రాత్రివేళ స్కూటీపై మహిళా గవర్నర్‌! | Puducherry safe for women even at night says Lt Governor Kiran Bedi | Sakshi
Sakshi News home page

రాత్రివేళ స్కూటీపై మహిళా గవర్నర్‌!

Published Sun, Aug 20 2017 2:36 AM | Last Updated on Sun, Sep 17 2017 5:42 PM

తన సహాయకురాలితో స్కూటీపై కిరణ్‌బేడీ

తన సహాయకురాలితో స్కూటీపై కిరణ్‌బేడీ

పుదుచ్చేరి: రాత్రి సమయంలో మహిళలకు ఏ విధమైన రక్షణ ఉందో పరిశీలించటానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ఓ సాహసం చేశారు. శుక్రవారం రాత్రి సహాయకురాలితో కలిసి ఆమె స్కూటీపై కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తిరిగారు. తననెవరూ గుర్తుపట్టకుండా బేడీ శాలువా కప్పుకున్నారు. ‘పుదుచ్చేరిలో రాత్రిపూట మహిళలు సురక్షితమే..అయినప్పటికీ భద్రతను మరింత మెరుగుపరుస్తాం’ అని బేడీ ట్వీటర్‌లో తెలిపారు.

ప్రజలకు సమస్యలేమైనా ఉంటే పీసీఆర్‌ లేదా 100కు ఫోన్‌ చేయాలని సూచించారు. కిరణ్‌బేడీ చర్యను పలువురు నెటిజన్లు ప్రశంసించారు. అయితే స్కూటీని నడుపుతున్న మహిళతో పాటు బేడీ కూడా హెల్మెట్‌ ధరించకపోవడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో రాత్రిపూట తాము నిస్సహాయంగా కనిపించడంతో పాటు ఆ సమయంలో స్కూటీ నడిపే సగటు మహిళ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికే హెల్మెట్‌ ధరించలేదని బేడీ వివరణ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement