
నేడు నిత్యానందకు పుంసత్వ పరీక్ష
బెంగళూరు: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సోమవారం ఇక్కడి విక్టోరియా ఆస్పత్రిలో పుంసత్వ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ రోజు పరీక్షలకు హాజరు కావాల్సిందిగా మూడు రోజుల క్రితం నిత్యానందకు సీఐడీ డీఎస్పీ లోకేశ్ నోటీసు జారీ చేశారు. ఓ అత్యాచారం కేసులో నిత్యానందకు పుసంత్వ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం తెలిసిందే.