
పంజాబ్ ఎగ్జిట్పోల్ సర్వే.. బీజేపీకి షాక్!
అమృత్సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఇండియా టుడే- యాక్సిస్ నిర్వహించిన ఎగ్జిట్పోల్ సర్వేలో బీజేపీకి షాకింగ్ ఫలితాలొచ్చాయి. బీజేపీ ఈ ఎన్నికల్లో చతికిలపడుతుందని.. కేవలం 11-15 సీట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కుతాయని సర్వే ఫలితాలు వెల్లడించాయి. పంజాబ్పై భారీ ఆశలు పెట్టుకున్న ఆప్కు కూడా అక్కడ ఆశించినమేర ఫలితాలుండవని సర్వేలో తేలింది. ఆ పార్టీకి 40 నుంచి 44 సీట్ల వరకు దక్కొచ్చని తేలింది.
కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినన్ని సీట్లు వస్తాయని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఆ పార్టీకి 60 నుంచి 65 సీట్లు దక్కుతాయని ఇండియా టుడే- యాక్సిస్ సర్వే ఫలితాలు తేల్చాయి.