15న ‘మోదీ ఎన్నిక చెల్లదు’ పిటిషన్‌పై విచారణ | Hearing on plea challenging Narendra Modi's election to continue on Nov 15 | Sakshi
Sakshi News home page

15న ‘మోదీ ఎన్నిక చెల్లదు’ పిటిషన్‌పై విచారణ

Published Thu, Oct 20 2016 10:41 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

Hearing on plea challenging Narendra Modi's election to continue on Nov 15

అలహాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు నవంబరు 15న విచారించనుంది. ఎన్నిక ఎందుకు చెల్లదో వివరిస్తూ పిటిషనర్‌ అసంబద్ధ కారణాలు పేర్కొన్నారని, ఈ ఆరోపణలు ప్రజా ప్రతినిధుల చట్టం కిందకు రావనీ, అసలు ఇది విచారణార్హం కాదని మోదీ తరఫు న్యాయవాదులు వాదించారు. అయినా కోర్టు పిటిషన్‌ను విచారణకు తీసుకుంది.

ఆ ఎన్నికల్లో మోదీపై కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అజయ్‌ రాయ్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ వేశారు. మోదీ చిత్రాలున్న పోస్టర్లు, టీ షర్టులను జనాలకు పంచిపెట్టారనీ, ఒక విధంగా ఓటర్లకు లంచం ఇవ్వడం వంటిదని పిటిషనర్‌ అందులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement