అధికారుల కేసుల విచారణ ఇకపై వేగవంతం | CVC to fast-track probe in Rs 10-crore fraud cases and cases against top bankers, babus | Sakshi
Sakshi News home page

అధికారుల కేసుల విచారణ ఇకపై వేగవంతం

Published Mon, Jul 18 2016 2:10 PM | Last Updated on Mon, Jul 29 2019 6:54 PM

CVC to fast-track probe in Rs 10-crore fraud cases and cases against top bankers, babus

న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులకు సంబంధించి రూ.10 కోట్లకుపైన అవినీతికి పాల్పడిన కేసుల్లో దర్యాప్తును త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నిర్ణయించింది. అలాగే అవినీతి నిరోధానికి సుప్రీంకోర్టు, హైకోర్టు, సీవీసీ, కేంద్ర ప్రభుత్వం సూచించే కేసులకూ, పార్లమెంట్ కమిటీలు కోరే నివేదికలకు సంబంధించిన విచారణ కు ప్రాముఖ్యత ఇవ్వాలని తీర్మానించింది.

వీటితోపాటు ఆరు నెలల్లో రిటైరయ్యే లేదా పదవీ విరమణ చేసిన అధికారుల్లో ఎవరైనా ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటుంటే కాలపరిమితిలోగా దర్యాప్తును ముగించాలని నిర్ణయం తీసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement