ఉద్దవ్ థాక్రేకు ఫోన్ చేయలేదు: బీజీపీ
ముంబై: ఉద్ధవ్ థాక్రేకు ఫోన్ చేయలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి జేసీ సద్దా తెలిపారు. తొలుత శాసన సభా పక్షనేతను ఎంపిక చేస్తామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే ఉద్ధవ్ నుంచి మాకు ఎలాంటి ఫోన్ రాలేదన్నారు.
ఎన్సీపీ మద్దతు ఇస్తామని ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. ఎన్సీపీ, శివసేన మద్దతుపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ పరిపాలన దక్షతకే ప్రజలు ఓటు వేశారని సద్దా అన్నారు.