న్యూఢిల్లీ: ఇరాన్ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు రౌహానీతో భేటీ సందర్భంగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తలనిండా కప్పుకున్న ఫొటోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భారత ఇంధన అవసరాల విషయంలో ఇరాన్ను సంతృప్తిపరిచేందుకే మంత్రి ఆ దేశ వేషాధారణలో కనిపించారని నెటిజన్లు అంటున్నారు.
అయితే ఇరాన్ సాంప్రదాయం, చట్టాల ప్రకారం అక్కడ పర్యటించే వారెవరైనా తలను పూర్తిగా కప్పుకోవాల్సిందే. 2014లో స్కార్ఫ్ ధరించేందుకు యురోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రిబొనీనో నిరాకరించటంతో పర్యటన రద్దుచేసుకోవాల్సి ఉంటుందని ఇరాన్ పేర్కొంది.
సుష్మ ‘ముసుగు’పై విమర్శలు
Published Tue, Apr 19 2016 8:28 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
Advertisement