రైళ్లలో కరోనా రోగులతో జాగ్రత్త | coronavirus infected passengers in trains: train travel risky | Sakshi
Sakshi News home page

రైళ్లలో కరోనా రోగులుంటారు జాగ్రత్త : ప్రయాణం ప్రమాదం

Published Sat, Mar 21 2020 3:49 PM | Last Updated on Sat, Mar 21 2020 4:31 PM

coronavirus infected passengers in trains: train travel risky - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక వైరస్‌ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమవుతోంది. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసింది. అంతేకాదు రైల్వే ప్రయాణాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఇటీవలి కాలంలో రైళ్లలో కరోనా పాజిటివ్‌ రోగులు, అనుమానితులను గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 

రైళ్ళలో కోవిడ్‌-19 (కరోనా వైరస్) సోకిన కొన్ని కేసులను గుర్తించామని, ఇది రైలు ప్రయాణాన్ని ప్రమాదకరంగా చేస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది. మీ సహ ప్రయాణీకుడికి కరోనావైరస్ ఉంటే మీరు కూడా వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నందున రైలు ప్రయాణానికి దూరంగా ఉండాలని   హెచ్చరిస్తోంది. అన్ని ప్రయాణాలను వాయిదా వేయండి..తద్వారా మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచుకోండని సూచిస్తూ రైల్వేమంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement