
అలహాబాద్ లో కూలిన జాగ్వార్ విమానం
అలహాబాద్: ఉత్తర్ ప్రదేశ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు కూలిపోయింది. అలహాబాద్కు 18 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం కూలి పోవడానికి ముందే ప్రమాదాన్ని గుర్తించిన ఇద్దరు ఫైలట్లు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు అదేశించింది.