indian air force
-
ఒకే రోజు ఐఏఎఫ్, ఆర్మీ దంపతుల ఆత్మహత్య..
న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వారిద్దరూ.. వేర్వేరు నగరాల్లో ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బీహార్కు చెందిన దీనదయాల్ దీప్ ఆగ్రాలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో లెఫ్టెనెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య రేణు తన్వర్ అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో కెప్టెన్గా పనిచేస్తున్నారు. ఈ జంట 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇటీవల తన్వర్ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం ఢిల్లీ వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు. రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. భర్త మరణించాడనే విషయాన్ని తట్టుకోలేక అతని ఆర్మీ అధికారి భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్లోని గెస్ట్ హౌస్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వీరిద్దరి చావుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే తన్వర్ వద్ద పోలీసులు సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త దీప్తోమృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని లేఖలో ఆమె కోరారు. తన్వర్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీప్ వద్ద ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదు. దీంతో అతడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు -
ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో భారత్ కీలక ఒప్పందం
దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేసే దిశగా అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మన సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. వీటి విలువ రూ. 32,000 కోట్లు కాగా ఈ డీల్ కింద భారతదేశంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ (ఎమ్ఆర్ఓ) సదుపాయాన్ని నెలకొల్పడంతో పాటు యూఎస్ నుంచి మొత్తం 31 MQ-9B హై ఆల్టిట్యూడ్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్ట్కు గత వారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) అనుమతి ఇచ్చింది. మొత్తం 31 డ్రోన్లలో 15 భారత నావికాదళానికి వెళ్తాయి. మిగిలినవి వైమానిక దళం, ఆర్మీల మధ్య సమంగా విభజించనున్నారు.కాగా డెలావేర్లో జరిగిన క్వాడ్ లీడర్స్ సదస్సు సందర్భంగా డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య చర్చలు జరిగిన నెలలోపే ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతేగాక ఈ డీల్ మొత్తం విలువ రూ.34,500 కోట్లకు పెరగే అవకాశం ఉంది. చెన్నై సమీపంలోని ఐఎన్ఎస్ రాజాలి, గుజరాత్లోని పోర్బందర్, ఉత్తరప్రదేశ్లోని సర్సావా మరియు గోరఖ్పూర్తో సహా నాలుగు సాధ్యమైన ప్రదేశాలలో భారతదేశం డ్రోన్లను ఉపయోగించనుంది.అయితే చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచేందుకు ఈ డ్రోన్లు అవసరమని భారత్ భావిస్తోంది. ఈ డ్రోన్లు గరిష్టంగా గంటకు 442 కిమీ వేగంతో, దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. సుమారు 40 గంటలకుపైగా గాల్లో ఉండగలవు. నాలుగు హెల్ఫైర్ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. ఇప్పటికే భారత్ వీటిల్లో మరోరకమైన సీగార్డియన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని కూడా జనరల్ అటామిక్స్ నుంచి లీజ్పై భారత్ తీసుకొంది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా.. మన నౌకాదళం మరో నాలుగేళ్లపాటు దీనిని పొడిగించింది. -
ఎయిర్ షో విషాదం.. స్పందించిన సీఎం స్టాలిన్
చెన్నై: చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షో ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు, ఆదివారం మెరీనా బీచ్లో వైమానిక ప్రదర్శన కోసం ఇండియన్ ఎయిర్ఫోర్స్ కోరిన దానికి మించిని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని సీఎం పేర్కొన్నారు. ఎయిర్ షో కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రమాదంపై స్టాలిన్ మాట్లాడుతూ.. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. భారత వైమానిక దళం కోరిన దాని కంటే మించిన ఏర్పాట్లను అధికారులు చేశారని చెప్పారు. ఊహించినదానికంటే ఎయిర్షోకు ఎక్కువ ప్రజలు వచ్చారని తెలిపారు. ప్రజలు తిరిగి వెళ్లేటప్పుడు తమ వాహనాలను చేరుకోవడానికి, ప్రజా రవాణాను చేరుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ అంశాలపై మరింత శ్రద్ధ చూపుతామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.కాగా చెన్నైలోని మెరీనా బీచ్లో ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో వేడి తట్టుకోలేక, ఊపిరి అందక, లోకల్ స్టేషన్ వద్ద తొక్కిసలాట వంటి కారణాల వల్ల ఐదుగురు మరణించగా వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. -
ఎయిర్ఫోర్స్లో లైంగిక వేధింపులు.. వింగ్ కమాండర్పై కేసు
శ్రీనగర్: భారత వైమానిక దళంలో సీనియర్ ర్యాంక్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు కలకలం రేపుతోంది. గత రెండేళ్లుగా వింగ్ కమాండర్ అధికారి తనను మానసికంగా వేధిస్తున్నాడని, అత్యాచారాని పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా ఫ్లయింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుద్గామ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.కాగా ఇద్దరు అధికారులు శ్రీనగర్ బేస్లోనే పనిచేస్తున్నారు. మహిళ తన ఫిర్యాదులో.. 31 డిసెంబర్ 2023న ఆఫీసర్స్ మెస్లో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో సీనియర్ అధికారి వింగ్ కమాండర్ పీకే సెహ్రావత్ బహుమతి పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. బహుమతి తీసుకోమని అతని గదిలోకి పిలిచి తనతో అసహ శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేసినట్లు తెలిపారు. చివరికి తనను తోసేసి అక్కడి నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చారు.ఈ ఘటన అనంతరం తనలో తానే మానసికంగా కుమిలిపోయానని.. ఎంతగానో భయపడ్డానని చెప్పారు. కానీ అతను మాత్రం ఏం జరగనట్లు సాధారణంగా వ్యహరించారని, కనీసం పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. అనంతరం ఇద్దరు మహిళా అధికారులకు ఈ విషయం తెలియజేయగా వారి సాయంతో అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కల్నల్ స్థాయి అధికారిని ఆదేశించారని, ఈ ఏడాది జనవరిలో రెండుసార్లు తనతోపాటు వింగ్ కమాండర్ వాంగ్మూలాలు నమోదు చేయించుకున్నారని చెప్పారు.అనంతరం వింగ్ కమాండర్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే విచారణను ముగించారని ఆరోపించారు. రెండు నెలల తర్వాత మరోసారి ఫిర్యాదు చేయగా.. అధికారులు పక్షపతంతో నిందితుడికి సహకరించారని, ప్రత్యక్ష సాక్ష్యాలు లేవనే సాకుతో కేసును నీరుగార్చరని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని తెలిపింది.అప్పటి నుంచి అనేక సార్లు వింగ్ కమాండర్ చేతిలో వేధింపులకు గురవుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు. వీటన్నింటితో మానసిక వేధనకు గురవుతున్నట్లు, ఒకానొక సమయంలో చనిపోదామని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నీసం సెలవులపై వెళ్లడానికి లేదా వేరే చోట పోస్టింగ్ కోసం అభ్యర్థించినా అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని నిరంతరం భయంతో జీవిస్తున్నానని తెలిపారు. తన జీవితం మొత్తం నాశనం అయ్యిందని, పూర్తిగా నిస్సహాయకురాలిగా మారినట్లు చెప్పారు.అయితే వింగ్ కమాండర్పై వేధింపుల ఆరోపణల వ్యహారంపై భారత వాయుసేన స్పందించింది. ఈ కేసు గురించి తమకు సమాచారం ఉందని వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా శ్రీనగర్లోని భారత వైమానిక దళాన్ని బుద్గామ్ పోలీసులు సంప్రదించారని.. వారి దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని వాయుసేనకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
ఎయిర్ లిఫ్టింగ్.. నదిలో పడిపోయిన హెలికాప్టర్
డెహ్రాడున్: మరమ్మత్తులకు గురైన ఓ హెలికాప్టన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ఎంఐ-17 హెలికాప్టర్ తరలిస్తుండగా.. ఒక్కసారిగా గాలిలోనే జారి నదిలో పడిపోయింది. ఇటీవల కేదార్నాథ్ సమీపంలోని భీంబాలి సమీపంలో ఓ హెలికాప్టర్ మరమ్మతులకు గురైంది. అయితే దానిని శనివారం ఎంఐ17 హెలికాప్టర్తో అధికారులు లిఫ్ట్ చేశారు. తరలిస్తుండగానే ఎంఐ17 హెలికాప్టర్ తీగ తెగి నదిలో పడిపోయింది. ఈ ఘటనుకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.‘‘ఎంఐ-17 హైలికాప్టర్ మరమ్మత్తులకు గురైన చిన్న హెలికాప్టర్ను గౌచర్ ల్యాండింగ్ స్ట్రిప్కు తీసుకువెళుతోంది. గాలి పీడనం, చిన్న హెలికాప్టర్ బరువు కారణంగా ఎంఐ-17 హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. అనంతరం కిందకు జారి నదిలో పడిపోయింది’’ అని జిల్లా పర్యాటక అధికారి రాహుల్ చౌబే పేర్కొన్నట్లు జాతీయమీడియా పేర్కొంది.VIDEO | Uttarakhand: A defective helicopter, which was being air lifted from #Kedarnath by another chopper, accidentally fell from mid-air as the towing rope snapped, earlier today.#UttarakhandNews(Source: Third Party) pic.twitter.com/yYo9nCXRIw— Press Trust of India (@PTI_News) August 31, 2024 -
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ పారాడ్రాప్
ఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన పోర్టబుల్ హాస్పిటల్ను విజయవంతంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆరోగ్య మైత్రీ హెల్త్ క్యూబ్గా పేర్కొనే ఈ ఆస్పత్రిని 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు పేర్కొంది. భీష్మా (భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా అండ్ మైత్రి) అనే ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య మైత్రీ హెల్త్ క్యూబ్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం సంబంధించిన వీడియోను రక్షణ శాఖ విడుదల చేసింది. ఇక.. ఇది ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ కావటం విశేషం.#IAF & #IndianArmy have jointly carried out a first-of-its-kind precise para-drop operation of Aarogya Maitri Health Cube at a high-altitude area close to 15,000 ft.These critical trauma care cubes have been indigenously developed under Project #BHISHM👉🏻https://t.co/QmA6ZYBPST pic.twitter.com/iEufwVcEG3— Defence Production India (@DefProdnIndia) August 17, 2024విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర సేవలు అందించాలనే ప్రధాని మోదీ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు ప్రారంభించినట్లు తెలిపింది. మారుమూల, పర్వత ప్రాంతాల్లో విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయ చర్యలు అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని అన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ పోర్టబుల్ హాస్పిటల్ను ఏర్పాటు చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఇక.. పోర్టబుల్ హాస్పిటల్లో మొత్తం 72 క్యూబ్స్ ఉంటాయి. దీన్ని ఉపయోగించి 200 మందికి ఆరోగ్య సేవలందించవచ్చు. భారత వైమానికి దళానికి సంబంధించిన విమానం సీ-130జీని సాయంతో దీనిని నిర్దేశించిన ప్రాంతానికి చేరవేస్తుంది. -
సమున్న‘తరంగ్’
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్ వరుస అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలుస్తూ.. ప్రపంచ దేశాలకు ఆతిథ్యమిస్తోంది. మిలాన్, ఐఎఫ్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్ని నిర్వహించిన భారత్.. మరో కీలక విన్యాసాలకు సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీ నుంచి రెండు దశల్లో జరిగే తరంగ్శక్తి యుద్ధ విన్యాసాలు తమిళనాడులోని సూలూరులో జరగనున్నాయి. ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలో భారత నౌకాదళ సహకారంతో ప్రారంభం కానున్న విన్యాసాల్లో 30 దేశాలకు పైగా పాల్గొంటున్నాయి.భారత్ సత్తా చాటేలా..భారత రక్షణ వ్యవస్థ సత్తా ప్రపంచానికి చాటేలా త్రివిధ దళాల సమన్వయం ఎలా ఉంటుందో శత్రు దేశాలకు తెలియజేసేలా.. భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర సహకారం మరింత పెంపొందేలా ‘తరంగ్ శక్తి’ యుద్ధ విన్యాసాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భారత వాయుసేన, ఆర్మీ, ఇండియన్ నేవీ కలిసి నిర్వహిస్తున్న అంతర్జాతీయ విన్యాసాలకు 51 దేశాలకు ఆహ్వానమందించగా.. 30కి పైగా దేశాలు హాజరవుతున్నాయి. మొదటి దశ ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకూ తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకూ రాజస్థాన్లోని జో«ధ్పూర్లో రెండో దశ విన్యాసాలు జరగనున్నాయి. భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా దేశాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ విన్యాసాలకు రష్యా, ఇజ్రాయిల్ దూరంగా ఉంటున్నాయి.తొలి దశలో భారత నౌకాదళంతమిళనాడులో జరిగే ఫేజ్–1 విన్యాసాల్లో భారత నౌకాదళం ప్రాతినిధ్యం వహిస్తోంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే విన్యాసాల్లో యుద్ధ నౌకలపై హెలికాప్టర్ల ల్యాండింగ్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లపై మిగ్–29, రాఫెల్ యుద్ధ విమానాల ల్యాండింగ్, ఫైరింగ్ తదితర విన్యాసాలు నిర్వహించనున్నారు. రక్షణ రంగంలో స్వావలంబన, అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తరంగ్ శక్తి కీలకంగా మారనుంది. సత్తా చాటనున్న ఐఏఎఫ్ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఈ విన్యాసాల్లో సత్తా చాటనుంది. ఎల్సీఏ తేజస్ యుద్ధ విమానాలు, రాఫెల్, మిరాజ్ 2000, ఎల్సీహెచ్ ప్రచండ్, ధృవ్, రుద్ర, జాగ్వర్, మిగ్–29, సీ–130, ఐఎల్–78 తదితర యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. భారత వైమానిక దళంతో పాటుగా ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్–18, బంగ్లాదేశ్కు చెందిన సీ–130, ఫ్రాన్స్కు చెందిన రాఫెల్, జర్మనీకి చెందిన టైఫూన్, గ్రీస్కు చెందిన ఎఫ్–16, స్పెయిన్కు చెందిన టైపూన్, యూఏఈకి చెందిన ఎఫ్–16, యూకేకి చెందిన టైపూన్, యూఎస్ఏకి చెందిన ఏ–10, ఎఫ్–16, ఎఫ్ఆర్ఏ, సింగపూర్కు చెందిన సీ–130 యుద్ధ విమానాలు, బలగాలు విన్యాసాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. -
‘సుదర్శన్ ఎస్-400’ పరీక్ష విజయవంతం
భారత వైమానిక దళం ‘సుదర్శన్ ఎస్-400’ రక్షణ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు విమానాలను 80 శాతం కంటే అధిక రేటుతో నాశనం చేసినట్లు ఎయిర్ఫోర్స్ అధికారులు తెలిపారు. భారతదేశం తన వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి రష్యాతో కలిసి ‘సుదర్శన్ ఎస్-400’ను తయారుచేసినట్లు చెప్పారు.ఈ మేరకు ఎయిర్ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ..‘సుదర్శన్ ఎస్-400 రక్షణ క్షిపణి పరీక్ష విజయవంతం అయింది. శత్రు విమానాలను 80 శాతం కంటే అధిక రేటుతో నాశనం చేసింది. విమానాలపై అటాక్ చేసి అవి ముందుకు కదలకుండా నిరోధించింది. ఈ వ్యవస్థ వల్ల భారత వైమానిక రక్షణ దళం మరింత పురోగమించింది. రష్యా-భారత్ కలిసి వీటిని ఈ వ్యవస్థను రూపొందించాయి. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. 2026 నాటికి మరో రెండు స్క్వాడ్రన్లు సిద్ధం అవుతాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఉచితంగా రూ.1.09 లక్షల విలువైన ఫోన్!సుదర్శన్ ఎస్-400 ఐదు స్క్వాడ్రన్ల కోసం గతంలో రెండు దేశాలు రూ.35,000 కోట్లకు పైగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఎంఆర్-సామ్ క్షిపణి వ్యవస్థ భారత వైమానిక రక్షణ దళంలో చేరింది. దాంతోపాటు ‘ఇజ్రాయెలీ స్పైడర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్’ క్షిపణి వ్యవస్థ సైతం ఎయిర్ఫోర్స్లో చేరింది. తాజాగా ఎస్-400 కూడా వాటికి తోడవడంతో వైమానిక దళం గేమ్ ఛేంజర్గా మారిందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ‘ప్రాజెక్ట్ కుషా’తో మరింత సమర్థవంతమైన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు ఇండియన్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు భద్రతపై గతంలోనే కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. -
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పేరుతో ఘరానా మోసం
-
Indian Air Force: ‘నైట్ విజన్ గాగుల్స్’తో విమానం ల్యాండింగ్
న్యూఢిల్లీ: భారత వాయుసేన(ఐఏఎఫ్) మరో అరుదైన ఘనత సాధించింది. నైట్ విజన్ గాగుల్స్(ఎన్వీజీ) సాయంతో తక్కువ వెలుతురు ఉన్న సమయంలో సీ–130జే రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. తూర్పు సెక్టార్లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో ఈ ప్రక్రియను చేపట్టింది. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఒక వీడియోలో ఎన్వీజీ టెక్నాలజీతో విమానం సాఫ్ట్ ల్యాండింగ్ అయిన దృశ్యాలు, మరో వీడియోలో విమానంలో లోపలి నుంచి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్వీజీ విజువల్స్ కావడంతో ఈ దృశ్యాలు ఆకుపచ్చ రంగులో విభిన్నంగా ఉన్నాయి. మన దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడుకొనే ప్రక్రియలో భాగంగా తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నామని భారత వాయుసేన పేర్కొంది. నైట్ విజన్ గాగుల్స్ టెక్నాలజీతో భారత వాయుసేన మరింత బలోపేతమైంది. వెలుతురు తక్కువ ఉన్న సమయాల్లో, రాత్రిపూట విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి, సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడనుంది. -
ఈ లింక్పై క్లిక్ చేయవద్దు
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో చేరాలని యువతలో చాలా కలలు కంటుంటారు. ఇలాంటి కలల్నే తమకు అనుకూలంగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు తెరదీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు యువతను హెచ్చరిస్తున్నారు. భారత వాయుసేనలో చేరాలంటే తాము ఇచ్చే ప్రకటనలోని లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాౖలెన ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి వాటిల్లో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా అభ్యర్థుల నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ తర్వాత దరఖాస్తు కోసమని, వెరిఫికేషన్ చార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని వారు సూచించారు. అధికారిక వెబ్సైట్లలో మాత్రమే వివరాలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
ప్రకాశం జిల్లా: కోరిశపాడు జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ (ఫొటోలు)
-
HYD: నేటి నుంచి ఏవియేషన్ షో.. ఏ గేటు నుంచి ఎవరెవరికి ప్రవేశమంటే..
హైదరాబాద్: నగరానికే తలమానికమైన ఏవియేషన్ షోకు సర్వం సిద్ధమైంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ‘వింగ్స్ ఇండియా–2024’ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 21 వరకు నిర్వహించే ఈ షోలో 25 వరకు విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. తొలిసారిగా ప్రదర్శనకు వస్తున్న బోయింగ్తో పాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు వ్యాపార, వాణిజ్య వేత్తలకు, ఆ తర్వాత రెండు రోజులు సామాన్యులను సైతం అనుమతిస్తారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఉన్నతాధికారుల రాకను పురస్కరించుకుని 600 మంది కానిస్టేబుళ్లు, 30 మంది ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఏసీపీలతో పాటు ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. విమానాశ్రయాన్ని డాగ్స్క్వాడ్తో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. ఏ గేటు నుంచి ఎవరెవరు ప్రవేశం.. గేటు 1: చాలెట్ ఎగ్జిబిటర్లు, వీఐపీలు, అతిథులు గేటు 2: కాన్ఫరెన్స్ డెలిగేట్స్, సీఈఓ రౌండ్ టేబుల్కు హాజరయ్యేవారు గేటు 3: నిర్వాహకులు, చాలెట్ ఎగ్జిబిటర్స్, ప్రభుత్వ ప్రతినిధులు గేట్ 4: నిర్వాహకులు, ఎగ్జిబిటర్స్, మీడియా, బిజినెస్ విజిటర్స్ గేటు 5: ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్, ఎగ్జిబిటర్స్, వింగ్స్ ఇండియా విధులు నిర్వర్తించేవారు ► మీడియా, పాస్లు కలిగిన జనరల్ పబ్లిక్, ఎగ్జిట్ గేటు ద్వారా అందరూ బయటకు రావాల్సి ఉంటుంది. ఏవియేషన్ ఎగ్జిబిషన్లో హైలైట్స్ ► కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై వింగ్స్ ఇండియా–2024ను ప్రారంభిస్తారు. ► ప్రపంప దేశాల నుంచి 130 ఎగ్జిబిటర్స్, 15 హాస్పిటాలిటీ చాలెట్స్.. 106 దేశాల నుంచి 1500 డెలిగేట్స్, 5,000 బిజినెస్ విజిటర్స్ పాల్గొంటారని అంచనా. ► 500కు పైగా బీ2జీ, బీ2బీ సమావేశాలు ► ప్రముఖ హెలికాప్టర్ తయారీ సంస్థలు అగస్తా వెస్ట్ల్యాండ్, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్బస్ హెలికాప్టర్స్ ప్రదర్శన. ► ప్రముఖ ఇంజిన్ తయారీ సంస్థలు సీఎఫ్ఎం, యూటీసీ, జీఈ ఏవీయేషన్, రోల్స్ రాయిస్, ప్రట్ అండ్ వైట్నీల ఉత్పత్తుల ప్రదర్శన. ► యూఎస్ఏ, కెనడా, ఫ్రాన్స్, జమైకా, మారిషస్, బెల్జియం, జర్మనీ, న్యూజిలాండ్, సౌత్కొరియా, గ్రీక్, మలేసియా, యూఏఈ వంటి దాదాపు 25 దేశాల ప్రతినిధులు ఏవియేషన్ ఎగ్జిబిషన్కు హాజరు కానున్నారు. సారంగ్ టీం స్పెషల్.. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్ చేసే ఏకై క జట్టుగా పేరొందిన ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన సారంగ్ టీం ఇప్పటికే నగరానికి చేరుకుంది. హుస్సేన్సాగర్ వద్ద బుధవారం 5 నిమిషాల పాటు తమ విన్యాసాలను ప్రదర్శించిన అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడ రిహార్సల్స్ను కొనసాగించింది. -
‘గగన’ విజయం
సాక్షి, హైదరాబాద్: కలలు కన్నారు.. ఆ కలను నిజం చేసుకునేందుకు కష్టపడ్డారు.. వ చ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ గగనతలంలో విజయబావుటా ఎగురవేశారు ఈ యువ ఫ్లయింగ్ కేడెట్లు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం అయినా..అంతిమ లక్ష్యం మాత్రం భరతమాత సేవలో తాము ఉండాలన్నదే. ఆదివారం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొని భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా యువ అధికారులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు. దేశ సేవలో నేను మూడో తరం.. దేశ సేవలో మా కుటుంబ నుంచి మూడో తరం అధికారిగా నేను ఎయిర్ఫోర్స్లో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. మా తాతగారు పోలీస్ అఫీసర్గా చేశారు. మా నాన్న కర్నల్ రాజేశ్ రాజస్థాన్లో పనిచేస్తున్నారు. నేను ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో నావిగేషన్ బ్రాంచ్లో సెలక్ట్ అయ్యాను. వెపన్సిస్టం ఆపరేటర్గా నాకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇది ఎంతో చాలెంజింగ్ జాబ్. శిక్షణ సమయంలో ఎన్నో కఠిన పరిస్థితులను దాటిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి బాధ్యత అయినా నిర్వర్తించగలనన్న నమ్మకం పెరిగింది. మా స్వస్థలం జైపూర్. నేను బీటెక్ ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సిస్టం అమేథీలో చేశాను. – ఫ్లయింగ్ కేడెట్ థాన్యాసింగ్, జైపూర్ నాన్నే నాకు స్ఫూర్తి... మాది వికారాబాద్ జిల్లా చీమల్దరి గ్రామం. నాన్నపేరు శేఖర్. ప్రైవేటు ఉద్యోగి, అమ్మ బాలమణి టైలర్. చిన్నప్పటి నుంచి నాన్న స్ఫూర్తితోనే నేను డిఫెన్స్ వైపు రాగలిగాను. కార్గిల్ యుద్ధంలో సూర్యకిరణ్ పైలెట్ బృందం ఎంతో కీలకంగా పనిచేసిందన్న వార్తలను చూసి మా నాన్న నాకు సూర్యకిరణ్ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే నన్ను డిఫెన్స్కు వెళ్లేలా ప్రోత్స హించారు. అలా నేను ఏడో తరగతిలో డెహ్రాడూన్లోని రాష్ట్రాయ ఇండియన్ మిలిటరీ కాలేజ్కు ప్రవేశ పరీక్ష రాసి 8వ తరగతిలో చేరాను. అందులో రాష్ట్రానికి ఒక్క సీటు మాత్రమే కేటాయిస్తారు. అంత పోటీలోనూ నేను సీటు సాధించాను. అక్కడే ఇంటర్మీడియెట్ వరకు చదివాను. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో రెండేళ్లు శిక్షణ తీసుకున్న తర్వాత ఇండియన్ ఎయిర్ఫోర్స్కి సెలక్ట్ అయ్యాను. – సూర్యకిరణ్, చీమల్దరి, వికారాబాద్ జిల్లా భారత సైన్యంలో చేరడం నా కల.. నా పేరు లతా కౌషిక్. మాది హరియాణా రాష్ట్రంలోని జజ్జర్ జిల్లా దుబల్దాన్ గ్రామం. మానాన్న రైతు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలోని మిరండా కాలేజీలో బీఎస్సీ హానర్స్, మ్యాథ్స్ చదివాను. డిఫెన్స్ ఫోర్స్లో చేరడం ద్వారా దేశానికి, ప్రజల రక్షణకు పనిచేయవచ్చని నా కోరిక. ఆడపిల్ల డిఫెన్స్లోకి ఎందుకు అని ఏనాడు మా ఇంట్లో వాళ్లు అనలేదు. మా నాన్నతో సహా కుటుంబం అంతా నన్ను ప్రోత్సహించడంతోనే నేను ఎయిర్ఫోర్స్కి వచ్చాను. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏదీ మనల్ని అడ్డుకోలేదు. అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. – లతా కౌషిక్, ఫ్లయింగ్ ఆఫీసర్, హరియాణా ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కని నేను ఫైటర్ పైలట్ అయ్యాను.. నాపేరు జోసెఫ్. నేను ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఫైటర్ పైలెట్ కావడం సంతోషంగా ఉంది. మా సొంత ప్రాంతం గుంటూరు. నేను టెన్త్ వరకు గుంటూరులో చదివాను. ఎయిర్ఫోర్స్కి రావాలని అనుకోలేదు. ఇంటర్మిడియెట్ తర్వాత ఎన్డీఏ గురించి తెలుసుకుని ఈ కెరీర్ని ఎంచుకున్నాను. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాను. తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్లగలిగాను. అక్కడ నుంచి భారత వాయుసేనలో సెలక్ట్ అయ్యాను. మా తల్లిదండ్రు ల ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరాను. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా పిల్లలు ఏదీ సాధించలేరు. తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తేనే పిల్లలు వారి కలలు నిజం చేసుకోగలుగుతారు. – జోసెఫ్, ఫైటర్ పైలట్, గుంటూరు -
రాజస్థాన్లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధవిమానం.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్లో కుప్పకూలింది. హనుమాన్గఢ్ జిల్లా బహ్లోల్నగర్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ యుద్ధవిమానం సూరత్గఢ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే మిగ్-21 కూలిపోవడానికి ముందే పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ విమాన శకలాలు తగిలి ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. వీరి ఇంటిపైనే విమానం కూలినట్లు తెలుస్తోంది. సాధారణ శిక్షణలో భాగంగానే బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైనట్లు భారత వైమానిక దళం తెలిపింది. పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది. #WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. Two civilian women died and a man was injured in the incident, the pilot sustained minor injuries. pic.twitter.com/z4BZBsECVV — ANI (@ANI) May 8, 2023 చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు
సూడాన్ అంతర్గత యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో చర్యలు చేపట్టింది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా పూడాన్ నుంచి మూడో బ్యాచ్ కూడా బయల్దేరింది. సూడాన్ నుంచి మరో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నట్లు విదేశీవ్యవహారాల సహాయమంత్రి వి మురళీధరన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు మొదటి బ్యాచ్లో భాగంగా భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుమేధ’ ద్వారా 278 మంది ప్రయాణికులు సూడాన్ పోర్టు నుంచి సౌదీకి చేరుకున్నారని విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది. రెండో భాచ్లో 148 మంది భారతీయులను తొలి విమానంలో స్వదేశానికి తరలించినట్లు తెలిపింది. అయితే వీరిలో 160 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. కాగా సూడాన్లో 3 వేల మందికిపైగా భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. Third batch comprising 135 Indians from Port Sudan arrived in Jeddah by IAF C-130J aircraft. Onward journey to India for all who arrived in Jeddah will commence shortly. #OperationKaveri pic.twitter.com/OHhC5G2Pg8 — V. Muraleedharan (@MOS_MEA) April 26, 2023 -
తవాంగ్ ఘర్షణ: ‘ఫైటర్ జెట్స్’ను రంగంలోకి దింపిన భారత్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల నడుమ ఈనెల 9న ఘర్షణ తెలెత్తి మరోమారు సరిహద్దు వివాదంరాజుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దుల్లో యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా గగనతల విహారం పెరిగినట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు భారత్ అప్రమత్తమైనట్లు పేర్కొన్నాయి. చైనా బలగాలను తిప్పికొట్టేందుకు ఇటీవల రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఫైటర్ జెట్స్ గస్తీ పెంచినట్లు వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో చైనా గగనతల కార్యకలాపాలు పెరిగిన క్రమంలో గగనతల పెట్రోలింగ్ పెంచినట్లు భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. సరిహద్దులో తాజా ఉద్రిక్తతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. పార్లమెంట్లో కీలక ప్రకటన చేయనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: ఇండో-చైనా సైనికుల ఘర్షణపై రాజ్నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష -
ఉన్ని టోపీల ప్రదర్శనలో గిన్నిస్ రికార్డు
న్యూఢిల్లీ: వైమానిక దళ సభ్యుల సతీమణుల సంక్షేమ సంఘం (ఏఎఫ్డబ్ల్యూడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన 41,541 ఉన్ని టోపీల ప్రదర్శన గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. 3 వేల మంది మూణ్నెల్లు శ్రమించి నాలుగు టన్నుల ముడి ఉన్నితో వీటిని అల్లారు. ఏఎఫ్డబ్ల్యూడబ్ల్యూఏ 6వ వార్షికోత్సవం సందర్భంగా వీటిని ప్రదర్శించారు. వచ్చే శీతాకాలంలో అవసరమైన వారికి వాటిని అందించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రశంసించారు. గిన్నిస్ రికార్డు గుర్తింపు పత్రాన్ని శనివారం ఏఎఫ్డబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షురాలు నీతా చౌధరికి అందజేశారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషి నాథ్. గిన్నిస్ రికార్డు పత్రం అందుకున్న సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌధరి తదితరులు ఇలా హర్షం వెలిబుచ్చారు. The culmination of the event was celebrated today on occasion of the AFWWA Day & was attended by Hon'ble RM Shri @rajnathsingh & Hon'ble Smt @smritiirani. A world record was set, as recognised by Guiness World Records,when the caps were put on display at the location.@GWR pic.twitter.com/cuicVVJKuJ — Indian Air Force (@IAF_MCC) October 15, 2022 ఇదీ చదవండి: ప్రిస్క్రిప్షన్పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు -
భారత వైమానిక దళంలోకి మన ప్రచండ్ (ఫొటోలు)
-
వాయుసేన అమ్ములపొదిలోకి ప్రచండ్ హెలికాఫ్టర్లు
-
పాకిస్తాన్లోకి భారత క్షిపణులు మిస్ఫైర్.. ముగ్గురు అధికారులపై వేటు
సాక్షి,న్యూఢిల్లీ: పాకిస్తాన్లోకి పొరపాటున బ్రాహ్మోస్ క్షిపణులను ప్రయోగించిన ముగ్గురు వాయుసేన అధికారులను విధుల నుంచి తొలగించింది కేంద్రం. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనపై న్యాయ విచారణ అనంతరం మంగళవారం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం విధుల నుంచి తొలగించిన అధికారుల్లో ఓ గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్ ఉన్నారు. భారత వాయుసేన తాజాగా చెప్పిన వివరాల ప్రకారం ఈ ముగ్గురు అధికారులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(SOP)లో చేసిన పొరపాటు వల్లే క్షిపణులు ప్రమాదవశాత్తు పాకిస్తాన్ భూభాగంలో పడ్డాయి. మార్చి 9న జరిగిన ఈ ఘటన అనంతరం బ్రాహ్మోస్ క్షిపుణులు తమ భూభాగంలో పడ్డాయని పాకిస్తాన్ భారత్కు సమన్లు పంపి నిరసన వ్యక్తం చేసింది. అయితే సాంకేతిక లోపం వల్లే క్షిపణులు పొరపాటున పాక్లో పడినట్లు భారత్ వివరణ ఇచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదనే విషయాన్ని ప్రస్తావించింది. చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! -
దుండిగల్లో సీజీపీ పరేడ్.. అదుర్స్!
-
క్రమశిక్షణ, అంకితభావం ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: భారత వైమానిక దళంలో చేరే అభ్యర్థులు నిరంతరం విజ్ఞాన సాధన కొనసాగించాలని, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ మనోజ్ పాండే సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, వృత్తిపరమైన నైపుణ్యం ఏర్పరుచుకోవాలన్నారు. మన దేశ భద్రతా వ్యవస్థ చాలా విస్తృతమైందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్స్, హైపర్సోనిక్స్ వంటి సాంకేతికతలు ఇకపై సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కావని, యుద్ధ ప్రదేశాల్లోనూ భౌతికంగా అవసరం అవుతాయని పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భరత’లో భాగంగా సాయుధ దళాల్లోనూ పలు సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రతీ యువ అధికారులు ఇతరులకు మార్గదర్శకులుగా నిలిచేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. మహిళలు సాయుధ దళాల్లోకి ప్రవేశించడం స్ఫూర్తిదాయకమని వివరించారు. దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివా రం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) జరిగింది. భారత వైమానిక దళంలోని ‘ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ’లకు చెందిన 165 మంది ఫ్లయిట్ కెడెట్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మనోజ్ పాండే ప్రెసిడెంట్ కమిషన్లను ప్రదానం చేశారు. భారత నావికాదళం, ఇండియన్ కోస్ట్గార్డ్కు చెందిన అధికారులకు కూడా వింగ్స్ అవార్డులను అందించారు. అనంతరం పిప్పింగ్ సెరిమనీ, కవాతు, తేజస్, సూర్యకిరణ్, సారంగ్ బృందంతో ఏరోబాటిక్ ప్రదర్శనలు జరిగాయి. పైలెట్ల కోర్సులో మొదటి స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ రాఘవ్ అరోరా.. రాష్ట్రపతి çపతకం, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్ అవార్డులను అందుకున్నారు. -
మిస్సైల్ రచ్చ! భారత్పై పాక్ సంచలన ఆరోపణలు
భారత్పై దాయాది పాకిస్థాన్ సంచలన ఆరోపణలకు దిగింది. భారత్కు చెందిన సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి తమ సరిహద్దులో కుప్పకూలిందంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేసి కలకలం రేపింది. ఇది ఉల్లంఘనే అవుతుందని, దీనిపై భారత్ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్ సరిహద్దులో కూలిందని పాక్ ఆరోపించింది. ప్యాసింజర్ ఫ్లయిట్లు తిరిగే ఎత్తులోనే ఈ దూసుకొచ్చిందని, పైగా అది పడిన ప్రాంతం జనావాసమని ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు పాక్ మేజర్ జనరల్, ISPR డీజీ అయిన బాబర్ ఇఫ్తికర్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు తెలిపాడు. పాకిస్థానీ వైమానిక దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్.. భారత సరిహద్దు నుంచి వచ్చిన మిస్సైల్ అనుమానిత వస్తువును స్వాధీనం చేసుకుంది. మియా చన్ను సమీపంలో అది పడిపోయింది. ఇది పాకిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించడమే. ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కానీ, అక్కడే ఉన్న గోడ మాత్రం నాశనం అయ్యింది అని ఇఫ్తికర్ వెల్లడించాడు. శిథిలాను బట్టి.. అదొక సూపర్ సోనిక్ మిస్సైల్ అయి ఉంటుందని భావిస్తున్నాం (BrahMos supersonic cruise missile గా అనుమానిస్తోంది పాక్). కానీ, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. భారత్ ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ ఘోరమైన ఉల్లంఘనను తీవ్రంగా నిరసిస్తూ.. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని భారత్ను హెచ్చరిస్తున్నాం అంటూ ప్రసంగించాడు ఇఫ్తికర్. ఇదిలా ఉంటే పాక్ ఆరోపణలపై అటు రక్షణ శాఖ, ఇటు భారత వాయు సేన గానీ స్పందించాల్సి ఉంది. 2005 ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల క్షిపణి పరీక్షలు గనుక నిర్వహిస్తే.. మూడు రోజుల ముందు తెలియజేయడంతో పాటు, ఇరు దేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా, నష్టం జరగకుండా నిర్ణీత వ్యవధిలోనే ఆ పరీక్షలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. -
రంగం లోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
-
ఆపరేషన్ గంగాకి మోదీ పిలుపు..ముమ్మరంగా తరలింపు చర్యలు!
IAF C-17 Aircraft Bring back Indian Nationals: చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ చర్యలు మరింత వేగవంతం చేసింది. అంతేకాదు రష్యా నేరుగా జనావాసాలపై దాడి చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో యుద్ధం మరింత తీవ్రమవుతోందంటూ ఉక్రెయిన్లోని రాయబార కార్యాలయం విద్యార్థులను తక్షణమే కైవ్ని విడిచి వచ్చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రధాని మోదీ ఉక్రెయిన్లోని భారతీయుల తరలింపు చర్యలను మరింత వేగవంతం చేసేలా ఆపరేషన్ గంగా చేపట్టాలని నిర్ణయించారు. ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 భారత వైమానిక దళం తరలింపు ప్రయత్నాలు పాలుపంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఐఏఎఫ్ సీ-17 విమానం సుమారు 336 మందిని తీసుకువెళ్లగలదు. అంతేకాదు దీన్ని అఫ్గనిస్తాన్ తరలింపులో ఉపయోగించారు. మానవతా సాయాన్ని మరింత సమర్థవంతంగా అందించడంలో ఇది సహయపడుతుందని అంటున్నారు. అంతేకాదు ఈ భారత వైమానిక దళం ఈ రోజు నుంచే ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 విమానాలు మోహరించే అవకాశం ఉందని చెప్పారు. ప్రదాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ సమావేశంలో మోదీ ఉక్రెయిన్లోని భారతీయుల భద్రతకు ప్రభుత్వం 24 గంటలూ పని చేస్తుందని చెప్పారని అన్నారు. ఇంకోవైపు ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు తాజా సలహాను జారీ చేసింది. కైవ్ను అత్యవసరంగా వదిలివేయాలని, అందుబాటులో ఉన్న రైళ్లలో లేదా మరేదైనా మార్గంలో వెళ్లాలని కోరింది. మరోవైపు భారత్ ఆపరేషన్ గంగా కింద తరలింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. అంతేకాదు ఉక్రెయిన్ చుట్టుపక్కల సరిహద్దుల నుండి తరలింపు ప్రక్రియను సమన్వయం చేయడానికి, వేగవంతం చేయడానికి ప్రభుత్వం నలుగురు కేంద్ర మంత్రులను పంపింది. ఈ మేరకు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ వీకే సింగ్ సరిహద్దుల వద్ద మొత్తం ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: అమ్మా నాకు చాలా కష్టంగా ఉంది!..రష్యన్ సైనికుడి చివరి సందేశం) -
రక్షణమంత్రికి సీడీఎస్ చాపర్ క్రాష్ దర్యాప్తు నివేదిక
-
మేరా భారత్ మహాన్: భగవద్గీత స్ఫూర్తి.. ఆకాశాన్ని అంటిన కీర్తి
Indian Air Force Day 2021:దేశ రక్షణలో సైన్యం పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. మూడు విభాగాలతో రక్షణ, నిఘాతో సరిహద్దుల్లోనే కాదు.. అవసరం పడితే దేశం లోపల కూడా తమ సేవల్ని అందిస్తుంటాయి. అక్టోబర్ 8న అంటే ఇవాళ ఇండియన్ ఎయిర్ఫోర్స్ డే. ఈ సందర్భంగా భారత వాయు సేన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం. ►యునైటెడ్ కింగ్డమ్కి చెందిన రాయల్ ఎయిర్ఫోర్స్ ప్రోత్సాహంతో పుట్టుకొచ్చింది ఈ విభాగం. ►ప్రతీ ఏడాది ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ ‘హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్’లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఉత్సవాలను నిర్వహిస్తారు. ►ఐఏఎఫ్ చీఫ్, సీనియర్ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ►ఎయిర్క్రాఫ్ట్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ వేడుకలకు. ►భారత వాయు సేన.. అక్టోబర్ 8, 1932న అధికారికంగా బ్రిటిష్ పాలనలో మొదలైంది. ►ఏప్రిల్ 1, 1933 నుంచి నుంచి సేవలు(కేవలం శిక్షణ కోసం) మొదలుపెట్టినప్పటికీ.. పూర్తిస్థాయిలో రెండో ప్రపంచ యుద్ధంలోనే రంగంలోకి దిగింది. ►ఆ టైంలో ఈ విభాగం పేరు.. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ►ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF).. దేశం తరపున ఆకాశ మార్గానా గస్తీ కాచే, శత్రువులతో పోరాడే కీలక సైన్య విభాగం. ►పాక్, చైనాతో జరిగిన యుద్ధాల్లోనూ ఐఏఎఫ్ సేవలు మరువలేనివి. ►గత 89 ఏళ్లుగా.. ముఖ్యంగా స్వాతంత్ర్యం అనంతరం.. వాయు సేన క్రమక్రమంగా తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ను సైతం వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యాల తర్వాత అతిపెద్ద వాయుసేనను కలిగి ఉన్న వ్యవస్థగా భారత్ నిలిచింది. ►ఐఎఎఫ్ నినాదం ‘నభమ్ స్పర్శమ్ దీప్తమ్’(ఇంగ్లీష్లో టచ్ ది స్కై విత్ గ్లోరీ) అంటే.. ఆకాశాన్ని అంటే కీర్తి అని అర్థం. భగవద్గీతలోని పదకొండవ అధ్యయం నుంచి ఈ వాక్యాన్ని భారత వాయు సేన స్ఫూర్తిగా తీసుకోవడం విశేషం. ►భారత వాయు సేనలో ప్రస్తుతం సుమారు 1,400 ఎయిర్క్రాఫ్ట్లు, లక్షా డెబ్భై వేల మంది సిబ్బంది ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ►యూపీ హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్.. ఆసియాలో అతిపెద్ద, ప్రపంచంలో 8వ పెద్ద ఎయిర్ బేస్. అందుకే ఇక్కడ ఉత్సవాల్ని నిర్వహిస్తారు. ►ఆపరేషన్ పుమాలై, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్.. ఇలా ఎన్నో ఆపరేషన్లలో ఐఎఎఫ్ సేవలు మరువలేనిది. ►యుద్ధ సమయంలోనే కాదు.. జాతి ప్రయోజనాల కోసం సైతం పని చేస్తుంది భారత వాయు సేన. గుజరాత్ తుపాన్(1998), సునామీ(2004), ఉత్తరాది వరదల సమయంలో సేవలు అందించింది కూడా. ముఖ్యంగా ఉత్తరాఖండ్ వరదల సమయంలో ‘రాహత్’ ఆపరేషన్ ద్వారా 20 వేల మంది ప్రాణాలు కాపాడగలిగింది ఐఎఎఫ్. ►ఐక్యరాజ్య సమితి శాంతి చర్యల్లోనూ ఐఎఎఫ్ పాల్గొంటోంది. ►వాయు సేనలో మహిళలకు ఉన్నత ప్రాధాన్యం ఉంటోంది. నేవిగేటర్ల దగ్గరి నుంచి పైలట్లు, ఉన్నత స్థాయి పదవుల్లో కొనసాగుతున్నారు. - సాక్షి, వెబ్ స్పెషల్ -
Air Show: ఆకాశంలో అద్భుత విన్యాసాలు
-
జమ్ము కశ్మీర్లో భారత 'వైమాని దళ విన్యాసం'
-
ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేలా భారత బలగాలకు వ్యూహాత్మక శిక్షణ !
న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్గనిస్తాన్ను ఆక్రమించిన నేపథ్యంలో సరిహద్దు భద్రతా అంశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారతదేశ సరిహద్దు ప్రాంతంలో మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలతో పాటు సాయుధ బలగాలకు సరికొత్త వ్యూహాత్మక శిక్షణ ఇవ్వాలని కేంద్ర భద్రత సంస్థ సూచించింది. అఫ్గన్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడకుండా మోహరించి ఉన్న దళాలను సరికొత్త వ్యూహంతో ఎదుర్కొనేలా సంసిద్ధం చేయాలని నొక్కి చెప్పింది. అఫ్గానిస్తాన్లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని చూస్తే అడుగడుగునా పాకిస్తాన్ ముద్ర స్పష్టంగా కనిపించడమే కాక భారత్పై దాడులు చేసిన హక్కానీలకు కీలక పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ సరిహద్దు ప్రాంతాలైన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, లోతట్టు ప్రాంతాలలో భద్రతా దళాలను మరింతగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోమని కోరింది. భద్రత దళాలైన బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, సీఆర్పీఎఫ్ దళాలు అత్యంత ధైర్య సాహసాలతో ఉగ్రవాదులను తిప్పికొట్టగల సామర్థ్యం కలవారని ఆర్మీ ఉన్నతాధికారి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
జాతీయ రహదారిపై ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
జైపూర్: కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కేఎస్ భదౌరియా కలిసి ప్రయాణిస్తున్న భారత వైమానిక దళానికి చెందిన సీ-130జె సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం మాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఫెసిలిటీ(ఈఎల్ఎఫ్) డ్రిల్ లో భాగంగా రాజస్థాన్ బార్మర్ సమీపంలోని సట్టా-గాంధవ్ జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యింది. భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం జాతీయ రహదారిని ఉపయోగించడం ఇదే మొదటిసారి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రోడ్డు రవాణా & రహదారి మంత్రి నితిన్ గడ్కరీ కలిసి సంయుక్తంగా రాజస్థాన్ బార్మర్ సమీపంలో ఐఏఎఫ్ అత్యవసర ల్యాండింగ్ కోసం నిర్మించిన సట్టా-గాంధవ్ జాతీయ రహదారిని ప్రారంభించారు. ఈ మాక్ డ్రిల్ విజయవంతం కావడంతో రక్షణ మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కేవలం 19 నెలల్లో నిర్మించిన సట్టా-గాంధవ్ జాతీయ రహదారిపై నేడు జరిగిన ఈఎల్ఎఫ్ విమాన కార్యకలాపాలను వారు వీక్షించారు. ఐఏఎఫ్ కు చెందిన 32 సైనిక రవాణా విమానం, మీ-17వి5 హెలికాప్టర్ కూడా ఈఎల్ఎఫ్ వద్ద దిగాయి. (చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు వాయిదా..?) #WATCH | C-130J Super Hercules transport aircraft with Defence Minister Rajnath Singh, Road Transport Minister Nitin Gadkari & Air Chief Marshal RKS Bhadauria onboard lands at Emergency Field Landing at the National Highway in Jalore, Rajasthan pic.twitter.com/BmOKmqyC5u — ANI (@ANI) September 9, 2021 రాజస్థాన్లోని సట్టా-గాంధవ్ స్ట్రెచ్ను ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజస్థాన్లోని బర్మేర్ జిల్లాలో సట్టా-గాంధవ్ జాతీయ రహదారి మాదిరిగానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్స్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. యుద్ద సమయాలలో ఈ రహదారులు ముఖ్య భూమిక పోషిస్తాయి అని అన్నారు. కోవిడ్-19 ఆంక్షలు ఉన్నప్పటికీ ఐఎఎఫ్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ రంగం చేతులు కలిపి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ నిర్మాణాన్ని 19 నెలల్లో పూర్తి చేసినందుకు రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. "బహుళ విభాగాలు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి ఇది గొప్ప ఉదాహరణ" అని ఆయన అన్నారు. రాజ్ నాథ్ సింగ్ 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐఎఎఫ్ విమానాల ల్యాండింగ్ సరికొత్త ఇండియా చారిత్రాత్మక బలంగా నిర్వచించారు. భారత వైమానిక దళానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కోసం మూడు కిలోమీటర్ల విభాగాన్ని ఎన్హెచ్ఏఐ అభివృద్ధి చేసింది. ఈ మొత్తం జాతీయ రహదారిని(196.97 కిలోమీటర్ల పొడవు) భారత్ మాల ప్రాజెక్టు కింద రూ.765.52 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్నారు. వీటి పనులు జూలై 2019లో ప్రారంభమైతే, జనవరి 2021లో పూర్తి అయ్యాయి. ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న బార్మర్, జలోరే జిల్లాల గ్రామాలను కలుపుతుంది. చైనా, పాకిస్తాన్ సహా ఉపఖండంలో శత్రువులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మరిన్ని జాతీయ రహదారులు అవసరమని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ తో పాటు, సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు కింద కుందన్ పురా, సింఘానియా, బఖసర్ గ్రామాల్లో మూడు హెలిప్యాడ్ లను నిర్మించారు. -
జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం
జమ్మూ: జమ్మూలోని మూడు ప్రాంతాల్లో మళ్లీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. ఈ పరిణామంతో పోలీసులు, సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మిరాన్ సాహిబ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 9.23 గంటలకు ఒక డ్రోన్ కనిపించగా, కలుచక్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4.40 గంటలకి ఒక డ్రోన్, కుంజ్వానిలో 4.52 గంటలకి మరో డ్రోన్ కనిపించిందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్పై ఆదివారం డ్రోన్ దాడి జరిగిన దగ్గర్నుంచి ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట డ్రోన్లు కనిపిస్తూనే ఉన్నాయి. జమ్మూలోని భారత వైమానిక దళం స్థావరం వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వైమానిక స్థావరంపైనే ఆదివారం డ్రోన్లతో తొలిసారిగా దాడి జరిగిన విషయం తెలిసిందే. డ్రోన్లతో ఏ క్షణంలో ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందోనని ఈ వైమానిక స్థావరంలో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు, సాఫ్ట్ జామర్లు ఏర్పాటు చేసినట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో చైనాకు చెందిన డ్రోన్లు వాడినట్టుగా ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. డ్రోన్ల నుంచి పేలుడు పదార్థాలను జారవిడిచినట్టుగా భావిస్తున్నారు. నైట్ విజన్, నావిగేషన్ వ్యవస్థ కలిగిన డ్రోన్లను ముష్కరులు వాడినట్టుగా భద్రతా అధికారులు వెల్ల డించారు. మరోవైపు రాజౌరి జిల్లాలో ఏ అవసరానికైనా డ్రోన్లను వినియోగించడంపై అధికారులు నిషేధం విధించారు. -
భారత అమ్ములపొదిలో మరో అద్భుతం
భువనేశ్వర్: ప్రపంచంలోనే అత్యంత అధునాతన యంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ‘హెలీనా’ ప్రయోగానికి సంబంధించిన వీడియోలను భారత వైమానికి దళం విడుదల చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసిన హెలీనాకు ధ్రువస్త్రా అని నామకరణం చేశారు. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ బాలసోర్లో జూలై 15, 16 తేదీల్లో క్షిపణి ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. హెలీనా (హెలికాప్టర్ ఆధారిత నాగ్ మిస్సైల్) ప్రత్యక్ష హిట్ మోడ్తో పాటు టాప్ అటాక్ మోడ్లోనూ లక్ష్యాలను చేధించగలదని అధికారులు వెల్లడించారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన హెలీనా ప్రపంచంలోనే అత్యంత అధునాతన యాంటీ ట్యాంక్ ఆయుధాలలో ఒకటి. ఇందులో అమర్చిన యాంటీ ట్యాంక్ గైడెడె వ్యవస్థ ద్వారా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇది పనిచేయగలదు. లాక్-ఆన్ బిఫోర్-లాంచ్ మోడ్లో పనిచేసే ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్ (ఐఐఆర్) ద్వారా దీనికి మార్గదర్శకాలు అందుతాయి. దీనిలో అమర్చిన అత్యాధునిక టెక్నాలజీ ద్వారా యుద్ధ ట్యాంకులను విచ్చిన్నం చేయగలదు. దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి హెలీనా సహాయపడుతుందని సైనిక అధికారులు పేర్కొన్నారు. భారత వైమానిక దళంలో మరో కీలక ఆయుధంగా హెలీనా (ధ్రువస్త్రా)ని అభివర్ణిస్తున్నారు. (లద్దాఖ్కు యుద్ధ విమానాలు ) #WATCH Trials of Helicopter-launched Nag Missile (HELINA), now named Dhruvastra anti-tank guided missile in direct and top attack mode. The flight trials were conducted on 15&16 July at ITR Balasore (Odisha). This is done without helicopter. pic.twitter.com/Jvj6geAGLY — ANI (@ANI) July 22, 2020 -
గాంధీ ఆస్పత్రికి అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో కీలకమైన వేదికగా మారిన గాంధీ ఆస్పత్రిలో ఆదివారం (మే 3) రోజు అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కబళిస్తున్న వేళ.. కరోనా ఫైటర్స్ గా మారి చికిత్స అందిస్తున్న ‘గాంధీ’ వైద్యులపై పూల వర్షం కురవబోతుంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ బారిన పడిన రోగులకు సేవలు అందించేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. సెలవులను సైతం రద్దు చేసుకొని వైద్యం అందిస్తున్నారు. వీరి కృషి వల్ల ఎందరో బాధితులు కోలుకొని ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో గాంధీ వైద్య సిబ్బందికి అభినందనలు తెలపడానికి ఎయిర్ ఫోర్స్ ముందుకు వచ్చింది. కరోనాని జయిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి సంఘీభావంగా రేపు ఉదయం 9.30 గంటలకు గాంధీ ఆస్పత్రిపై హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించబోతున్నారు. (చదవండి : వైద్యురాలికి ఘన స్వాగతం.. భావోద్వేగం) గాంధీ ఆసుపత్రి ఆవరణలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద డాక్టర్లు. నర్సులు. తెలంగాణ పోలీసు అధికారులు, మినిస్టీరియల్, పారామెడికల్, 4వ తరగతి సిబ్బంది, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సహా అందరూ హాజరు కావాలని హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు కోరారు. వీరందరిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించి అభినందనలు తెలియజేయాలని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్ణయించింది. ఎయిర్ ఫోర్స్ అధికారుల సూచన మేరకు సిబ్బంది అంతా తమ యూనిఫాంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద హాజరు కావాలని.. ఎయిర్ ఫోర్స్ అందించే ప్రశంశలను అందుకోవాలని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కోరారు. కాగా, వైద్యులు చేస్తున్న కృషికి సంఘీభావంగా దేశ వ్యాప్తంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందిపై ఆదివారం హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించనున్నారు. -
వాయుసేనకు 200 జెట్ విమానాలు
కోల్కతా: భారత వైమానిక దళంలోకి మరో 200 యుద్ధ విమానాలను చేర్చనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారుచేసే 83 ఎల్సీఏ తేజస్ మార్క్ 1ఏ విమానాల కాంట్రాక్టు తుది దశలో ఉందన్నారు. మొత్తంగా 200 విమానాలను తీసుకొనే ప్రక్రియ సాగుతోందన్నారు. ఎల్సీఏ మార్క్ 1ఏ విమానాల డిజైన్ పూర్తయినందున ఉత్పత్తిని ఏడాదికి 16కి పెంచుతుందన్నారు. -
ప్రాంతీయంగా శాంతి నెలకొనాలి
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ బుధవారం ఇరుగు పొరుగు దేశాధినేతలతో ఫోన్లలో మాట్లాడారు. వారికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందిస్తూనే ప్రాంతీయంగా శాంతి భద్రతల కోసం భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని కె.పి. శర్మ ఒలి, భూటాన్ రాజు జిగ్మె ఖేసర్, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సొలి తదితరులతో ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయంగా శాంతి భద్రతల అంశానికే తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని మోదీ ఈ సందర్భంగా తెలియజేశారు. భారత వాయుసేన వీడియో వైరల్ భారత వాయుసేన 2020 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ శుభాకాంక్షలు అందిస్తూ రూపొందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నరనరాల్లోనూ ఉప్పొంగే దేశభక్తి, ఉవ్వెత్తున ఎగిసిపడే భావోద్వేగాలతో ఈ వీడియోను రూపొందించారు. గగన తలాన్ని రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడే వాయుసేన బలగాల కర్తవ్యదీక్షలో ఎలాంటి సాహ సాలు చేస్తారో చూపించిన అత్యంత శక్తిమంతమైన దృశ్యాలు అందరినీ కట్టిపడేశాయి. హిందీలో కవితాత్మకంగా దేశభక్తిని, మాతృభూమి రక్షణ కోసం వాయుసేన చేసే సాహసాన్ని వర్ణించిన తీరుతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీడియోను ఐఎఎఫ్ తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేసింది. అది క్షణాల్లోనే వైరల్ అయింది. కొద్ది గంటల్లో 13వేలకు పైగా వ్యూస్, 5వేలకు పైగా లైక్లు, వెయ్యికి పైగా రీట్వీట్లతో వైరల్గా మారింది. -
సాగరమంతా సంబరమే!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్ వేదికగా.. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నేవీ డే వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. విశిష్ట, ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఆయనకు తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ సతీసమేతంగా స్వాగతం పలికారు. తొలుత నేవీ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల నేవీ బ్యాండ్ ప్రదర్శనతో నావికాదళ వేడుకలకు శ్రీకారం చుట్టారు. మెరైన్ కమెండోలు 84 ఎంఎం రాకెట్ వాటర్ బాంబు పేల్చి సీఎంకు స్వాగతం పలికారు. తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన సూర్యకిరణ్ యుద్ధ విమానాల బృందం చేసిన విన్యాసాలు గగుర్పొడిచాయి. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో సముద్రంలో పయనిస్తూ ఐఎస్వీ తరహా నౌకలు సుదూరం నుంచి ఎదురెదురుగా దూసుకువచ్చే సన్నివేశం అబ్బురపరచింది. ఆరువేల అడుగుల ఎత్తులో పయనిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ల నుంచి పారా జంపింగ్ చేసిన స్కై డైవర్లు గాల్లో విన్యాసాలు చేస్తూ ప్యారాచూట్ల సహాయంతో వేదిక ప్రాంగణంలో చాకచక్యంగా వాలారు. అనంతరం స్కై డైవర్ల బృంద సారధి లెఫ్టినెంట్ రాథోడ్ విశిష్ట అతిథి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి స్మృతి చిహ్నాన్ని అందించారు. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించడం, మిగ్ విమానాలు పల్టీలు కొడుతూ దూసుకుపోవడం, మార్కోస్ను సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా మరో చోటకు తరలించడం వంటి సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అద్భుతమైన రీతిలో విన్యాసాలు ప్రదర్శించారంటూ నౌకాదళ బృందాన్ని సీఎం ప్రశంసించారు. బుధవారం విశాఖ సాగర తీరంలో ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు చేస్తున్న నేవీ సిబ్బంది. (ఇన్సెట్లో) తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్కుమార్ జైన్తో కలిసి విన్యాసాలను వీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ తేనీటి విందులో సీఎం జగన్ విన్యాసాలు ముగిసిన అనంతరం నేవీ హౌస్లో ఎట్ హోం పేరుతో నిర్వహించిన తేనీటి విందులో సీఎం జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. భారత నౌకాదళం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ సాగించిన వీరోచిత చరిత్రపై ప్రదర్శించిన షార్ట్ ఫిల్మ్ను తిలకించారు. సీఎం వెంట మంత్రులు అవంతి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. -
ఘానంగా ఇండియన్ ఏయిర్ ఫోర్స్ 87వ వార్షికోత్సవం
-
రఫేల్తో బలీయ శక్తిగా ఐఏఎఫ్
పారిస్: అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల చేరికతో భారత వైమానిక దళ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని యూరోప్కు చెందిన క్షిపణి తయారీ సంస్థ ఏంబీడీఏ పేర్కొంది. తాము తయారు చేసిన మెటియొర్, స్కాల్ప్ క్షిపణులను రఫేల్ యుద్ధ విమానాలు ప్రయోగించగలవంది. ‘ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలపైకి మెరుపువేగంతో, కచ్చితత్వంతో దాడి చేయగల మెటియొర్, ఆకాశం నుంచి భూమిపై సుదూర లక్ష్యాలను ఛేదించగల స్కాల్ప్ క్షిపణులు భారత వైమానిక దళాన్ని మరింత శక్తిమంతం చేస్తాయి. ఈ సామర్థ్యం భారత్కు గతంలో లేదు’ అని ఎంబీడీఏ ఇండియా చీఫ్ పీడ్వాచ్ వ్యాఖ్యానించారు. ‘రఫేల్ అద్భుతమైన యుద్ధ విమానం. ఇది ఆధునిక ఆయుధ శ్రేణితో ఉంది. ఈ ఒప్పందంలో మేం కూడా భాగస్వాములం కావడం సంతోషకరం’ అన్నారు. ఫ్రాన్స్ నుంచి రూ. 58 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధవిమానాలను భారత్ కొనుగోలు చేస్తుండటం తెలిసిందే. అందులో తొలి విమానాన్ని మంగళవారం భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ ఫ్రాన్స్ మిలటరీ అధికారుల నుంచి స్వీకరించనున్నారు. కంటికి కనిపించని లక్ష్యాలను ఛేదించడంలో మెటియొర్ క్షిపణి సామర్థ్యం అమోఘమని పీడ్వాచ్ పేర్కొన్నారు. అలాగే, లక్ష్యాల ఛేదనలో స్కాల్ప్కు తిరుగులేదని కితాబిచ్చారు. ఈ రెండు క్షిపణులతో కూడిన రఫే ల్ చేరికతో భారత వైమానిక దళం ప్రాంతీయంగా బలీయ శక్తిగా మారుతుందన్నారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మెటియొర్ కచ్చితత్వంతో పనిచేస్తుందని, ఫైటర్ జెట్స్ నుంచి చిన్నవైన మానవ రహిత విమానాల వరకు అన్నింటినీ కచ్చితత్వంతో కూల్చివేయగలదన్నారు. ఆకాశం నుంచి ప్రయోగించి భూమిపై ఉన్న సుదూర లక్ష్యాలను ముందస్తు ప్రణాళికతో ఛేదించడంలో స్కాల్ప్ సామర్థ్యం తిరుగులేనిదన్నారు. భారత్ అవసరాలకు అనుగుణంగా రఫేల్లో మార్పులు చేశారు. ఫ్రాన్స్లో రాజ్నాథ్ ఆయుధ పూజ న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాలను స్వీకరించేందుకు ఫ్రాన్స్ వెళ్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. దసరా సందర్భంగా అక్కడే పారిస్లో ఆయుధ పూజ చేయనున్నారు. దసరా రోజు ఆయుధ పూజ చేయడం సంప్రదాయం. దసరాతో పాటు భారత వైమానిక దళ వ్యవస్థాపక దినోత్సవం కూడా కావడం విశేషం. రఫేల్ యుద్ధ విమానాన్ని స్వీకరించిన అనంతరం.. పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రాజ్నాథ్ అందులో ప్రయాణించనున్నారు. 36 యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని మంగళవారమే స్వీకరించినప్పటికీ.. తొలి నాలుగు రఫేల్ యుద్ధవిమానాలు భారత్కు వచ్చే ఏడాది మేలోనే వస్తాయి. రఫేల్ను భారత్కు అందించే కార్యక్రమంలో ఫ్రాన్స్ మిలటరీ ఉన్నతాధికారులు, డసో ఏవియేషన్ సీనియర్ అధికారులు పాల్గొంటారు. రూ. 58 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్తో 2016లో ఒప్పందం కుదిరింది. పలు ఆధునిక ఆయుధాలు, క్షిపణులను ఈ యుద్ధవిమానం నుంచి ప్రయోగించవచ్చు. మొదట వచ్చే యుద్ధవిమానాలను అంబాలాలోని వైమానిక దళ స్థావరంలో మోహరించనున్నారు. -
మరో ‘బాలాకోట్’కు రెడీ
న్యూఢిల్లీ: భారత్–పాక్ సరిహద్దుల్లోని పరిస్థితులపై భారత వాయు సేన(ఐఏఎఫ్) ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, అవసరమైతే బాలాకోట్ తరహాలో మరో వైమానిక దాడికి దిగేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని ఐఏఎఫ్ నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా వెల్లడించారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఎలాంటి ఆపరేషన్లు అయినా చేపడతామని తెలిపారు. అంతకుముందు భారత వాయు సేనలో 26వ ఎయిర్ చీఫ్ మార్షల్గా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందిన చీఫ్ బీఎస్ ధనోవా స్థానంలో రాకేశ్ బాధ్యతలు స్వీకరించారు. -
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
-
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: భారత వాయుసేన ఆధునీకరణ దిశగా పెద్ద ముందడుగు పడింది. వాయుసేన అమ్ములపొదిలోకి తాజాగా ఎనిమిది అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరాయి. అమెరికాలో తయారైన అపాచీ ఏహెచ్-64ఈ (ఐ) హెలికాప్టర్లు మంగళవారం భారత్ చేరాయి. పఠాన్కోట్ ఎయిర్బేస్లో వీటిని వాయుసేన స్వాధీనం చేసుకుంది. వాయుసేనకు చెందిన125 హెలికాప్టర్ యూనిట్ ’గ్లాడియేటర్స్’ ఈ అత్యాధునిక హెలికాప్టర్లు వినియోగించనున్నారు. వాయుసేన అమ్ములపొదిలోకి ఈ హెలికాప్టర్లు చేరిన సందర్భంగా వాటిని ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా, ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ పరిశీలించారు. అమెరికా నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్లను భారత్ దిగుమతి చేసుకొంది. వీటిని కొనుగోలు చేసేందుకు 2015లోనే భారత్ అమెరికా రక్షణ సంస్థ బోయింగ్తో 1.1 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2022నాటికి భారత వాయుసేనలోకి మొత్తం 22 అపాచీయుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరనున్నాయి. మొత్తం నాలుగు దశల్లో వీటిని బోయింగ్ భారత్కు అప్పగించనుంది. ప్రస్తుతం భారత వాయుసేన సోవియట్ నాటి ఎంఐ-25, ఎంఐ 35 హెలికాప్టర్లను వినియోగిస్తోంది. వీటి స్థానంలో అపాచీ హెలికాప్టర్లను వాయుసేన ఇకనుంచి వినియోగించనుంది. పాకిస్థాన్ సరిహద్దులకు కొద్ది దూరంలోనే ఉన్న పఠాన్ కోట్ ఎయిర్బేస్లో ఈ యుద్ధ హెలికాప్టర్లలోని నాలుగింటిని వాయుసేన మోహరించనుంది. -
గగనతలంలో అరుదైన ఘట్టం
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్తో కలిసి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మిగ్ 21 సోర్టీ యుద్ధవిమానాన్ని చివరిసారిగా నడిపారు. ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఇది ధనోవా చివరి గగన విహారం. అంతేకాదు.. ఈ విహారానికో ప్రత్యేకత ఉంది. గతంలో అభినందన్ తండ్రి సింహకుట్టి వర్థమాన్తో కలిసి ధనోవా యుద్ధవిమానాన్ని నడిపించారు. ఎయిర్ మార్షల్గా సింహకుట్టి రిటైరయ్యారు. ఆయన కొడుకు అయిన అభినందన్ భారత వైమానిక దళంలో పనిచేస్తుండటమే కాదు.. గత ఫిబ్రవరిలో గగనతలంలో పాకిస్థాన్తో జరిగిన హోరాహోరి వైమానిక పోరులో దాయాదికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని వీరోచితంగా కూల్చేసిన సంగతి తెలిసిందే. దాయాదితో వీరోచిత పోరులో అసమాన ధైర్యసాహసాలకు మారుపేరుగా నిలిచిన అభినందన్తో కలిసి మిగ్ 21 యుద్ధవిమానాన్ని నడిపించిన ధనోవా అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అభినందన్తో తనకు పలు విషయాల్లో సారూప్యతలు ఉన్నాయని, అందుకే అతనితో కలిసి చివరిసారిగా యుద్ధవిమానాన్ని నడిపించానని తెలిపారు. తాము ఇద్దరం కూలిపోతున్న యుద్ధవిమానం నుంచి తప్పించుకొని కిందకు దిగామని, అదేవిధంగా పాకిస్థానీలతో పోరాడామని ధనోవా వివరించారు. ఇక, అభినందన్ తండ్రి సింహకుట్టితో కలిసి తాను గతంలో యుద్ధ విమానం నడిపించానని, ఇప్పుడు ఆయన కొడుకుతో కలిసి యుద్ధ విమానం నడిపించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. -
వాయుసేనకు అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్ మరింత శక్తిమంతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత అధునిక యుద్ధ హెలికాప్టర్ అపాచీ ఏహెచ్ 64ఈ త్వరలో వాయుసేన అమ్ములపొదిలో చేరనుంది. అమెరికా విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ నాలుగేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు హెలికాప్టర్లను భారత్కు అందజేసింది. మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లకు డీల్ కుదరగా తొలి విడతగా నాలుగు హెలికాప్టర్లు ఐఏఎఫ్కి అందాయి. వచ్చేవారం మరో నాలుగు వస్తాయి. మొత్తం ఎనిమిది అపాచీ హెలికాప్టర్లు పఠాన్కోట్ వైమానిక కేంద్రం నుంచి త్వరలో భారత వైమానిక దళంలో లాంఛనంగా చేరనున్నాయి. అపాచీ చేరికతో తమ పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని ఐఏఎఫ్ ఆశాభావం వ్యక్తంచేసింది. -
తెలంగాణ నుంచి ఒకే ఒక్కడు!!
సాక్షి, వనపర్తి(మహబూబ్ నగర్) : దేశం కోసం పని చేయాలనే లక్ష్యంతో నూనుగు మీసాల వయస్సులో ఓ యువకుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అర్హత సాధించి ఇండియన్ ఎయిర్ఫోర్స్ విభాగంలో యుద్ధ విమానాలు నడిపే పైలెట్కు శిక్షణ తీసుకోనున్నాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎయిర్ ఫోర్స్కు ఎంపికైన ఏకైక విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమశిక్షణ, ఆలోచన, దేశభక్తి తోడైతే విజయం సాధించవచ్చని పట్టుదలతో నిరూపించాడు. ఉరిమే ఉత్సాహంతో ఉన్న ఆ యువకుడు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో స్థానం సంపాదించాడు. సైనిక అధికారుల పర్యవేక్షణలో మూడేళ్లపాటు సైనిక శిక్షణ పొందనున్నాడు. నేవీ, ఆర్మీ కంటే అతికష్టంగా ఉండే ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన అన్ని టెస్టుల్లోనూ ప్రతిభ సాధించడంతో అర్హత సాధించాడు. దేశానికి సేవ చేసే భాగ్యం కోసం చిన్నప్ప టి నుంచి కలలు గన్న ఆ యువకుడి తల్లిదండ్రుల ఆశయాలు ఫలించాయి. వనపర్తి లోని గాంధీనగర్కాలనీకి చెందిన ఎల్ఐసీ కృష్ణ, చంద్రకళ దంపతుల కుమారుడు నిఖిల్సాయి యాదవ్ 2018 సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా 208 ఆర్మీ, 42 నేవీ, 92 ఎయిర్ ఫోర్స్కు గాను యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ ఎంట్రెన్స్ ఎగ్జాం నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా 3.12 లక్షల మంది విద్యార్థు లు ఎంట్రెన్స్ టెస్టు రాయగా అందులో 6,800 మంది అర్హత సాధించారు. నవంబ ర్ 30న ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల కావ డంతో అర్హత సాధించిన వారికి డెహ్రడూన్ లో సర్వీస్ సెలక్షన్ బోర్డు ఈ ఏడాది జనవరి 14 నుంచి 19 వరకు డ్యాకుమెంట్ వెరిఫికేషన్, ఫిజిక ల్ ఫిట్నెస్ టెస్టు, సైకాలజీ టెస్టులో నిర్దేశిత టైం ప్రకారం నిర్వహించే టెస్టులు ఒక పిక్చర్ చూయిం చి దానిపై స్టోరీ రాయించడం, స్విచ్వేషన్ రియాక్ట్ టెస్టులో 60 స్విచ్ వేషన్లను 30 నిమిషాల్లో స్టూడెంట్ 30 రియాక్షన్స్ పేర్కొన్నాలి. సెల్ఫ్ డిక్రిప్షన్, వర్డ్ అసోసియేషన్ టెస్టులో 15 సెకన్లకు వచ్చే ఒక వర్డ్పై సెంటన్స్ రాయడం, పర్సనల్ ఇంటర్వ్యూ ఒక గంట మౌఖికంగా నిర్వహించడం, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ నేతృత్వంలో గ్రూప్ చర్చలు, గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్, ప్రోగ్రెసివ్ గ్రూప్ చాట్, ఆఫ్ గ్రూప్ చాట్, సెల్స్ ఆప్టికల్స్, గ్రూప్ ఆప్స్ కిల్ రేస్, కమాండ్ టాస్క్ లెక్చరేట్, ఫైనాల్ గ్రూప్ టాస్క్ మెడికల్ ఎగ్జామ్ ఇలా అన్నింటిలో అర్హత సాధించాడు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 21 నుంచి 25 వరకు ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబిలీష్మెంట్ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో అన్నింటిలో మెరుగ్గా తేలడంతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశానికి చోటు దక్కింది. ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేసిన వారు, చదువుతున్న వారు ఈ పరీక్షలు రాసేందుకు అర్హులు, ప్రతి ఆరు నెలలకోసారి యూపీఎస్సీ భారత రక్షణ శాఖ నేతృత్వంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన వారు ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ అధికారి హోదాతో ఉద్యోగ జీవితం ప్రారంభం కానుంది. మూడేళ్ల శిక్షణతోపాటు బీటెక్ అని పరీక్షల్లోనూ అర్హత సాధించడంతో యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో మూడేళ్ల ప్రవేశానికి చోటు కల్పిస్తూ యూపీఎస్సీ ధ్రువీకరించింది. జూలై 2న పుణెలోని కడక్వాస్లో గల ఎన్డీఏలో చేరనున్నారు. అక్కడ మూడేళ్లపాటు ఎయిర్ ఫోర్స్తోపాటు బీటెక్ చేయిస్తారు. ఇందుకు సంబంధించి ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించనుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఏడాదిపాటు ట్రైనీ ఫ్లయింగ్ ఆఫీసర్గా శిక్షణ ఇస్తారు. అనంతరం అధికారికంగా నియమాక పత్రం అందజేస్తారు. దీంతో యుద్ధ విమానాలు నడిపే పైలెట్గా దేశానికి సేవ చేయాల్సి ఉంటుంది. సంతోషంగా ఉంది నేను దేశానికి సేవ చేయబోతున్నాననే మాట ఎంతో సంతృస్తిని ఇస్తుంది. తల్లిదండ్రుల ఆశయాన్నీ నిలబెట్టేందుకు పట్టుదలతో చదువుకున్నా. అదే పట్టుదలతో దేశానికి సేవ చేస్తాను. ప్రణాళికబద్ధంగా చదువుకొని ముందుకు సాగాను. ఇకపై కూడా అన్ని పరీక్షల్లోనూ పూర్తిగా అర్హత సాధిస్తానన్న నమ్మకం ఉంది. – నిఖిల్సాయి, వనపర్తి -
దుండిగల్ ఎయిర్ఫోర్స్లో ఆకాడమీలో విన్యాసాలు
-
విమానం జాడపై తొలగని ఉత్కంఠ
ఈటానగర్/న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్–32 రకం రవాణా విమానం ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాయుసేన విమానం జాడ కనిపెట్టేందుకు మంగళవారం భారతీయ నేవీ కూడా రంగంలోకి దిగింది. మొత్తం 13 మందితో వెళ్తున్న ఏఎన్–32 విమానం అస్సాంలోని జోర్హత్ నుంచి టేకాఫ్ అయిన 33 నిమిషాలకే అదృశ్యమైన విషయం తెలిసిందే. అరుణాచల్ప్రదేశ్లోని మెచుకా ప్రాంతానికి చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే గల్లంతైంది. అదృశ్యమైన విమానాన్ని వెతికేందుకు శక్తివంతమైన పీ8ఐ విమానం తమిళనాడులోని ఎర్నాకులంలో ఉన్న ఐఎన్ఎస్ రాజలీ నుంచి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరిందని నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ వెల్లడించారు. ఇది ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఎయిర్ఫోర్స్కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు విమానం కోసం మెంచుకా అటవీ ప్రాంతంలో గాలిస్తున్నాయని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో కొంతమంది బృందాలుగా ఏర్పడి విమానం జాడ కోసం వెతుకుతున్నాయని తెలిపారు. సోమవారం ఓ చోట విమానం కూలిపోయినట్లు తమకు సమాచారం అందిందని.. వెంటనే అక్కడకు వెళ్లి పరిశీలించగా అలాంటిదేం లేదని గుర్తించామని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో వెల్లడించింది. అస్సాంకు చేరిన ఫ్లైట్ లెఫ్టినెంట్ కుటుంబసభ్యులు పటియాలా: అదృశ్యమైన విమానంలో ఎనిమిది మంది వైమానిక సిబ్బంది సహా ఐదుగురు ప్యాసింజర్లు ఉన్నారని తెలిపింది. వీరిలో పటియాలాలోని సమానా ప్రాంతానికి చెందిన ఫ్లైట్ లెఫ్లినెంట్ మోహిత్ గార్గ్ కూడా ఉన్నారు. విమానం గల్లంతైన వార్త తెలియగానే మోహిత్ తండ్రి సురీందర్ గార్గ్, అంకుల్ రిషీ గార్గ్ అస్సాంకు చేరుకున్నారని వారి కుటుంబసభ్యులు వెల్లడించారు. మోహిత్ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు అతని సోదరుడు అశ్వనీ గార్గ్ తెలిపారు. మోహిత్కు గతేడాది వివాహమైంది. అతని భార్య అస్సాంలోని ఓ బ్యాంకులో పనిచేస్తోంది. పదేళ్ల క్రితమూ ఇలాగే.. అది 2009 సంవత్సరం జూన్ నెల. భారత వాయుసేనకు చెందిన ఏఎన్–32 రకం రవాణా విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్లో కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని రించీ హిల్పైన ఆ విమానం కూలిపోయింది. ఆ విమానం మెచుకా నుంచి అసోంలోని మోహన్బరి వైమానిక స్థావరానికి వెళ్తుండగా మెచుకాకు 30 కిలోమీటర్ల దూరంలో దుర్ఘటన జరిగింది. విచిత్రం ఏమిటంటే సరిగ్గా పదేళ్లకు జూన్ నెలలోనే 13 మందితో మెచుకా వెళ్తున్న ఏఎన్–32 రకం విమానం సోమవారం కన్పించకుండా పోయింది. ఇందులో కూడా 13 మందే ఉండటం గమనార్హం. ఈ విమానం మెచుకాకు వెళుతుండగా అదృశ్యం కావడం విశేషం. -
వాయుసేన వ్యూహాత్మక కేంద్రంగా ఏపీ
సాక్షి, అమరావతి: భారతదేశ తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్ను వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దాలని భారత వాయుసేన నిర్ణయించింది. విపత్తు నిర్వహణ, నిఘా, రక్షణ అవసరాల కోసం మన రాష్ట్రంలోని విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో యుద్ధవిమానాల బేస్క్యాంప్లు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు వ్యూహాత్మక ప్రణాళికను భారత వాయుసేన ఉన్నతస్థాయి కమిటీ ఆమోదించింది. బంగాళాఖాతంలో పటిష్ట నిఘా ప్రస్తుతం దేశ తూర్పు తీరంలో చెన్నై సమీపంలోని అరక్కోణంలో వైమానిక దళ స్థావరం ఉంది. యుద్ధ విమానాలను అక్కడ మొహరించారు. ఎక్కడైనా విపత్తులు సంభవించినా, రక్షణ అవసరాల కోసం అక్కడి నుంచే యుద్ధ విమానాలను పంపిస్తున్నారు. కాగా తూర్పు తీరంలో బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అరికట్టడంతోపాటు బంగాళాఖాతంలో చైనా ఆధిపత్యంపై కన్నేసి ఉంచాల్సిన అవసరాన్ని భారత వాయుసేన గుర్తించింది. అందుకోసం బంగాళాఖాతంలో నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాల్సిన అవసరం ఉంది. ఇక ఎక్కువుగా తుఫాన్ల ముప్పు ఎదుర్కొంటున్న తూర్పుతీర ప్రాంతంలో విపత్తుల నిర్వహణ కూడా వాయుసేన ప్రాధాన్య అంశంగా ఉంది. అందుకోసం తూర్పుతీరంలో మరో వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. అతి పొడవైన తీరప్రాంతం ఉన్న ఏపీని అందుకు అనువైనదిగా ఎంపిక చేసింది. ఇప్పటికే విశాఖలో భారత నావికాదళ వ్యూహాత్మక కేంద్రం ‘ఐఎన్ఎస్ డేగా’ ఉంది. దాంతో రాజమండ్రి, విజయవాడ విమానాశ్రయాలను తమ వ్యూహాత్మక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని భారత వాయుసేన భావించింది. ఇందుకుగాను యుద్ధవిమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా విజయవాడ– రాజమండ్రి మధ్య ఉన్న జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఉత్తర భారత దేశంలో ఆగ్రా–లక్నో జాతీయరహదారిని అదే విధంగా యుద్ధ విమానాలు అత్యవసర ల్యాండింగ్కు వీలుగా అభివృద్ధి చేశారు. యుద్ధ విమానాల ల్యాండింగ్కు అనుకూలంగా జాతీయ రాహదారులు ఆరులేన్లుగా ఈ జాతీయరహదారిని అభివృద్ధి చేసిన తరువాత యుద్ధ విమానాల ల్యాండింగ్కు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. ఈమేరకు ప్రతిపాదనలకు కేంద్ర రక్షణ శాఖ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో రక్షణ మౌలిక వసతులను అభివృద్ధికి ప్రణాళికను రూపొందించనున్నారు. యుద్ధవిమానాల మొహరింపు, రోజువారీ విన్యాసాలు, శిక్షణ తదితర అవసరాలకు అనుగుణంగా రక్షణ మౌలిక వసతులను తీర్చిదిద్దుతారు. దాంతో తూర్పుతీరంలో భారత వాయుసేన నిఘా మరింత పటిష్టమవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
మెరుపు దాడుల వివరాలు ఏడుగురికే తెలుసు
పాకిస్తాన్లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన మెరుపు దాడుల నిర్ణయం గురించి కేవలం ఏడుగురికే తెలుసని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, ప్రధాని జాతీయ భద్రత సలహాదారు అజిత్కుమార్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, పరిశోధన, విశ్లేషణ విభాగం (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతులకు మాత్రమే వాయుసేన జరిపే దాడులకు సంబంధించిన సమాచారం ఉంది. పాక్పై మెరుపు దాడులకు లక్ష్యాలను గుర్తించాలని ఈ నెల 14న పుల్వామా ఉగ్రదాడి జరిగిన వెంటనే ‘రా’ను ప్రభుత్వం ఆదేశించింది. ‘రా’ ఆరు లక్ష్యాల జాబితా సమర్పించింది. బాలాకోట్లోని జైషే మహమ్మద్ శిక్షణ శిబిరం, జైషే స్థాపకుడు మసూద్ అజహర్ బావ యూసుఫ్ అజహర్ నడుపుతున్న ఉగ్ర శిబిరం ఈ జాబితాలో అగ్రభాగాన ఉన్నాయి. భారత్ దాడి చేయడానికి అనుకూలమైనదిగా బాలాకోట్ ఉగ్ర స్థావరం కనిపించింది. దీనిపై మెరుపుదాడి చేస్తే జైషే మహమ్మద్ను సూటిగా హెచ్చరించినట్టవుతుందని, పుల్వామాలో భారత భద్రతా దళాలకు జరిగిన నష్టానికి సమానంగా బాలాకోట్లో జైషేకు నష్టం కలగజేయవచ్చని ప్రభుత్వం భావించిందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. అలాగే బాలాకోట్ శిబిరంపై దాడి వల్ల సాధారణ పౌరులెవరూ మరణించే అవకాశం లేకపోవడం వల్ల వెంటనే పాక్ ప్రతిదాడికి దిగే అవకాశంగానీ, ప్రపంచదేశాల నుంచి భారత్పై విమర్శలుగానీ ఉండవని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో దాడులు చేసేందుకు ప్రధాని మోదీ ఈ నెల 18న తుది నిర్ణయం తీసుకున్నారు. -
పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేశాం : భారత్
న్యూఢిల్లీ : భారత వైమానిక దాడులకు ప్రతిదాడిగా పాకిస్తాన్ ప్రయత్నించిందని భారత విదేశాంగశాఖ పేర్కొంది. ' 3 పాక్ జెట్ విమానాలు భారత గగనతలంలోకి వచ్చాయి. సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు యత్నించింది. అప్రమత్తమైన భారతవైమానిక దళం వారి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూల్చేశాం. ఈ ఘటనలో భారత్కు చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. ఒక పైలట్ జాడ తెలియడం లేదు' అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు. మరోవైపు భారత పైలట్ తమ అధీనంలోనే ఉన్నారంటూ పాక్ ఓ వీడియోను విడుదల చేసింది. ‘నేను వింగ్ కమాండర్ అభినందన్ను. ఐఏఎఫ్ అధికారిని. నా సర్వీసు నెంబర్ 27981’ అని పైలట్ చెప్తున్న అంశాలు ఆ వీడియోలో ఉన్నాయి. వింగ్ కమాండర్ అభినందన్ మిగ్ 21 బైసన్ జెట్లో వెళ్లాడని, ఇప్పటికీ తిరిగి రాలేదని ఐఏఎఫ్ పేర్కొంది. వీడియో ఉన్నది అభినందనా కాదా అనేది తెలియాల్సి ఉంది. -
ఒక పైలట్ జాడ తెలియడం లేదు
-
పాక్తో యుద్ధం జరుగుతుందా!
సాక్షి, న్యూఢిల్లీ : 1971 తర్వాత భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు జరపడం ఇదే మొదటిసారి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సందర్భంగా కూడా పాక్స్థాన్ భూభాగంలోకి భారత వైమానిక దళాలు చొచ్చుకుపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం నాడు భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్లోని ఖైబర్ పంఖ్తూఖ్వా రాష్ట్రంలోనికి చొచ్చుకుపోయి బాలకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. ఎదురుదాడికి సిద్ధమైన పాకిస్థాన్ యుద్ధ విమానాలు బుధవారం భారత సరిహద్దులోకి దూసుకురాగా భారత వైమానికి దళం గట్టిగా ప్రతిఘటించి ఓ పాక్ యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. మిగతా పాక్ విమానాలు వెనక్కి తిరిగి పోయాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్ని ఇలాంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా? అన్న చర్చ పలు వర్గాల్లో మొదలైంది. (‘యుద్ధం వస్తే గట్టిగా నిలబడండి’) ‘2016లో భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ జరిపాయి. అప్పుడు కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాని ఆ పరిస్థితులు యుద్ధానికి దారితీయలేదు. ఇప్పుడు భారత వైమానిక దళం రెండోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిపాయి. కాకపోతే ఈసారి పాక్ ఆక్రమిత కశ్మీర్ను దాటి పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాంబులు కురిపించింది. ఇది ప్రస్తుతానికి ప్రతీకాత్మక దాడి మాత్రమే. దాడి గురించి భారత్ చెప్పే కథనానికి, పాక్ చెప్పే కథనానికి మధ్య ఎంతో వైరుధ్యం ఉంది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని, దాదాపు 350 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయి ఉండవచ్చని భారత దళం చెబుతుండగా, భారత విమానాలు ఖాళీ ప్రదేశంలో బాంబులను కురిపించాయని, ఆనవాళ్లు ఇదిగో! అంటూ పాక్ దళం శకలాలను చూపిస్తోంది. ఏదేమైనా పరస్పర దాడులు కొన్ని రోజులు కొనసాగవచ్చు. (సైనికేతర, ముందస్తు దాడి చేశాం) ఇది నాన్ మిలటరీ ప్రీఎంప్టీవ్ దాడులుగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారంటేనే యుద్ధానికి కాలుదువ్వడం కాదనేది అర్థం. తాము పాక్ సైనికులు లేదా పౌరులు లక్ష్యంగా దాడి చేయలేదని, ఉగ్రవాదుల లక్ష్యంగా దాడి చేశామని చెప్పడమే ఈ మాటల ఉద్దేశం. భారత్పై ఉగ్రదాడి జరిగినందుకు, మరిన్ని జరుగుతాయని తెల్సినందునే ఈ దాడి జరిపామని కూడా భారత వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ సమాజానికి సర్ది చెప్పడం కోసం భారత వర్గాలు ఇలా మాట్లాడుతుండవచ్చు. ఒక్కసారి పాక్ సరిహద్దు రేఖను ఉల్లంఘించి లోపలకి పోయామంటే చాలు, పాక్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లే. దీనిపై ఏ దేశం ఎలా స్పందిస్తుందో భారత్కు ప్రస్తుతం అనవసరం. ఏ దేశమైనా తమ రాజకీయాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే స్పందిస్తాయి. 2016లో మొదటిసారి సర్జికల్ స్ట్రైక్స్ భారత వైమానిక దళం జరిపిన తర్వాత సరిహద్దులో పాక్ సైనికుల కాల్పుల ఉల్లంఘనలు పెరిగాయి. కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఇప్పుడు మరింత పెరగవచ్చు! ఆవేశంతోనే ఉద్రేకంతోనో ఇరు దేశాల్లోని కొంత మంది యుద్ధాన్ని కోరుకోవచ్చు. ఒక్కసారి యుద్ధం మొదలయితే అది పరిమితంగా జరుగుతుందా? పూర్తిస్థాయిలో జరుగుతుందా? అన్నది చెప్పలేం. యుద్ధం అంటే ఇరువర్గాలకు అపార నష్టం. అందుకని ఇరువర్గాల సైనికులు కూడా యుద్ధాన్ని కోరుకోరు. ప్రస్తుత పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా, లేదా? అన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. మరి కొన్ని రోజులు గడిస్తే స్పష్టత రావచ్చు!’ (ఢిల్లీలోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రిటైర్డ్ లెఫ్ట్నెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని అభిప్రాయాల సారాంశం ఇది) -
మన దళాలు సత్తా చాటాయ్ : ఆజాద్
-
మన దళాలు సత్తా చాటాయ్ : ఆజాద్
సాక్షి, న్యూఢిల్లీ : వైమానిక దాడులతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలను మట్టుబెట్టిన భారత వాయుసేన దళాలను రాజకీయ పార్టీలు అభినందనల్లో ముంచెత్తాయి. మంగళవారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం భారత సేనల సామర్ధ్యాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొనియాడారు. ఉగ్రవాద నిరోధానికి సైన్యం చేపట్టే చర్యలను తాము ఎల్లప్పుడూ సమర్ధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. నేడు జరిగిన వైమానిక దాడులు నేరుగా ఉగ్రవాదులు, ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా సాగుతూ ఉగ్రమూకలను మట్టుబెట్టి విజయవంతంగా తిరిగి భారత్ పోస్టులకు సైన్యం చేరుకుందని ఆజాద్ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీల ప్రతినిధులకు వైమానిక మెరుపు దాడులు జరిగిన తీరును విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వివరించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన దళం మిరేజ్ యుద్ధ విమానాలతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. -
నింగి నుంచి మిరాజ్ మెరుపులు.. నేల కరిచి పాక్ అరుపులు
-
‘మా వినయాన్ని పిరికితనమనుకున్నారు..’
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి. ఈ సందర్భంగా భారత సైన్యం ట్వీట్ చేసిన ఓ పద్యం ఇప్పుడు తెగ వైరలవుతోంది. ‘శత్రువు ముందు వినయ విధేయతలు చూపిస్తే.. వాడు మనల్ని పిరికివాడుగా భావిస్తాడు. పురాణాల్లో కౌరవులు పాండవుల గురించి ఎలా తక్కువ అంచనా వేశారో.. అలానే మన శత్రువు కూడా మన సహనాన్ని పిరికితనంగా భావించాడు. అయితే ఫలితం ఇంత తీవ్రంగా ఉంటుందని ఊహించి ఉండడు’ అంటూ ‘ఆల్వేస్రెడి’ అనే హాష్ట్యాగ్తో పోస్ట్ చేసిన ఈ పద్యం ఇప్పుడు తెగ వైరలవుతోంది. అంతేకాక మనం శక్తివంతులమని, యుద్ధంలో గెలుపు మనదేనని శత్రువుకు అర్థమైతేనే శాంతి చర్చలు ఫలిస్తాయంటూ ఓ అధికారి అభిప్రాయపడ్డారు. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. -
భారత్కు సరైన సమాధానమిస్తాం : పాక్
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహ్మద్ శిబిరాలే లక్ష్యంగా భారత్ జరిపిన మెరుపు దాడులపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ స్పందించారు. భారత వైమానిక దళాలు దాడి చేసిన విషయాన్ని ధ్రువీకరించారు. ‘ భారత్ ఇలాంటి పని చేస్తుందని ప్రపంచానికి మేము చెబుతూనే ఉన్నాం. మా మాటలను ఈరోజు భారత్ నిజం చేసి చూపించింది. ఇప్పుడు వాళ్లకు సరైన సమాధానం చెప్పే హక్కు పొందాము. నియంత్రణ రేఖను దాటి భారత్ నిబంధనలు ఉల్లంఘించింది. ఆత్మరక్షణ హక్కు మాకు కూడా ఉంది కదా’ అని ఖురేషీ వ్యాఖ్యానించారు.(పాక్పై ప్రతీకారం తీర్చుకున్న భారత్) కాగా పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిస్తామన్న భారత్ మాట నిలబెట్టుకుంది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 విజయవంతంగా పూర్తి చేసి... దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్ చర్యపై అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మంత్రులు, ఆర్మీ అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.(ఐఏఎఫ్ అంటే ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్) -
పాక్ పట్టించుకోలేదు.. అందుకే!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడులపై విదేశాంగ శాఖ స్పందించింది. భారత వైమానిక దాడులలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సైనికులు వీర మరణం పొందారు. మసూద్ అజహార్కు చెందిన జైష్ ఏ మహ్మద్ దీనికి మూలకారణం. పాక్ ప్రభుత్వం మద్దతు లేనిదే ఉగ్రవాద సంస్థలు దాడులు చేయలేవు. రెండు దశాబ్ధాలుగా పాకిస్తాన్లో జైషే మహ్మద్ స్థావరాలు ఉన్నాయి. వేలమంది జిహాదీలకు శిక్షణ ఇస్తున్నారు. ఉగ్రవాదులకు శిక్షణ ఆపివేయాలని పాకిస్తాన్ను అనేకసార్లు కోరాం. వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని సూచించాం. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత నివారణకు పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2001లో డిసెంబర్లో పార్లమెంట్పై కూడా దాడి చేశారు. పాక్లో ఉగ్రవాద శిబిరాలను గుర్తించారు. పఠాన్ కోట్, యురీ, పుల్వామా దాడులకు సంబంధించి ఆధారాలు ఇచ్చాం. పుల్వామా ఉగ్రవాది ఘటన జరిగిన తర్వాత రోజు దాడులకు సిద్ధమయ్యాం. (పాక్పై ప్రతీకారం తీర్చుకున్న భారత్) మరిన్న దాడులకు పాక్ కుట్ర మరో భారీ దాడికి ఉగ్రవాద సంస్థలు సిద్ధమవుతున్నారన్న సమాచారం వచ్చింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ఇవాళ ఉదయం ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేశాం. బాలాకోట్లో చేసిన దాడిలో పెద్ద ఎత్తున జిహాదీలు, కమాండర్లు హతమయ్యారు. పౌర సముదాయాలకు దూరంగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జైషే ఉగ్రవాదుల శిబిరాలపై చేశాం. మసూద్ అజహార్ మేనల్లుడు యుసుఫ్ అజహార్ కేంద్రాన్ని ధ్వంసం చేశాం. ఇప్పటికైనా పాకిస్తాన్ తన భూభాగంలో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తుందని భావిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. -
మీ ఆట అదిరింది: సెహ్వాగ్
న్యూఢిల్లీ: పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో యావత్ భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్లకు ఘన నివాళులర్పించిందని జాతి మొత్తం గర్విస్తోంది. భారత వైమానిక దళం చేసిన తాజా దాడుల్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ జవాన్లు.. మీ ఆట అదిరింది’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్వీటర్ అకౌంట్లో అభినందించాడు. ఇందుకు ఎయిర్స్ట్రైక్ హ్యాష్ ట్యాగ్ను జోడించాడు. మరొక మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందిస్తూ.. ‘ భారత్ ఆర్మీకి ఇదే నా సెల్యూట్’ అని ట్వీట్ చేశాడు. ఇక గౌతం గంభీర్ ‘జై హింద్ ఐఎఎఫ్’ అంటూ ట్వీట్ చేశాడు. (ఇక్కడ చదవండి: సర్జికల్ స్ట్రైక్ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం!) టీమిండియా యువ క్రికెటర్ యజ్వేంద్ర చహల్ భారత ఆర్మీని ప్రశంసించాడు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దేశం మొత్తాన్ని కలచివేసిన ఆ ఘటనకు ప్రతీకారంగానే ఉగ్రస్థావరాలపై భారత్ మరో మెరుపు దాడి చేసింది. ఈ ఘటనలో 200 నుంచి 300 వరకూ ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. The boys have played really well. #SudharJaaoWarnaSudhaarDenge #airstrike — Virender Sehwag (@virendersehwag) 26 February 2019 JAI HIND, IAF 🇮🇳 @IAF_MCC @adgpi #IndiaStrikesAgain #IndiaStrikesBack #IndiaStrikes — Gautam Gambhir (@GautamGambhir) 26 February 2019 Salute to the Indian Air Force. Shaandaar #IndiaStrikesBack — Mohammad Kaif (@MohammadKaif) 26 February 2019 Indian Air Force 🇮🇳👏 Bohot Hard Bohot Hard #IndiaStrikesBack #JaiHind 🇮🇳🇮🇳 — Yuzvendra Chahal (@yuzi_chahal) 26 February 2019 -
పాక్ ఆర్మీ తేరుకునేలోపే పనిపూర్తి...
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి ఘటనతో రగిలిపోతున్న భారత్ వైమానిక దళం... పాకిస్తాన్ ఆర్మీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ తేరుకునేలోపే భారత వైమానిక దళాలు కేవలం 21 నిమిషాల్లో దాడులు పూర్తి చేసుకుని వెంటనే వెనుతిరిగాయి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 జెట్ ఫైటర్లు...ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులను వైమానిక దళం ఉగ్రవాద శిబిరాలపై ప్రయోగించగా, జైషే మహ్మద్కు చెందిన అల్పా-3 కంట్రోల్ రూం పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. (పాక్పై ప్రతీకారం తీర్చుకున్న భారత్) కీలకపాత్ర పోషించిన మిరాజ్ యుద్ధ విమానం... ఈ దాడుల్లో మిరాజ్ 2000 యుద్ధ విమానం కీలకపాత్ర పోషించింది. మొత్తం 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. అధునాతర మల్టీరోల్ ఫైటర్ అయిన ఈ యుద్ధ విమానం గంటకు 2,336 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. న్యూక్లియర్ దాడుల కోసం ఈ యుద్ధ విమానాన్ని ప్రత్యేకంగా రూపొందించబడింది. 1550 కిలోమీటర్ల లక్ష్యాన్ని మిరాజ్ అవలీలగా ఛేదించగలదు. సెకన్కు 280 మైల్స్ ఎగిరే సామర్థ్యం ఉండగా, 2X30 కెనాన్లతో 125 రౌండ్లు దాడి చేయగలదు. (సర్జికల్ స్ట్రైక్ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం!) తొలి దాడి : బాలాకోట్లో 3.45 గంటలకు రెండో దాడి : ముజఫరాబాద్లో 3.48 గంటలకు మూడో దాడి : చకౌటిలో 3.58 గంటలకు 21 నిమిషాల వ్యవధిలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన వైమానిక దళం -
వాయుసేనకు వందనం : ఫిలిం స్టార్స్
ఆత్మాహుతి దాడితో 40 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులపై భారత వైమానిక దళం పగ తీర్చుకుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం భారత వాయు సేన 29 నిమిషాల పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 200 నుంచి 300 మంది తీవ్రవాదులు హతమయ్యుంటారని భావిస్తున్నారు. ఈ ప్రతీకార చర్యపై ప్రతీ ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ 2 అంటూ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని విజయ గర్వాన్ని పంచుకుంటున్నారు. సినీ తారలు సైతం భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, మహేష్ బాబు, కమల్ హాసన్, రామ్ చరణ్, అఖిల్, వరుణ్ తేజ్, మంచు విష్ణు, మెహరీన్, సోనాక్షి సిన్హా, నితిన్, ఉపాసన, వెంకీ అట్లూరిలతో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు విజయానందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. Our country gives a fitting reply. #IndiaStrikesBack . Salute to the Indian Air Force #JaiHind — Jr NTR (@tarak9999) 26 February 2019 Extremely proud of our #IndianAirForce. Salutes to the brave pilots of IAF🇮🇳 — Mahesh Babu (@urstrulyMahesh) 26 February 2019 Salute to the #IndianAirForce 🙏🏻. JAI HIND. #IndiaStrikesBack — rajamouli ss (@ssrajamouli) 26 February 2019 Our 12 return safely home after wreaking havoc on terrorist camps in Pakistan. India is proud of its heroes. I salute their valour. — Kamal Haasan (@ikamalhaasan) 26 February 2019 #SaluteIndianAirForce 🇮🇳🇮🇳🇮🇳 https://t.co/1G4RDOssu2 — Varun Tej Konidela (@IAmVarunTej) 26 February 2019 Proud of the Indian Air Force 🇮🇳 Jai Hind 🇮🇳 🙏🏼#IndiaStrikesBack #ramcharan pic.twitter.com/f5rN4Qc1sP — Upasana Konidela (@upasanakonidela) 26 February 2019 -
త్రివిధ దళాలకు సెలవులు రద్దు
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత వైమానిక దళం చేసిన మెరుపు దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం త్రివిధ దళాలకు సెలవులను రద్దు చేసింది. ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే భారత తీర ప్రాంతాలను అప్రమత్తం చేసింది. దీంతో తీర ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ మెరుపు దాడుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారమన్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైమానిక మెరపుదాడుల గురించి హోంశాఖ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానికి వివరించారు. -
సర్జికల్ స్ట్రైక్ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం!
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత వైమానిక దళం చేసిన మెరుపు దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. జైషే ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో దాడులు చేసింది. 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 భారత వాయిసేన విజయవంతంగా పూర్తి చేసింది. ఈ దాడులను ధృవీకరించిన పాక్.. తమ బలగాలు తిప్పికొట్టాయని చెబుతూనే.. ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. భారత వాయుసేన దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్థిక, రక్షణ శాఖతో ఆయన చర్చిస్తున్నారు. ఇక వాయుసేన దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రధానికి వివరించారు. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. తాజా దాడుల నేపథ్యంలో భారత్, పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత వైమానిక మెరుపు దాడులపై యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత వైమానికి దళానికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. 🇮🇳 I salute the pilots of the IAF. 🇮🇳 — Rahul Gandhi (@RahulGandhi) February 26, 2019 -
సర్జికల్ స్ట్రైక్ 2 విజయవంతం
-
పాక్పై ప్రతీకారం తీర్చుకున్న భారత్
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీనగర్లోని వేర్పాటు వాదుల నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. వేర్పాటువాదులు యాసిన్, మిర్వాయిజ్, షబీర్ షా, ఆశ్రఫ్ ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి నష్టం జరగలేదు.. భారత వైమానిక దాడులను ధృవీకరించిన పాక్.. ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది. భారత్ సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు ప్రేరేపిస్తోందని ఆ దేశ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. పాక్ వైమానిక దళం ఎదురు దాడి చేయడంతో భారత యుద్ద విమానాలు వెనక్కు వెళ్లాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని గఫూర్ స్పష్టం చేశారు. భారత్ వైమానిక దాడుల అనంతరం దానికి సంబంధించి ఫోటోలను పాక్ విడుదల చేసింది. అయితే ఈ దాడుల్లో 300మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. Indian aircrafts intruded from Muzafarabad sector. Facing timely and effective response from Pakistan Air Force released payload in haste while escaping which fell near Balakot. No casualties or damage. — Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February 26, 2019 -
గజ్వేల్లో ఎయిర్ఫోర్స్ రిక్రూట్మెంట్
సిద్దిపేట జోన్: ఇండియన్ ఎయిర్ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ గజ్వేల్ పట్టణంలో నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ పద్మాకర్ పేర్కొన్నారు. కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు గజ్వేల్ పట్టణంలో ఎయిర్ఫోర్స్ రిక్రూట్ ర్యాలీని నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో డీఆర్వో చంద్రశేఖర్, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలసి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 26, 27, 28 మార్చి 1 తేదీల్లో చేపట్టాల్సిన ర్యాలీలకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 26న ఉదయం 5 గంటలకు గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ బిల్డింగ్ కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ వద్ద జరిగే ఎయిర్ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఆసక్తిగల అభ్యర్థులు హాజరుకావాలని వారు తెలిపారు. 25వ తేదీ సాయంత్రంలోగా గజ్వేల్ పట్టణంలో అందుబాటులో ఉండే విధంగా రావాలన్నారు. 26, 27 తేదీల్లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్ జిల్లాలోని అభ్యర్థులకు రిక్రూట్మెంట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో ఆదిలాబాద్, కొమరంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జోగుళాంబ గద్వాల్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ఆసక్తిగల అభ్యర్థులు హాజరుకావొచ్చన్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఇంగ్లిష్ సబ్జెక్ట్లో 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 19 జనవరి 1999 నుంచి 1 జనవరి 2003 మధ్య జన్మించి ఉండాలన్నారు. అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని తెలిపారు. 5 నిమిషాల 40 సెకన్లలో 1.6 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. సమీక్షలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు యోగేష్ మూహ్ల, నరేందర్కుమార్, జోగేందర్సింగ్, ఏసీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఫ్లయింగ్ పరేడ్
-
క్రాస్బౌ–18 విజయవంతం
విశాఖ సిటీ: క్రాస్బౌ–2018 పేరుతో భారత వైమానిక దళం నిర్వహించిన క్షిపణి ప్రయోగ విన్యాసాలు గురువారంతో ముగిశాయి. గుంటూరు జిల్లా సూర్యలంకలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఈ నెల 3 నుంచి క్రాస్ బౌ విన్యాసాలు మొదలయ్యాయి. సదరన్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్షిపణి విన్యాసాల్లో ముఖ్య అతిథులుగా భారత వైమానిక దళాధిపతి బీరేందర్ సింగ్ ధనోవా, సదరన్ ఎయిర్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షన్ బి.సురేష్ పాల్గొన్నారు. ఉపరితలంపై నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాష్, స్పైడర్, ఒసా–ఎక్–ఎం, ఐజీఎల్ఏ మొదలైన క్షిపణులను విజయవంతంగా విన్యాసాల్లో పరీక్షించారు. భూ ఉపరితలం నుంచి గాలిలో ఉన్న శత్రు లక్ష్యాల్ని ఛేదించే ప్రయోగం విజయవంతమయ్యింది. రాత్రి సమయంలో ప్రత్యక్ష ఫైరింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్.యూ–30 ఫైటర్ జెట్ ఈ విన్యాసాల్లో పాల్గొంది. ఈ విన్యాసాల ద్వారా భారత వాయుదళాల మార్గదర్శక వ్యవస్థలు, అంతర్గత ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ సామర్థ్యాలను పరీక్షించారు. -
కుప్పకూలిన శిక్షణ విమానం..!
కిలోమీటర్ దూరంలోనే బాహుపేట గ్రామం.. పక్కనే నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి.. ఓ వెంచర్లో పనులు చేసుకుంటున్న పలువురు కూలీలు... ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ఓ శిక్షణ విమానం పెద్దశబ్దంతో ఆ వెంచర్లోని నిర్మానుష్య ప్రదేశంలో కళ్లుమూసి తెరిచేలోపే కుప్పకూలింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే విమాన శకలాలు అల్లంతదూరాన పడ్డాయి. విమానం ఆనవాళ్లు లేకుండా కాలిబూడిదైపోయింది. ఉహించని ఘటనతో మండల పరిధిలోని బాహుపేట ఉలిక్కిపడింది. ప్రత్యక్ష సాక్షులు, ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట (ఆలేరు) : హైదరాబాద్ హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్శిక్షణ కేంద్రానికి చెందిన ఫైటర్ విమానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యోగేష్ యాదవ్ శిక్షణ తీసుకుంటున్నాడు. మరో 15 రోజులైతే శిక్షణ పూర్తి చేసుకునే దశలో యోగేష్ నడుపుతున్న ఫైటర్ విమానంలో హకీంపేట నుంచి బయలుదేరాడు. బాహుపేట సమీపంలోకి రాగానే.. బుధవారం ఉదయం సుమారు 11.40 గంటల ప్రాంతంలో యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలోకి రాగానే ఫైటర్ విమానంలోని ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఎయిర్ ఫోర్స్కు చెందిన అధికారులతో ఎప్పటికప్పుడు పైలట్ యోగేష్ యాదవ్ సమస్యకు సంబంధించిన వివరాలు అందిస్తూనే ఉన్నాడు. విమానంలో తలెత్తిన సమస్య మరింత తీవ్రంగా మారింది. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసి, పైలట్ యోగేష్ యాదవ్ విమానంలో ఉన్న ప్యారాచూట్, ఇతర సామగ్రి సహాయంతో బయటికి దూకాడు. దీంతో సుమారు అర కిలోమీటర్ దూరంలోకి వెళ్లి విమానం భారీ శబ్దంతో కుప్ప కూలిపోయి.. పూర్తిగా దగ్ధమైంది. భారీగా మంటలు వ్యాపించడంతో స్థానిక ప్రజలు, వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై నుంచి వెళ్లె ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సుమారు అర కిలోమీటర్ దూరంలో పడిపోయిన పైలెట్ యోగేష్ యాదవ్ను స్థానికులు వెళ్లి పరామార్శించారు. ఏం జరిగిందంటూ.. బాహుపేట సమీపంలో కుప్పకూలిన ఫైటర్ విమానం చూసి యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. శిక్షణ తీసుకుంటున్న పైలట్కు చెందిన ఫైటర్ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది.. అదే సయమంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం కోసం ప్రముఖ నాయకులు అప్పుడే బహిరంగ సభలకు బయల్దేరిన హెలికాప్టర్ ఏమైనా కుప్పకూలిందా అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఇటీవల వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు హెలికాప్టర్లో పర్యటనలు చేస్తున్నారు. బుధవారం అధికంగా ప్రముఖులు వివిధ ప్రాంతాలకు పర్యటించే క్రమంలో ఏమైన ప్రమాదం జరిగాందా అనే అనుమానంతో అధిక సంఖ్యలో ప్రజలు, వివిధ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో చేరుకున్నా రు. శిక్షణ తీసుకుంటున్న విమానం కుప్పకూలిందని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాకుండా ప్రమాదం జరిగిన ప్రదేశంలో కూడా ఎవరు లేకపోవడంతో ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఎయిర్ఫోర్స్ అధికారులు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన అధికారులు సంఘటన స్థలానికి 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో చేరుకున్నారు. తొలుత హెలికాప్టర్లో ఆర్మీకి చెందిన వైద్యులు నలుగురు అక్కడికి చేరుకున్నారు. పైలెట్కు వైద్య పరీక్షలు చేసి, మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలోనే మరో హెలికాప్టర్ ఆకాశంలో నాలుగు సార్లు తిరిగి దిగింది. అందులో ప్రమాదం జరిగిన తీరును పరిశీలించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సాంకేతిక నిపుణులు వచ్చి అక్కడ ఖాళీ బూడిదైన శకలాలను పరిశీలించారు. అంతకు ముందే భువనగిరి ఏసీపీ జితేదర్రెడ్డి, యాదగిరిగుట్ట ఎస్ఐ రమేష్లు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయాలతో పైలెట్.. సెల్ఫీలతో యువకులు... శిక్షణ విమానంలో గాయాలైన పైలెట్ను రక్షించకుండా స్థానిక యువకులు సెల్ఫీ తీసుకున్నారు. కనీస మానవతాదృక్పథంతో ఆలోచించకుండా ఖాళీ బూడిదైన విమానం వద్ద, గాయాలై కిందపడిపోయిన పైలెట్ వద్దకు వెళ్లి కొందరు యువకులు సెల్ఫీలు తీసుకోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ శబ్దం వచ్చింది మేము వెంచర్లో పనులు చేస్తున్నాం. అప్పుడే మా సార్ కారులో వస్తున్నాడు. ఒక్క సారిగా విమానం ఆకాశంలో నుంచి కిందకి వస్తుంటే అందులో నుంచి ఓ వ్యక్తి బెలున్ కట్టుకొని కిందకు దూకాడు. కళ్లు తెరచి మూసే లోపే భారీ శబ్దంతో విమానంలో భూమిపై పడిపోయింది.దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. దానిని చూసి షాక్కు గురయ్యాం. భయమేసింది. నోట్లో నుంచి మాటలు కూడా రాలేదు. కొద్ది సేపటికి తేరుకొని చూసే సరికి జనమంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కిందపడిన వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేసిన.. భాష అర్థం కాలేదు. ఇలాంటి ప్రమాదం చూడడం ఇదే ప్రథమం. – నిర్మల, బాలలక్ష్మి, ప్రత్యక్ష సాక్షులు -
ఏకీకృత కమాండ్తోనే యుద్ధాల్లో విజయం
న్యూఢిల్లీ: శత్రుదేశాలతో యుద్ధాలను వీలైనంత త్వరగా గెలవడానికి ఆర్మీ, నావికాదళం, వాయుసేనలను కలిపి ఏకీకృత కమాండ్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా తెలిపారు. యుద్ధాల సమయంలో త్రివిధ దళాలు పరస్పరం సమన్వయం చేసుకుంటే శత్రువులను చావుదెబ్బ తీయవచ్చని వెల్లడించారు. ఈ ఏకీకృత కమాండ్ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రంతో పాటు రక్షణశాఖ వర్గాలు పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు ఈ విధానాన్ని ఇప్పటికే పాటిస్తున్నాయన్నారు. ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనోవా మాట్లాడుతూ.. చైనా తన సైన్యాన్ని ఐదు ఏకీకృత కమాండ్లుగా విభజించిందని తెలి పారు. భారత్లో మాత్రం 17 కమాండ్లు ఉన్నాయనీ, ఒక్క అండమాన్–నికోబార్ దీవుల్లో మాత్రం 2001లో వ్యూహాత్మక ఏకీకృత కమాండ్ను ఏర్పాటు చేశారని చెప్పారు. రక్షణరంగంలో స్వయంసమృద్ధి సాధించడం ప్రతి దేశానికి కీలకమని వ్యాఖ్యానించారు. ఐఏఎఫ్లో దశలవారీగా ఆధునీకరణ చేపడుతున్నట్లు ధనోవా వెల్లడించారు. -
రాఫెల్ డీల్ అవసరమే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ ఫైటర్ జెట్లను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సమర్థించారు. గతంలో కూడా ఇలా అత్యవసరంగా భారత్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిందని తెలిపారు. బుధవారమిక్కడ ధనోవా మాట్లాడుతూ.. ‘చైనా తన వాయుసేన సామ ర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. దేశ సరిహద్దులోని టిబెట్లో యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలను మోహరిస్తోంది. ఇండియా కూడా ఇందుకు తగ్గట్లు వాయుసేనలో ఆధునీకరణ చేపట్టాలి. పక్కనే రెండు అణ్వ స్త్ర దేశాలు (చైనా, పాక్) ఉన్నటువంటి విచిత్ర పరిస్థితిని భారత్ ఎదుర్కొంటోంది. వీరి ఉద్దేశాలు రాత్రికి రాత్రి మారిపోవచ్చు. చైనా దగ్గర 1,700 ఫైటర్ జెట్లు ఉండగా, వీటిలో 800 జెట్లు నాలుగో తరానికి చెందినవే. ఒకవేళ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే వీటిలో చాలామటుకు రంగంలోకి దిగుతాయి. ప్రస్తుతం భారత్ చాలా ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని మరే దేశానికి ఈ స్థాయిలో ప్రమాదం లేదు’ అని చెప్పారు. ఒకవేళ భారత్ 42 స్క్వాడ్రన్ జెట్లను సమకూర్చుకున్నా, చైనా–పాక్ల సామర్థ్యంకన్నా తక్కువగానే ఉంటుందన్నారు. -
రియల్ హీరో.. ఓ బాలుడిని కాపాడేందుకు
తిరువనంతపురం : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. వందేళ్లలో కనీవినీ ఎరుగని వర్షాలు కేరళను ముంచేశాయి. దాదాపు అన్ని జిల్లాలు వరద ముప్పులో కూరుకుపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ రుతుపవనాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 357 మంది చనిపోయారు. వరద బాధితుల్ని రక్షించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. తమ ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడుతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 'గరుడ్' కమాండర్ ప్రశాంత్ అద్భుత సాహసంతో ఓ బాలుడిని కాపాడాడు. అలప్పుజ పట్టణంలో ఓ ఇంటి చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇంట్లో వారంతా ఇంటిపై కప్పుకు చేరుకున్నారు. అందులో ఓ బాలుడిని కమాండర్ ప్రశాంత్ హెలికాప్టర్ నుంచి తాడు సాయంతో పై కప్పుకు చేరుకుని ఓ చేత్తో బాలుడిని, మరో చేత్తో తాడును పట్టుకొని సాహసంతో హెలికాప్టర్లోకి చేరుకున్నారు. కాగా బాలుడిని కాపాడిన కమాండర్కు ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయన రియల్ హీరో, సైనికుడు మన కోసం ఏమైనా చేస్తాడు, దటీజ్ ఇండియన్ ఆర్మీ అంటూ నెటిజన్లు ప్రశాంత్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
రియల్ హీరో.. ఓ బాలుడిని కాపాడేందుకు
-
కూలిన మిగ్ 21
షిమ్లా: ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా జిల్లాలో బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు. పఠాన్కోట్ ఎయిర్బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే జవాలీకి సమీపంలోగల పట్టా జతియన్ గ్రామంలో మధ్యాహ్నం 1.21గంటలకు కుప్పకూలింది. విమానం కూలిన ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. సహాయక చర్యలకోసం రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలిక్యాప్టర్లు రంగంలోకి దిగాయి. జరిగిన ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనతో కలిపి.. ఈ ఏడాది ప్రమాదాలకు గురైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఅఊ) విమానాల సంఖ్య నాలుగుకు చేరుకుంది. జూన్ 27న మహారాష్ట్రలోని నాసిక్లో సుఖోయ్–30, జూన్ 5న గుజరాత్లోని కచ్లో జాగ్వర్ విమానాలు కుప్పకూలాయి. మే 27న జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో మిగ్–21 ఫైటర్ కూలిపోయింది. ఒకప్పుడు మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అత్యంత కీలకమైనదిగా నిలిచింది. -
అమ్మాయిలంటే ఇలా ఉండాలి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాలన్న ధ్యేయంతో చిన్నప్పట్నుంచీ ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ వచ్చింది ఆంచల్ గంగ్వాల్. క్లాస్లోనే కాదు, క్లాస్ బయట ఆటల్లోనూ ఫైటింగ్ స్పిరిట్ చూపించింది. కలలకు రెక్కలు కట్టుకుని చదివి, ఫ్లయింగ్ బ్రాంచ్లో సీటు సాధించింది! వేటూరి గారు అన్నట్లు ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు’. అంతేనా! ఆంచల్ గంగ్వాల్ కూడా అవుతారు! తమ మీద తమకు అచంచలమైన నమ్మకం ఉండి కృషి చేస్తే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని నిరూపించింది ఆంచల్. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాకు చెందిన ఈ అమ్మాయి ఇటీవలే ఇండియన్ ఎయిర్ఫోర్స్ సర్వీస్కు ఎంపికైంది. ఆరు లక్షల మంది రాసిన ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్లో 22 మంది ఎంపికయ్యారు. వారిలో అమ్మాయిలు ఐదుగురు. ఆ ఐదుగురిలో ఫ్లయింగ్ బ్రాంచికి మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన ఒకే ఒక అమ్మాయి ఆంచల్. అందుకే ఆంచల్ సాధించిన విజయం పట్ల ఆమె అమ్మానాన్నలతో పాటు రాష్ట్రం కూడా గర్వపడుతోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో ఆంచల్కు అభినందనలు తెలియచేశారు. ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి అర్చనా చిట్నీస్ అయితే స్వయంగా ఆంచల్ ఇంటికి వచ్చి మరీ అభినందించారు. ‘అమ్మాయిలంటే ఇలా ఉండాలి’ని అంచల్ బుగ్గలు పుణికారామె. పెద్దింటమ్మాయి కాదు! ముఖ్యమంత్రి అభినందనలు, మంత్రి ప్రశంసలు అందుకున్న ఆంచల్.. ఆర్థికంగా ఒక సాధారణ దిగువ తరగతి ఇంటి అమ్మాయి. నీముచ్ జిల్లా కేంద్రంలో బస్స్టాండ్లో టీ దుకాణం నడుపుతాడు ఆంచల్ తండ్రి సురేశ్. అయితే ఇప్పుడు పట్టణంలో అందరికీ ఆంచల్ వల్లనే ‘నామ్దేవ్ టీ స్టాల్’ గురించి తెలిసింది. ‘‘నా టీ స్టాల్ని వెతుక్కుంటూ వచ్చి ఆంచల్ తండ్రి మీరేనా అని అడిగి మరీ నన్ను అభినందిస్తున్నారు, నా కూతురు పైలటయినా అంత ఆనందం కలిగిందో లేదో కానీ తండ్రిగా నా గుండె ఉప్పొంగిపోతోంది’ అంటున్నాడు సురేశ్. ఇది ఆరో ప్రయత్నం రక్షణ రంగంలో చేరాలనే ఆలోచన బాల్యంలోనే మొలకెత్తింది ఆంచల్లో. నీముచ్లోని మెట్రో హెచ్ఎస్ స్కూల్లో క్లాస్ టాపర్ అయ్యింది. దాంతో స్కూల్ కెప్టెన్ అయింది. తర్వాత ఉజ్జయిన్లో విక్రమ్ యూనివర్సిటీలోనూ ప్రతిభ కనబరిచి స్కాలర్షిప్కు ఎంపికైంది. బాస్కెట్బాల్, 400 మీటర్ల పరుగులో కాలేజ్కు ప్రాతినిధ్యం వహించింది. డిఫెన్స్లో చేరాలంటే అన్ని రకాల నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి కాబట్టి ఇన్నింటిలో చురుగ్గా ఉండేదాన్నని చెబుతుంది ఆంచల్. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని వదులు కోవడానికి కారణమూ డిఫెన్స్ పట్ల ఇష్టమేనంటోంది. సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరితే ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ప్రిపరేషన్కి వెసులుబాటు ఉండదని వదిలేసిందామె. ఆ తరువాత వచ్చిన లేబర్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా ప్రిపరేషన్కి అవకాశం ఉంటుందని నిర్ధారించుకున్న తర్వాతనే చేరింది. ఒక పక్క ఇతర ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే తను కలగన్న డిఫెన్స్ ఉద్యోగానికి పరీక్షలు రాస్తూ వచ్చింది. ఐదు ప్రయత్నాలు సఫలం కాకపోయినా సంకల్పాన్ని వదలకపోవడమే ఆంచల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఆరవ ప్రయత్నంలో ఆమె ఎయిర్ఫోర్స్ రంగంలో సెలెక్ట్ అయింది. ఆ ఫలితాలు ఈ నెల ఏడవ తేదీన వెలువడ్డాయి. అప్పటి నుంచి ఆమె ఇంటి ఫోన్ రింగవుతూనే ఉంది. ‘ఆంచల్! నేల మీద నుంచి నింగి దాకా ఎదిగావు’ అంటూ అభినందనల వాన కురుస్తూనే ఉంది. – మంజీర ఆ వరదలే కారణం! నేను పన్నెండవ తరగతిలో ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ను వరదలు ముంచెత్తాయి. అప్పుడు బాధితులను రక్షించడానికి ఆర్మీ జవాన్లు బృందాలుగా వచ్చారు. తమకు ఏమవుతుందోననే భయం వారిలో ఏ కోశానా కనిపించేది కాదు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో చొరవగా దూసుకెళ్లిపోయి బాధితులను కాపాడడం చూసినప్పుడు నాకు ఒళ్లు పులకరించినట్లయింది. ఇలాంటి సర్వీసుల్లో చేరాలని నాకప్పుడే అనిపించింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పట్లో చేరలేకపోయాను. ఆ కల ఇప్పటికి తీరింది. నా కోచింగ్ కోసం నాన్న లోన్ తీసుకున్నాడు. ఉద్యోగంలో చేరగానే లోన్ తీరుస్తాను. ఆ లోన్ తీర్చినప్పుడే నాన్న కళ్లలోకి ధైర్యంగా చూడగలుగుతాను. – ఆంచల్, ఐఎఎఫ్ -
ఛాయ్వాలా బిడ్డ.. ‘గగన’ విజయం..
భోపాల్ : భారత వాయుసేనలో చేరి దేశానికి సేవ చేయాలన్న ఛాయ్వాలా కూతురి కల నెరవేరింది. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల ఆంచల్ గంగ్వాల్ ఇండియన్ ఎయిర్ఫోర్స్(ఐఏఎఫ్)లో ఫ్లయింగ్ బ్యాచ్కి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది ఏఎఫ్సీఏటీ పరీక్షకు హాజరవ్వగా అందులో ఎంపికైన 22 మంది ఆంచల్ ఒకరు. ఆంచల్ ఎఫ్సీఏటీ పరీక్షను ఎదుర్కొవడం ఇది ఆరోసారి. తొలి ఐదు ప్రయత్నాల్లో ఆమె రాత పరీక్ష అనంతర టెస్టుల్లో విఫలం చెందారు. ఆంచల్ తండ్రి సురేశ్ గంగ్వాల్ నీముచ్ బస్టాండ్లో టీ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. వీరంతా చదువులో రాణించడంతో ఆర్థికంగా పరిస్థితులు బాగోలేకున్నా అప్పులు చేసి మరీ చదివించారు. ఆంచల్ చిన్ననాటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. ఉత్తరాఖండ్ వరదల సమయంలో భారత సైన్యం చూపిన తెగువను చూసి స్ఫూర్తి పొందిన ఆంచల్ ఎయిర్ ఫోర్స్లో చేరాలని నిర్ణయించుకున్నారు. చదువు పూర్తి అయ్యాక పోటీ పరీక్షలకు ఆమె ఇండోర్లో కోచింగ్ తీసుకుని సన్నద్ధమయ్యారు. వరుసగా పరీక్షలు రాయగా పోలీసు శాఖలో ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. అందులో ట్రైనింగ్లో ఉండగా లేబర్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం రావడంతో ఎయిర్ఫోర్స్కు సాధన చేయొచ్చనే ఉద్దేశంతో అందులో చేరిపోయారు. ఎంతో శ్రమకోర్చి ఎయిర్ఫోర్స్లో చేరాలన్న తన కలను నెరవేర్చుకుంది. ఎయిర్ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్కి ఎంపికైన ఆంచల్ను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. సోషల్ మీడియా ద్వారా ఆమెకు అభినందనలు వెల్లువలా వస్తున్నాయి. -
భారత్ ‘గగన’ విన్యాసం..!
సాక్షి, హైదరాబాద్ : భారత వాయుసేన భారీ సైనిక కసరత్తుకు తెరతీసింది. శత్రుదేశాల నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా అతి తక్కువ సమయంలోనే కార్యరంగంలోకి దూకేలా తన సన్నద్ధతకు మరింత పదునుపెడుతోంది. దీనిలో భాగంగా గతంలో కనీవినీ ఎరుగని విధంగా దేశవ్యాప్తంగా ఉన్న తన స్థావరాల్లోని మొత్తం విమానాలు, సిబ్బందిని పరీక్షించేలా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతోంది. ‘గగన్శక్తి–2018’ పేరిట ఈ నెల 10 నుంచి 23 తేదీ వరకు అత్యు న్నతస్థాయి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. రెండు దశల్లో పాకిస్థాన్, చైనా సరిహద్దులలో చేపడుతున్న అత్యంత విస్తృత శిక్షణా కార్యక్రమాల ద్వారా తన అపార సైనిక శక్తిని, యుద్ధానికి ఎప్పుడైనా రెడీ అనేలా వాయుసేన బలాన్ని ప్రదర్శిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతమంతా విస్తరించేలా భారత్ చేపట్టిన ఈ కసరత్తు గత కొన్ని దశాబ్దాల కాలంలోనే అతి పెద్దది. భారత సైన్యం (ఆర్మీ), నావికా (నేవీ)దళంతో కూడా కలిసి వాయుసేన సంయుక్త సైనిక చర్యలు చేపట్టడం దీని ప్రత్యేకత. ఇందులో వాయుసేనకు సంబంధించిన యావత్ యుద్ధవిమాన శ్రేణులు పాల్గొంటున్నాయి. ఎందుకు ? వైమానిక దళానికి సంబంధించి ప్రతిదాడులతో సహా అన్ని బలాలు పరీక్షించడం యుద్ధసన్నద్ధతలో భాగంగా వివిధ విభాగాలు,రంగాల సమన్వయంపై సమీక్ష వాయుసేనకున్న బలం,బలగాన్ని ప్రదర్శించడం ద్వారా ఈ రంగంలో తనకున్న అధిపత్యం చాటడం. ప్రత్యేకతలు... ఈ కసరత్తులో 1,100 యుద్ధ (సిబ్బంది, ఆయుధాల రవాణాతో సహా) విమానాలు, హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి. 300 మందికి పైగా ఫైటర్ పైలట్లు, ఇతర ఉన్నతస్థాయిఅధికారులు, 15 వేల మంది వైమానికదళ సభ్యులు పాల్గొన్నారు. ఎడారి ప్రాంతాలు మొదలుకుని, అత్యంత ఎల్తైన ప్రాంతాలు, సముద్రజలాలు, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించే ఆపరేషన్లు, గరుడ కమాండోల దాడుల వరకు విస్తృతస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆకాశంలో, ఆకాశం నుంచి భూమిపైకి దాడి, పారాట్రూపర్ల ద్వారా మెరుపుదాడి, యుద్ధంలో గాయపడిన సైనికుల తరలింపు వంటి వాటిని పరీక్షించింది. ఏవేవి పరీక్షించారు... బ్రహ్మోస్, హార్పూన్ యాంటీ–షిప్ క్షిపణులతో కూడిన సుఖోయ్ (ఎస్యూ)–30, జాగ్వార్ యుద్ధ విమానాలు తమ లక్ష్యాలు చేధించడాన్ని పరిశీలించారు. సీ–17 గ్లోబ్మాస్టర్, ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లు, సీ–130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాల పనితనాన్ని పరీక్షించారు. పాకిస్థాన్తో ఉన్న పశ్చిమ సరిహద్దులో కేవలం మూడురోజుల్లోనే 5వేల సార్లు యుద్ధవిమానాలు రాకపోకలు సాగించడం విశేషం. భారత వాయుసేనకు చెందిన పీ–8ఐ ఎమ్మార్ విమానాన్ని ఉపయోగించి సుదూర లక్ష్యాల చేధన పరీక్ష. ఇండియన్ ఎయిర్ఫోర్స్లోకి ఇటీవలే ప్రవేశించిన ఎల్సీఏ (లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్) తేజాస్ను తొలిసారి పరీక్షించారు. తేజాస్ మార్క్–1ను ఇప్పటికే ఆమోదించిన ఐఏఎఫ్, దానిని త్వరలోనే మరింత నవీకరించి తేజస్ మార్క్–1ఏ, తేజస్–మార్క్ 2 లను రంగంలోకి దించనుంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
లక్ష కోట్లతో ఫైటర్జెట్స్ కొనుగోలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దాదాపు 110 యుద్ధవిమానాల కొనుగోలుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) శుక్రవారం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్(ఆర్ఎఫ్ఐ) జారీచేసింది. జూలై 6లోపు తమ ప్రతిపాదనల్ని పంపాలని కోరింది. ఈ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థలు మొత్తం యుద్ధ విమానాల్లో 85 శాతాన్ని మేకిన్ ఇండియా కింద భారత్లో దేశీయ కంపెనీలతో కలసి తయారుచేయాలి. మిగిలిన విమానాలను వినియోగానికి సిద్దంగా ఉన్న స్థితిలో అందజేయాలి. 15 బిలియన్ డాలర్ల(సుమారు రూ.97, 342 కోట్లు) విలువైన ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, డసాల్ట్, బోయింగ్ వంటి సంస్థలు పోటీపడుతున్నాయి. ఎఫ్–16, ఎఫ్–18 కొనుగోలుపై భారత్ నిర్ణయంపైనే యుద్ధ విమానాలకు సంబంధించి తమతో రక్షణ సంబంధాలు ఆధారపడి ఉంటాయని అమెరికా తెలిపింది. -
ఆకాశమే హద్దుగా...
అవకాశం లభించాలేగానీ ఆకాశమే మాకు హద్దు అంటున్నారు భారత మహిళామణులు... అవనీ చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్. దేశంలోనే మొదటి మహిళా సూపర్సోనిక్ జెట్ ఫైటర్లుగా చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రస్తుతం భారత వాయు సేనలో శిక్షణ పొందుతున్న వీరు మరో నెల రోజుల్లో యుద్ధ విమానాలను నడపబోతున్నారు. యుద్ధ విమానాల్లో మొదటిసారి...! ఈ మహిళా త్రయం తేలికపాటి యుద్ధ విమానాలైన పిలాటస్ పీసీ-7, కిరణ్, హాక్ జెట్లను నడిపేందుకు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం అవని, భావన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, అత్యధిక టేకాఫ్ వేగం కలిగిన మిగ్-21 యుద్ధ విమానాలను నడిపేందుకు సిద్ధమవుతున్నారు. అవని 2 సీట్ల సామర్థ్యం కలిగిన మిగ్-21 రకం విమానాన్నినడిపేందుకు సూరత్ఘర్ ఎయిర్బేస్లో శిక్షణ పొందుతోంది. భావన కూడా అంబాల ఎయిర్బేస్లో శిక్షణకు సిద్ధమవుతోంది. ఇక మోహన హాక్ జెట్ను నడిపేందుకు కలైకుండ ఎయిర్బేస్లో శిక్షణ పూర్తయిన తర్వాత ఆపరేషనల్ స్క్వాడ్గా వెళ్లబోతుందని సీనియర్ అధికారి తెలిపారు. కఠినమైన శిక్షణలో నెగ్గితేనే...! జెట్ ఫైటర్గా రాణించాలంటే కఠినమైన శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. సుమారు పన్నెండుసార్లు ద్వంద్వ తనిఖీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదట విమానం ఎగరటంలో మెళకువలు, నిర్వహణ పద్ధతులు, టేకాఫ్, లాండింగ్ వంటి ప్రాథమిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. యుద్ధ విమానం నడిపే సమయంలో ఏర్పడే చిక్కుల్ని ఎదుర్కొనే సమయస్ఫూర్తి, సామర్థ్యం, నేర్పు ఉండాలి. ప్రాథమిక శిక్షణ అనంతరం యుద్ధ సమయంలో పాటించాల్సిన వ్యూహాలతో పాటు, యుక్తులు ప్రదర్శించగలగాలి. అవసరాన్ని బట్టి ఆకాశం నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి భూమిపైకి విమాన మార్గాన్నిమళ్లించే చతురత కలిగి ఉండాలి. ఈ శిక్షణలో నెగ్గితేనే యుద్ధ విమానాన్ని నడిపేందుకు అర్హత సాధిస్తారు. ఈ దశలన్నీ దాటుకుని సుమారు ఏడాదిన్నరగా జరుగుతున్న శిక్షణ పూర్తి చేసుకుని మొదటి మహిళా పైలట్ ఫైటర్లుగా మారనున్న అవని, భావన, మోహనలకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. - సుష్మారెడ్డి యాళ్ళ