తొలి క్రాస్‌బోర్డర్‌ ‘పెట్రోలైన్‌’.. ప్రారంభించిన మోదీ | PM Modi and Nepal PM jointly inaugurate petroleum pipeline | Sakshi

భార‌త్‌, నేపాల్ మధ్య పెట్రోలియం పైప్‌లైన్

Published Tue, Sep 10 2019 4:22 PM | Last Updated on Tue, Sep 10 2019 6:36 PM

PM Modi and Nepal PM jointly inaugurate petroleum pipeline - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాసియాలోని తొలి క్రాస్‌బోర్డర్‌ పెట్రోలియం పైప్‌లైన్ భార‌త్‌, నేపాల్ మధ్య ప్రారంభమైంది. బిహార్‌లోని మోతీహ‌రి- నేపాల్‌లోని అమ్‌లేక్‌గంజ్ మ‌ధ్య నిర్మించిన ఈ పెట్రో పైప్‌లైన్‌ను ప్రధాని నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. నేపాల్ ప్రధాని కేపీ శ‌ర్మ ఓలీతోపాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 69 కిలోమీటర్ల ఈ పైప్‌లైన్‌ కోసం కేంద్రం రూ. 350 కోట్లు వెచ్చించింది. కేవలం 15 నెలల రికార్డ్ సమయంలో ప్రాజెక్ట్ పూర్తికావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. నేపాల్ ప్రభుత్వ సహకారం, ఇరుదేశాల అధికారుల సమర్థత కారణంగానే ఇది సాధ్యమైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement