
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం కోసం కాంగ్రెస్ ప్రారంభించిన సంతకాల ఉద్యమం క్రమంగా చల్లారిపోతోంది. సైద్ధాంతికంగా ఆ పార్టీతో కలిసొచ్చే కొన్ని పార్టీలే ఈ అంశంపై వెనక్కితగ్గాయి. కాంగ్రెస్ తీర్మానంపై బుధవారం ముగ్గురు డీఎంకే ఎంపీలు సంతకం చేయగా.. పార్టీ నాయకత్వం ఆదేశాలతో వారు మద్దతును వెనక్కి తీసుకున్నారు. తీర్మానంపై సమాజ్వాదీ పార్టీ సంతకాలు చేసినా తరువాత ఉపసంహరించుకుంది. పార్లమెంట్లో కాంగ్రెస్తో కలిసి పోరాడుతున్న తృణమూల్ కాంగ్రెస్ సంతకం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇతర ప్రతిపక్ష పార్టీలు సంతకం చేశాకే నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో మమతా బెనర్జీ ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment