మన దళాలు సత్తా చాటాయ్‌ : ఆజాద్‌ | Ghulam Nabi Azad Says We Have Appreciated Thee Efforts By The Forces | Sakshi
Sakshi News home page

మన దళాలు సత్తా చాటాయ్‌ : ఆజాద్‌

Published Tue, Feb 26 2019 6:52 PM | Last Updated on Tue, Feb 26 2019 7:11 PM

Ghulam Nabi Azad Says We Have Appreciated Thee Efforts By The Forces - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వైమానిక దాడులతో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని  ఉగ్ర శిబిరాలను మట్టుబెట్టిన భారత వాయుసేన దళాలను రాజకీయ పార్టీలు అభినందనల్లో ముంచెత్తాయి. మంగళవారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం భారత సేనల సామర్ధ్యాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ కొనియాడారు. ఉగ్రవాద నిరోధానికి సైన్యం చేపట్టే చర్యలను తాము ఎల్లప్పుడూ సమర్ధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

నేడు జరిగిన వైమానిక దాడులు నేరుగా ఉగ్రవాదులు, ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా సాగుతూ ఉగ్రమూకలను మట్టుబెట్టి విజయవంతంగా తిరిగి భారత్‌ పోస్టులకు సైన్యం చేరుకుందని ఆజాద్‌ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీల ప్రతినిధులకు వైమానిక మెరుపు దాడులు జరిగిన తీరును విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ వివరించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన దళం మిరేజ్‌ యుద్ధ విమానాలతో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement