
నా భర్త ఆచూకి తెలియడం లేదు: శశికళ పుష్ప
తన భర్త కోసం ఉదయం నుంచి వెతుకుతున్నానని, ఇప్పటి వరకు ఆయన జాడ కనిపించలేదని బహిష్కత ఏఐఏడీఎంకే ఎంపీ శశికళ పుష్ప అన్నారు.
అనంతరం పోలీసులు వచ్చి వారిని విడిపించి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగిన విషయం తెలిసినప్పటి నుంచి తన భర్త కోసం వెతుకుతున్నానని, ఆయన జాడ కనిపించలేదని అన్నారు. తాను ఇంకా అన్నాడీఎంకేలోనే ఉన్నానని, రేపటి సమావేశానికి హాజరవుతానని శశికళ చెప్పారు. మరోపక్క, జయలలిత మృతిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఆశా రంజన్కు బెదిరింపులు వచ్చాయి. ఆమె పిటిషన్ వెనక్కి తీసుకోకుంటే ఆమెను చంపివేస్తామంటూ కొంతమంది బెదిరిస్తున్నారని ఆమె తరుపు న్యాయవాది కిస్లే పాండే చెప్పారు.