పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించడంతో యూపీ, ఉత్తరాఖండ్లలో ఒక్కో నియోజకవర్గంలో ఫిబ్రవరి 15న జరగాల్సిన పోలింగ్ వాయిదావేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది.
న్యూఢిల్లీ: పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించడంతో యూపీ, ఉత్తరాఖండ్లలో ఒక్కో నియోజకవర్గంలో ఫిబ్రవరి 15న జరగాల్సిన పోలింగ్ వాయిదావేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. యూపీలో ఆలంపూర్ నియోజకవర్గంలో ఎస్పీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థి ఆదివారం గుండెపోటుతో కన్ను మూయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్లో కర్నాప్రయాగ్ సీటుకు బీఎస్పీ తరఫున పోటీచేస్తున్న కుల్దీప్ సింగ్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఈసీ తెలిపింది.
పాఠశాలల్లోనే ‘ఎన్నికల అక్షరాస్యత’: ఈసీ
విద్యార్థులకు ‘ఎన్నికల అక్షరాస్యత’పై అవగాహన కల్పించాలని కేంద్ర హెచ్చార్డీ మంత్రిత్వ శాఖకు ఈసీ లేఖ రాసింది. సానుకూలంగా స్పందించిన హెచ్చార్డీ మంత్రి.. దీనిపై నూతన విద్యారంగ విధానంలో మార్పుల సమయంలో పరిగణలోకి తీసుకోవాలని ఎన్ సీఈఆర్టీకి సూచించారని సమాచారం.