17 ఏళ్లలో 19 దాడులు | terror attacks in jammu and kashmir | Sakshi
Sakshi News home page

17 ఏళ్లలో 19 దాడులు

Published Mon, Sep 19 2016 4:10 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

terror attacks in jammu and kashmir

భారతదేశ కిరీటం జమ్మూ, కశ్మీర్‌లో 1999 నవంబర్ నుంచి ఇప్పటి వరకు, దాదాపు 17 సంవత్సరాల్లో భద్రతాదళాలపై మొత్తం 19 దాడులు జరిగాయి. దాదాపు 130 మందికి పైగా సిబ్బంది వీర మరణం పొందారు. దాడుల వివరాలు..
 

  •  1999 నవంబర్ 3: శ్రీనగర్‌లోని బదామీ బాగ్‌లో ఆర్మీ కార్యాలయంపై దాడి. 10 మంది ఆర్మీ సిబ్బంది మరణం.
  •  2002 మే 14: జమ్మూలోని కాలూచక్‌లో ఉన్న ఆర్మీ కంటోన్మెంట్‌పై దాడి. 36 మంది మృతి. 48 మందికి గాయాలు.  
  •  2003 జూలై 22: అఖ్నూర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల బృందం ఆర్మీ శిబిరంపై దాడి. 8 మంది భద్రతా దళ సిబ్బంది మృతి.
  •  2005 ఏప్రిల్ 6: ఒక పర్యాటక రిసెప్షన్ కేంద్రంపై ఇద్దరు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి.
  •  2006 అక్టోబర్ 5: శ్రీనగర్ నడిబొడ్డున ఉగ్ర దాడి. ఐదుగురు పోలీసులు, ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ఒక పౌరుడి మరణం.
  •  2013 మార్చి 31: సీఆర్‌పీఎఫ్ శిబిరంపై దాడి. ఐదు మంది జవాన్ల వీర మరణం.
  •  2013 జూన్ 24: శ్రీనగర్‌లోని హైదర్‌పొరాలో మిలిటరీ వాహన శ్రేణిపై దాడి. 8 మంది జవాన్లు మృతి.
  •  2013 సెప్టెంబర్ 26: కశ్మీర్‌లలో జంట ఆత్మాహుతి దాడులు. ముగ్గరు ఉగ్రవాదులతో పాటు 10 మంది మరణం.
  •  2014 నవంబర్ 27: అర్నియా సెక్టార్‌లోని కఠార్ గ్రామంలో ఎన్‌కౌంటర్.  ముగ్గురు ఆర్మీ సిబ్బంది, ముగ్గురు ఉగ్రవాదులు, నలుగురు పౌరులు సహా మొత్తం 10 మంది మృతి.
  •  2014 డిసెంబర్ 5: యూరి సెక్టార్‌లోని ఆర్మీ 31వ ఫీల్డ్ రెజిమెంట్ ఆర్డినెన్స్ శిబిరంపై  ఉగ్రవాదుల దాడి. ఆర్మీకి చెందిన ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఏడుగురు జవాన్లు, రాష్ట్ర పోలీసుల్లో ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి. ఆరుగురు ఉగ్రవాదులు కూడా.
  •  2015 మార్చి 20: కఠువా జిల్లాలోని పోలీస్ స్టేషన్‌పై ముష్కరుల దాడి. ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది, ఇద్దరు పౌరుల మృతి.
  •  2015 మార్చి 21: సాంబ జిల్లాలోని జమ్మూ-పఠాన్‌కోట్ ఆర్మీ శిబిరంపై ఇద్దరు ఉగ్రదాడి. తిప్పికొట్టి హతమార్చిన భద్రతా దళాలు.
  •  2015 మే 31: కుప్వారా జిల్లాలో బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడికి ఆరుగురు ఉగ్రవాదుల యత్నం. తిప్పి కొట్టిన ఆర్మీ. నలుగురు ఉగ్రవాదులు హతం.
  •  2015 నవంబర్ 18: కుప్వారా అడవుల్లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్. పారా కమాండోకు చెందిన కల్నల్ మృతి.
  •  2015 నవంబర్ 25: కుప్వారా జిల్లా తంఘదర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదుల దాడి. ఒక జనరేటర్ ఆపరేటర్, ముగ్గురు ఉగ్రవాదులు హతం.
  •  2015 డిసెంబర్ 7: అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహరా వద్ద సీఆర్‌పీఎఫ్ వాహన శ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు. ఆరుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు.
  •  2016 ఫిబ్రవరి 21: శ్రీనగర్ దగ్గర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో మొత్తం (సిబ్బంది, ఉగ్రవాదులు కలిపి) 7 మంది మృతి.
  •  2016 జూన్ 25: శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తున్న సీఆర్‌పీఎఫ్ వాహన శ్రేణిపై ఉగ్రదాడి. 8 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మృతి. 20 మందికి గాయాలు.
  •  2016 సెప్టెంబర్ 18: యూరి సెక్టార్‌లోని ఆర్మీ 12వ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడి. 17 మంది జవాన్లు మృతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement