గుజరాత్లోని కచ్ జిల్లాలో శనివారం ఉదయం రెండుసార్లు భూప్రకంపనలు వచ్చాయి.
కచ్: గుజరాత్లోని కచ్ జిల్లాలో శనివారం ఉదయం రెండుసార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఉదయం 6 గంటల ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది. బచావు పట్టణానికి వాయవ్య దిశలో 22 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఓ గంట తర్వాత మళ్లీ ప్రకంపనలు వచ్చాయి. ఎలాంటా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు.