Shiv Sena
-
అస్సలు పశ్చాత్తాప పడను.. షిండేపై వ్యాఖ్యల కేసులో కునాల్ కమ్రా
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే(Eknath Shinde)ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యల దుమారం తర్వాత ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా(kunal kamra) తొలిసారి స్పందించారు. షిండేపై వ్యాఖ్యలను సమర్థించుకున్న కునాల్, ఈ వ్యహారంలో తాను క్షమాపణలు చెప్పాల్సి వస్తే.. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కమ్రాను ముంబై పోలీసులు సంప్రదించినట్లు సమాచారం. అయితే.. షిండేపై చేసిన వ్యాఖ్యలకు తానేమీ పశ్చాత్తాపం చెందడం లేదన్న కునాల్ కమ్రా.. తన వెనుక ఎవరో ఉన్నారన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. షిండే రాజకీయ ప్రత్యర్థులు డబ్బులు ఇచ్చి తనతో ఇలా మాట్లాడించారన్నదాంట్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ముంబై పోలీసులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే తన ఆర్థిక లావాదేవీలను పరిశీలించేందుకు పోలీసులకు ఆయన అనుమతి ఇచ్చినట్లు సమాచారం.ఇక.. కునాల్ కమ్రా తక్షణమే షిండేకు క్షమాపణలు చెప్పాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన హెచ్చరికలపైనా కమ్రా స్పందించారు. తాను కేవలం న్యాయస్థానాలు కోరినప్పుడు మాత్రమే క్షమాపణలు చెబుతానని ముంబై పోలీసులకు తేల్చి చెప్పాడట. ఈ మేరకు ఓ జాతీయ మీడియా ఈ వివరాలతో కథనం ఇచ్చింది.ఇదిలా ఉంటే.. ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యాఖ్యలతో ది యూనికాంటినెంటల్ హోటల్లోని హాబిటాట్ క్లబ్కు కష్టాలు మొదలయ్యాయి. అందులో అక్రమ కట్టడాలు ఉంటున్నాయంటూ బీఎంసీ (బృహన్ ముంబయి కార్పొరేషన్) ఉద్యోగులు ఖార్ వద్దకు చేరుకొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నైక్ మాట్లాడుతూ ఖార్లోని ఆ స్టూడియో అక్రమ నిర్మాణమని.. చర్యలు తీసుకోవాలని ముంబయి కమిషనర్ను కోరినట్లు వెల్లడించారు. అయితే ఇది రాజకీయ నిర్ణయం కాదంటూ ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. తాజా పరిణామాలపై అసిస్టెంట్ కమిషనర్ వినాయక్ విస్పుటే మాట్లాడుతూ ‘‘స్టూడియో యజమాని కొన్ని అక్రమ షెడ్లను నిర్మించారు. వాటిని ఇప్పుడు మేము తొలగిస్తున్నాం. వీటికి నోటీసులతో పనిలేదు’’ అని వెల్లడించారు. అసలు స్టూడియో ప్లాన్ను కూడా పరిశీలించి చర్యలు తీసుకొంటామని తెలిపారు.#WATCH | Mumbai: BMC officials arrive at Unicontinental Studio in Khar area of Mumbai. The officials have arrived here with hammers. Details awaited. pic.twitter.com/dLb1O2z3uT— ANI (@ANI) March 24, 2025ఇటీవల హబిటాట్ స్టూడియో(Habitat Club)లో జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందేపై కునాల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ద్రోహితో పోల్చాడు. ఈ సందర్భంగా ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. దీంతో శివసేన షిండే వర్గం కునాల్పై భగ్గుమంది. ఆ పార్టీ కార్యకర్తలు ఆ స్టూడియోపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో 12 మందిని అరెస్టు చేశారు. మరోవైపు పోలీసులు సోమవారం కునాల్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చిచెప్పారు. ఇంకోవైపు.. థాక్రే శివసేన సహా పలు రాజకీయ పార్టీలు కునాల్కు మద్దతుగా నిలుస్తుండడం గమనార్హం.This is full length 45 minutes video of Kunal Kamra which has shaken the roots of right wing 🔥He has spoken facts with wit and satire which BJP can't digest. WATCH & SHARE BEFORE IT GETS BANNED ON YOUTUBE 🧵 pic.twitter.com/GNEs7gef6w— Amock_ (@Amockx2022) March 24, 2025 -
రాహుల్ గాంధీ ధారావి పర్యటపై సెటైర్లు
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత తాజాగా ముంబైలోని ధారావి ప్రాంతంలో పర్యటించారు(Dharavi Visit). అయితే ఈ పర్యటనలో కాంగ్రెస్ నేతలెవరూ కనిపించకపోవడంపై శివసేన నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్(Sanjay Nirupam) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.గురువారం ధారావిలోని ఛామర్ స్టూడియోను సందర్శించిన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. డిజైనర్ సుధీర్ రాజ్బర్ & టీంను కలిశారు. ఆపై సోషల్ మీడియాలో రాజ్బర్ బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు కూడా.Sudheer Rajbhar of Chamar Studio encapsulates the life and journey of lakhs of Dalit youth in India. Extremely talented, brimming with ideas and hungry to succeed but lacking the access and opportunity to connect with the elite in his field. However, unlike many others from his… pic.twitter.com/VOtnA9yqSD— Rahul Gandhi (@RahulGandhi) March 6, 2025 అయితే ఒక కాంగ్రెస్ నేతగా కాకుండా.. యూట్యూబర్లాగా రాహుల్ ధారావిలో పర్యటించారంటూ సంజయ్ నిరుపమ్ ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ముంబై కాంగ్రెస్ యూనిట్ డబ్బుల్లేక దివాళా తీసిందని సెటైర్లు కూడా వేశారు. ముంబైలో కాంగ్రెస్కు ఓట్లు మాత్రమే కాదు.. డబ్బులు కూడా లేకుండా పోయాయి. చాలాకాలంగా ముంబై కాంగ్రెస్ కార్యాలయం కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఆ బకాయిలు రూ. 5 లక్షల దాకా పేరుకుపోయాయి. అందుకే.. కావాలనే రాహుల్ కాంగ్రెస్ నేతలను కలవకుండా వెళ్లిపోయారు. ఒక కాంగ్రెస్ నేతలా కాకుండా.. యూట్యూబర్లాగా ఆయన పర్యటన సాగింది. గతంలో నేను ముంబై కాంగ్రెస్ యూనిట్ చీఫ్గా నాలుగేళ్లపాటు పని చేశా. కానీ, ఏనాడూ ఇంత ఘోరమైన పరిస్థితులు మాత్రం లేవు’’ అని సంజయ్ నిరుపమ్ అన్నారు.బాల్థాక్రే పిలుపుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంజయ్ నిరుపమ్.. ఆ తర్వాత కాంగ్రెస్తోనూ అనుబంధం కొనసాగించారు. ఒకసారి శివసేన నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 2009-14 మధ్య కాంగ్రెస్ నుంచి లోక్సభ ఎంపీగా పని చేశారు. అయితే కిందటి ఏడాది ఏప్రిల్లో క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్ ఆయనపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసి.. షిండే శివసేన వర్గంలో చేరారు. -
సైలెంట్గా మాజీ మంత్రి కొడుకు బ్యాంకాక్ ట్రిప్.. విమానం గాల్లో ఉండగా ట్విస్టులు
ఆయనో మాజీ మంత్రి తనయుడు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఓ ఆగంతకుడు పోలీసులకు సమాచారం అందించాడు. అతని తండ్రి అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులే స్వయంగా కిడ్నాప్ చేసి నమోదు చేసి రంగంలోకి దిగారు. ఆపై ఆ మాజీ మంత్రి సీన్లోకి రావడంతో అధికార యంత్రాగమే దిగి వచ్చింది. పాపం.. ఆ బాబుగారి సీక్రెట్ బ్యాంకాక్ ప్లాన్ ‘గాల్లో ఉండగానే’ బెడిసి కొట్టింది. ముంబై: శివసేన(షిండే వర్గం) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్ సావంత్ కిడ్నాప్నకు గురయ్యారనే వ్యవహారం సోమవారం రాత్రి మహారాష్ట్రలో కలం రేపింది. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న తానాజీ.. హుటాహుటిన కమిషనర్ ఆఫీస్కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఎంక్వైరీ చేసిన పోలీసులు అతనొక ప్రైవేట్ ఛార్ట్లో అండమాన్ వైపు వెళ్తున్నాడనే సమాచారం తెలుసుకున్నారు. ఎవరో ఇద్దరు బలవంతంగా తన కొడుకును ఎత్తుకెళ్తున్నారని ఆయన మీడియా ముందు వాపోయారు. ఆ వెంటనే డీజీసీఏకు ఈ కేసు గురించి సమాచారం అందించారు. బ్యాంకాక్ వైపు వెళ్తున్న ఆ ప్రైవేటు విమానం.. పుణెకు తీసుకురావాలని పైలట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత పైలట్లు అదొక తప్పుడు సమాచారం అనుకున్నారట. సాధారణంగా మెడికల్ ఎమర్జెన్సీ లేదంటే సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే అలా వెనక్కి రావడానికి పైలట్లకు అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఎందుకైనా మంచిదని ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి ధృవీకరణ చేసుకుని వెనక్కి తిప్పారు. అలా.. అండమాన్ దాకా వెళ్లిన విమానం అలాగే వెనక్కి వచ్చేసింది.పుణే ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ కాగానే విమానంలో ఉన్న ముగ్గురు షాక్ తిన్నారు. తమకు తెలియకుండానే తిరిగి రావడంతో రిషిరాజ్, అతడి స్నేహితులు.. పైలట్లపై మండిపడ్డారు. అయితే తాము కేవలం ఆదేశాలు మాత్రమే పాటిస్తామని పైలట్లు చెప్పడంతో ఏం చేయలేకపోయారు. ఆ వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది విమానంలోకి వెళ్లి వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తన కుటుంబానికి తెలియకుండా రిషిరాజ్ ఇద్దరు స్నేహితులతో ‘బిజినెస్ ట్రిప్’ ప్లాన్ చేశాడట. విషయం తెలిసి పోలీసులు, ఆ మాజీ మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకోకుండా తన కొడుకును బలవంతంగా వెనక్కి రప్పించారంటూ అధికారులపై ఆ మాజీ మంత్రి అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. మరోవైపు మరోవైపు పోలీసుల అత్యుత్సాహం, తానాజీ అధికార దుర్వినియోగంపై ఉద్దవ్ శివసేన మండిపడింది. ఎక్కడైతే రిషిరాజ్ కిడ్నాప్నకు గురయ్యారని హడావిడి జరిగిందో.. అదే సింగాద్ రోడ్ పీఎస్లో ఈ వ్యవహారంపై యూబీటీ శివసేన ఫిర్యాదు చేసింది. -
స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోరు
నాగ్పూర్: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో లుకలుకలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కూటమి నేతలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంవీఏలోని కీలక భాగస్వామ్య పార్టీ శివసేన(ఉద్ధవ్) సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఉమ్మడిగా ఉండి పోటీ చేస్తే కూటమి భాగస్వామ్య పక్షాల కార్యకర్తలకు అవకాశాలు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో సంస్థాగతంగా బలోపేతం అవ్వాల్సిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించామన్నారు. ముంబై, థానె, నాగ్పూర్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సైతం సొంతంగానే బరిలోకి దిగాలనే నిర్ణయానికి తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సానుకూలంగా ఉన్నట్లు రౌత్ వివరించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) రూపంలోని మైత్రి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితమని రౌత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరు సరికాదు ఎంవీఏ, ఇండియా కూటమిలోనీ ముఖ్య భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ సభ్య పార్టిలకు ఏమాత్రం సహకరించడం లేదని రౌత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ వడెట్టివార్ భాగస్వామ్య పక్షాలను నిందిస్తున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం, సర్దుకుపోవడం వంటి వాటిపై విశ్వాసం లేని వారికి కూటమిలో కొనసాగే అర్హత లేదని రౌత్ విమర్శించారు. ఇక ఇండియా కూటమి విషయానికొస్తే..లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క దఫా కూడా సమావేశం కాలేకపోయిందన్నారు. ఇండియా కూటమికి కన్వినర్ను కూడా నియమించుకోలేకపోవడం మంచి విషయం కాదన్నారు. ఎవరికీ మంచిది కాదు: ఎన్సీపీ(శరద్) శివసేన (ఉద్ధవ్) పార్టీ నిర్ణయంపై ఎంవీఏ భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీ(శరద్) స్పందించింది. ‘ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అది శివసేన(ఉద్ధవ్) పార్టీ ఇష్టం. మేం అడ్డుకోబోం. బలవంతంగా ఎవరినీ కలుపుకోం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా మేం కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది సరైన నిర్ణయంగా మేం భావించడం లేదు. కానీ, ఈ నిర్ణయం ప్రభావం ఎంవీఏ కూటమిలోని మూడు భాగస్వామ్య పక్షాల గెలుపు అవకాశాలపైనా పడుతుంది’అని ఆ పార్టీ నేత జితేంద్ర ఔహద్ చెప్పారు. మేం పట్టించుకోం: సీఎం ఫడ్నవీస్ స్థానిక ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేయాలన్న శివసేన(ఉద్ధవ్) నిర్ణయాన్ని బీజేపీకి చెందిన సీఎం ఫడ్నవీస్ తోసిపుచ్చారు. ‘ఎంవీఏ కూటమి పోటీలో ఉన్నా లేకున్నా మేం పట్టించుకునేది లేదు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాం. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు మాకే మద్దతుగా ఉంటారనే నమ్మకం మాకుంది’అని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో శివసేన(ఉద్ధవ్) వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపుతోందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ..రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చునంటూ వ్యాఖ్యానించారు. -
‘మహా’ వ్యాఖ్యలు... మర్మమేమిటో?!
మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణకు రంగం సిద్ధమవుతోందా? కొద్ది రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ దిశగా చర్చ జోరందుకుంటోంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమికి చేరువయ్యేందుకు విపక్ష శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) ప్రయత్నం చేస్తున్నాయన్న వార్తలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ పార్టీల నేతల తాజా వ్యాఖ్యలు ఈ దిశగా సంకేతాలేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి మహాయుతి ఘోర ఓటమి రుచి చూపించడం తెలిసిందే. శివసేనను కొన్నేళ్ల క్రితం నిలువునా చీల్చిన ఏక్నాథ్ షిండే వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గం మహాయుతి భాగస్వాములుగా బీజేపీతో అధికారం పంచుకుంటున్నాయి. తామే అసలైన పార్టీలమంటూ ఇప్పటికే గుర్తింపు కూడా దక్కించుకున్నాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగా షిండే, అజిత్ ఆయనకు డిప్యూటీలుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్తో కలిసి ఎంవీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఉద్ధవ్ సేన, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ భారీ ఓటమితో కుదేలయ్యాయి. ఒకరకంగా ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అభిమానులు, కార్యకర్తల నుంచి వస్తున్న విజ్ఞప్తులు ఆసక్తి కలిగిస్తున్నాయి. విడిపోయిన పార్టీలు మళ్లీ కలిసి పోవాలంటూ కొద్ది రోజులుగా వారు గట్టిగా కోరుతున్నారు! ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్) అధికారిక పత్రిక ‘సామ్నా’ తమ ప్రత్యర్థి అయిన ఫడ్నవీస్ను ప్రశంసల్లో ముంచెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్చిరోలీ జిల్లాలో నక్సలిజం అంతానికి ఆయన బాగా కృషి చేస్తున్నారని సామ్నా తాజా సంచిక సంపాదకీయంలో పేర్కొంది. ‘‘గడ్చిరోలీలో పలు అభివృద్ధి పనులకు సీఎం ఫడ్నవీస్ శ్రీకారం చుట్టారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎంతో కృషి చేస్తున్నారు. గడ్చిరోలీకి నూతన గుర్తింపును ఇవ్వాలని ఫడ్నవీస్ భావిస్తే స్వాగతిస్తాం’’ అని చెప్పుకొచ్చింది. ‘‘నక్సల్స్ ప్రభావిత జిల్లాలో నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టిన ఫడ్నవీస్ నిజంగా ప్రశంసలకు అర్హుడు’’ అని పేర్కొంది! మరోవైపు పార్టీని చీల్చి ప్రస్తుత దుస్థితికి కారకుడైన షిండేపై సంపాదకీయం విమర్శలు గుప్పించింది. ఆయన గతంలో ఇన్చార్జి మంత్రి హోదాలో గడ్చిరోలీలో మైనింగ్ లాబీల ప్రయోజనాల పరిరక్షణకే పని చేశారని ఆరోపించింది. లోగుట్టు ఏమిటో?! ఉద్ధవ్ సేన ఉన్నట్టుండి బీజేపీ అనుకూల వైఖరి ప్రదర్శిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గత నెల 17న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ఫడ్నవీస్ను పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా కలుసుకున్నారు కూడా! ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే సైతం ఫడ్నవీస్ను అభినందించారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆయన మిషన్ మోడ్లో పని చేస్తున్నారంటూ ప్రస్తుతించారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ సీఎంను ఇలా ఆకాశానికెత్తుతుండటం యాదృచ్ఛికమేమీ కాదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అవి ఎన్డీఏ వైపు చూస్తున్నాయనేందుకు బహుశా ఇది సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. హిందూత్వవాదమే మూల సిద్ధాంతంగా పుట్టుకొచ్చిన శివసేన రాష్ట్రంలో అధికారం కోసం ఐదేళ్ల కింద అనూహ్యంగా తన బద్ధ విరోధి కాంగ్రెస్తో జట్టుకట్టడం తెలిసిందే. అప్పటినుంచే పార్టీ పతనం ప్రారంభమైందన్నది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలో ఉనికిని కాపాడుకోవడానికి హిందూత్వవాది అయిన బీజేపీతో స్నేహం తప్పు కాదని ఉద్ధవ్ వర్గం నేతల్లో కొందరంటున్నారు. కానీ అది ఆత్మహత్యా సదృశమే కాగలదని, పార్టీ ఎదుగుదల అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోతాయని మరికొందరు వాదిస్తున్నారు. పైగా ఎన్డీఏలో చేర్చుకుని ఉద్ధవ్ సేనకు చేజేతులారా కొత్త ఊపిరి పోసే పని బీజేపీ ఎందుకు చేస్తుందని ప్రశి్నస్తున్నారు. మాది మనసున్న పార్టీ: రౌత్ సామ్నా సంపాదకీయాన్ని పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ సమ రి్థంచుకున్నారు. తాము విపక్షంలో ఉన్నప్పటికీ గడ్చిరోలీ జిల్లాకు సీఎం మంచి పనులు చేస్తున్నారు గనుక ప్రశంసిస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘‘మాది చాలా పెద్ద మనసున్న పార్టీ. ప్రజలకు మంచి చేస్తే మా ప్రత్యర్థులనైనా ప్రశంసిస్తాం’’ అన్నారు.ఎన్సీపీల విలీనం! ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో కొన్నేళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉంటున్న బాబాయి శరద్ పవార్, అబ్బాయి అజిత్ దగ్గరవుతున్న సంకేతాలు కొద్ది రోజులుగా ప్రస్ఫుటమవుతున్నాయి. విభేదాలకు స్వస్తి పలికి ఇద్దరూ కలిసిపోవాలని అజిత్ తల్లి ఇటీవలే పిలుపునివ్వడం తెలిసిందే. వారిద్దరూ కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. అందుకు తగ్గట్టే డిసెంబర్ 12న శరద్ జన్మదినం సందర్భంగా అజిత్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దాంతో రెండు ఎన్సీపీలు కలిసిపోతాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అది అతి త్వరలోనే జరగవచ్చని పవార్ కుటుంబ అభిమానులు చెప్పుకుంటున్నారు. శరద్ తమకు దేవుడని, పవార్ కుటుంబం ఒక్కటైతే చాలా సంతోషిస్తామని అజిత్ వర్గం ఎంపీ ప్రఫుల్ పటేల్ అన్నారు. శరద్ తన వర్గాన్ని అజిత్ పార్టీలోనే కలిపేసి ఎన్డీయే గూటికి చేరినా ఆశ్చర్యం లేదని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఫడ్నవీస్కు శరద్ కూతురు సుప్రియ ప్రశంసలు అందులో భాగమేనని వారంటుండగా మరికొందరు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మహారాష్ట్ర: సంజయ్ రౌత్పై కార్యకర్తల దాడి?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్పై కార్యకర్తలు దాడి చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఆయనపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియా కథనాలు చర్చనీయాంశంగా మారాయి.ముంబైలోని బాంద్రాలో ఉన్న మాతోశ్రీలో ఉద్దవ్ థాక్రేతో సంజయ్ రౌత్ సమావేశమాయ్యారు. ఈ సమావేశం సందర్భంగా కొంత మంది పార్టీ కార్యకర్తలు సంజయ్తో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రౌత్.. వైఖరి, ఆయన వ్యాఖ్యల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయినట్టు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందినట్టు కార్యకర్తలు చెప్పారు. దీంతో, వాగ్వాదం తలెత్తింది. ఇందులో భాగంగానే సంజయ్ రౌత్పై థాక్రే మద్దతుదారులు దాడి చేసినట్టు సమాచారం. అంతేకాకుండా, సంజయ్ రౌత్ను కొన్ని గంటల పాటు ఓ గదిలో ఉంచి తాళం వేసినట్టు తెలుస్తోంది.ఇక, సంజయ్ రౌత్పై దాడికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దాడి ఘటన వార్తలపై ఉద్దవ్ థాక్రే కానీ, సంజయ్ రౌత్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో, ఈ ఘటనపై మహారాష్ట్రలో మరింత చర్చ జరుగుతోంది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో జరగబోయే బీఎంసీ ఎన్నికలపై ఉద్దవ్ థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ నేత ఆనంద్ దూబే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.There are multiple reports that Shiv Sena (UBT) workers have beaten Sanjay Raut by locking him in a room in Matoshree.Do you support this action of Shiv Sena workers ? pic.twitter.com/deVAEWRuCj— Megh Updates 🚨™ (@MeghUpdates) January 1, 2025 -
కొలువుదీరిన ప్రభుత్వం.. మంత్రి పదవులపై కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి ముంబై: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్.. ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా సహా.. బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో ఎవరెవరిని మంత్రి పదవులు వరించనున్నాయనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇలా ముగ్గురే ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రి పదవులపై సస్సెన్స్ కొనసాగుతోంది. అయితే అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి సుమారు 20 నుంచి 25 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండగా.. శివసేన (షిండేే) పార్టీకి సుమారు 10 నుంచి 12 అదేవిదంగా ఎన్సీపీ (ఏపీ)కి 8 నుంచి 10 మంత్రి పదవులు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల ఆశిస్తున్న వారందరు లాబీ యింగ్ ప్రారంభించారు.ఇదిలా ఉండగా తాను ముఖ్య మంత్రిని కానందుకు మనస్తాపానికి గుర య్యానన్న మాటలను మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి షిండే కొట్టిపారేశారు. 2022లో శివసేనను నుంచి బయటకు వచ్చినపుడు తనవెంట ఉన్నది 39 మంది ఎమ్మెల్యేలని, నేడు, పార్టీకి 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అసలు శివసేన ఎవరిదో దీన్ని బట్టే తెలి సిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకా రోత్సవం అనంతరం శివసేన ప్రధాన కార్యా లయం ఆనంద్ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. వందలాది మంది పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ ఆయన్ను స్వాగతించారు.< -
షిండే శకం ముగిసింది.. ఆయన మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్రలో పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు(గురువారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను మరోసారి సీఎం చేయకపోవడంపై ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే పాలన శకం ముగిసిందని, ఆయన ఇంకెప్పుడూ మహారాష్ట్రకు సీఎం కాలేడని అన్నారు. ఈ మేరకు గురువారం విలేకరులతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ షిండేను పావులా ఉపయోగించుకొని ఇప్పుడు పక్కన పెట్టిందని ఆరోపించారు. ‘షిండే శకం ముగిసిపోయింది. రెండేళ్లు మాత్రమే సీఎంగా ఉన్నారు. ఇప్పుడు అతని వాడుక ముగిసింది. అతడిని పక్కన పడేశారు. షిండే మళ్లీ ఈ రాష్ట్రానికి సీఎం కాలేడు. తమతో జతకట్టే పార్టీలను బలహీనపరిచేందుకు, కూల్చివేయడానికి బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని ఉపయోగిస్తోంది’ అని ఆరోపించారు.షిండే పార్టీని కూడా విచ్ఛిన్నం చేయగలరని సంజయ్ రౌత్ విమర్శించారు. రాజకీయాల్లో బీజేపీ వ్యూహం ఇదేనని, తమతో పనిచేసే వారి పార్టీని విచ్ఛిన్నం చేసి ఆ పార్టీని లేకుండా చేస్తుందని మండిపడ్డారు. మెజారిటీ ఉన్నప్పటికీ మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 15 రోజులు ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. పాలక కూటమిలో చీలిక మొదలైందని.. ఈ సమస్య రేపటి నుంచి ఇంక పెద్దదవుతుందని అన్నారు.‘ఈరోజు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి సీఎం అవుతారు. ఆయనకు మెజారిటీ ఉంది కానీ, 15 రోజుల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు . అంటే వారి పార్టీ లేదా మహాయుతిలో ఏదో లోపం ఉందని అర్థం. ఇప్పుడు కాకపోయిన రేపు అయినా బయటపడుతుంది. వారు మహారాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పని చేయడం లేదు. తమ స్వార్థంతో కలిసి వచ్చారు.. కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. ఫలితాలను ఇప్పటికీ వారు అంగీకరించడం లేదు.’ అని పేర్కొన్నారు.కాగా ముంబయిలో బుధవారం జరిగిన రాష్ట్ర భాజపా కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు.ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టనుండటం ఇది మూడోసారి కానుంది. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, వారు కూడా గురువారం తనతోపాటు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే ఆ ఇద్దరిలో ప్రస్తుతానికి ఒక్కరిపైనే అధికారికంగా స్పష్టత వచ్చింది.తాను డిప్యూటీ సీఎంగా మరోసారి బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ఎన్సీపీ అగ్ర నాయకుడు అజిత్ పవార్ ప్రకటించారు. ఆయనతోపాటు ప్రస్తుతం మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా ఉన్న శివసేన అధినేత ఏక్నాథ్ షిండే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు. -
సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలు
మహారాష్ట్ర సీఎం ఎవరూ.. గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే. నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో మహాయుతి కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు తేలడం లేదు. ముఖ్యంగా సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లతో కలిసి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చర్చలు జరిపినప్పటికీ సీఎం పీఠముడి వీడటం లేదు. ఓవైపు సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. మరోవైపు ముంబైలోని ఆజాద్ మైదాన్లో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేదిక, గ్యాలరీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఎవరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటి వరకు మహాయుతి నేతలుగవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కూడా కలవలేదు. నిజానికి బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ మంగళవారం వేర్వేరు నగరాల్లో ఉన్నారు.జ్వరం, గొంతు నొప్పితో శుక్రవారం సాయంత్రం సొంతూరికి వెళ్లిన ఏక్నాథ్షిండే ఆదివారం సాయంత్రం ముంబైకు రాకుండా థానే వెళ్లారు. శాఖల కేటాయింపుపై మహాయుతి భేటీని రద్దు చేసుకున్నారు. ఇక దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో ఉండగా.. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్లారు.మరోవైపు నేడు విధాన్ భవన్లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆయన పేరును ప్రకటించడంలో జాప్యం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మహాయుతానికి చెందిన ముగ్గురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రమాణస్వీకారానికి సమయం లేకపోవడంతో రేపు గవర్నర్తో సమావేశం అయ్యే అవకాశం ఉంది.ముంబై సమవావేశాలకు షిండే తరుచూ గైర్హాజరు అవ్వడంపై అనేక అనుమానాలు లేవనెత్తడంతో.. ప్రభుత్వ ఏర్పాటులో తాను అడ్డంకి కాబోనని, ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షాపైనే వదిలేశానని షిండే స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్ర కొత్త సీఎం డిసెంబర్ అయిదున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు రాఫ్ట్ర భీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే వెల్లడించారు. సీఎం ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా దేవేంద్ర ఫడ్నవీస్కే ఎక్కువ అవకాశం దక్కుతుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు కొత్త సీఎం ఎవరో ఈనెల 4న జరిగే భేటీలో వెల్లడిస్తామని బీజేపీ సీనియర్ నేత తెలిపారు.ఈ ఉదయం విధాన్ భవన్లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది, ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అత్యున్నత పదవికి బిజెపి తన ఎంపికను ప్రకటించడంలో జాప్యం ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మహాయుతానికి చెందిన ముగ్గురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా గవర్నర్తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. -
కీలక సమావేశానికి షిండే డుమ్మా.. మహాయుతిపై ఆదిత్య ఠాక్రే సెటైర్లు
ముంబై : ‘మహరాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు విడుదలై వారం రోజులవుతుంది. ఇంత వరకూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో స్పష్టత ఇవ్వకపోవడం దారుణం. అధికార మహాయుతి కూటమికి రాష్ట్రంపై ఉన్న అశ్రద్ధకు ఇదే నిదర్శనం’ అంటూ శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.మహరాష్ట్రలోని ప్రస్తుత రాజకీయాలపై ఆదిత్య ఠాక్రే ఎక్స్ వేదికగా స్పందించారు. ఫలితాల విడుదలై వారం రోజులవుతున్నా ఓ ముఖ్యమంత్రిని నిర్ణయించలేకపోతున్నారని మహాయుతి కూటమిపై సెటైర్లు వేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేశారు. To not be able to decide on a chief minister, and form government, for more than a week after result day, is not just an insult to Maharashtra (for taking our state so lightly) but also to the assistance provided by their dearest Election Commission. It seems that rules only…— Aaditya Thackeray (@AUThackeray) December 1, 2024 ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అధికార మహాయుతి కూటమి తీరు చూస్తుంటే నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకు వర్తిస్తాయని, అధికార పార్టీలకు వర్తించవని తెలుస్తోంది. గవర్నర్కు సంఖ్యాబలం చూపకుండానే ఏకపక్షంగా ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించడం అరాచకం’అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహాయుతి కూటమి కీలక సమావేశం జరుగాల్సి ఉంది. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనూహ్యంగా సతారా జిల్లాలోని తన గ్రామానికి వెళ్లడం చర్చాంశనీయంగా మారింది. ఓ వైపు కీలక సమావేశం ఉన్నా ఏక్నాథ్ షిండే గైర్హాజరు కావడం మహరాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో ఆదిత్య ఠాక్రే ఎక్స్ వేదికగా స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. -
ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యు.బి.టి.) రాయని డైరీ
శరద్ పవార్, నేను, నానా పటోలే ఒక దగ్గర కూర్చొని ఉన్నాం. ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం?’’ అన్నారు శరద్జీ హఠాత్తుగా! 83 ఏళ్ల వయసులో కూడా ఆయన, మెలకువలోంచి కళ్లు తెరిచినట్లుగా... హఠాత్తుగా, ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం’’ అనే ప్రశ్న వేయగలిగారంటే అది ఆయనలోని తరగని రాజకీయ చైతన్యానికి ఒక స్పష్టమైన సంకేతమనే అనుకోవాలి. ఎక్కడ కూర్చొని ఉన్నామో చెప్పబోయాన్నేను. ‘‘ఉద్ధవ్జీ! మీరాగండి నేను చెబుతాను’’ అన్నారు నానా పటోలే!! విస్మయంగా ఆయన వైపు చూశాను. ‘‘సరే, మీరే చెప్పండి నానాజీ’’ అన్నాను. నానాజీ ఏం చెప్పినా – మేము కూర్చొని ఉన్నది ముంబై హెర్డియా మార్గ్లోని ఎన్సీపీ పార్టీ ఆఫీసు తప్ప మరొకటి అవటానికి లేదు. ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నామంటే శరద్జీ... సరిగ్గా ఒక పరాజయ పీఠం మీద! అది కూడా ముగ్గురం సర్దుకుని కూర్చున్నాం...’’ అన్నారు నానాజీ!అంటే... ఎన్సీపీ–శివసేన–కాంగ్రెస్. ‘‘మీరేమంటున్నారు నానాజీ, కలిసి పోటీ చేయటం వల్ల మన మూడు పార్టీలు ఓడిపోయాయనేనా?’’ అన్నాను. ‘‘ఉద్ధవ్జీ... అక్కడ బీజేపీ కూటమిలో శివసేన ఉంది, ఇక్కడ కాంగ్రెస్ కూటమిలోనూ శివసేన ఉంది. అక్కడ బీజేపీ కూటమిలో ఎన్సీపీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కూటమిలోనూ ఎన్సీపీ ఉంది. అయినప్పటికీ వాళ్లే ఎందుకు గెలిచారో తెలుసా?’’ అన్నారు నానాజీ. ‘‘కానీ నానాజీ, మనమిక్కడ కూర్చున్నది వాళ్లెందుకు గెలిచారు అని కాక, మనం ఎందుకు ఓడిపోయామో ఒకర్నుంచి ఒకరం తెలుసుకోటానికి కదా...’’ అన్నాను. ‘‘అదే అంటున్నాను ఉద్ధవ్జీ... వాళ్లెందుకు గెలిచారో తెలిస్తే, మనమెందుకు ఓడిపోయామో తెలుస్తుంది. పోనీ, మీరన్నట్లు మనం ఎందుకు ఓడిపోయామో తెలుసుకుంటే వాళ్లెందుకు గెలిచారో తెలుస్తుంది కానీ, వాళ్ల గెలుపుతో మనకు పనేమిటి? మన ఓటమి గురించి మనం ఆలోచించాలి కానీ...’’ అన్నారు నానాజీ!ఆలోచనలో పడ్డాన్నేను. గెలుపోటములు అన్నవి రెండు భిన్నమైన స్థితులా లేక, పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండే పరిస్థితులా?‘‘సరే చెప్పండి నానాజీ! వాళ్లెందుకు గెలిచారని మీరు అనుకుంటున్నారు?’’ అన్నాను. ‘‘గెలవకుండా ఎలా ఉంటారు ఉద్ధవ్జీ! ‘విడిపోతే దెబ్బతింటాం. కలిసుంటే భద్రంగా ఉంటాం’ అని కదా వాళ్ల నినాదం. అది పట్టేసింది మహారాష్ట్రా వాళ్లకు, మహారాష్ట్రలో ఉండే గుజరాతీలకు; ఇంకా... హిందువులకు, ముస్లిములకు! పైకే నినాదం. లోపల అది బెదిరింపు. ఓట్లు విడిపోతే పాట్లు తప్పవని...’’ అన్నారు నానాజీ. ‘‘అందుకే ఓడామా మనం?’’ అన్నాను. ‘‘కాదు’’ అన్నారు. ‘‘మరి?’’ అన్నాను. ‘‘శివసేన నుంచి శివసేన, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయి, ఒకదాన్ని ఒకటి ఓడించాయి. రెండూ కలిసి కాంగ్రెస్ను ఓడించాయి’’ అన్నారు నానాజీ... ‘మీతో కలిసి మేం దెబ్బతిన్నాం’ అనే అర్థంలో!!నేను మౌనంగా ఉండిపోయాను. నానాజీ కూడా కాసేపు మౌనం పాటించారు. ‘‘మనమిక్కడ ఎంతసేపటిగా కూర్చొని ఉన్నాం?’’ అన్నారు శరద్జీ హఠాత్తుగా!అప్పుడు గానీ... ఆయన్ని పట్టించు కోకుండా మేమిద్దరమే చాలాసేపటిగా మాట్లాడుకుంటూ ఉన్నామన్న సంగతి మాకు స్పృహలోకి రాలేదు!‘ఎక్కడ కూర్చొని ఉన్నాం’ అనే తన ప్రశ్నకు, ‘‘పరాజయ పీఠం’’ మీద అన్న నానాజీ జవాబు ఆయన్ని సంతృప్తి పరిచే ఉండాలి. లేకుంటే – ‘‘మనమిక్కడ ఎంతసేపటిగా కూర్చొని ఉన్నాం?’’ అనే కొనసాగింపు ప్రశ్న వేసి ఉండేవారు కాదు శరద్జీ. -
Maharashtra: వీడని ‘పీఠ’ముడి.. కానీ ఆరోజే సీఎం ప్రమాణ స్వీకారం!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో అధికార మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్ బెర్త్ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది.ఈ మేరకు శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం (డిసెంబర్ 2) సమావేశమవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎంపికైన నేత గురువారం (డిసెంబర్ 5) ముంబైలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పేర్కొన్నాయి.అయితే మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అసంతృప్తి చెందిన తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకొని తన స్వగ్రామానికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది.అయితే ఈ ఊహాగాలను శివసేన కొట్టిపారేసింది. షిండే అస్వస్థతతో ఉన్నారని, ఆయన శనివారం తిరిగి ముంబై చేరుకుంటారని తెలిపింది. ‘షిండే అలగలేదు. అతను అనారోగ్యంతో ఉన్నారు. సీఎం పదవి విషయంలో మనస్తాపం చెంది ఆకస్మిక పర్యటనకు వెళ్లాడని ప్రచారం చేయడం సరికాదు. ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడతానని చెప్పారు. చదవండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరుసమావేశాలు భౌతికంగానే కాదు.. వీడియో కాన్ఫరెన్స్, మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా జరుగుతాయి. షిండే చెప్పినట్లుగా త్వరలోనే మహారాష్ట్ర మంత్రివర్గం ఖరారు అవుతుంది. 60 మంది ఎమ్మెల్యేలు కలిసి షిండేను ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరాం. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. లాడ్లీ బెహన్ యోజనను ప్రవేశపెట్టినందున అతను ప్రభుత్వంలో కొనసాగడం చాలా ముఖ్యం. ప్రభుత్వంలో అతని ఉనికి ముఖ్యం. మరోసారి, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య సమావేశం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణపై కూలంకషంగా చర్చిస్తాం’’ అని తెలిపారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ముంబైలో బీజేపీ, ఎన్సీపీ, శివసేన భేటీ కావాల్సి ఉండేది. కానీ షిండే అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం వాయిదా పడింది.కాగా నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి 233 స్థానాలను కైవం చేసుకుంది. బీజేపీ రికార్డు స్థాయిలో 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 57 చోట్ల, ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించింది. అయితే ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే సీఎం పీఠాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్న నేపథ్యంలో ఏక్నాథ్షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం శాఖ వంటి కీలక పోర్ట్ఫోలియోలపై పట్టుబడుతున్ట్లు తెలుస్తోంది. గతంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్న్పుడు హోంమంత్రిత్వ శాఖను కూడా ఆయనే నిర్వహించారు. -
షిండేకు భారీ షాక్? శివసేన నేత కీలక వ్యాఖ్యలు
-
‘మహా’ రాజకీయం: ఏక్నాథ్ షిండే అలకపాన్పు
ముంబై: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెరపడడం లేదు. ఎన్నికల ఫలితాలు విడుదలై వారం రోజులవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. శుక్రవారం జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం అనూహ్యంగా రద్దయ్యింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అడుగులు చర్చనీయాంశంగా మారాయి. సతారా జిల్లాలోని తన సొంత గ్రామానికి ఆయన చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన(షిండే) నాయకుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(అజిత్) నేత అజిత్ పవార్ గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రి జె.పి.నడ్డాతో సమావేశమయ్యారు. మంత్రివర్గం కూర్పు, మంత్రి పదవుల పంపకంపై వారు చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం ఉదయం ముంబైకి చేరుకున్నారు. శుక్రవారం ముగ్గురు నేతల మధ్య కీలక సమావేశం జరగాల్సి ఉంది. నూతన ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రి పదవుల పంపకాన్ని ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఏక్నాథ్ షిండే ఆకస్మికంగా తన సొంత గ్రామానికి వెళ్లిపోవడంతో చర్చలు ఆగిపోయాయి. తాజా పరిణామాల పట్ల షిండే అసంతృప్తితో ఉన్నారని, అందుకే అలకబూని మిత్రపక్షాలతో చర్చలు కొనసాగించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ మరింత పెరిగిపోయింది. మహాయుతి సమావేశం ఆదివారం జరుగనున్నట్లు శివసేన(షిండే) వర్గాలు తెలియజేశాయి. కొత్త ముఖ్యమంత్రి వచ్చేవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వివరించాయి. తమ పార్టీ నేత ఏక్నాథ్ షిండేలో ఎలాంటి అసంతృప్తి లేదని, ఆయన శనివారం ముంబైకి తిరిగి వస్తారని శివసేన నాయకుడు ఉదయ్ సామంత్ చెప్పారు. ఢిల్లీలో షిండే తమ పార్టీ డిమాండ్లను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై అమిత్ షా అతిత్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తారని వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) పారీ్టలు మహాయుతి పేరిట కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ(అజిత్) 41 సీట్లు గెలుచుకున్నాయి. సీఎం కుర్చీ కోసం మూడు పార్టీల ముఖ్యనేతలు పోటీపడ్డారు. కానీ, మిత్రపక్షాలకు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించడం లేదు. దాంతో కనీసం మంత్రి పదవుల్లోనైనా ఎక్కువ వాటా సొంతం చేసుకోవాలని శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) ఆరాటపడుతున్నాయి. మిత్రపక్షాలకు 20 మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తమకే ఎక్కువ పదవులు కావాలని ఎన్సీపీ(అజిత్) పట్టుబడుతోంది. మరోవైపు బీజేపీ శాసనసభాపక్షం ఇప్పటికీ సమావేశం కాలేదు. తమ నాయకుడిని ఎన్నుకోలేదు. షిండే అడుగులు ఎటువైపు? మరోసారి సీఎం పదవి తనకే ఇవ్వాలని ఏక్నాథ్ షిండే తొలుత డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం బుజ్జగించడంతో మెత్తబడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలిసింది. కానీ, కీలకమైన హోంశాఖను తనకే అప్పగించాలని షరతు పెట్టారు. షిండే మనసు మార్చుకుంటున్నట్లు ఆయన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నాయి. ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పోస్టుపై శివసేన(షిండే)లో రెండు రకాల వాదనలు వినిపిస్తాయి. ఈ పదవి తీసుకోవాలని ఒక వర్గం చెబుతుండగా, అవసరం లేదని మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావడం ఏమిటని శివసేన(షిండే) ఎమ్మెల్యే సంజయ్ సిర్సాత్ ప్రశ్నించడం గమనార్హం. పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి చిన్న పదవిలో ఇమడలేరని ఆయన చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో షిండే కూర్చొనే అవకాశం లేదని అన్నారు. కూటమి ధర్మాన్ని తన తండ్రి గౌరవిస్తారని, వ్యక్తిగత ఆకాంక్షలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోరని ఏక్నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే స్పష్టంచేశారు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీతో జట్టుకట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు వారి బలం సరిపోదు. రెండు రోజుల్లో సీఎం ఎంపిక: షిండే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్ షా, జె.పి.నడ్డాతో సానుకూల చర్చలు జరిగాయని ఏక్నాథ్ షిండే చెప్పారు. ఆయన శుక్రవారం ఉదయం ఢిల్లీలో ముంబైకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. కొత్త సీఎం ఎంపికపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ముంబైలో మహాయుతి కీలక సమావేశం జరగబోతోందని, చర్చలు కొనసాగుతాయని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాను అవరోధం కాబోనని, ప్రధాని మోదీ, అమిత్ షాల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. మహాయుతి కూటమి పారీ్టల మధ్య చక్కటి సమన్వయం ఉందని వివరించారు. అతి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. పదవుల వెంట పడడం తమకు ఇష్టం లేదన్నారు. -
కాంగ్రెస్ అతి విశ్వాసమే కొంపముంచింది: మిత్రపక్షం శివసేన
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ అతి విశ్వాసమే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఓటమికి కారణమని మిత్ర పక్షం శివసేన ఆరోపించింది. ఎంవీయేలో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ప్రదర్శించిన వైఖరి.. కూటమి విజయావకాశాలను దెబ్బతిశాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు శివసేన(యూబీటీ) సీనియర్ నేత, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వే మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ మహా వికాస్ అఘాడి ఎన్నికలకు వెళ్లాల్సిందని అన్నారు."లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత హర్యానా, జమ్మూ కాశ్మీర్లో మాదిరిగానే మహారాష్ట్రలోనూ కాంగ్రెస్కు మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంది. ఇదే ఫలితాల్లో ప్రతిబింబించింది. సీట్ల పంపకాల చర్చల సమయంలో కాంగ్రెస్ వైఖరి మమ్మల్ని బాధించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్దవ్ను ప్రకటించాల్సి ఉండేది. అలా చేయకపోవడం మా అవకాశాలను దెబ్బతీసింది. అలా చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి.’ దాన్వే పేర్కొన్నారు.కాగా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రకు సంబంధించిన 48 స్థానాల్లో మహా వికాస్ అఘాడి అత్యధికంగా 30 చోట్ల గెలుపొందింది. మిత్ర పక్షాలతో పోలిస్తే కాంగ్రెస్ ఎక్కువగా 13 స్థానాల్లో విజయం సాధించింది. ఇదే జోష్ మీదున్న కాంగ్రెస్.. రాష్ట్ర ఎన్నికలకు ముందు సీట్ల భాగస్వామ్య చర్చల సమయంలో గట్టిగా బేరసారాలు చేసింది. ఇది కూటమిలో ఘర్షణకు దారితీసింది. చివరకు 103 స్థానాల్లో పోటీ చేసినా కేవలం 16 మాత్రమే గెలుపొందింది. 89 స్థానాల్లో పోటీ చేసిన సేన (యూబీటీ) 20 స్థానాల్లో విజయం సాధించింది. మూడో మిత్రపక్షమైన శరద్ పవార్ ఎన్సీపీ 87 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో విజయం సాధించింది.మరోవైపు శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 132 చోట్ల విజయం కేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే శివసేన 57 స్థానాల్లో గెలుపొందగా.. అజిత్పవార్ ఎన్సీపీ41 చోట్ల విజయం సాధించింది. -
మంత్రి పదవులపై మల్లగుల్లాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఘన విజయంతో అధికారపీఠాన్ని కైవసం చేసుకున్న మహాయుతి కూటమి పార్టీలు అధికార పంపిణీపై మాత్రం మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే సీఎం పదవిపై స్పష్టత వచి్చనట్లు తెలుస్తోంది. ఫడ్నవిస్కు సీఎం పదవి ఇవ్వడంలో అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు సమాచారం. కీలక పోర్ట్ఫోలియోలపై మూడు పార్టీలూ కన్నేయడంతో నేరుగా కూర్చుని మాట్లాడుకునేందుకు శివసేన, ఎన్సీపీ సారథులు బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేలు మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి బీజేపీ అగ్రనేత అమిత్షాను కలిశారు. కృష్ణమీనన్ మార్గ్లోనిæషా నివాసంలో చర్చలు జరిపారు. సామాజిక సమీకరణాలతోనే పోస్ట్లు సామాజిక సమీకరణాలను బట్టే మంత్రి పదవులను కట్టబెట్టాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీలోని ఓబీసీ లేదా మరాఠా నేతకే సీఎం పదవి కట్టబెట్టాలని చూస్తోందని తొలుత వార్తలొచ్చాయి. అన్ని పార్టీల్లో మరాఠా వర్గానికి చెందిన వాళ్లే అత్యధికంగా ఎమ్మెల్యేలుగా గెలిచినా ఆర్ఎస్ఎస్ లాబీయింగ్ బలం పనిచేస్తే బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవిస్కే మళ్లీ సీఎం పీఠం దక్కుతుందని ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అజిత్, షిండే డిప్యూటీ సీఎంలుగా ఉంటారని వార్తలొచ్చాయి. అయితే సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎవరేం కోరుతున్నారు? పోర్ట్ఫోలియోలపై ఎవరికివారు కరీ్చఫ్ వేసేస్తున్నారు. తమ పార్టీకి ఈ శాఖలే కావాలని పట్టుబడుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పట్టణాభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్య శాఖలు తమకు కేటాయించాలని ఏక్నాథ్ షిండే కోరుతున్నారు. కీలకమైన ఆర్థిక శాఖ తమకు ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ వర్గం డిమాండ్చేస్తోంది. అయితే మెజారిటీ సీట్లు గెలిచిన తమ వద్దే కీలకమైన శాఖలను అట్టిపెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. గెలిచిన ప్రతి ఆరు సీట్లకు ఒక కేబినెట్ పోస్ట్ చొప్పున మంత్రి పదవులను పంచాలని ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు వార్తలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిలో బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ( అజిత్ పవార్) 41 చోట్ల గెలిచాయి. ఒక్కో పార్టీ గెలిచిన సీట్ల సంఖ్యను బట్టి కేబినెట్ పోస్టులు కేటాయించాలని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ సీఎంగా చేసిన షిండే ఇకపై డిప్యూటీ సీఎం పదవి చేబడితే పట్టణాభివృద్ధి శాఖతోపాటు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖనూ తన వద్ద అట్టిపెట్టుకోవాలని చూస్తున్నారు. రెవిన్యూ, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, సామాజిక న్యాయ శాఖలను తమ పార్టీకే కేటాయించాలని డిమాండ్చేస్తున్నారు. అజిత్ డిమాండ్లు ఏంటి ? డిప్యూటీ సీఎం పోస్ట్తోపాటు ఆర్థికశాఖ తనకే ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కోరుతున్నట్లు వినికిడి. అయితే కీలకమైన ఆర్థికశాఖతోపాటు ప్రణాళిక శాఖను తన వద్దే ఉంచేసుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. వ్యవసాయం, ఆహార, పౌర సరఫరాలు తదితర శాఖలు తమకు కేటాయించాలని అజిత్ అడుగుతున్నారని తెలుస్తోంది. బీజేపీ మాటేంటి? కూటమిలో అత్యధిక సీట్లు గెలిచినందున కీలకమైన ఏ శాఖనూ కూటమి పార్టీలకు ఇచ్చేది లేదని బీజేపీ పట్టుదలగా ఉందని తెలుస్తోంది. హోం, గృహ, పట్టణాభివృద్ధి, ఆర్థికం, నీటిపారుదల, విద్యుత్, నైపుణ్యాభివృద్ధి శాఖలు తమ ఆధ్వర్యంలోనే కొనసాగాలని బీజేపీ ఆశిస్తోంది. గెలిచిన ప్రతి ఆరు సీట్లకు ఒక కేబినెట్ పోస్ట్ చొప్పున మంత్రి పదవులను పంచాలన్న సూత్రాన్ని అమలుచేస్తే బీజేపీకి 21 లేదా 22, శివసేనకు 10 లేదా 12, ఎన్సీపీకి 8 లేదా 9 మంత్రి పదవులు దక్కుతాయి. -
ఈవీఎంలు ఉంటే ఏదైనా సాధ్యమే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి బంపర్ లక్కీ డ్రాలో గెలిచిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పత్రిక సామ్నా విమర్శించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు ఉంటే ఏదైనా సాధ్యమే నని పేర్కొంది. సామ్నా ఎడిటో రియల్లో ఈ మేరకు ధ్వజమెత్తింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల భారత్లో చాలావేగంగా ఓట్ల లెక్కింపు పూర్తయిందని, అమెరికాలో ఇది చాలా ఆలస్యమైందని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై సామ్నా స్పందిస్తూ భారత్లో ఈవీఎంల పనితీరుతో సామాన్యులూ నిర్ఘాంతపోయారని పేర్కొంది. అంతేకాకుండా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ స్వయంగా కొన్ని నెలల కిందట చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. మొత్తం 288 సీట్లలో మహాయుతి బంపర్ లక్కీ డ్రాలో ఏకంగా 230 సీట్లను ఎలా నెగ్గగలిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే అవన్నీ ఈవీఎంల దగ్గరే ఆగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. ఏకంగా 95 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని పేర్కొంది. అలాగే బ్యాటరీలు పూర్తి చార్జింగ్తో ఉండటం ఈవీఎంలపై పలు అనుమానాలను రేకెత్తిస్తోందని తెలిపింది. -
విజయాన్ని మించిన పరాజయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ప్రజలకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. మెజారిటీ సర్వే సంస్థలు పాలకపక్ష కూటమి ‘మహాయుతి’కి అనుకూలంగానే చెప్పాయి. కానీ, ఇంతటి ఘనవిజయాన్ని అవి కూడా అంచనా వేయలేకపోయాయి. ఈ గెలుపును విశ్లేషిస్తే, ‘మహా వికాస్ ఆఘాడీ’పై మహాయుతి విజయంగా కన్నా... మహాయుతి చేతిలో ఎమ్వీయే ఘోర పరాజయంగా పరిగణించడమే సమంజసం. ఇది విపక్ష కూటమి చేజేతులా తెచ్చుకున్న ఓటమి. మితిమీరిన ఆత్మవిశ్వాసం, కొరవడిన ఎన్నికల వ్యూహం వారికీ గతి పట్టించాయి. అతి విశ్వాసంతో సరైన ‘ఎన్నికల నినాదమే’ లేకుండా కూటమి గుడ్డిపోరు సల్పింది. లోక్సభ ఎన్నికల్లో లభించిన స్పష్టమైన ఆధిక్యాన్ని నిలుపుకోలేక పోయింది.మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేసిన ట్టుగానే, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పాలకపక్ష కూటమి ‘మహాయుతి’ ఘన విజయాన్ని సాధించింది. గరిష్ఠంగా ‘పీపుల్స్ పల్స్’ చెప్పిన 195 సంఖ్యను కూడా మించి,ఏకంగా 234 స్థానాలను కైవసం చేసుకొని బీజేపీ నేతృత్వపు కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.మహారాష్ట్ర ఫలితం ‘ఇండియా కూటమి’కి ఎదురు దెబ్బే అయినా, పార్టీగా కాంగ్రెస్కు కోలుకోలేని పెద్ద దెబ్బ. హిమాచల్ ప్రదేశ్ గెలుపు కర్ణాటకలో విజయానికీ, కర్ణాటకలో గెలుపు తెలంగా ణలో విజయానికీ కొంత ప్రేరణ ఇచ్చిన క్రమంలో... 2024 లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తన స్థానాలను రెట్టింపు చేసుకోగలిగింది. సెంచరీ మార్క్ సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగుదల మిత్ర పక్షాలకూ ప్రేరణ కలిగించి, దేశ రాజకీయాల్లో ‘ఇండియా కూటమి’ బలమైన ప్రత్యామ్నాయంగా నిలువగలిగింది. అయితే, చావు తప్పి కన్ను లొట్టబోయిందన్న తరహాలో ‘ఇండియా’ కూటమికి దక్కిన నిన్నటి జమ్ము–కశ్మీర్ గెలుపైనా, ఇవాళ్టి ‘జార్ఖండ్’ విజయమైనా మిత్రుల ఘనతే తప్ప కాంగ్రెస్ సాధించిందేమీ లేదు. కాంగ్రెస్ సంస్థాగత స్థితి, ఎన్నికల నిర్వహణా సామర్థ్యం దిగదుడుపుగానే ఉంటోంది. 1990లలో బీజేపీ–శివసేన కూటమి రాజకీయాలు మొదలయ్యే వరకు మహారాష్ట్రలో కాంగ్రెస్దే ఆధిపత్యం. బీజేపీ–శివసేన శకం ఆధిపత్య క్రమంలో కూడా 2004–14 మధ్య శరద్ పవార్ నేతృత్వంలోని జాతీయవాద కాంగ్రెస్ (ఎన్సీపీ)తో పొత్తుల వల్ల కాంగ్రెస్ మళ్లీ పాలకపక్ష స్థాయికి వచ్చింది. 2014 తర్వాత, ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి, పార్టీ మార్పిళ్లు, రాజకీయ శక్తుల పునరేకీకరణల్లో కాంగ్రెస్ క్రమంగా పలుచబారుతోంది. కాంగ్రెస్ది మహావైఫల్యంఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకా శాలను దాదాపు అన్ని సర్వే సంస్థలూ అంచనా వేశాయి. 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ, మొత్తం పది లోక్సభ స్థానాలూ ఓడి పోయిన హరియాణాలో కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికలకు వచ్చేసరికి 5 స్థానాలు గెలిచింది. ఓటు వాటాలోనూ బీజేపీ కన్నా 1 శాతం స్పష్టమైన ఆధిక్యత దక్కించుకుంది. తర్వాతి ఒకటి, రెండు మాసాల్లో కాంగ్రెస్ సానుకూలత మరింత పెరిగినట్టు వివిధ సర్వేల్లో సంకేతా లొచ్చాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడింది. తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొన్న బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి, మూడోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. లోక్సభ ఎన్ని కలు, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు ప్రాతిపదికలపై జరుగుతాయనీ, ప్రజాతీర్పు భిన్నంగా వచ్చే ఆస్కారం ఉంటుందనీ కాంగ్రెస్ పాఠం నేర్వనందునే మహారాష్ట్రలో ఎదురుదెబ్బ తప్పలేదు. హరియాణా పరిస్థితే మహారాష్ట్రలోనూ ఉండింది. లోక్సభ ఎన్నికల్లో 48కి 30 స్థానాలు నెగ్గి మహా వికాస్ అఘాడీ స్పష్టమైన ఆధిక్యత పొందింది. పాలక పక్షంగా ఉండిన మహాయుతికి 17 స్థానాలే లభించాయి. మరాఠ్వాడా వంటి కొన్ని ప్రాంతాల్లో మహా యుతికి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఆ పరిస్థితిని నిలబెట్టు కోవడమో, మెరుగుపరచుకోవడమో చేయకుండా... తమ గెలుపు ఖాయమైపోయినట్టు ఎమ్వీయే పక్షాలు ధీమా ప్రదర్శించాయి. కూటమి గెలుపు మీద కన్నా ‘ఎవరు ముఖ్యమంత్రి?’ అన్న దానిపైనే వివిధ పక్షాల నేతలు కన్నుపెట్టారు. సంస్థాగత నిర్వహణ, మిత్రులతో సయోధ్య, ప్రభావవంతమైన నినాదమివ్వడం, ప్రజలకో స్పష్టమైన వాదన (నెరేటివ్) వినిపించగలగడం... ఇలా అన్నింటా విఫల మయ్యారు. ఎన్నికల వేళ ఆ యా ప్రాంతాలకు పార్టీ ఇన్చార్జీల నియా మకం కూడా సహేతుకంగా జరుగలేదు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి, ఇప్పుడు వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న నాయకుడిని ఒక నియోజకవర్గానికి నియమిస్తే, ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థియే పోటీలో లేరు. ప్రత్యర్థి పార్టీ ఓబీసీలతో 60 వేల ‘బృంద సమావేశాలు’ ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ నాయకులు స్టార్ హోటళ్లలో దిగి, రూ. 60 వేల బిల్లులు చేశారంతే!పాత చింతకాయ పచ్చడిచంకలో పుస్తకం పెట్టుకొని ‘రాజ్యాంగం ప్రమాదంలో ఉంది’ (సంవిధాన్ ఖత్రే మే హై) అన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నినాదం ఈసారి పనిచేయలేదు. ‘బీజేపీ అడుగుతున్నట్టు 400కు పైగా స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు గల్లంతవుతాయి’ అని ప్రచారం చేస్తే లోక్సభ ఎన్నికల్లో అది కాంగ్రెస్కూ, వారి కూటమికీ లాభించింది. అసెంబ్లీ ఎన్నికలు గనుక... సోయ, పత్తి వంటి రైతాంగ సమస్యలు, కొన్ని ప్రాంతాల వెనుకబాటుతనం, మరాఠా యువత నిరుద్యోగిత వంటి స్థానికాంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. మహా వికాస్ ఆఘాడీలోని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) కూడా, తమ పార్టీలను బీజేపీ నిలువునా చీల్చిందన్న పాత నినాదాన్నే ఈ ఎన్నికల్లోనూ ప్రచారాంశంగా ఎత్తుకున్నాయి. అదే అంశంపై లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన కలిసి ఎన్నికలకు వెళ్లి, సానుకూల ప్రజాతీర్పు పొందిన తర్వాత, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన... కాంగ్రెస్ –ఎన్సీపీ పంచన చేరడం వారి నైతిక స్థితిని కొంత బలహీనపరిచింది. అందుకే, చీలికల అంశంలో బీజేపీపై నిందలు తాజా ఎన్నికల్లో ఆధిక్యతను ఇవ్వలేకపోయాయి. వాస్తవిక బలాల ఆధారంగా లోక్సభ సీట్ల పంపకాలు చేసుకున్న ఎమ్వీయే కూటమి ఈసారి మాత్రం పొత్తుల్ని కడదాకా తేల్చలేదు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేయడం వల్లనేమో... సీట్ల పంపకాల్లో సయోధ్యకు నీళ్లొదిలారు. కాంగ్రెస్ గెలిచిన 16 స్థానాల్లో 11 బీజేపీతో నేరుగా తలపడ్డ స్థానాలే. అయినా, ఆ పార్టీతో పోలిస్తే విజయశాతం అట్టడుగున ఉంది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు కూడా ప్రత్యర్థి కూటమి పక్షాలైన శివసేన (షిందే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి.దిద్దుబాటు చర్యలతో...లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పసిగట్టిన మహాయుతి కూటమి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే, 18–59 మధ్య వయస్కులైన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చెల్లిస్తూ చేపట్టిన ‘మాజీ–లడ్కీ–బహెన్’ పథకం తిరుగు లేని ఆధిక్యతనిచ్చింది. మహిళా ఓటింగ్ 6 శాతం పెరగటం ఇందు కొక సంకేతమే! తాము తిరిగి గెలిస్తే దాన్ని రూ. 2,100లకు పెంచుతామన్న ‘మహాయుతి’ హామీ 2.4 కోట్ల కుటుంబాలకు ఆశ కల్పించింది. దానికి తోడు ‘ఓట్ జిహాద్’, ‘బటేంగే తో కటేంగే’ నినాదాలు, ఆ దిశలో చేసిన ప్రచారం హిందువుల ఓట్లను ఏకీకృతం చేయడంలో ప్రభావం చూపాయి.బీజేపీ యంత్రాంగానికి తోడు ఆర్ఎస్ఎస్ ఈ ఎన్నికల్ని ప్రతి ష్ఠాత్మకంగా తీసుకొని పనిచేసింది. లోక్సభ ఎన్నికల్లో మరాఠ్వాడా, విదర్భ లాంటి ప్రాంతాల్లో ప్రతికూలంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని గమనించిన బీజేపీ, ఓబీసీల మద్దతు కూడగట్టడంపై పెట్టిన శ్రద్ధ కలిసొచ్చింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలను అమలు చేయట్లేదంటూ చేసిన ‘ప్రతి ప్రచారం’తో, ఎమ్వీయే కూటమి హామీ లపై సందేహాల్ని రేకెత్తించడంలో మహాయుతి పైచేయి సాధించింది. అంతిమంగా మహారాష్ట్ర ఫలితం ‘మహాయుతి’ భారీ విజయాన్ని మించి, ‘మహా వికాస్ ఆఘాడీ’ ఘోర పరాజయంగా మిగిలింది.దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
Maharashtra: ప్రతిపక్ష నేత ఎవరు..?
ముంబై: ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా... మహాయుతి కూటమి 235 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 132 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ 41 స్థానాలు దక్కించుకున్నాయి. ఏ పార్టీకి దక్కని ప్రతిపక్ష హోదా!ఊహించని విధంగా రికార్డు బద్దలు కొడుతూ భారీ మెజార్టీతో మహాయుతి కూటమి విజయ దుందుభి మోగించగా ప్రతిపక్ష నేత ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షంలోని ఏ పార్టీ కూడా పది శాతం స్థానాలు రాబట్టుకోలేక పోయాయి. దీంతో ప్రతిపక్ష పదవిలో ఎవరు ఉండక పోవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపీ) లేకపోవడం ఆరు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. రాష్ట్ర శాసన మండలి నియమాల ప్రకారం మొత్తం స్థానాల్లో పది శాతం స్థానాలు దక్కించుకున్న పార్టీకే ప్రతిపక్ష పదవి లభిస్తుంది. కానీ శనివారం వెలువడిన ఫలితాల్లో మహా వికాస్ అఘాడీలోని యూబీటీ, కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) మిత్రపక్షాల్లోని ఏ ఒక్క పార్టీకి పది శాతం స్థానాలు రాలేకపోయాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 49 చోట్ల గెలుపొందింది. ప్రస్తుతం కాంగ్రెస్ వద్ద 16, యూబీటీ–శివసేన వద్ద 20, ఎన్సీపీ (ఎస్పీ) వద్ద 10 స్థానాలున్నాయి. దీంతో ఏ పార్టీ వద్ద తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్ష పీఠంపై ఉత్కంఠ నెలకొంది. సీఎం పీఠంపై వీడని ఉత్కంఠమరోవైపు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందుకోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సీఎం, శివసేన (షిండే) అధినేత ఏక్నాథ్ షిండే మరోసారి అవకాశం ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా తం ఆ పోస్టు కోసం పోటీలో ఉన్నారు.బీజేపీ మాత్రం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో తీరనుంది. కనుక ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి. -
ఏదో మోసం జరిగింది: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: మహా రాష్ట్ర ఎన్నికల ఫలితాల విషయంలో ఏదో మోసం కచ్చితంగా జరిగిందని, ఇలాంటి ఫలితాలను తాము ఎంతమాత్రం ఊహించలేదని శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు అందించానని, మహారాష్ట్ర ప్రజలు తనను కుటుంబ పెద్దగా భావించారని తెలిపారు. వారు తనకు ఇలాంటి ప్రతికూల తీర్పు ఇస్తారంటే నమ్మలేకుండా ఉన్నానని వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రే శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, అయినా మహాయుతి ఎలా గెలిచిందో అర్థం కావడం లేదని, దీని వెనుక ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితమే జరిగిన లోక్సభ ఎన్నికల్లో 48 సీట్లకు గాను మహా వికాస్ అఘాడీ 30 సీట్లు గెలుచుకుందని గుర్తుచేశారు. ఇంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టంచేశారు. -
మాజీ సీఎంకు షాకిచ్చిన ‘ఆటోవాలా’
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. రాష్ట్రంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైంది. ఎన్డీయే కూటమిలో బీజేపీ అత్యధికంగా 125, శివసేన 56, 39 చోట్ల ఎన్సీపీ హవా కొనసాగుతోంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 56 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉద్దవ్ వర్గం శివసేన 18 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ కేవలం 12 స్థానాల్లో ఆధిక్యంతో సరిపెట్టుకోగా.. అటు కాంగ్రెస్ కూడా అంతంత మాత్రంగానే 23 చోట్ల తమ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.అయితే ఈ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్ర ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల కౌంటింగ్ పరిశీలిస్తే.. నిజమైన శివసేన ఏదనే విషయంలో మరాఠీ ప్రజలు స్పష్టం తీర్పును వెల్లడించారు. ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేననే అసలు పార్టీలుగా ప్రజలు తేల్చినట్లు తెలుస్తోంది. బాలాసాహెబ్ ఠాక్రే వారసుడు ఏక్నాథ్ షిండే అని మహా ఓటర్లు తేల్చి చెప్పారు.ఆటో డ్రైవర్ నుంచి సీఎం దాకాఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఏక్నాథ్షిండే.. ఆర్థిక కారణాలతో చదువును మధ్యలోనే ఆపేశారు,.. ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్, బీర్లు తయారు చేసే సంస్థలోపనిచేశారు. శివసేన ఫైర్బ్రాండ్ నేత దివంగత ఆనంద్ దిఘే ఆశిస్సులతో 1997లో థానే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీచేసి నెగ్గడంతో శిండే రాజకీయ ప్రయాణం ఊపందుకుంది. 4 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఏక్నాథ్.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. శిండే శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్కు ప్రియశిష్యుడు కూడా.మహారాష్ట్రలో బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. 2022 జూన్లో పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి భారతీయ జనతా పార్టీతో కలిసి మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. .ఉద్దవ్ వర్గం కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహా వికాస్ ఆఘాడీ కూటమిలో కొనసాగుతున్నాయి. అసలు శివసేన పార్టీ ఎవరిదని శివసేన చీలిక వర్గాలు పిటిషన్లు వేయగా.. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించారు. సీఎం ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన అని ఈసీ అధికారికంగా గుర్తించింది. ధనుస్సు, బాణం గుర్తును కూడా షిండే వర్గానికే కేటాయించింది.ఇక శనివారం వెలువడుతున్న మహారాష్ట్రలో ఫలితాల్లో ఎన్డీయే కూటమి కూటమి సంచలన విజయాన్ని సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 288 స్థానాలకు గానూ 221 చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. బీజేపీ అత్యధికంగా 125, శివసేన 56, ఎన్సీపీ 39 చోట్ల ఆధిక్యాన్ని హవా కొనసాగుతోంది. మరోసారి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఎన్డీయే శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. బీజేపీ కేంద్ర పరిశీలకులు నేటి సాయంత్రం ముంబై వెళ్లనున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలతో భేటీ కానున్నారు. ఇక నవంబర్ 26లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. -
ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని శివసేన(ఉద్ధవ్) అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) ట్యాంపరింగ్ చేసి మహాయుతి గెలిచిందని మండిపడ్డారు. తమకు దక్కాల్సిన సీట్లను దొంగిలించిందని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ కూటమి విజయం వెనుక పెద్ద కుట్ర ఉందని తేల్చిచెప్పారు.#WATCH | As Mahayuti has crossed halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, "They have done some 'gadbad', they have stolen some of our seats...This cannot be the public's decision. even the public does not agree with these results. Once the results are… pic.twitter.com/Qxx6a0mKsW— ANI (@ANI) November 23, 2024 బిలియనీర్ గౌతమ్ అదానీ సాయంతో ఆ కూటమి నెగ్గిందని విమర్శించారు. అదానీ బీజేపీకి ‘లాడ్లీ భాయ్’గా మారిపోయాడని ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు ప్రజల వాస్తవ తీర్పును ప్రతిబింబించడం లేదని చెప్పారు. ప్రజలు ఏం కోరుకున్నారో తమకు తెలుసని, మహాయుతి పాలన పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ ఫలితాలను ప్రజా తీర్పుగా తాము భావించడం లేదన్నారు. ప్రజలు మహాయుతికి ఆఖండమైన మెజార్టీ కట్టబెట్టారంటే తాము విశ్వసించడం లేదని సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. Mumbai | As Mahayuti has crossed the halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, "From what we are seeing, it seems that something is wrong. This was not the decision of the public. Everyone will understand what is wrong here. What did they (Mahayuti) do… pic.twitter.com/COjoVJpfi3— ANI (@ANI) November 23, 2024 -
‘మహా’ పోరు: ఇంతకీ రెండు కూటముల ‘సీఎం’ ఎవరంటే..
యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి నువ్వా-నేనా అన్నట్టుగా ఎన్నికల్లో పోరాడాయి. బుధవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన అత్యధిక ఎగ్జిట్స్ పోల్స్ మహాయుతి కూటమే విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న బీజేపీ, శివసేన (ఉద్దవ్ వర్గం), ఎన్సీపీ(అజిత్ పవార్) నేతృత్వంలోని కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి...మరోవైపు ఎన్నికల్లో విజయంపై అటు ప్రతిపక్ష కూటమి మహ వికాస్ అఘాడీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా లేకపోయినా.. ఫలితాల అనంతరం ఎంవీఏ కూటమే అధికారం చేపడుతుందని భావిస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన నేపథ్యంలో మహారాష్ట్రలోనూ సర్వేల ఫలితాలు తారుమారు అవుతాయని గట్టిగా నమ్ముతోంది. ఇక మరో 24 గంటల్లో మహారాష్ట్ర భవితవ్యం తేలనుంది. నవంబర్ 23న అధికారికంగా ఫలితాలు వెలువడనున్నాయి.అయితే ఫలితాల ముందే అటు మహాయూతి, ఇటు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలోనూ ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు నుంచి ఇరు వర్గాలు తమ సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడంతో సీఎం పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తమ పార్టీ నాయకత్వంలోనే మహారాష్టట్రలో ఎంవీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్కు అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయని ఓటింగ్ ట్రెండ్లు సూచిస్తున్నాయని ఆయన అన్నారు.ఈ వ్యాఖ్యలను మిత్రపక్షమైన శివసేన(ఉద్దవ్) ఖండించింది. ఎన్నికల్లో ఎంవీఏ మెజారిటీ పొందిన తర్వాత కూటమి భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా చర్చించ నిర్ణయం తీసుకుంటామని స్పఫ్టం చేశారు. పటోలే ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ హైకమాండ్, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, దాని అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు కూడా అదే విషయాన్ని ప్రకటించాలని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.అటు మహాయుతి కూటమిలో శివసేన ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముఖాముఖిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నట్లు పేర్కొననారు. పోలింగ్ నాడు ఓటర్లు షిండేకు తమ ప్రాధాన్యతను చూపించారని ఆయనే మరోసారి సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నారు. షిండేనే తదుపరి ముఖ్యమంత్రి అవుతారని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సీఎం అవుతారని పార్టీ నేత ప్రవీణ్ దారేకర్ పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఎవరైనా సీఎం అయితే.. అది దేవేంద్ర ఫడ్నవీసే అని తెలిపారు.ఇక ఎన్సీపీ నాయకుడు అమోల్ మిత్కారీ తన పార్టీ చీ ఫ్ఉ, ప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేరును సీఎం చర్చలోకి తీసుకొచ్చారు. ఫలితాలు ఏమైనప్పటికీ, ఎన్సిపి కింగ్మేకర్ అవుతుందని అన్నారు. మహాయుతి కూటమిలోని అన్ని పార్టీలు కలిసి కూర్చుని సీఎం ఎవరనే నిర్ణయం తీసుకుంటాయని మిస్టర్ ఫడ్నవీస్ తెలిపారు. మొత్తానికి అన్ని పార్టీలు తమ నేతనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ కూటమి అధికారంలోకి వస్తుందది, ఎవరు సీఎం పీఠంపై కూర్చుంటారనేదానిపై రేపటి(శనివారం) ఫలితాల తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
అది ఎవరూ అంగీకరించరు: కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోనే మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నవంబర్ 25న కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యలను శివసేన(ఉద్దవ్) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని అన్నారు.ఈ మేరకు ముంబైలో విలేకరుల సమావేశంలో రౌత్ మాట్లాడుతూ.. సీఎం ఎవరన్నదనే విషయం కూటమి భాగస్వామ్యాలతో సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ‘నేను దీన్ని అంగీకరించను. ఎవరూ కూడా అంగీకరించరు. నానా పటోలేకు కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఉందో లేదో మేము కలిసి కూర్చుని నిర్ణయిస్తాము. పటోలే ముఖ్యమంత్రి అవ్వాలంటే కాంగ్రెస్ హైకమాండ్ చెప్పాలి. రాహుల్ గానీ ప్రియాంక గాంధీ వాద్రాగానీ, సోనియా గాంధీగానీ ప్రకటించాలి’ అని పేర్కొన్నారు.అయితే మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చీఫ్ నానా పటోలే తెలిపారు. ప్రజల ఫీడ్బ్యాక్ ఆధారంగా మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. నవంబర్ 25న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశామని, కానీ తాము ఓడిపోయామని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ ఓటమిని వారు అంచనా వేస్తున్నారు కాబట్టి తామే తప్పకుండా గెలుస్తామని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (షిండే వర్గం) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక ప్రతిపక్ష కూటమి అయిన ఎంవీఏ(కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్పవార్) ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికీ అధికారాన్ని దక్కించుకోలేదని అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగాల్సి ఉంది. -
యుద్ధంలా ‘మహా’ రాజకీయం
నేడు జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ‘మహాయుతి’, ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటముల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఇవి పాత కొత్త పార్టీలకు అస్తిత్వ పోరాటంగా మారాయి. ఎందుకంటే, శివసేన, ఎన్సీపీ రెండింటిలోనూ అతి పెద్ద చీలికలు జరిగాయి. పైగా ఫిరాయింపు వర్గాలే పార్టీల అసలు పేర్లను, చిహ్నాలను ఉంచుకున్నాయి. ఇది ఓటర్లలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. దీనికితోడు, డబ్బు, బెదిరింపులు, రాజకీయ అవకాశవాదం ఈ ఎన్నికల్లో గతంలో కంటే పెద్ద పాత్రను పోషిస్తున్నాయి. 2024లో దేశంలో జరిగిన పంటనష్టంలో 60 శాతం మహారాష్ట్రలోనే సంభవించింది. అయినా స్వల్పకాలిక బుజ్జగింపు చర్యలపై పార్టీలు ఆధారపడటం పెరిగింది. ఇది సంక్షేమ ఎజెండాకు ప్రాధాన్యమివ్వడంలో వరుస ప్రభుత్వాల దీర్ఘకాలిక వైఫల్యాన్ని నొక్కి చెబుతోంది.అనేక రాజకీయ ఒడుదొడుకులు, నిట్టనిలువు చీలికలు, ప్రముఖ నాయకుల అడ్డగోలు దారులు, అధికారం కోసం నిరంతర పోరు వంటి వాటిని చూసిన తర్వాత, మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆరు ప్రముఖ పార్టీలు నేడు (నవంబర్ 20) అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలు అనేక విధాలుగా విశేషమైనవి. ఎందుకంటే ఇవి రాష్ట్ర రాజకీయాలలో ఎన్నికల, రాజకీయ చర్చను రూపొందించే అవ కాశం ఉన్న కొన్ని కీలకమైన తప్పులను బహిర్గతం చేశాయి. ఈ కథనం అటువంటి ఐదు తప్పులను, అవి విసిరే సంక్లిష్ట సవాళ్లను అందిస్తుంది.1. ఉచితాలపై ఆధారపడటం: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాలన్నీ ‘మాఝీ లడ్కీ బహిన్ యోజన’, ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, సీనియర్ సిటిజన్ లకు ఉచిత తీర్థయాత్రలు వంటి వాటిని లక్ష్యంగా చేసుకున్నాయి. ఉచితాలు ఈ ఎన్నికల్లో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇలాంటి ప్రకట నలపై ‘మహాయుతి’, ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటముల మధ్య పోటీ కనిపిస్తోంది. ఈ పథకాలు చాలావరకు రాష్ట్ర ఓటర్లలో దాదాపు సగం మందిగా ఉన్న మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. స్వల్పకాలిక బుజ్జగింపు చర్యలపై ఆధారపడటం అనేది విపరీతంగా పెరుగుతోంది. ఇది రాష్ట్రంలో సంక్షేమ ఎజెండాకు సమర్థంగా ప్రాధాన్యమివ్వడంలో వరుస ప్రభుత్వాల దీర్ఘకాలిక వైఫల్యాన్ని నొక్కి చెబుతుంది. ఎందుకంటే, గతంలో మహిళల భద్రత, శ్రేయస్సుపై ఆదుర్దా, ఆందోళనలు కనబడేవి.గత రెండు దశాబ్దాలుగా, కీలక అభివృద్ధి సూచికలలో మహారాష్ట్ర కిందికి జారిపోయింది. ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం, మహారాష్ట్ర స్థూల దేశీ యోత్పత్తి వృద్ధి గత 14 సంవత్సరాలలో రెండు శాతం పాయింట్లు పడిపోయింది. ‘వార్షిక విద్యా నివేదిక– 2022’ ప్రకారం, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంకగణితం, పఠన నైపు ణ్యాలలో మునుపటి కంటే చాలా పేలవంగా ఉన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నుండి వెలు వడిన ‘భారతదేశ నిరుద్యోగ నివేదిక–2023’ మహా రాష్ట్రలో విద్యావంతులైన నిరుద్యోగిత నిష్పత్తి 2022లో 15 శాతంగా ఉందని పేర్కొంది. దశాబ్దం క్రితం కంటే ఇది 11 శాతం పెరుగుదల. ఈ ప్రాథ మిక ఆందోళనలను పరిష్కరించడానికి బదులుగా, పార్టీలు ఎన్నికల లాభాల కోసం ఉచితాల మీద దృష్టి పెడుతున్నాయి.2. కరిగిపోయే పొత్తులు, మారుతున్న విధేయతలు: 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాషాయ కూటమి (భారతీయ జనతా పార్టీ, శివసేన) విచ్ఛిన్నం కావడం ‘మహా వికాస్ ఆఘాడీ’ ఏర్పాటుకు దారితీసింది. ఇది చాలా భిన్నమైన సిద్ధాంతాలు గల పార్టీల (కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్–ఎన్సీపీ, శివసేన) మధ్య అసహజ కూటమి. వారి ప్రభుత్వం స్వల్పకాలికంగా పనిచేసింది. పైగా మనం శివసేన, ఎన్సీపీ రెండు పార్టీలలో అతిపెద్ద చీలికలను చూశాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో చేతులు కలిపేందుకు రెండు పెద్ద భాగస్వామ్యాలు సిద్ధమైనాయి. భారత రాజకీయాల్లో ఇలాంటి ఫిరాయింపులు అసాధారణం ఏమీకాదు. కానీ ఫిరాయింపు వర్గాలే పార్టీల అసలు పేర్లను, చిహ్నా లను ఉంచుకున్నాయి. ఇది ఓటర్లలో గందర గోళాన్ని సృష్టించింది. ఇది సాధారణంగా ఎన్నికల ఫలితాలను నిర్ణయించే దీర్ఘకాలిక పొత్తులు, సైద్ధాంతిక ప్రాధాన్యతలు, కేడర్ విధేయతలు వంటి సాంప్రదాయ సమీకరణాలను పూర్తిగా బలహీనపరిచింది. ఇది మహారాష్ట్ర రాజకీయ సంస్కృతిని దెబ్బ తీసింది. డబ్బు, బెదిరింపులు, రాజకీయ అవకాశ వాదం గతంలో కంటే పెద్ద పాత్రను పోషిస్తు న్నాయి.3. వ్యవసాయ సంక్షోభాన్ని, వాతావరణ– ప్రేరిత సవాళ్లను పట్టించుకోకపోవడం: 2024లో దేశంలో జరిగిన పంట నష్టంలో 60 శాతం మహా రాష్ట్రలోనే సంభవించిందని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్’ ఇటీవలి నివేదిక వెల్లడించింది. దాదాపు సగం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభాన్ని, వాతావరణ ప్రేరిత సవాళ్లను పరిష్క రించడానికి సమష్టి కృషి జరగలేదు. రుణమాఫీ వంటి తక్షణ చర్యలకు మించి దీన్ని పరిష్కరించ డానికి రాజకీయ పార్టీలకు కచ్చితమైన ప్రణాళిక ఉన్నట్లు కనిపించడం లేదు. మరాఠా రిజర్వేషన్ల డిమాండ్ మూలాలు ప్రధానంగా వ్యవసాయా ధారిత మరాఠా సమాజం ఎదుర్కొంటున్న సామా జిక–ఆర్థిక సవాళ్లలో ఉన్నాయి. భారీగా ఉన్నసంఖ్యను బట్టి, ఎన్నికల వేడిలో వీరిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మూల కార ణాన్ని పరిష్కరించడంలో రాజకీయ పార్టీలు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు.4. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం: మహా రాష్ట్రలోని పలు స్థానిక సంస్థలకు గత రెండు నుంచి ఐదేళ్లుగా ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 29 మున్సిపల్ కార్పొరేషన్లు (రెండు కొత్తవి), 200 కంటే ఎక్కువ మున్సిపల్ కౌన్సిళ్లు, 27 జిల్లా సమి తులు ఉన్నాయి. బొంబాయి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సర్పంచ్ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ఏడాది గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో జాప్యం వల్ల స్థానిక పరి పాలనా విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం అధిక నియంత్రణను సాధించేలా చేసింది. ఇది అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం క్షీణించడం గురించిన ఆందోళనలకు దారితీసింది. స్థానిక సంస్థల పరిధిలోని కొన్ని విధాన నిర్ణయాలు రాజకీయ పరిశీలనల ద్వారా ఎక్కువగా ప్రభావితమవు తాయి. ‘గట్టర్, మీటర్, నీరు’ (మురుగునీటి పారు దల, విద్యుత్, నీరు)కు సంబంధించిన సాధారణ పౌరుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఎందుకంటే వాటిని పరిష్కరించడానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేరు.5. అభివృద్ధి విధానం: ఇటీవలి సంవత్స రాలలో, మెట్రో రైలు, ఎక్స్ప్రెస్ హైవేలు, బుల్లెట్ రైలు వంటి ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మహారాష్ట్ర గణనీయమైన ప్రాధాన్య మిస్తోంది. ఈ విధానం పెద్ద స్థాయి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తుంది. స్థానిక రైల్వేలు, ప్రభుత్వ ఆధీ నంలో నడిచే రోడ్డు రవాణా, అందుబాటులో ఉండే పబ్లిక్ రోడ్లు వంటి విస్తృత జనాభాకు మరింత నేరుగా ప్రయోజనం చేకూర్చే అవసరమైన సేవ లను బలోపేతం చేయాల్సిన ఖర్చుతో ప్రైవేట్, ఉన్నత వర్గాల ఆసక్తులకు ఎక్కువ ప్రాధాన్యత కనబడుతోంది.2024 మహారాష్ట్ర ఎన్నికలు పాత, కొత్త పార్టీలు, నాయకులు, పొత్తులకు అస్తిత్వయుద్ధంగా పరిణమించాయి. కానీ అంతకుమించి, ఇది ఓటర్లకు నిజమైన పరీక్ష అవుతుంది. ఎందుకంటే వారి ఎంపికలే రాబోయే దశాబ్దాల రాష్ట్ర రాజకీ యాల గమనాన్ని నిర్ణయిస్తాయి.– సంజయ్ పాటిల్ ‘ రాజకీయ పరిశోధకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మహిళా నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరిన ఎంపీ
శివసేన (ఏక్నాథ్ షిండే) నేత షాయినా ఎన్సీ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ సావంత్.. తాజాగా క్షమాపణలు తెలిపారు. ఎవరినీ కించపరిచే ఉద్ధేశ్యం తనకు లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని, తన ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. తన 55 ఏళ్ల రాజకీయ జీవితంలో మహిళలను కించపరుస్తూ ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. రాజకీయ వ్యాఖ్యల్లో భాగంగా ఇలా చేశానని, తనకు ఎలాంటి తప్పుడు ఉద్ధేశాలు లేవని అన్నారు. తను ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదని తెలిపారు.కాగా త్వరలో మహారాష్ల్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన షాయినా ఎన్సీ.. సీటు రాకపోవడంతో షిండే వర్గం శివసేనలో చేరారు. దీనిపై శివసేన(ఉద్దవ్ వర్గం) ఎంపీ అరవింద్ సావంత్ స్పందిస్తూ.. దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. . ఆమె ఇంతకాలం బీజేపీలో ఉన్నారని, అక్కడ టికెట్ రాకపోవడంతో మరో పార్టీలో చేరారని తెలిపారు. దిగుమతి చేసుకున్న వస్తువులను అంగీకరించరని, మా వస్తువులు ఒరిజినల్ అంటూ వ్యాఖ్యానించారు. కాగా నవంబర్ 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో షాయినా ముంబాదేవి నుంచి బరిలోకి దిగుతున్నారు.ఈ వ్యాఖ్యలపై షాయినా తీవ్రంగా స్పందించారు. గతంలో ఆయన తనను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారని, ఇప్పుడేమో తనను దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సావంత్తో పాటు ఆయన పార్టీ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని, ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదని అన్నారు. ఆ తర్వాత ఆమె తమ మద్దతుదారులతో కలిసి స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో సావంత్ వ్యాఖ్యలపై నాగ్పడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. శివసేన ఎంపీపై కేసు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో సీట్లు దక్కని నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీలో టికెట్ దక్కని మహిళా నేత.. షిండే వర్గం శివసేనలో చేరడంతో యూబీటీ ఎంపీ సంచలన కామెంట్స్ చేశారు. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రజలు అంగీకరించరు అని కామెంట్స్ చేయడం వివాదం తెచ్చిపెట్టింది.మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నుంచి షాయినా ఎన్సీ టికెట్ ఆశించారు. అయితే, ఆమెకు టికెట్ దక్కకపోవడంతో తాజాగా బీజేపీని వీడి షిండే వర్గం శివసేనలో చేరారు. ఆమె చేరికపై శివసేన(యూబీటీ) నేత, ఎంపీ అరవింద్ సావంత్ స్పందించారు. ఈ సందర్భంగా సావంత్ మాట్లాడుతూ.. షాయినా ఎన్సీ ఇంతకాలం బీజేపీలో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆమెకు టికెట్ రాలేదని ఇప్పుడు మా పార్టీలో చేరారు. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రజలు అంగీకరించరు(దిగుమతి చేసుకున్న మెటీరియల్). మా వస్తువులు ఒరిజినల్ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, మహిళా నేతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఇక, ఎంపీ సావంత్ వ్యాఖ్యలపై మహిళా నేత షాయినా స్పందించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. అరవింద్ సావంత్ వ్యాఖ్యలు బాధాకరం. ఆయన గతంలో నన్ను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారు. ఇప్పుడేమో దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటున్నారు. నేను మెటీరియల్ను కాదు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. ఇది సావంత్తో పాటు ఆయన పార్టీ మైండ్సెట్ను చూపిస్తోంది. ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదు అంటూ మండిపడ్డారు. ఆ తర్వాత ఆమె తమ మద్దతుదారులతో కలిసి పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. సావంత్ వ్యాఖ్యలను బీజేపీ సైతం తీవ్రంగా ఖండించింది. Surprising to see @ShainaNC quitting BJP and filing her nomination from Mumbadevi as a Shiva Sena(Shinde) Candidate for #MaharashtraElection2024 Hope all is well between the current alliance partners of BJP in Maharashtra. pic.twitter.com/JeToDqqOFs— Rajesh Shenoy (@rshenoy87) October 29, 2024 -
అన్ని నామినేషన్లు పూర్తి.. ఇక యుద్ధానికి సిద్ధం: కాంగ్రెస్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియడంతో ఏయే స్థానాల్లో ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నారనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. దీంతో బరిలో నిలిచన అభ్యర్థులు ప్రచార హోరును పెంచుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ తమ అభ్యర్థుల గెలుపుకు సర్వశక్తుల కృషిచేస్తున్నాయి.అయితే నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ..15 స్థానాల్లో అటు మహాయుతి, ఇటు మహా వికాస్ అఘాడీ కూటమిలోనూ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో తొలుత గందరగోళం నెలకొంది. ఇప్పుడు ఆ సందిగ్దత తొలగిపోయింది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు నామినేషన్లు పూర్తి చేసినట్లు మహా వికాస్ అఘాడీ కూటమి వెల్లడించింది. ఇక ఎన్నికల యుద్ధానికి సిద్దమైనట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, సీనియర్ నాయకుడు వర్షా గైక్వాడ్, నసీమ్ ఖాన్లతో కలిసి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి రమేష్ చెన్నితాల బుధవారం మాట్లాడుతూ..మహా వికాస్ అఘాడిలో అన్ని పార్టీలకు సమానమైన గౌరవం ఉందని తెలిపారు. మొత్తం 288 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశామని చెప్పారు. మహాయుతి కూటమితో పోల్చితే తమ గ్రూపులో ఎలాంటి గొడవలు లేవని అన్నారు. . తమ సభ్యుల మధ్య కొంత అపార్థాలు ఉన్నప్పటికీ మిత్రపక్షాల మధ్య ఎలాంటి చీలికలు లేవన్నారు. ఎంవీయేలో అన్ని పార్టీలకు సమానమైన గౌరవాన్ని అందించామని తెలిపారు‘మహాయుతి సమయం ముగిసింది. , ఆ కూటమిలో బీజేపీ తమ మిత్రపక్షాలైన ఎన్సీపీ, శివసేన(షిండే) స్థానాలను దోచుకుంది. బీజేపీ తమ కూటమి భాగస్వాములను అణగదొక్కాలని చూస్తోంది. కానే మేము ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులకు ఏ, బీ ఫారమ్లను ఇచ్చాం. ఎన్నికల్లో పోటీకి మేము సిద్దం. స్వతంత్రంగా నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ నాయకులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలి. ’ అని చెన్నితాల కోరారు. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఫలితాలను వెల్లడిస్తారు. -
టికెట్ నిరాకరణ.. సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం
మహారాష్ట్రలో ఎన్నికల తేదీ దగ్గరపడుతోన్నకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ఓవైపు నామినేషన్ వేసిన వారు ప్రచారాలతో విజయం కోసం హోరెత్తిస్తుండటంతో.. మరోవైపు టికెట్ దక్కని వారు నిరశలో కూరుకుపోయారు.ఈ క్రమంలో ఓ అనూహ్య విషయం వెలుగులోకి వచ్చింది. టికెట్ దక్కలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనను కాదని మరొకరికి టికెట్ ఇవ్వడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురై కనిపించకుండాపోయారు. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగకు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. పాల్ఘర్ స్థానం నుంచి ఆయనకు బదులు మాజీ ఎంపీ రాజేంద్ర గోవిట్ను బరిలోకి దింపింది. దాంతో శ్రీనివాస్ తీవ్ర వేదనకు గురైన శ్రీనివాస్ సోమవారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు.కాగా 2022లో ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని వీడి చీలికవర్గమైన షిండేతో వెళ్లిన నేతల్లో శ్రీనివాస్ వంగా ఒకరు. ఎమ్మెల్యే అదృశ్యంతో సీఎం షిండే వంగా భార్యతో ఫోన్ మాట్లాడారు. అతను కనిపించకుండా పోయే ముందు.. వంగా మీడియాతో మాట్లాడుతూ.. షిండే కోసం దేవుడిలాంటి వ్యక్తిని (ఉద్ధవ్ ఠాక్రే) విడిచిపెట్టానని, ప్రస్తుతం తనకు తగిన శాస్తి జరిగిందని చెప్పారు.షిండేకు విధేయుడిగా ఉన్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నట్లు తెలిపారు.ఇక ఆ తర్వాత నుంచి శ్రీనివాస్ జాడ తెలియరావడం లేదు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తనకు సీటు ప్రకటించకపోయే సరికి తీవ్ర నిరాశకు గురైనట్లు శ్రీనివాస్ భార్య తెలిపారు. సోమవారం బ్యాగ్ సర్దుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే.. మళ్లీ అందుబాటులోకి రాలేదని చెప్పారు. అయితే అదృశ్యమయ్యే ముందు తాను షిండే వర్గంలో చేరినందుకు పశ్చాత్తాపడుతున్నానని, ఉద్దవ్ ఠాక్రేను కలిసి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నట్లు తనతో చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం పోలీసులు ఆయనకోసం గాలిస్తున్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
మహారాష్ట్ర చూపంతా ఈ నియోజకవర్గంపైనే...
థాణేలోని కోప్రి –పాచ్పాఖడీ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందేకు వ్యతిరేకంగా శివసేన (యూబీటీ) కేదార్ దిఘేను బరిలోకి దింపింది. దీంతో ఈ నియోజకవర్గంలో ఏక్నాథ్ శిందేకు, కేదార్ దిఘేల మధ్య రసవత్తర పోటీ జరగనుంది. వాస్తవానికి కేదార్ దిఘే శిందే గురువు దివంగత శివసేన నేత ఆనంద్ దిఘే సోదరుని కుమారుడు. దీంతో ఇక్కడ వీరిద్దరి మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికపై థాణేతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే అనేకమంది అభ్యర్థులను ప్రధాన పార్టీలు ప్రకటించగా మిగిలిన అభ్యర్థులను కూడా ఒక్కోరిని ప్రకటిస్తూ వస్తున్నారు. నామినేషన్లు దాఖలు గడువు ఈనెల 29తో ముగియనుండగా నవంబర్ 4వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో ఎన్నికల అసలు చిత్రం నవంబర్ 4న స్పష్టం కానుంది.శివసేన కంచుకోటగా థాణేముఖ్యంగా థాణేలో గత 30 ఏళ్లుగా శివసేనకు కంచుకోటగా మారింది. అయితే రెండున్నరేళ్ల కిందట ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో శివసేన పార్టీ రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అయితే థాణేలో మంచి పట్టున్న ఏక్నాథ్ శిందేకు అక్కడి కార్పొరేటర్లలో అత్యధికమంది మద్దతు పలికారు. అయితే ఉద్దవ్ ఠాక్రేకు మాత్రం వేళ్లమీదలెక్కించేంతమంది కార్పొరేటర్లు మాత్రమే మద్దతు పలికారు. దీంతో వీరిద్దరిలో ఎవరి ప్రభావం ఉండనుంది..? ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.ఏక్నాథ్ శిందేకు థాణేపై పట్టు!ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందేకు కోప్రీ – పాచ్పాఖడీ అసెంబ్లీయే కాకుండా థాణేలో మంచి పట్టు ఉంది. దీంతో 2004లో ఏక్నాథ్ శిందే మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కోప్రీ – పాచ్పాఖడీ అసెంబ్లీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ శిందేపై 32,677 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ మరింత పెరిగింది. ముఖ్యంగా 1,00,316 ఓట్లు పోలయ్యాయి. అదే ప్రత్యర్థి సందీప్ లేలేకు 48,447 ఓట్లు పోలయ్యాయి. ఇలా ఏక్నాథ్ శిందే 51,869 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.చదవండి: తెలుగువారిపై మహరాష్ట్ర రాజకీయ పార్టీల చిన్నచూపు ఎందుకు? ఇక గత ఎన్నికల్లో 2019లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ ఘాడిగావ్కర్పై 90 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇలా ప్రతీసారి ఆయన మెజార్టీ పెరుగుతూ వస్తోంది. అయితే శివసేనలో తిరుగుబాటు చేసిన అనంతరం శివసేన పార్టీతోపాటు పార్టీ చిహ్నం ఏక్నాథ్ శిందేకే దక్కింది. దీంతో ఈసారి మొట్టమొదటిసారిగా శివసేన (శిందే) వర్సెస్ శివసేన (యూబీటీ)ల మధ్య పోటీ జరుగుతోంది.దిఘే ప్రభావం చూపేనా...?రెండున్నరేళ్ల కిందట శివసేనలో తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ శిందే బీజేపీతో చేతులు కలిపారు. అయితే థాణే ఓటర్లు పెద్ద సంఖ్యలో దివంగత శివసేన అధినేత బాల్ఠాక్రేకు మద్దతు పలికేవారు. దీంతో ఈ ఓటర్లు బాల్ ఠాక్రే కుమారుడు ఉద్దవ్ ఠాక్రే శివసేన (యూబీటీ)వైపు మొగ్గు చూపుతారా? శిందేకు పట్టం కడతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇటీవలే జరిగిన లోకసభ ఎన్నికల్లో మాత్రం శివసేన (శిందే) అభ్యర్థి నరేష్ మస్కేకు 1.11 లక్షల ఓట్లు, శివసేన (యూబీటీ) అభ్యర్థి రాజన్విచారేకు 66,260 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఏక్నాథ్ శిందే ప్రభావమే అధికంగా ఉందని ఈ ఫలితాల ద్వారా కన్పిస్తోంది. దివంగత శివసేన నేత ఆనంద్ దిఘేను ఏక్నాథ్ శిందే గురువుగా కొలుస్తారు. దీంతో ఆనంద్ దిఘే సోదరుని కుమారుడైన కేదార్ దిఘేకు థాణే ఓటర్లు అనుకూలంగా మారే అవకాశమూ ఇక్కడ లేకపోలేదు. -
సీట్ల పంపకాల్లో ‘మహా’ ప్రతిష్టంభన!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహావికాస్ అఘాడీలో టికెట్ల పంపిణీపై విభేదాలు మొదలయ్యాయి. 288 స్థానాల్లో 260 స్థానాలపై మధ్య ఏకాభిప్రాయం కుదరగా, 28 సీట్లపై పీటముడి పడినట్లు సమాచారం. అఘాడీ భాగస్వాములు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎప్పి) శుక్రవారం 9 గంటల పాటు జరిగిన మారథాన్ సమావేశం జరిపాయి. . విదర్భలో ఐదు సీట్లు కావాలని కాంగ్రెస్ను ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.ఆ సీట్లనే కోరుతున్న శివసేనవిదర్భ ప్రాంతంలో 62 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఉమ్మడి శివసేన, బీజేపీ కూటమి 27 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 15, శివసేన 12 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ ఒంటరిగా 29, ఎన్సీపీ ఐదు సీట్లు గెలిచాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత కూడా విదర్భ ఎమ్మెల్యేలు శరద్ పవార్ వెంటే ఉన్నారు. శివసేనలో తిరుగుబాటు తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు సీఎం ఏకనాథ్ షిండే వైపు, 8 మంది ఉద్ధవ్ వైపు నిలిచారు. ఇప్పుడు పాత ఫలితాలపైనే సమస్య నెలకొంది. సీట్ల పంపిణీ ఫార్ములా ప్రకారం 2019లో గెలిచిన 12 సీట్లు తమకే దక్కాలని ఉద్ధవ్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదని సమాచారం. ముంబైలోని 20–25 స్థానాల్లో స్థానాల పంపకాలు కూడా సమస్యగా మారింది. ముంబై శివసేన కంచుకోట గనుక అక్కడ ఎక్కువ సీట్లు రావాలని ఉద్ధవ్ డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ముంబైలోని 36 అసెంబ్లీ స్థానాలకు గాను 31 స్థానాలను బీజేపీ–సేన కూటమి కైవసం చేసుకుంది. శివసేన 22, బీజేపీ 9 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంది. -
మహాయుతిలో 225–230 సీట్లపై ఏకాభిప్రాయం: ప్రఫుల్
ముంబై: అధికార మహాయుతి కూటమిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 225–230 సీట్లపై ఏకాభిప్రాయం వచ్చిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ సోమవారం వెల్లడించారు. ఈ స్థానాల్లో ఎవరెక్కడ పోటీచేయాలనే దానిపై అంగీకారానికి వచ్చామని తెలిపారు. మరో రెండు లేదా నాలుగు రోజుల్లో మిగతా సీట్ల పంపకంపై నిర్ణయానికి వచ్చాక వివరాలను వెల్లడిస్తామన్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్పవార్), బీజేపీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ఈ ఏడాది నవంబరు 26తో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఎన్సీపీతో కలిపి ఎన్నికలకు వెళితే నష్టపోతామని బీజేపీ, శివసేన నాయకులు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. -
పరువు నష్టం కేసులో ఎంపీ సంజయ్రౌత్కు 15 రోజులు జైలు
ముంబై: శివసేన(ఉద్దవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్కు న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో సంజయ్రౌత్కు ముంబై కోర్టు 15 రోజులు జైలు శిక్ష విధించింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయనకు 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద రౌత్ను దోషిగా నిర్ధారిస్తూ.. ఆయనకు రూ.25 వేలు జరిమానా కూడా విధిస్తున్నట్లు వెల్లడించింది.మేధ సోమయ్య ముంబైలోని రుయా కళాశాలలో ఆర్గానిక్ కెమెస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె యువ ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థ నడుపుతున్నారు. అయితే తన ఎన్జీవతో కలిసి ఆమె రూ.100 కోట్ల మరుగుదొడ్ల కుంభకోణానికి పాల్పడినట్లు రౌత్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలు మీడియాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. చదవండి: ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?.. ఈడీకి సుప్రీం కోర్టు మందలింపువీటిని ఖండించిన కిరీట్ సోమయ్య సతీమణి మేధ.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టును ఆశ్రయించారు. 2022 నుంచి రౌత్ తనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని, అవి పలు పత్రికలు, ఎలక్ట్రానిక్తోపాటు సోషల్ మీడియాలోనూ ప్రచురితమయ్యాయని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనతోపాటు తన భర్తపై సంజయ్ రౌత్ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారని చెబుతూ.. పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు సంజయ్ రౌత్ న్యాయవాది, ఆయన సోదరుడు సునీల్ రౌత్ మాట్లడుతూ.. బెయిల్ పిటిషన్ వేస్తామని తెలిపారు. అలాగే ఈ ఉత్తర్వులపై ముంబై సెషన్స్ కోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. -
Maharashtra Polls: నాకూ సీఎం కావాలని ఉంది.. అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి గెలిస్తే.. తాను సీఎం కావాలనే ఆశతో ఉన్నట్లు అజిత్ పవార్ పేర్కొన్నారు.పుణెలోని దగ్దుషేత్ హల్దవాయ్ గణపతి ఆలయంలో మంగళవారం అజిత్ పవార్ పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ‘ప్రతిఒక్కరు తమ నాయకుడిని సీఎంగా చూడాలని కోరుకుంటారు. నేను కూడా అదే అనుకుంటున్నారు. కానీ ఎవరైనా సీఎం కావాలనుకుంటే.. వారు మెజార్టీ సంఖ్యకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరవు.చదవండి: ‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయంక, కోరికలు ఉంటాయి. కానీ అందరూ వారు కోరుకున్నది పొందలేరు. అదంతా ఓటర్ల చేతిలో ఉంటుంది. 288 స్థానాలకుగానూ 145 సీట్లు దక్కించుకోవాలి’ అని ఈ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే మహాయుతి కూటమి(బీజేపీ, శివసేన, ఎన్సీపీ) పోటీ చేస్తుందని పేర్కొన్నారు.‘మా కూటమిని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు మేమంతా ప్రయత్నిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా కలిసి చర్చించుకొని తదుపరి సీఎంను ఎంచుకుంటాం’ అని తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ శిండేను ముఖ్యమంత్రి చేయాలంటూ శివసేన నేతలు డిమాండ్ చేస్తోన్న తరుణంలో పవార్ స్పందించడం గమనార్హం. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. -
రాహుల్ గాంధీపై శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నాలుక కోసిన వారికి రూ, 11 లక్షలు బహుమతిగా ఇస్తానని శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ప్రకటించారు. అయితే రిజర్వేషన్లపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ ప్రకటన చేశారు.“ఇటీవల అమెరికా పర్యటనలో భారత్లో రిజర్వేషన్లను అంతం చేయడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రకటించడం.. ప్రజలకు చెప్పిన అతిపెద్ద అబద్ధం. ఓవైపు మహారాష్ట్రలో రిజర్వేషన్ల డిమాండ్లు పెరుగుతున్నాయి. కానీ అక్కడ దేశంలో రిజర్వేషన్లను తొలగిస్తామని ప్రకటన చేశారు. దేశం నుంచి రిజర్వేషన్లను దూరం చేస్తామంటూ రాహుల్ మాటాలతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది. రాహుల్ నాలుకను ఎవరు నరికినా, వారికి 11 లక్షల రూపాయల బహుమతి ఇస్తాను’ అని గౌక్వాడ్ ప్రకటించారు.అయితే మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ, శివసేన భాగస్వామ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే గైక్వాడ్ వ్యాఖ్యలపై ఇటు బీజేపీ కానీ, అటుశివసనే కానీ స్పందించలేదు. కాగా గైక్వాడ్ విధర్బలోని బుల్దానా అసెంబ్లీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఎమ్మెల్యేకు వివాదాలు కొత్తేమీ కాదు. గత నెలలో ఓ పోలీసు అధికారి గౌక్వాడ్ కారును శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి వైరల్గా మారడంతో వివాదంగా మారింది. అయితే దీనిని ఎమ్మెల్యే సమర్ధించుకున్నారు. కారులో అనుకోకుండా కారులో వాంతులు చేసుకోవడంతో ఆ పోలీసు స్వచ్ఛందంగా దాన్ని శుభ్రం చేశాడని చెప్పుకొచ్చారు. అంతేగాక 1987లో ఓ పులిని వేటాడి దాని దంతాన్ని నెక్లెస్గా ధరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్ర అటవీశాఖ ఫోరెన్సిక్ ఆ దంతాన్ని పరీక్షించి.. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసింది. -
Maharashtra: సీట్ల పంపకాలు పూర్తి.. 140 స్థానాల్లో బీజేపీ పోటీ?
ముంబై: లోక్సభ ఎన్నికల అనంతరం దేశంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. హర్యానా, జమ్మూకశ్మీర్, మహారాష్ట్రకు వరుసగా అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాజకీయ హడావిడీ నెలకొంది. గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు ఎన్నికల పోరుకు సమాయత్తం అవుతున్నాయిఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాకముందే.. అధికార, విపక్షాలు తమ ఫోకస్ పెంచాయి. తాజాగా మహయుతి ప్రభుత్వంలోని పార్టీల మధ్య (బీజేపీ, శివసనే,ఎన్సీపీ) సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. మూడు పార్టీలు సైతం తమ పట్టు నిలుపుకునేందుకు ఎక్కువ స్థానాల్లో పోటీ కోరినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు అధికార కూటమిలో సీట్ల పంపకాల చర్చ అప్పుడే కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 140 నుంచి 150 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 55 స్థానాల్లో పోటీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా చిన్న మిత్రపక్షాలకు మూడు సీట్లు కేటాయించనున్నట్లు వినికిడి.అయితే ప్రభుత్వానికి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కూటమి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో 48 స్థానాల్లో 30 స్థానాలను గెలుచుకొని సత్తా చాటాయి ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్చంద్ర), శివసేన(ఉద్దవ్). లోక్సభ ఎన్నికల జోష్నే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మహా వికాస్ అఘాడి కూటమి తమ సీట్ల భాగస్వామ్యాన్ని ఇంకా ప్రకటించలేదు. మరోవైపు కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితమైన ఎన్డీయే కూటమి.. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చి అధికారాన్ని కాపాడుకునేందుకు యత్నిస్తోంది. కాగా గత 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అవిభక్త శివసేన కూటమి అఖండ విజయం సాధించింది.అయితే సీఎం పదవిపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. కానీ కొంతకాలానికే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. 2022లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే బయటకు వచ్చి బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కొంతకాలానికే ఎన్సీపీని చీల్చుతూ అజిత్ పవార్ బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు. -
మోదీ క్షమాపణల్లోనూ అహంకారమే
ముంబై: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహా వికాస్ అఘాడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని పేర్కొంది. ఆదివారం మహావికాస్ అఘాడీలోని ఎన్సీపీ(ఎస్పీ)చీఫ్ శరద్పవార్, శివసేన(యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేల సారథ్యంలో ముంబైలోని హుతాత్మ చౌక్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా వరకు భారీ ర్యాలీ జరిగింది. ఆగస్ట్ 26న విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో క్షమాపణ చెప్పడం తెలిసిందే. దీనిపై ఠాక్రే స్పందిస్తూ..‘క్షమాపణ చెప్పడంలో ప్రధాని మోదీ అహంకారాన్ని గమనించారా? ఆయన అహంకారానికి ఇదో ఉదాహరణ. అదే సమయంలో డిప్యూటీ సీఎం ఒకరు నవ్వుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అవినీతి వల్లే విగ్రహం కూలింది. ఇది మహారాష్ట్ర ఆత్మకే అవమానం. క్షమించరాని నేరం. దేశం నుంచి బీజేపీ వెళ్లిపోవాలి’అని ఆయన డిమాండ్ చేశారు. సింధుదుర్గ్లో శివాజీ మహారాజ్ విగ్రహం బీజేపీ అవినీతి కారణంగానే కూలిందని, ఛత్రపతి అభిమానులకు ఇది అవమానకరం’అని శరద్ పవార్ పేర్కొన్నారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే టార్గెట్.. సీట్ల పంపకాలపై చర్చలు షురూ
ముంబై: మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమికి ఆశించిన స్థానాలు రాకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టింది. మరోవైపు ఈ సారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలనే ధీమాతో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి పావులు కదుపుతోంది.అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్పవార్) పార్టీలు ఆగస్టు 7న సమావేశం కానున్నాయి. ముంబైలో జరిగే ఈ కీలక భేటీలో మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరగనుంది. వీటితోపాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ర్యాఆలీ ప్రణాళికతో సహా ఇతర అంశాలను సమావేశంలో చర్చిస్తామని కాంగ్రెస్ ఎల్పీ నేత బాలాసాహెబ్ థోరట్ పేర్కొన్నారు. గెలిచే అభ్యర్ధులను బరిలోకి దింపడం వల్ల సీట్ల మార్పిడి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పారు.ఇక 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్..110 స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కేవలం 10 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్సీపీ దాదాపు 80 స్థానాల్లో పోటీపై కన్నేసినట్లు వినికిడి.. ఇక ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 100 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.కాగా ఈ ఏడాది అక్టోబర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 లోక్సభ స్థానాలకు గాను 30 స్థానాలను ప్రతిపక్ష ఎంవీఏ గెలుచుకుంది. కాంగ్రెస్ రెబల్గా ఉన్న ఏకైక స్వతంత్ర ఎంపీ విశాల్ పాటిల్ ఆ పార్టీ అసోసియేట్ మెంబర్గా మారడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 31కి చేరుకుంది. బీజేపీ, ఎన్సీపీ, శివసేన కూటమి 17 స్థానాలకే పరిమితమైంది. -
మహారాష్ట్రలో రసవత్తర రాజకీయం.. ఆ ఒక్క ఎమ్మెల్సీ ఎవరు?
ముంబై: మహారాష్ట్రలో పలు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీల పెద్దలు అలర్ట్ అయ్యారు. దీంతో, ‘మహా’ రాజకీయం రీసార్ట్లకు చేరింది.కాగా, మహారాష్ట్రలో రేపు(శుక్రవారం) 11 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక, 11 స్థానాలకు గాను 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక, రాష్ట్రంలో ఇద్దరు అభ్యర్థులు గెలుపునకు అవసరమయ్యే మెజార్టీ ఎంవీఏకు ఉన్నప్పటికీ మూడో అభ్యర్థిని నిలబెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే.. మిలింద్ నార్వేకర్తో నామినేషన్ వేయించారు. దీంతో మూడో స్థానంలోనూ గెలుపొందేందుకు అవసరమైన ఓట్ల కోసం ఎంవీఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక ప్రాంతాలకు తరలించాయి. క్రాస్ ఓటింగ్ భయం నేపథ్యంలో శివసేన (యూబీటీ), ఏక్నాథ్ శిందే వర్గాలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులు, లగ్జరీ హోటళ్లకు తరలించినట్లు తెలిసింది. మరోవైపు.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ నేతల కోసం ఎలాంటి హోటళ్లను బుక్ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. -
ముంబై బీఎండబ్ల్యూ ఘటన... నిందితుడి తండ్రిపై శివసేన చర్యలు!
ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్షా తండ్రి, శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం) నేత రాజేష్ షాపై పార్టీ చర్యలు చేపట్టింది. పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ బుధవారం ప్రకటించింది. కాగా పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన నేత రాజేష్ షా ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్పై విడుదల అయ్యారు.ఆయన కుమారుడు మిహిర్ ఆదివారం ఉదయం మద్యం మత్తులో కారు నడుపుతూ వర్లీ ప్రాంతంలో బైక్ను ఢీకొట్టడంతో కావేరీ నఖ్వా అనే మహిళ చనిపోగా ఆమె భర్త గాయపడటం తెలిసిందే. ప్రమాదం జరిగినప్పటి నుంచి మూడు రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మిహిర్ను ముంబైలోని విరార్ వద్ద మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతని తల్లి, ఇద్దరు చెల్లెళ్లను మరో 10 మందితో కలిసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే పోలీసుల విచారణలో.. ప్రమాద సమయంలో తాను బీఎండబ్లయూ కారు నడుపుతున్నట్లు మిహిర్ అంగీకరించాడు. కానీ తాను తాగినట్లు వచ్చిన ఆరోపణలనుఅతడు కొట్టేసినట్లు తెలుస్తోంది.పోలీసుల విచారణలో ప్రమాదం ముందు మిహిర్ తన స్నేహితులతో కలిసి వైస్ గ్లోబల్ తపాస్ బార్లో మద్యం తాగి బిల్ ఏకంగా 18 వేలు చేసినట్లు తేలింది.మిహిర్ తొలుత మహిళను ఢీకొన్న తర్వాత ఆమెను 1.5 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లాడు .తర్వాత వాహనం టైరులో చిక్కుకున్న ఆమెను రోడ్డుపై పడేశాడు.కారును రివర్స్ చేసేటప్పుడు ఆమెపై నుంచి మరోసారి కారును ఎక్కించాడు. ఇక మిహిర్కు మద్యం సరఫరా చేసన బార్ యజమానిని అరెస్ట్ చేయడంతోపాటు బార్ను మూసేశారు. మిహిర్ తండ్రిని, స్నేహితులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. -
ముంబై బీఎండబ్ల్యూ కేసు.. కీలక నిందితుడి అరెస్ట్
ముంబై: ముంబైలోని వర్లీలో జరిగిన బీఎండబ్ల్యూ కారు రోడ్డు ప్రమాదం కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. మద్యం మత్తులో లగ్జరీ కారు నడుపుతూ దంపతులను ఢీకొట్టి మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైన నిందితుడు మిహిర్ షాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అతడు పరారీలో ఉండగా.. 72 గంటల తర్వాత ముంబయికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరార్లోని అపార్ట్మెంట్లో మిహిర్ షాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతని తల్లి, సోదరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని వర్లీ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే గత మూడు రోజులుగా కొడుకును దాచి పెట్టడంతో తండ్రి, శివసేన(ఏక్నాథ్ షిండే) నేత రాజేష్ షాా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక షాు అరెస్టుకు ముందు అతడి తప్పతాగి రూ. 18 వేల బిల్ చేసిన ద వైస్ గ్లోబల్ తపస్ బార్ను పోలీసులు సీజ్ చేశారు. కాగా ఈ హిట్ అండ్ రన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు కావేరీ నక్వాను నిందితుడు మిహిర్ షా కారు తన బానెట్పై సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన్నట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.కారు బలంగా ఢీకొట్టడంతో కావేరీ నక్వా ఎగిరి కారు బానెట్పై పడగా.. అలాగే కిలోమీటర్ దూరం పైగా ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారుమీదున్న బాడీని కిందకు దించాడు. అనంతరం అదే కారు రివర్స్ చేసి ఆమె శరీరం మీద నుంచి పోనిచ్చినట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయని స్థానిక పోలీసులు కోర్టులో వెల్లడించారు అసలేం జరిగిందంటే.. ముంబైలోని వర్లీలో ఆదివారం ఉదయం వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడం వల్ల కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త ప్రదీప్కు స్వల్పగాయాలయ్యాయి. చేపలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఈ దంపతులు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్ షా పేరుతో రిజిస్టర్ అయింది. ప్రమాదం అనంతరం నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు.కారునిందితుడు మిహిర్ శనివారం అర్ధరాత్రి జూహూలోని ఓ బార్లో మద్యం తాగి.. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కారు తానే నడుపుతానని పట్టుబట్టి డ్రైవరు సీటులోకి మారి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే స్పందించారు. చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. ఎవరినీ విడిచిపెట్టబోమని చెప్పారు.కాగా ఈ ప్రమాదం పుణెలో జరిగి పోర్చే కారు ప్రమాద ఘటనను గుర్తు చేసింది. 17 ఏళ్ల మైనర్ బాలుడు మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక ట్విస్టుల అనంతరం నిందితుడు తల్లి, తండ్రి, తాత అరెస్ట్ అయ్యారు. చివరికి నిందితుడైన మైనర్ను అతని అత్త సంరక్షణలో ఉండేలా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
ముంబై హిట్ అండ్ రన్ కేసు.. అతడికి బెయిల్ మంజూరు
ముంబై: మహారాష్ట్రలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు మిషిర్ షా తండ్రి, శివసేన నేత రాజేష్ షాకు బెయిల్ లభించింది. సోమవారం సాయంత్రం రాజేష్ షాకు కోర్టు బెయిల్ రూ.15వేల పూచీకత్తుతో ప్రొవిజినల్ బెయిల్ను మంజూరు చేసింది.ఇక, ఈరోజు ఉదయం హిట్ రన్ కేసులో భాగంగా పోలీసులు రాజేష్, కారు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సిటీ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రాజేష్కు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇక, తాజాగా కోర్టు రాజేష్ షాకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా.. కారుతో ఢీకొట్టి మహిళ మరణానికి కారణమైన మిషిర్ షాకు లుక్ అవుట్ నోటీస్ను పోలీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి.VIP hit & run coward Mihir Shah's father Rajesh Shah (Shinde Faction Sena leader) gets bail a day after he was arrested. Son still absconding.#EknathShinde pic.twitter.com/iuzOMUlwqb— Kedar (@shintre_kedar) July 8, 2024మరోవైపు.. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అంతా సమానమేనని షిండే తెలిపారు. ఈ ఘటనలో ఉన్నది ఎంత పెద్ద ధనవంతుడైనా, రాజకీయ నాయకుడైన ఎవరినీ వదిలి పెట్టేది లేదన్నారు. ఇక, షిండే ఇలా వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే రాజేష్ షాకు బెయిల్ రావడం మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: ముంబై హిట్ అండ్ రన్ ఘటనపై సీఎం షిండే సంచలన కామెంట్స్.. -
Shiv Sena Leader: బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో ట్విస్టు
ముంబై: మహారాష్ట్రలో జరిగిన బీఎండబ్ల్యూ కారు ప్రమాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రమాదానికి కారణమైన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన నేత(ఏక్నాథ్ షిండే) రాజేష్ షా కుమారుడు మిషిర్ షా కోసం పోలీసులు గాలిస్తున్నారు. లింది. ప్రమాద సమయంలో 24 ఈ యువకుడే ఈ కారును నడుపుతున్నట్లు తేలింది.దీంతో ఒక్కసారిగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. మిహిర్ షా నిర్లక్ష్యంగా కారు నడపడంతో ప్రమాదం జరిగినట్లు విచారణలో తేలింది . ఘటన జరిగిన సమయంలో మిహిర్ షా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా.. అతని డ్రైవర్ రాజ్ రిషి బిజావత్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.నిందితుడు మిషిర్ షా కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో ఓ సీసీటీవీ ఫుటేజీ వైరల్గా మారింది. మిహిర్ షా తన నలుగురు స్నేహితులతో కలిసి మెర్సిడెస్ కారులో పబ్ నుంచి బయలు దేరినట్లు ఈ వీడియోలో కినిపిస్తుంది. అయితే తరువాత అతడు కారు మారాడు. మిహిర్ బీఎండబ్ల్యూ కారు నడపడగా.. అతడి డ్రైవర్ ప్యాసింజర్ సీటులో కూర్చొని ఉన్నాడు.అయితే మిహిర్ తప్పించేందుకు అతడి గర్ల్ఫ్రెండ్ సాయం చేసి ఉండవచ్చిన పోలీసులు అనుమానిస్తున్నారు, ఈ నేపథ్యంలో ఆమెను కూడా వారు విచారిస్తున్నారు. మిహిర్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.మిహిర్ సంఘటనా స్థలం నుంచి కాలా నగర్ మీదుగా వెళ్లి బాంద్రా ఈస్ట్ వద్ద కారును విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తరువాత ఓ ఓటోలో అక్కడ ఇనుంచి పరారైనట్లు పేర్కొన్నారు. మిహిర్ కోసం నాలుగు పోలీసు బృందాలు వెతుకుతున్నట్లు తెలిపారు. కారు ఎక్కడ మారిందనే విషయంపై కూడా విచారణ జరుపుతున్నారు.అసలేం జరిగిందంటే.. ముంబైలోని వర్లీలో ఆదివారం ఉదయం వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడం వల్ల కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త ప్రదీప్కు స్వల్పగాయాలయ్యాయి. చేపలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఈ దంపతులు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్ షా పేరుతో రిజిస్టర్ అయింది. ప్రమాదం అనంతరం నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు.నిందితుడు మిహిర్ శనివారం అర్ధరాత్రి జూహూలోని ఓ బార్లో మద్యం తాగి.. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కారు తానే నడుపుతానని పట్టుబట్టి డ్రైవరు సీటులోకి మారి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే స్పందించారు. చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. ఎవరినీ విడిచిపెట్టబోమని చెప్పారు.కాగా ఈ ప్రమాదం పుణెలో జరిగి పోర్చే కారు ప్రమాద ఘటనను గుర్తు చేసింది. 17 ఏళ్ల మైనర్ బాలుడు మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక ట్విస్టుల అనంతరం నిందితుడు తల్లి, తండ్రి, తాత అరెస్ట్ అయ్యారు. చివరికి నిందితుడైన మైనర్ను అతని అత్త సంరక్షణలో ఉండేలా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
Uddhav Thackeray: సార్వత్రిక పోరులో గెలుపు ఆరంభం మాత్రమే
ముంబై: ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తమ కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) గెలుపు ఆరంభం మాత్రమేనని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎంవీఏ విజయయాత్ర రాష్ట్రంలో మరికొద్ది నెల ల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసా గుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 సీట్లకు గాను ఎంవీఏ పార్టీలు 30 సీట్లను గెల్చుకో వడం తెల్సిందే. ఉద్ధవ్ శనివారం ఎన్సీపీ (ఎస్పీ)చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ అజేయమనే అపోహ ఎంత బూటకమైనదో లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు రుజువు చేశారని ఉద్ధవ్ అన్నారు. ఎన్డీఏ సర్కారుగా మారిన మోదీ సర్కారు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. -
మోదీ కేబినెట్.. సహాయ మంత్రి పదవిపై శివసేన అసంతృప్తి
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్ కూడా ఏర్పాటైంది. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులు,36 మంది సహాయ మంత్రులు, 5 మంది స్వంతంత్ర్య మంత్రులు దక్కాయి.ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, జేడీఎస్, శివసేన, ఎన్సీపీ, ఎల్జీపీ, ఆరెల్డీ పార్టీల నుంచి నేతలకు పలు మంత్రి పదవులు వరించాయి.అయితే మోదీ కేబినెట్ కూర్పుపై మిత్రపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంలో స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రిత్వ పదవి దక్కడంపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సోమవారం అసంతృప్తిని వ్యక్తం చేసింది. శివసేన పార్టీ కేబినెట్ మంత్రి ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్డీయే ఇతర భాగస్వామ్య పక్షాలకు దక్కిన పదవులను ప్రస్తావిస్తూ శివసేన చీప్ విప్ శ్రీరంగ్ బర్నే మాట్లాడుతూ.. ఐదుగురు ఎంపీలు కలిగిన చిరాగ్ పాశ్వాన్, ఒక ఎంపీ కలిగిన జితన్ రాం మాంఝీ, ఇద్దరు ఎంపీలు కలిగిన జేడీఎస్లకు ఒక్కో క్యాబినెట్ మంత్రి పదవిని కేటాయించారని.. తమను మాత్రం ఒకే ఒక్క సహాయ మంత్రి పదవికి పరిమితం చేశారని వాపోయారు.ఏడు ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్క పదవి మాత్రమే ఎందుకు లభించిందని ప్రశ్నించారు. తమకు కేబినెట్ మంత్రిత్వ శాఖ వచ్చి ఉండాల్సిందని తెలిపారు. కాగా శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్కు స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర పదవి దక్కింది. మరోవైపు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సైతం తమకు సహాయ మంత్రి పదవితో సరిపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమకు కూడా కేబినెట్ మంత్రి కావాలని డిమాండ్ చేసింది. ఆదివారం ప్రమాణస్వీకారానికి ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర హోదా మంత్రి ప్రతిపాదనను తిరస్కరించింది. -
మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
ముంబై: నరేంద్ర మోదీ బలవంతంగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రయతి్నస్తే ఆయన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండబోదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. 2014, 2019లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్ఎస్ఎస్ను బానిసగా మార్చుకోవడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రయతి్నంచారని ఆరోపించారు. ఇప్పుడు వారిద్దరి బలం తగ్గిపోయిందని పేర్కొన్నారు. మోదీని ఇంటికి సాగనంపే స్థితిలో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఉందన్నారు. -
48 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలుపు!
ముంబై: లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీయే కాదు.. అత్యల్ప మెజారిటీ కూడా నమోదైంది. మహారాష్ట్రలోని ముంబై వాయవ్య నియోజకవర్గంలో అనూహ్య ఫలితం వెలువడింది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్సెస్ శివసేన (సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీ) పోరు హోరాహోరీగా సాగింది. ఈ పోరులో చివరి వరకు విజయం ఇరుపక్షాల మధ్య దోబూచులాడింది. చివరకు కేవలం 48 ఓట్ల అతితక్కువ మెజారిటీతో శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాయ్కర్ తన సమీప ప్రత్యర్థి అమోల్ కీర్తికర్పై గెలుపొందారు. వాయ్కర్కు 4,52,644 ఓట్లు లభించగా అమోల్కు 4,52,596 ఓట్లు లభించాయి. రౌండ్ రౌండ్కు ఆధిక్యం ఇరు పారీ్టల అభ్యర్థుల మధ్య మారుతూ వచి్చంది. ఒక రౌండ్లో అయితే అమోల్ కేవలం ఒక ఓటుతో ఆధిక్యంలో కాసేపు కొనసాగారు. ఈ ఎన్నికల్లో కేరళలోని అత్తింగల్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాశ్ కేవలం 684 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. రాజస్తాన్లోని జైపూర్ రూరల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్ర సింగ్ 1,615 ఓట్ల తేడాతో గెలిచారు. చత్తీస్గఢ్లోని కాంకేర్ నుంచి బీజేపీ అభ్యర్థి భోజ్రాజ్ నాగ్ 1,884 ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ రాజ్పుత్ 2,678 ఓట్ల తేడాతో నెగ్గారు. -
మహారాష్ట్రలో ఎన్డీయే ఢీలా.. ఆధిక్యంలో ఇండియా కూటమి
లోక్సభ ఎన్నికల ఫలితాలు అందరిని షాక్కు గురిచేస్తున్నాయి. జాతీయ స్థాయిలో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రల్లో బీజేపీ, ప్రధాని మోదీ చరిష్మా తగ్గింది. అయోధ్య రామనాయం పనిచేయనట్లు కనిపిస్తుంది. 2019 ఫలితాలో పోలిస్తే తాజాగా బీజేపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్, మహారాష్ట్రలో గతం కంటే సగం సీట్లు కోల్పోయింది కాషాయ పార్టీ.చాలా చోట్ల ఊహించని విధంగా ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలో ఇండియా కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుండగా.. ఎన్డీయే వెనుకంజలో ఉంది. మొత్తం 48 స్థానాల్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ 12 చోట్ల, శివసేన(షిండే వర్గం) ఆరు చోట్ల, ఎన్సీపీ(అజిత్ పవార్) ఒకచోట ఆధిక్యతలో ఉంది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ ముందంజలో ఉన్నారు. మరోవైపు మహా వికాస్ అఘాడి కూటమిలో భాగస్వామ్యమైన శివసేన(ఉద్దవ్ వర్గం) 10 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 10 సీట్లలో, ఎన్సీపీ(శరద్ పవార్) ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్పై తిరుగుబాటు చేసి సాంగ్లీ నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి విశాల్ పాటిల్ ఆధిక్యంలో ఉన్నారు.మొత్తానికి ఎన్డీయే కూటమి 19 చోట్ల, ఇండియా కూటమి 28 చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా 48 లోక్సభ స్థానాలతో దేశంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. అయిదు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మొత్తం 61 శాతం పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీయే 30 స్థానాలు గెలుచుకుంటుందని, ఇండియా 18 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వాస్తవ ఫలితాలు తారుమారు చేశాయి. -
20 రోజుల్లో ఉద్దవ్ బీజేపీలో చేరుతారు: మహారాష్ట్ర ఎమ్మెల్యే
సాక్షి, ముంబై: అమరావతి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణా భర్త, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రానా శివసేన(ఉద్దవ్ వర్గం) అధినేత ఉద్ధవ్ థాక్రేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్వం జరిగిన 20 రోజుల్లో ఉద్ధవ్ బీజేపీతో చేరుతారని జోస్యం చెప్పారు. జూన్ 20లోపు ఉద్ధవ్ వర్గం శివసేన ఎన్డీయే కూటమిలో చేరబోతుంని తెలిపారు. కాగా లోక్సభ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భార్య నవనీత్ కౌర్తో ఎమ్మెల్యే రవి రానా‘నేను నమ్మకంగా చెప్పగలను. కేంద్రలో మోదీ మళ్లీ ప్రధాని అయిన 20 రోజుల్లో ఉద్దవ్ ఠాక్రే మోదీ ప్రభుత్వంలో కలుస్తారు. రాబోయే కాలం మోదీదే.. ఆ విషయం ఉద్దవ్కు కూడా తెలుసు. బాబాసాహెబ్ థాక్రే ఆలోచనలు ముందుకు తీసుకెళ్తేది మోదీనే. ఉద్దవ్ కోసం ప్రధాని మోదీ ఓ కిటికీ ఎప్పుడూ తెరిచే ఉంచుతారు. ఈ విషయం మోదీనే స్వయంగా చెప్పారు కూడా. బీజేపీలో చేరేందుకు ఉద్ధవ్ ఈ ‘విండో’ను ఉపయోగించుకుంటారు’ అని పేర్కొన్నారు.గతంలోనూ శివసేన, ఎన్సీపీ నుంచి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వైదొలుగుతారని తాను ఖచ్చితంగా చెప్పానని, తరువాత అదే జరిగిందని అన్నారు. కాగా ఎన్సీపీ వ్యవస్థాపకుడు, శరద్ పవార్తోపాటు ఉద్దవ్ ఠాక్రేలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాని ఇటీవల మోదీ కోరారు. కాంగ్రెస్లో విలీనమై కనుమరుగవడం కంటే బీజేపీలో చేరడం మేలని అన్నారు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల ఆయనకున్న ప్రేమ, ఆప్యాయతను తాను ఎప్పటికీ మరచిపోలేనని మోదీ అన్నారు. -
Lok Sabha Election 2024: చివరి పంచ్ ఎవరిదో!
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 48 స్థానాలకు గాను నాలుగు విడతల్లో 35 సీట్లకు ఎన్నిక ముగిసింది. మిగతా 13 నియోజకవర్గాలకు ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. రెండుగా చీలిన శివసేన, ఎన్సీపీల్లో అసలు పారీ్టగా ప్రజలు దేన్ని గుర్తిస్తున్నదీ ఈ ఎన్నికలతో తేలనుంది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తదితరులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో తుది దశలో పోలింగ్ జరగనున్న కీలక స్థానాలపై ఫోకస్... నాసిక్ ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం, ఎగుమతి సుంకాల పెంపు తదితరాలపై ఇక్కడి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది అభ్యర్థులందరికీ పరీక్షగా మారింది. అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థి హేమంత్ గాడ్సే బరిలో ఉన్నారు. విపక్ష ఎంవీఏ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి రాజాభావు వాజే పోటీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 111 ఆశ్రమాలు, ఏడు గురుకులాలతో ప్రజల్లో బాగా పేరున్న శాంతిగిరి మహారాజ్ ఇండిపెండెంట్గా వీరిద్దరికీ పెను సవాలు విసురుతున్నారు. ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు గాడ్సే, వాజే శ్రమిస్తున్నారు. సీఎం షిండే ముమ్మరంగా ప్రచారం చేశారు. వంచిత్ బహుజాన్ అగాడీ నుంచి కరణ్ గైకర్ కూడా బరిలో ఉండటంతో చతుర్ముఖ పోరు నెలకొంది.పాల్గఢ్ ఈ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి హేమంత్ విష్ణు సవర బరిలో ఉన్నారు. శివసేన (ఉద్ధవ్) నుంచి భారతి భరత్ కామ్డి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, వంచిత్ బహుజన్ అగాడీ, స్థానికంగా బలమున్న బహుజన్ వికాస్ అగాడీ కూడా పోటీలో ఉన్నాయి. దాంతో బహుముఖ పోటీ నెలకొంది. నిరుద్యోగం, వైద్య సౌకర్యాల లేమి ఇక్కడి ప్రధాన సమస్యలు. ఈ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు ఇటీవలే పాక్ జైల్లో మరణించడం, ఇక్కడ ఇద్దరు సాధువులను కొట్టి చంపడం ఎన్నికల అంశాలుగా మారాయి. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, బీజేపీ అగ్ర నేతలు సాధువుల హత్యను పదేపదే ప్రస్తావించారు. రూ.76,000 కోట్లతో ప్రతిపాదించిన వాద్వాన్ పోర్టుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శివసేన (షిండే)కు చెందిన సిట్టింగ్ ఎంపీ రాజేంద్ర దేద్య గవిట్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. భివండి బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ ఆయనే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. ఎన్సీపీ (ఎస్పీ) నుంచి సురేశ్ మాత్రే (బాల్యా మామ), స్వతంత్ర అభ్యర్థి నీలేశ్ సంబారే పాటిల్కు గట్టి పోటీ ఇస్తున్నారు. నియోజకవర్గంలోని 21 లక్షల ఓటర్లలో 5 లక్షల మంది ముస్లింలే. 4.5 లక్షలు కుంబి, 3 లక్షలు అగ్ర వర్గీయులున్నారు. పాటిల్, మాత్రే ఇద్దరూ అగ్ర కులస్థులు. సంబారే కుంబి వర్గానికి చెందినవారు. మాత్రే గెలుపు కోసం శరద్ పవార్ తన పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారు. తమకు బాగా పట్టున్న ఈ స్థానాన్ని ఎన్సీపీకి ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఇది మాత్రే విజయావకాశాలపై ప్రభావం చూపేలా ఉంది.ముంబై నార్త్ ఇక్కడ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను బీజేపీ బరిలోకి దింపింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ఎంపికకు ముందు గట్టి కసరత్తే చేసింది. గోయల్ కోసం తొలుత దక్షిణ ముంబై స్థానాన్ని పరిశీలించినా చివరికి ముంబై నార్త్ వైపే మొగ్గుచూపించింది. ఇది ఒకప్పుడు కాంగ్రెస్కు గట్టి పట్టున్న స్థానం. 1989లో బీజేపీ నుంచి రాం నాయక్ విజయం సాధించాక పరిస్థితులు మారాయి. 2008లో లోక్సభ స్థానాల పునరి్వభజన తర్వాత ఇక్కడ మరాఠీయేతర మధ్య తరగతి ఓటర్లు పెరిగారు. దాంతో బీజేపీ మరింత బలపడింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్పై బీజేపీ నేత గోపాల్ చిన్నయ్య శెట్టి 4.47 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గారు. 2019 ఎన్నికల్లో ఆయన మెజారిటీని మరింతగా పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, నటి ఊర్మిళా మతోండ్కర్ను ఓడించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు.కల్యాణ్ అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యరి్థగా సీఎం కుమారుడు శ్రీకాంత్ షిండే బరిలో ఉండటంతో ఆసక్తి నెలకొంది. 2014, 2019 ఎన్నికల్లోనూ శివసేన టికెట్పై శ్రీకాంత్ ఎన్సీపీని ఓడించారు. విపక్ష అగాడీ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యరి్థగా వైశాలి దారేకర్ రాణే బరిలో నిలిచారు. దాంతో ఇంతకాలంగా శివసేనను ఆదరిస్తున్న ఓటర్లకు పరీక్ష ఎదురైంది. సంప్రదాయ ఓటర్లు ఈ రెండు పారీ్టల మధ్య చీలితే ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది. గత రెండుసార్లూ రెండో స్థానంలో నిలిచిన ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ఉద్దవ్ వర్గం అభ్యరి్థకి కలిసొచ్చే అంశం. ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి తన కుమారుడు ఎంతో చేశాడని, ఈసారీ గెలిపిస్తే మిగతా పనులన్నీ పూర్తి చేస్తాడని సీఎం షిండే భరోసా ఇస్తున్నారు. థానే ఇక్కడ రెండు శివసేనల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఇతరులు పోటీలో ఉన్నా నామమాత్రమే. 2019 ఎన్నికల్లో శివసేన అభ్యర్థి రాజన్ బాబూరావు విచారే 4.12 లక్షల ఓట్ల మెజారిటీతో ఎన్సీపీ నేత ఆనంద్ పరాంజపేపై ఘన విజయం సాధించారు. ఈ విడత విచారే శివసేన (ఉద్ధవ్) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థిగా నరేశ్ గణపత్ మాస్కే బరిలో ఉన్నారు. విచారే ముందునుంచీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. మాస్కేకు మద్దతుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సేన, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. కానీ ఆయన అభ్యరి్థత్వాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తుండడం ప్రతికూలంగా మారింది. విచారే, మాస్కే ఇద్దరూ థానే మేయర్లుగా పనిచేసిన వారే. కానీ నగర పరిసర ప్రాంతాలు సరైన అభివృద్ధికి నోచుకోలేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది.ఐదో విడత పోలింగ్ జరిగే స్థానాలుధూలే, దిండోరి, నాసిక్, పాల్ఘర్, భివండి, కల్యాణ్, థానే, ముంబై నార్త్, ముంబై నార్త్–వెస్ట్, ముంబై నార్త్–ఈస్ట్, ముంబై నార్త్–సెంట్రల్, ముంబై సౌత్–సెంట్రల్, ముంబై సౌత్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘జైలును తప్పించుకునేందుకే పార్టీ ఫిరాయించాను’
ముంబై: మహారాష్ట్రలోని ముంబై వాయువ్య లోక్సభ నియోజకవర్గ శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్, జైలును తప్పించుకునేందుకే తాను శివసేన (యూబీటీ) నుంచి ఫిరాయించానని ప్రకటించి తన పార్టీని ఇరుకున పడేశారు. జోగేశ్వరిలోని సివిక్ ప్లాట్లో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి ఈడీ ఆయనపై పీఎంఎల్ఏ కేసు నమోదు చేసింది.ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం మినహా తనకు వేరే మార్గం లేదని ఒక మరాఠీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీంద్ర వైకర్ పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు అత్యంత విధేయుడిగా రవీంద్ర వైకర్ పేరుగాంచారు. ఉద్ధవ్ థాకరే స్వయంగా వైకర్ నివాసానికి వెళ్లి బుజ్జగించారంటేనే ఆయనకు శివసేన (యూబీటీ) ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు.తన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగడంతో రవీంద్ర వైకర్ దిద్దుబాటుకు ప్రయత్నించారు. ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. శివసేన (యూబీటీ) నుండి వైదొలగే ముందు తాను ఉద్ధవ్తో మూడు సార్లు సమావేశమయ్యానని, తన ఇబ్బందులను తెలియజేశానని చెప్పారు.కాగా ముంబై నార్త్-వెస్ట్ స్థానంలో శివసేన (యూబీటీ)కి చెందిన అమోల్ కీర్తికర్తో వైకర్ పోటీలో ఉన్నారు. అమోల్ తండ్రి కీర్తికర్ ప్రస్తుతం ఇక్కడ సిటింగ్ ఎంపీ. ఈ లోక్సభ స్థానానికి ఐదో దశలో మే 20న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
ముంబై: ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే ఇంకా ఓటింగ్ జరగాల్సిన ప్రాంతాల్లో పార్టీలలో చేరేవారు చేరుతూనే ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ మాజీ నాయకుడు సంజయ్ నిరుపమ్ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.బీహార్కు చెందిన నిరుపమ్ 1990లలో జర్నలిజం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తరువాత 'దోఫర్ కా సామ్నా'కి సంపాదకుడు అయ్యారు. నిరుపమ్ పనికి ముగ్దుడైన శివసేన చీఫ్ బాల్ థాకరే 1996లో రాజ్యసభకు నియమించారు. ఆ తరువాత 2005లో తలెత్తిన కొన్ని వివాదాల కారణంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2005లో సేనను వీడి కాంగ్రెస్లో చేరారు.మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నిరుపమ్ను కాంగ్రెస్ నియమించింది. 2009 ఎన్నికలలో ముంబయి నార్త్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ సీనియర్ నేత రామ్నాయక్పై స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2014లో ఇదే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. 2017లో ముంబయి సివిక్ బాడీకి జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత నిరుపమ్ ముంబై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శివసేనను వీడిన చాలా సంవత్సరాల తరువాత నిరుపమ్ మళ్ళీ సొంతగూటికి చేరారు.#WATCH | Former Congress leader Sanjay Nirupam along with his wife and daughter join Shiv Sena, in the presence of Maharashtra CM Eknath Shinde, in Mumbai pic.twitter.com/lLtKFcelti— ANI (@ANI) May 3, 2024 -
నామినేషన్ దాఖలు చేసిన శివసేన అభ్యర్థులు
ముంబయి: లోక్సభ ఎన్నికల ఐదో దశకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. శివసేన (యూటీబీ) నాయకులు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్ సహా మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు సోమవారం ముంబైలో తమ నామినేషన్లను దాఖలు చేశారు. అరవింద్ సావంత్ ముంబై సౌత్ నుంచి, అనిల్ దేశాయ్ ముంబై సౌత్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు.సావంత్ తన నామినేషన్ ఫారమ్తో పాటు అఫిడవిట్ ద్వారా తన సంపద సమాచారాన్ని ఎన్నికల కమిషన్కు సమర్పించారు. అరవింద్ సావంత్ భార్య అనుయా అరవింద్ సావంత్ పేరిట ఉన్న ఆస్తుల సమాచారాన్ని కూడా అఫిడవిట్లో ప్రస్తావించారు.అఫిడవిట్ ప్రకారం.. అరవింద్ సావంత్ వద్ద ప్రస్తుతం రూ.135000 నగదు ఉందని, అతని భార్య వద్ద రూ.60000 ఉందని వెల్లడించారు. సావంత్ వద్ద 251.070 గ్రాముల బంగారం, 3000 గ్రాముల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. సావంత్ భార్య వద్ద 509.10 గ్రాముల బంగారం, 8000 గ్రాముల వెండి ఉందని వెల్లడించారు. అరవింద్ సావంత్ ఆస్తి మొత్తం రూ.2 కోట్ల 13 లక్షల 91 వేల 322. భార్య పేరు మీద 2 కోట్ల 26 లక్షల 65 వేల 869 రూపాయల ఆస్తులున్నట్లు వివరించారు.ముంబై సౌత్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న శివసేన నేత రాహుల్ షెవాలే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ముంబై సౌత్ నుంచి డాక్టర్ మయూరి సంతోష్ షిండే, సబీహా బానో సహా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ముంబైలోని ఆరు స్థానాలకు మే 20న ఓటింగ్ జరుగుతుంది. నామినేషన్స్ దాఖలు చేయడానికి చివరి రోజు మే 3.मुंबई दक्षिण मध्य लोकसभा मतदारसंघातील महाविकास आघाडीचे अधिकृत उमेदवार अनिल देसाई ह्यांनी त्यांचा उमेदवारी अर्ज दाखल केला. ह्यावेळी युवासेनाप्रमुख शिवसेना नेते आमदार आदित्य ठाकरे, शिवसेना उपनेत्या खासदार प्रियंका चतुर्वेदी, खासदार चंद्रकांत हंडोरे, आमदार प्रकाश फातर्पेकर, शिवसेना… pic.twitter.com/wXwI2MDs8k— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) April 29, 2024 -
Lok sabha elections 2024: మరాఠా గడ్డపై మహా పోరు!
మరాఠా గడ్డపై ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. పొత్తుకు పై పొత్తు అన్నట్లుగా ఏ పార్టీ ఎప్పుడు ఏ కూటమిలో ఉంటుందో తెలియని ట్విస్టులతో మహారాష్ట్రలో రాజకీయం నానా మలుపులు తిరుగుతోంది. శివసేన, దిగ్గజ నేత శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పగ్గాలు చీలిక వర్గాల చేతికి వెళ్లడంతో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఆ రెండు పార్టీలతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లోనూ వాటితో కలిసే కూటమిగా పోటీ చేస్తోంది. మరోపక్క, ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్)తో సహా చిన్నాచితకా పార్టీలు జట్టు కట్టి రంగంలోకి దిగాయి... స్టేట్ స్కాన్ 48 లోక్సభ స్థానాలున్న మహారాష్ట్ర సీట్లపరంగా ఉత్తరప్రదేశ్ తర్వాత రెండో అతి పెద్ద రాష్ట్రం. ఇక్కడి రాజకీయాలు ఎక్కువగా స్థానికాంశాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఎన్నికల వేళ అనూహ్య రాజకీయ మార్పులూ పరిపాటే. ఏ పార్టీ కూడా ఒంటిచేత్తో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న దాఖలాలు పెద్దగా లేవు. రెండేళ్లలో అంతా తలకిందులు పొత్తు రాజకీయాలకు పేరొందిన మహారాష్ట్రలో గడిచిన రెండేళ్లలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వాములుగా పోటీ చేసిన బీజేపీ, శివసేన ఏకంగా 41 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు దక్కించుకోగా, శివసేన 23 చోట్ల పోటీ చేసి 18 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ మరో రెండు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని బరిలోకి దిగినా ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసి ఒక్క చోటే గెలిచింది. ఎన్సీపీ 19 చోట్ల అభ్యర్థులను నిలబెట్టి 4 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతర పార్టీలు ఎన్డీఏ సునామీలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు శివసేన, ఎన్సీపీ రెండుగా చీలిపోయాయి. ఒకటి ఎన్డీఏలో, మరోటి మహాకూటమి పంచన చేరాయి. 48 లోక్సభ స్థానాల్లో 5 సీట్లు ఎస్సీలకు, 4 ఎస్టీలకు కేటాయించారు. మాటల యుద్ధం ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న కొద్దీ నేతల మాటల్లో వాడి, వేడి కూడా పెరుగుతోంది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ తప్పుబట్టారు. ‘రాజ్ ఠాక్రే బీజేపీ ముందు మరీ ఇలా సాగిలపడిపోతారనుకోలేదు. పులి కాస్త గొర్రెలా మారింది. ఠాక్రే వంటి పోరాట యోధుడు బానిసగా మారారు. అతను బీజేపీకి మద్దతు ప్రకటించినా ఎన్నికల్లో మా విపక్ష ఎంవీఏ కూటమిపై ఎలాంటి ప్రభావం ఉండదు’ అని విజయ్ పేర్కొన్నారు. కాగా, బుధవారం నాగ్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. ‘సర్వేలన్నీ ఎన్డీఏ బంపర్ విజయం ఖాయమంటున్నాయి. ప్రతిపక్షాలు నాపై చేస్తున్న విమర్శలు, దూషణలతో మా బలం మరింత పెరుగుతోంది. ’అబ్కీ బార్ 400 పార్’ ట్రెండ్ బలపడుతోంది‘ అని స్పష్టం చేశారు. బీజేపీ తరపున డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాగా, రెండు నెలల క్రితం కాంగ్రెస్ను వీడిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో ఉండటం విశేషం. ఆయనకు బీజేపీ రాజ్యసభ సీటు కట్టబెట్టింది. మరోపక్క, కాంగ్రెస్ ప్రచారంలో రాహుల్ గాం«దీ, మల్లిఖార్జున ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే దన్నుగా నిలుస్తున్నారు. అధికార కుమ్ములాటలు 2019 లోక్సభ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసి మెజారిటీ సాధించాయి. మహా వికాస్ అఘాఢీ (ఎంవీఏ) పేరిట కలిసి బరిలో దిగిన కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతిపక్షానికి పరిమితయ్యాయి. అధికార పంపకంపై బీజేపీ, శివసేన కుమ్ములాట చివరికి కూటమి నుంచి సేన వైదొలిగేందుకు దారితీసింది. శివసేనకు ఎంవీఏ సీఎం పదవి ఆఫర్ చేయడంతో అది కూటమిలో చేరింది. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టారు. 100కు పైగా సీట్లను దక్కించుకున్నా అధికారం దక్కకపోవడంతో బీజేపీ అదను చూసి శివసేనకు షాకిచ్చింది. శివసేన నేత ఏక్నాథ్ షిండే మెజారిటీ ఎమ్మెల్యేలను చీల్చి వేరుకుంపటి పెట్టుకున్నారు. ఆయన సీఎంగా బీజేపీ–శివసేన సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసింది. శివసేన పార్టీ, గుర్తు షిండే వర్గానికే దక్కాయి. అటు ఎన్సీపీలోనూ అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగరేశారు. ఎమ్మెల్యేలను చీల్చి అధికార సంకీర్ణంలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. ఎన్సీపీ పేరు, గుర్తు కూడా అజిత్ వర్గానికే దక్కడంతో శరద్ పవార్ కొత్త పేరు, గుర్తుతో పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది! ‘మహా’యుతి కూటమి బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి బలంగా కన్పిస్తోంది. శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమిలో ఉన్నాయి. అయోధ్య రామ మందిరం సాకారం, అభివృద్ధి నినాదాలతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది. మోదీ కేబినెట్లో రెండు విడతల్లోనూ మంత్రి పదవి దక్కించుకున్న మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) షిర్డీ లోక్సభ సీటు డిమాండ్ చేస్తోంది. దాన్ని తమ సిట్టింగ్ ఎంపీకే కేటాయించాలని సీఎం షిండే పట్టుబడుతున్నారు. షిర్డీ నుంచి తాను పోటీ చేసినా, చేయకపోయినా ఎన్డీఏతోనే ఉంటానని ఆర్పీఐ చీఫ్ రాందాస్ అథవాలే ప్రకటించారు. ఆయనకున్న ఓటు బ్యాంకు చాలా స్థానాల్లో కూటమికి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. బీజేపీ దాదాపు 30 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. కానీ ఎన్సీపీ 10, శివసేన 18 సీట్లు కోరుతున్నాయి. ఇప్పటిదాకా బీజేపీ 24, శివసేన 8, ఎన్సీపీ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. గత ఎన్నికల్లో మహారాష్ట్రలో 7 శాతం ఓట్లు సాధించిన అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ సారథ్యంలోని బహుజన్ అఘాడీ కూడా బీజేపీతో సీట్ల బేరం సాగిస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా తాజాగా మోదీకి జై కొట్టారు. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమికి బేషరతుగా మద్దతు ప్రకటించారు! ‘ఇండియా’ పైచేయి సాధించేనా? ప్రతిపక్ష ఎంవీఏ కూటమిలో ఎట్టకేలకు సీట్ల పంపకం కొలిక్కి వచి్చంది. శివసేన (ఉద్ధవ్) 21 సీట్లు, కాంగ్రెస్ 17 స్థానాలు, ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాల చొప్పున పంచుకున్నాయి. ఎన్సీపీ, శివసేన ఓటు బ్యాంకు తమతోనే ఉందని ఎంవీఏ చెబుతోంది. కాంగ్రెస్ 6 న్యాయాలు, 25 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. మహాయుతి కూటమికి ఎంవీఏ గట్టి పోటీ ఇస్తున్నట్టు కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో మహారాష్ట్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సర్వేల సంగతేంటి? సర్వేల్లో మహారాష్ట్రపై మిశ్రమ అంచనాలు వెలువడుతున్నాయి. కొన్ని అధికార మహాయుతి కూటమికే మెజారిటీ సీట్లు కట్టబెట్టగా మరికొన్ని ఎంవీఏ భారీగా పుంజుకుని పైచేయి సాధిస్తుందంటున్నాయి. తాజా సర్వే ఒకటి ఎంవీఏ కూటమికి ఏకంగా 26 స్థానాలు అంచనా వేయడంతో కాంగ్రెస్ తదితర విపక్షాల్లో ఉత్సాహం నెలకొంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
Lok Sabha polls 2024: గెలిస్తేనే నిలిచేది..!
ఈ లోక్సభ ఎన్నికలు మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టిలకు జీవన్మరణ పరీక్షగా మారాయి. రాజకీయ కురువృద్ధుడు ఎన్సీపీ (ఎస్సీపీ) అధినేత శరద్ పవార్, చీలిక వర్గం చీఫ్, ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్, బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే, శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే... ఈ నలుగురూ గెలుపు కోసం అన్ని అ్రస్తాలనూ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా శరద్ పవార్, ఉద్ధవ్ ఎన్నికలయ్యేదాకా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. శివసేనను షిండే, ఎన్సీపీని అజిత్ చీల్చి వేరుకుంపటి పెట్టుకోవడం తెలిసిందే. వాటినే అసలైన శివసేన, ఎన్సీపీగా మహారాష్ట్ర స్పీకర్తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్, శరద్ పవార్ అధికారంలో భాగస్వాములుగా లేరు. పైగా మహావికాస్ అఘాడీ కూటమి పొత్తులో భాగంగా కొన్ని స్థానాలకే పోటీ చేస్తున్నారు. కనుక గణనీయమైన సీట్లు సాధిస్తే తప్ప వారి రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో శరద్ పవార్ 50 ఏళ్లలో ఒక్క ఓటమీ ఎదుర్కోని నేత కాగా, ఉద్ధవ్ ఠాక్రే ఒక్కసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడని నేత కావడం విశేషం! ఠాక్రే... వీలైనన్ని చోట్ల పోటీ 2019లో బీజేపీతో పొత్తులో భాగంగా శివసేన 23 స్థానాల్లో పోటీ చేసి 18 గెలుచుకుంది. తర్వాత పార్టీని షిండే చీల్చడంతో ఉద్ధవ్ రాజకీయ భవితవ్యమే అనిశి్చతిలో పడింది. ఈసారి సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటే క్రమంలో 21 స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకైనా ఉద్ధవ్ తన కేడర్ను కాపాడుకోవాలంటే కనీసం ఆరేడు లోక్సభ స్థానాలు గెలిచి తీరాలని రాజకీయ విశ్లేషకుడు అకోల్కర్ విశ్లేషించారు. బారామతిలో ఎవరిదో పరపతి! శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 10 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో బారామతి పవార్కు కీలకమైనది. అక్కడ 3సార్లుగా ఎంపీగా గెలుస్తు న్న పవార్ కుమార్తె సుప్రియా సులే ఈ విడత అజిత్ పవార్ భార్య సునేత్ర గట్టి సవాలు విసురుతున్నారు. ‘‘బారామతిలో సుప్రి య ఓడితే పవార్ అంతా కోల్పోయినట్టే. అలా చూస్తే ఈ యుద్ధం శరద్, అజిత్ మధ్యే!’’ అని పరిశీలకులు అంటున్నారు. ఓట్ల చీలిక.. సీఎంగా ఉండగా ఇల్లు కదల్లేదన్న విమర్శలు మూటగట్టుకున్న ఉద్ధవ్ ఇప్పుడు పార్టీని బతికించుకునేందుకు రాష్ట్రమంతా చుడుతున్నారు. ఆయన ర్యాలీలకు మంచి స్పందనే వస్తోంది. శరద్ పవార్ ఉన్నచోటి నుంచే చక్రం తిప్పుతున్నారు. బారామతిలో కుమార్తె గెలుపు కోసం పుణె జిల్లాలో పూర్వపు ప్రత్యర్థులైన కాంగ్రెస్ నేతల మద్దతుకూ ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ మన వడైన ప్రకాశ్ అంబేడ్కర్ ఆధ్వర్యంలోని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ)తో ఎంవీఏ కూటమి సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయి. దాంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది అధికార కూటమికి అనుకూలిస్తుందంటున్నారు. కేడర్, ఓటర్ ఎటువైపు శరద్ పవార్, ఉద్దవ్లకు ఈ ఎన్నికలు గట్టి పరీక్షేనని సీనియర్ జర్నలిస్ట్ అభయ్ దేశ్పాండే అన్నారు. అయితే పార్టిలు చీలినా సంప్రదాయ ఓటర్లు, కేడర్ మద్దతు వావైపేనని అభిప్రాయపడ్డారు. ‘‘పైగా బీజేపీ కేడర్లోనూ అశాంతి నెలకొని ఉంది. కనుక వాళ్లు అజిత్, షిండే అభ్యర్థుల విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తారా అన్నది అనుమానమే’’ అని ఆయన సందేహం వెలిబుచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన 41 లోక్సభ స్థానాలను గెలుచుకున్నాయి. వాటిని నిలుపుకోవడం వాటికి ప్రతిష్టాత్మకమని, ఆ లెక్కన ఈ ఎన్నికలు అధికార బీజేపీ–షిండే–అజిత్ కూటమికే అసలైన పరీక్ష అని ఉద్దవ్, శరద్ పవార్ వర్గీయులు వాదిస్తున్నారు. – ముంబై -
బీజేపీకి షాక్.. శివసేనలోకి(ఉద్దవ్) సిట్టింగ్ ఎంపీ
ముంబై: లోక్సభ ఎన్నికల ముందు మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగిలింది. నార్త్ మహారాష్ట్రలోని జల్గావ్ ఎంపీ ఉన్మేష్ పాటిల్ ప్రతిపక్ష శివసేనలో(ఉద్ధవ్ వర్గం) చేరారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ వద్ద తన సహచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే జల్గావ్ నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన ఉన్మేష్కు ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. స్మితా వాఘ్ను సీటు కేటాయించడంతో బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా శివసేన(ఉద్దవ్ వర్గం) ఇప్పటికే జల్గావ్ లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థుల రెండో జాబితాలో భాగంగా కరణ్ పవార్ను జల్గావ్ నుంచి బరిలోకి దింపింది. అతని పేరుతో పాటు మరో మూడు నియోజకవర్గాల అభ్యర్థులను(కళ్యాణ్ నుంచి వైశాలి దారేకర్, హత్యనంగలే నుంచి సత్యజీత్ పాటిల్, పాలఘర్ నుంచి భారతి కమ్డి) ప్రకటించింది. దీంతో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో భాగమైన ఈ పార్టీ ఇప్పటి వరకు 21 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పాటిల్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో మార్పు కోసమే తాను శివసేనలో చేరినట్లు వెల్లడించారు. ప్రతీకారం కోసం కాదని అన్నారు. బీజేపీ యూజ్ అండ్ త్రో విధానాన్ని పాటిస్తుందని మండిపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీ ఎదుగుదలకు కృషి చేసింది శివసైనికులేనని అన్నారు. అయితే జల్గావ్ లోక్సభకు శివసేన పటీ చేయడం ఇదే తొలిసారి అని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. 2019 వరకు అవిభక్త శివసేన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో భాగంగా ఉన్నప్పుడు బీజేపీ ఇక్కడి నుంచి పోటీ చేసిందని తెలిపారు. కాగా 48 లోక్సభ స్థానాలున్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు అయిదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. ముంబై నార్త్ వెస్ట్ నుంచి పోటీ?
ముంబై: ఊహించిందే నిజమైంది. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లోక్సభ ఎన్నికల ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. గురువారం శివసేన కార్యలయంలో సీఎం షిడే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి వసేన పార్టీ తరఫున గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉద్దవ్ వర్గం శివసేన నుంచి అమోల్ కిర్తికర్ పోటీ చేస్తున్నారు. కాగా ఇటీవల గోవిందా మహారాష్ట్ర సీఎం, శివసేన షిండే వర్గం నేత ఏక్ నాథ్ షిండేతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం విదితమే. దీంతో సీనియర్ నటుడు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని అప్పుడే ఊహాగానాలు వినిపించాయి. నేడు వాటిని నిజం చేస్తూ గోవిందా షేండే పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నటుడు మాట్లాడుతూ.. మళ్లీ రాజకీయ రంగంలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. "దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ వనవాసం తర్వాత రాజకీయాల్లోకి తిరిగి వచ్చానని పేర్కొన్నారు.షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముంబై మరింత అందంగా, అభివృద్ధి చెందిన ప్రాంతగా మారిందని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే కళా, సాంస్కృతిక రంగంలో పని చేస్తానని పేరారు. #WATCH | Veteran Bollywood actor Govinda joins Shiv Sena in the presence of Maharashtra CM Eknath Shinde pic.twitter.com/vYu2qYDrlO — ANI (@ANI) March 28, 2024 మరోవైపు గోవిందా షిండే పార్టీలో చేరడంపై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ స్పందించారు. అతనే ప్రముఖ నటుడు కాదని. ఏక్నాథ్ షిండే పాపులారిటీ ఉన్న నటుడిని తీసుసుకొని ఉంటే బాగుండేదన్నారు. ‘నాకు తెలిసి షిండే సినిమాలు చూడరేమో.. ఒకవేళ చూస్తుంటే.. అతనికి ఎవరూ మంచి నటుడే తెలిసి ఉండేంది’ అని అన్నారు #WATCH | On joining Shiv Sena, Veteran Bollywood actor Govinda says, "I was in politics from 2004 to 2009 and that was the 14th Lok Sabha. This is an amazing coincidence that now, after 14 years, today I have come into politics again..." pic.twitter.com/Qnil9ov8zV — ANI (@ANI) March 28, 2024 ఇదిలా ఉండగా గతంలోనూ గోవిందా రాజకీయాల్లో ఉన్నారు. 2004 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ముంబై నార్త్ నుంచి పోటీ చేసి.. బీజేపీ సీనియర్ నేత రామ్నాయక్పై విజయం సాధించారు. తర్వాత 2009లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
పార్టీలకు ప్రతిష్టాత్మకంగా విదర్భ!
మహారాష్ట్రలోని విదర్భ లోక్సభ స్థానానికి జరిగే ఎన్నికలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత రెండు ఎన్నికల్లో విదర్భ ఓటర్లు బీజేపీ, శివసేన జంటకు తమ మద్దతు పలికారు. తూర్పు విదర్భలో బీజేపీ, పశ్చిమాన శివసేన గట్టి పట్టు సాధించాయి. అయితే 1960 నుంచి 2009 వరకు విదర్భ కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైనప్పుడు విదర్భ ప్రజలు ఇందిరా గాంధీకి మద్దతుగా నిలిచారు. విదర్భ అనేది తూర్పు మహారాష్ట్రలోని 11 జిల్లాలు కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాగ్పూర్, రామ్టెక్, చంద్రాపూర్, గోండియా భండారా గడ్చిరోలి స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. రెండో దశలో ఏప్రిల్ 26న అకోలా, అమరావతి, వార్ధా, యవత్మాల్ వాషిం, బుల్దానా స్థానాలకు పోలింగ్ జరగనుంది. శివసేనకు చెందిన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే, ఎన్సిపికి చెందిన శరద్ పవార్, కాంగ్రెస్కు చెందిన మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి, అధికార బీజేపీ, శివసేన, ఎన్సీపీ (అజిత్ వర్గం) మహాకూటమి మధ్య అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఉంది. హైవే మ్యాన్గా బిరుదు పొందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మూడోసారి నాగ్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. నాగ్పూర్ సౌత్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వికాస్ ఠాక్రేను పోటీకి దింపడం ద్వారా కాంగ్రెస్.. బీజేపీకి గట్టి పోటీనిస్తుండగా, గడ్కరీ హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం విదర్భ పరిధిలోని నాగ్పూర్లో ఉంది. పొరుగున ఉన్న వార్ధా నియోజకవర్గం మహాత్మా గాంధీ జన్మస్థలం. రైతు ఆత్మహత్యలకు నెలవైన విదర్భలోని ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన సమస్యలు ఉన్నాయి. 64 సంవత్సరాల క్రితం విదర్భ ప్రాంతం నాగ్పూర్ ఒప్పందం కింద మహారాష్ట్రలో విలీనమైంది. మహారాష్ట్రలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే విదర్భలోని మొత్తం 62 సీట్లలో, బీజెపీ 29, అవిభక్త శివసేన 4, ఎన్సీపీ 6, కాంగ్రెస్ 15 ఇతరులు 8 సీట్లు గెలుచుకున్నారు. 2014లో విదర్భలో బీజేపీ 44 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. -
బరిలో ‘హీరో నెం 1’.. అక్కడి నుంచే పోటీ?
లోక్సభ ఎన్నికలు దగ్గరకొస్తున్నకొద్దీ మహారాష్ట్రలో రోజుకో కొత్త అభ్యర్థి పేరు తెరమీదకు వస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు గోవింద ముంబై నార్త్-వెస్ట్ స్థానం నుంచి శివసేన (ఏక్నాథ్ షిండే) టిక్కెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ప్రచారం సాగుతోంది. నటుడు గోవిందా ఐదు రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిశారు. ఈసారి ముంబై వాయువ్య స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గజానన్ కీర్తికర్కు టికెట్ ఇవ్వడానికి షిండే వర్గం సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో గోవిందా ఇక్కడి నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. ‘హీరో నెం 1’గా ప్రసిద్ధి చెందిన గోవిందా అసలు పేరు గోవింద్ అర్జున్ అహుజా. 2004లో ఆయన కాంగ్రెస్ టిక్కెట్పై ఉత్తర ముంబై నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో సీట్ల పంపకంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. -
బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు.. సీఎం షిండేపై సంచలన ఆరోపణలు
ముంబై: మహారాష్ట్రలో శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే గణ్పత్ గైక్వాడ్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తనను క్రిమినల్గా మార్చాడని గైక్వాడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాల ప్రకారం.. భూ వివాదంలో పోలీస్ స్టేషన్లోనే షిండే వర్గం శివసేన నేత మహేష్ గైక్వాడ్పై ఎమ్మెల్యే గణ్పత్ గైక్వాడ్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మహేష్ను ఆసుపత్రికి తరలించిన తర్వాత పోలీసులు ఎమ్మెల్యే గణ్పత్ గైక్వాడ్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయన ఓ మీడియా సంస్థతో టెలీఫోన్లో మాట్లాడారు. Land dispute turns into an action flick in #Maharashtra BJP MLA Ganpat Gaikwad opens fire on Shiv Sena's Mahesh Gaikwad in Ulhasnagar over land dispute claiming self-defense post son's alleged assault in a police station. Gaikwad arrested, faces attempt to murder charges pic.twitter.com/V4Gbq7GHal — Nabila Jamal (@nabilajamal_) February 3, 2024 ఈ సందర్భంగా గైక్వాడ్.. పోలీసు స్టేషన్లో తన కొడుకును కొట్టారని, తన భూమిని బలవంతంగా గుంజుకున్నారని చెప్పారు. ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగినట్లయితే ఇలాగే నేరగాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుందన్నారు. అతడు తనలాంటి మంచి వ్యక్తిని నేడు క్రిమినల్గా చేశాడని ఆరోపించారు. దీంతో, ఫ్రస్టేషన్లోనే కాల్పులు జరిపానని, అందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదన్నారు. పోలీస్ స్టేషన్లో కొందరు నా ఎదుటే నా కుమారుడిని కొట్టారు, ఇంతకంటే నేనేం చేయాలి అని ప్రశ్నించారు. వారిని చంపాలనేది తన ఉద్దేశం కాదని చెప్పారు. కాగా, మహేశ్ గైక్వాడ్పై ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని వార్తలు వచ్చాయి. కానీ పది రౌడ్ల బుల్లెట్లు అక్కడ లభించాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
BJP MLA: ‘కాల్చినందుకు పశ్చాత్తాపం లేదు’
ముంబై: మహారాష్ట్రలో సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన చెందిన నేతపై బీజేపీ చెందిన ఎమ్మెల్యేపై జరిపిన కాల్పులు శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది. భూవివాదం నేపథ్యంలో షిండే వర్గం శివసేన ముంబై చీఫ్ మహేష్ గైక్వాడ్, మరోనేత రాహుల్ పాటిల్పై బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ కాల్పలు జరిపారు. ఈ ఘటన హిల్ పోలీసు స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వార్లీ గ్రామంలోని భూవివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గణపతి గైక్వాడ్ కొడుకు వైభవ్ గైక్వాడ్ పోలీసు స్టేషణ్కు తన అనుచరులను తీసుకొని వచ్చారు. అదే సమయంలో మహేష్ గైక్వాడ్ సైతం తన కార్యకర్తలను తీసుకొని పోలీసు స్టేషన్కు వచ్చారు. కొంత సమయానికి గణపతి కూడా పోలీసు స్టేషన్కు వచ్చారు. సీనియర్ ఇన్స్పెక్టర్ అనిల్ జగ్తాప్.. ఇద్దరు నేతలను కూర్చోబెట్టి మాట్లాడుతున్న క్రమంలో స్టేషన్ వెలుపల ఇరు వర్గాల అనుచరులు ఆందోళకు దిగారు. దీంతో వారిని కంట్రోల్ చేయడానికి ఇన్స్పెక్టర్ అనిల్ జగ్తాప్ బయటకు వెళ్లారు. ఆ సమయంలో గణపతి గైక్వాడ్ .. మహేష్ గైక్వాడ్, మరో నేత రాహుల్ పాటిల్పై తుపాకితో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో మహేష్ గైక్వాడ్, రాహుల్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపే క్రమంలో గణపతి గైక్వాడ్ చేతికి గాయం అయింది. గాయపడిన మహేష్ గైక్వాడ్, రాహుల్ను థానేలోని ఆస్పత్రికి తరలించారు. మహేష్ గైక్వాడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైవ్వాడ్తో పాటు మరో ఇద్దని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహేష్ గైక్వాడ్.. కళ్యాణ్ లోక్సభ ఎంపీ, ఏక్ నాథ్ షిండే కుమారు డా. శ్రీకాంత్ షిండే సన్నిహితుడు కాగా.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్కు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన గణపతి గైక్వాడ్ చాలా సన్నిహితుడు గమనార్హం. సంకీర్ణ ప్రభుత్వంలోని ఇరుపార్టీల నేతల మధ్య జరిగిన కాల్పుల ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాకు పశ్చాత్తాపం లేదు: గణపతి గైక్వాడ్ ఆత్మరక్షణ కోసమే షిండే వర్గం శివసేన నేతపై కాల్పులు జరిపానని తెలిపారు. తన కొడుకుపై పోలీసు స్టేషన్లో మహేష్ గైక్వాడ్, అతని అనుచరులు దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. అందుకే వారి నుంచి తన కొడుకును కాపాడే క్రమంలో కాల్పులు జరిపినట్లు తెలిపారు. కాల్పుల ఘటనపై తనకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు. నిన్న (శుక్రవారం) రోజు పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గణపతి గైక్వాడ్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై ఆయనను పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష.. అప్పటి వరకు హైదరాబాద్లోనే -
మహారాష్ట్రలో ఉద్రిక్తత.. శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు
ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సదరు శివసేన నేత తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. కొద్దికాలంగా ఓ స్థలం వివాదానికి సంబంధించి శివసేన నేత మహేశ్ గైక్వాడ్, బీజేపీ ఎమ్మెల్యే గణ్పత్ గైక్వాడ్లతో పాటు వారి మద్దతుదారులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో గణ్పత్ గైక్వాడ్.. మహేశ్పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. #WATCH | Thane, Maharashtra: Sudhakar Pathare, DCP says, "Mahesh Gaikwad and Ganpat Gaikwad had differences about something and they came to the Police station to give complaint. At that time, they had a talk and Ganpat Gaikwad fired at Mahesh Gaikwad and his people. 2 people… pic.twitter.com/Qw2Q9iUHHz — ANI (@ANI) February 2, 2024 ఇక, కాల్పుల్లో శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ కూడా గాయపడ్డారు. తక్షణమే స్పందించిన పోలీసులు నేతలిద్దరినీ థానేలోని జూపిటర్ హాస్పిటల్కు తరలించారు. గణ్పత్ గైక్వాడ్ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అతడు ఉపయోగించిన తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శివసేన మద్దతుదారులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
ఛాయ్వాలా పీఎం.. ఆటోవాలా సీఎం: మిలింద్ దేవరా
ముంబయి: కాంగ్రెస్ను వీడి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిన సీనియర్ నేత మిలింద్ దేవరా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజకీయాల్లో ప్రస్తుత మార్పులు సమానత్వ విలువల్ని కోరుకుంటున్నాయని చెప్పారు. టీ అమ్మేవారు ప్రధానమంత్రి స్థానంలో.. రిక్షా నడిపే వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని అన్నారు. ఈ మార్పు భారత రాజకీయాల్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ఏక్నాథ్ షిండ్ సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని మిలింద్ దేవరా అన్నారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని చెప్పారు. "దేశంలోని అత్యంత కష్టపడి పనిచేసే, అందుబాటులో ఉండే సీఎంలలో ఏక్నాథ్ షిండే ఒకరు. మహారాష్ట్రలో అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అవగాహన, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి ఆయన చేసిన కృషి అభినందనీయం" అని ఆయన స్పష్టం చేశారు. "మహారాష్ట్రుల సంపన్నమైన భవిష్యత్తు కోసం షిండే ప్రయత్నాలతో ప్రేరణ పొందాను. ఆయన కృషికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను. భారతదేశం కోసం నరేంద్ర మోదీ, అమిత్ షాల దూరదృష్టి నన్ను ఆకర్షించాయి." అని మిలింద్ దేవరా అన్నారు. "సృజనాత్మక ఆలోచనలకు విలువనిచ్చి, నా సామర్థ్యాలను గుర్తించే నాయకుడితో నేను పని చేయాలనుకుంటున్నాను. ఏక్నాథ్ షిండే నా సామర్థ్యాలను నమ్ముతారు." అని దేవరా అన్నారు. కష్టపడి పనిచేయడం వల్ల అసాధ్యమైన విషయాలు కూడా సాధ్యమవుతాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరిపోయారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ‘ఏక్ భారత్...’కు ప్రతిబింబం పొంగల్: మోదీ -
‘మహా’ జనానిదే తుది తీర్పు
సుప్రీంకోర్టు తుది గడువు దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికే పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికుల మద్దతుందనీ, అదే ‘నిజమైన శివసేన’ అనీ తేల్చారు. అలాగని ఉద్ధవ్ ఠాక్రే వెంటనున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదు. పార్లమెంటు నుంచి అసెంబ్లీల వరకూ మన చట్టసభల్లో ఫిరాయింపులు, ఇతరేతర సమస్యలు తలెత్తినప్పుడు అధికార పక్షాల ప్రయోజనాల పరిధిని మించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవటానికి సభాధ్యక్షులు సిద్ధపడరని తరచు రుజువవుతూనేవుంది. మహారాష్ట్ర కూడా దానికి మినహాయింపు కాదు. అందువల్లే రెండుగా చీలిన శివసేన వర్గాల్లో ఏది నిజమైందో, ఏది కాదో తేల్చడానికి స్పీకర్ నార్వేకర్కు ఏడాదిన్నర కాలం పట్టిందంటే ఆశ్చర్యం లేదు. జనవరి 10 తుది గడువని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పకపోయివుంటే మరెన్ని నెలలు పట్టేదో అనూహ్యం. లెక్కలు తేల్చడానికి శివసేనకు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరు. అయినా నార్వేకర్ గరిష్ట వ్యవధిని తీసుకుని తుది నిర్ణయం ప్రకటించారు. 2019లో ఆ పార్టీ నేతృత్వంలో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహావికాస్ అఘాదీ (ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పడిననాటికి శివసేన ఎమ్మెల్యేలు 55 మంది. 2022 జూన్ 21న 34 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభానాయకుడిగావున్న ఏక్నాథ్ షిండే నాయకత్వంలో తిరగబడటంతో పార్టీ నిలువునా చీలింది. వెంటనే ఉద్ధవ్ మేల్కొని షిండే స్థానంలో సభానాయకుడిగా అజయ్ చౌధరిని నియమించటంతోపాటు, విప్గా వున్న షిండే వర్గం నేతను తొలగించి, తన వర్గంలోని సునీల్ ప్రభును ప్రకటించారు. ఎన్ని చేసినా ప్రయోజనం లేదని గ్రహించాక జూన్ 29న ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతుండగా వెలువడిన నార్వేకర్ నిర్ణయం... ఈ చీలికను ప్రోత్సహించి షిండే సర్కారులో చేరిన బీజేపీకి సహజంగానే ఊరటనిచ్చే అంశం. భావోద్వేగాల ప్రభావం ఎక్కువుండే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడివుంటే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి సానుభూతి వెల్లువెత్తేది. ఇప్పటికే ఉద్ధవ్ శివసేన పేరును, గుర్తును కూడా కోల్పోయారు. ఆ అంశంలో ఎన్నికల సంఘం షిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. సొంత మనిషిగా భావించిన షిండేయే బీజేపీ ప్రోద్బలంతో శివసేనలో చిచ్చు రగిల్చి ఉద్ధవ్కు అన్యాయం చేశారని జనం భావిస్తున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇది షిండే వర్గంతోపాటు బీజేపీని కూడా దెబ్బతీసేలా వున్నదని ఆ సర్వేల సారాంశం. అందుకే అనర్హత అంశం జోలికి వెళ్లకపోవటమే మంచిదని షిండే వర్గం భావించినట్టు కనబడుతోంది. అయితే ఉద్ధవ్ వర్గం మౌనంగా ఏమీవుండదు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయటంతోపాటు ప్రజాక్షేత్రంలోకెళ్తానని ఇప్పటికే ప్రకటించింది. కనుక ‘నిజమైన శివసేన’ షిండేదేనన్న స్పీకర్ నిర్ణయంపై అది కావలసినంత రచ్చ చేస్తుంది. అటు కొందరు ఎమ్మెల్యేలతో నిష్క్రమించిన అజిత్ పవార్ వర్గంపైనా ఇలాంటి పిటిషనే పెండింగ్లో వుంది. ఈనెల 31లోగా వెలువడే ఆ నిర్ణయం కూడా ప్రకంపనలు రేపడం ఖాయం. మన రాజ్యాంగం సభాధ్యక్షులకు ఎన్నో అధికారాలిచ్చింది. అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లోనేనని తేల్చిచెప్పాయి. కానీ తాము ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీల ప్రయోజనాల పరిధిని మించి స్పీకర్లు వ్యవహరించలేకపోతున్నారు. మహారాష్ట్ర విషయానికే వస్తే ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, స్పీకర్పై ఒత్తిడి తెస్తే తప్ప నిర్ణయం వెలువడలేదు. తమ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదని స్పీకర్లు చెబుతూ వుంటారు. వాటి ఆదేశాలను బేఖాతరు చేస్తుంటారు. అయితే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినంతవరకూ అటువంటి స్వతంత్రతను అందరూ హర్షిస్తారు. అందుకు భిన్నంగాపోయి న్యాయస్థానాలతో అక్షింతలు వేయించుకునే పరిస్థితి తెచ్చుకుంటే అది స్పీకర్ల వ్యవస్థను బలహీనపరుస్తుంది. సాధారణంగా ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేని సందర్భాల్లో ప్రభుత్వాలు ఏర్పడేటపుడూ... ఆ ప్రభుత్వాలు అస్థిరతలో పడినప్పుడూ ప్రత్యర్థి పక్షాలు ఖరీదైన విలాసవంతమైన హోటళ్లలో శిబిరాలు నిర్వహించటం, అవసరాన్నిబట్టి విమానాల్లో వేరే రాష్ట్రాలకు ఎమ్మెల్యేలను తరలించటం తరచు మన దేశంలో కనబడుతూనేవుంటుంది. ఈ తంతుమన ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నది కూడా. దానికితోడు సభాధ్యక్షులుగా వున్నవారు సైతం ఏదో ఒక వర్గం చేతిలో కీలుబొమ్మలై తటస్థతకు తూట్లుపొడిచి నిర్ణయాలు తీసుకోవటం లేదా నిర్ణయ ప్రకటనలో విపరీతమైన జాప్యం చేయటం తరచు కనబడుతుంది. భారీ మెజారిటీతో నెగ్గిన తెలుగుదేశం అధినేత స్వర్గీయ ఎన్టీఆర్ సర్కారును ఆయనకు స్వయానా అల్లుడైన చంద్రబాబు నాయుడు 1995 ఆగస్టులో కూల్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు జరిగిన పరిణామాలను ఎవరూ మరిచిపోరు. అంతకుముందూ, ఆ తర్వాతా కూడా పదే పదే అలాంటి ఉదంతాలే దేశంలో పునరావృతమయ్యాయి. స్పీకర్ తాజా నిర్ణయంపై ఉద్ధవ్ వర్గం న్యాయస్థానంలోనూ, వెలుపలా పోరాడుతుంది. ఇప్పటికైతే షిండే ప్రభుత్వం నిశ్చింతగా వుండొచ్చు. కానీ ఈ చీలికలపైనా, ప్రభుత్వాలను కూల్చటంపైనా జనం స్పందన ఎలావుండబోతున్నదో రాబోయే ఎన్నికల్లో తేలుతుంది. ఆ తర్వాతైనా రాజకీయ పక్షాలు పరిణతితో వ్యవహరించటం నేర్చుకుంటాయని ఆశించాలి. -
ప్రజాస్వామ్యమే గెలిచింది: ఏక్నాథ్ షిండే
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తేల్చేశారు. ఈ తీర్పుపై స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే.. శివ సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం మరోసారి విజయం సాధించిందని అన్నారు. శివ సేన- బీజేపీ సంకీర్ణ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షల మంది ఓటర్లు గెలుపొందారని తెలిపారు. "రాష్ట్రంలోని శివసైనికులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేడు ప్రజాస్వామ్యం మరోసారి గెలిచింది. 2019లో శివసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షలాది మంది ఓటర్లు ఈరోజు విజయం సాధించారు. ఇది శివుడి విజయం. హిందూ హృదయ చక్రవర్తి బాలాసాహెబ్ థాక్రే భావాజాలంతో ఉన్న శివసైనికుల విక్టరీ ఇది." అని ఏక్నాథ్ షిండే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. "బాలాసాహెబ్, ధర్మవీర్ ఆనంద్ దిఘేల హిందుత్వ భావాజాలానికి మేమే నిజమైన వారసులమని మరోసారి రుజువైంది. నేటి విజయం సత్యం విజయం. సత్యమేవ జయతే." అని అన్నారు. "నేటి ఫలితం ఏ పార్టీ విజయం కాదు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయం. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ముఖ్యం. శివ సేనాను ఎలక్షన్ కమిషన్ మనకు కేటాయించింది. ఇప్పుడు విల్లు, బాణాలు కూడా మన చేతికి వచ్చాయి. నేటి ఫలితాల నుంచి నియంతృత్వం, రాజవంశం అంతమైంది." "పార్టీని తన ఆస్తిగా భావించి ఎవరూ తన మనసుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేరు. ప్రస్తుత తీర్పు పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తి కాదని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి. పార్టీ అధ్యక్షుడు ఏకపక్షంగా ఉండకూడదు. ఈ తీర్పు అందుకు ఉదాహారణగా ఉంది.' అని షిండే ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: Maharashtra politics: షిండే వర్గమే అసలైన శివసేన -
Maharashtra politics: షిండే వర్గమే అసలైన శివసేన
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ బుధవారం తేల్చేశారు. ఏడాదిన్నరగా కొనసాగుతున్న అనిశి్చతికి తెరదించారు. శివసేన పార్టీ 2022 జూన్లో రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు రెండు పక్షాలుగా చీలిపోయారు. ఒక వర్గానికి నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే బీజేపీ, ఎన్సీపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహిస్తున్నారు. తమ వర్గమే అసలైన శివసేన అంటూ ఇరువురు నేతలు వాదిస్తున్నారు. అవతలి వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ షిండే, ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీ స్పీకర్కు విజ్ఞాపనలు సమరి్పంచారు. వీటిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ తన నిర్ణయం ప్రకటించారు. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. ఉద్ధవ్ వర్గానికి చెందిన సునీల్ ప్రభును విప్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. ఈ తొలగింపు 2022 జూన్ 21 నుంచి వర్తిస్తుందన్నారు. షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను అధికారికంగా విప్గా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేపై కూడా అనర్హత వేటు వేయడం లేదన్నారు. పార్టీ నుంచి నేతలను బహిష్కరించే అధికారం శివసేన చీఫ్కు లేదని పేర్కొన్నారు. 2018 నాటి శివసేన రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉద్ధవ్ వర్గం కోరగా, స్పీకర్ అంగీకరించలేదు. 1999 నాటి రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. శివసేన ఎన్నికల సంఘం సైతం ఈ రాజ్యాంగాన్నే గుర్తించిందని పేర్కొన్నారు. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలకు గాను 37 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలోనే ఉన్నాయని గుర్తుచేశారు. స్పీకర్ నిర్ణయంపై షిండే వర్గంసంబరాలు చేసుకుంది. సీఎం ఏక్నాథ్ షిండే కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంను ఆశ్రయిస్తాం: ఉద్ధవ్ వర్గం స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని శివసేన(ఉద్ధవ్) ప్రకటించింది. స్పీకర్ నిర్ణయాన్ని అంగీకరించబోమని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఇదంతా బీజేపీ కుట్ర అని పార్టీ నేతలు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ మండిపడ్డారు. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనను ఎవరూ అంతం చేయలేరన్నారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమని ఆరోపించారు. షిండే వర్గమే అసలైన శివసేన అయితే తమ వర్గం ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలేదని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య హత్యగా ఉద్ధవ్ ఠాక్రే అభివరి్ణంచారు. -
మిత్రపక్షం శివసేనకు కాంగ్రెస్ షాక్.. అందుకు నో!
ముంబై: మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేనకు (ఉద్ధవ్వర్గం) కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో 23 సీట్లలో పోటీ చేస్తామంటూ శివసేన చేసిన డిమాండ్ను కాంగ్రెస్ తిరస్కరించింది. సార్వత్రిక ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమిలో భాగస్వామమ్యులైన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య సీట్ల పంపకం గురించి చర్చించేందుకు నేతలు సమావేశమైన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ఎంవీఏ కూటమీ పేరులో మహారాష్ట్రలో 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే 2022లో శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని రెండుగా చీల్చాడు. బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. దీంతో ఎంవీఏ కూటమి అధికారం కోల్పోవాల్సి వచ్చింది. రెండు వర్గాలుగా విడిపోయిన శివసేనలో ఏక్నాథ్ షిండే వైపే మెజార్గీ నేతలు వెళ్లిపోయారు. ఉద్దవ్ వర్గంలో తగినంత అభ్యర్థులు లేకపోయినప్పటికీ 23 స్థానాలు కోరడం సరికాదని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. సీట్లు గెలుచుకోవడంపై నేతలు విభేదాలు మానుకోవాలని అన్నారు. శివసేన 23 సీట్లు డిమాండు చేయొచ్చు, కానీ వాటిని ఏం చేస్తారని ప్రశ్నించారు. సంక్షోభం అనంతరం శివసేన నేతలు వెళ్లిపోయారని, వాళ్లకు అభ్యర్థుల కొరత సమస్య. ఉంది’ అని తెలిపారు. శివసేన, శరద్పవార్ ఎన్సీపీలో చీలికలు ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్కటే స్థిరమైన ఓట్షేర్తో కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు సమావేశంలో తెలిపారు.పార్టీల మధ్య సర్దుబాటు అవసరమని మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ అన్నారు. ప్రతి పార్టీ సీట్లు ఎక్కువ వాటాను కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శివసేన 23 సీట్ల డిమాండ్ చేయడం ఎక్కవ అని అభిప్రాయపడ్డారు. -
జనవరి 10 కల్లా తేల్చండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: శివసేన పార్టీలోని రెండు వర్గాలు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పెట్టుకున్న పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్కు సుప్రీంకోర్టు గడువు పెంచింది. గతంలో డిసెంబర్ 31వ తేదీలోగా ఏదో ఒకటి తేల్చాలంటూ ఇచ్చిన గడువును తాజాగా మరో 10 రోజులు పొడిగించింది. ‘డిసెంబర్ 20వ తేదీతో అసెంబ్లీ కార్యకలాపాలు ముగుస్తున్నందున, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువు పొడిగించాలంటూ స్పీకర్ పెట్టుకున్న వినతిని సహేతుకమైందిగా భావిస్తున్నాం. అందుకే, గడువును మరో 10 రోజులపాటు, వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు పొడిగిస్తున్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. -
శివసేన, ఎన్సీపీ విబేధాలపై స్పీకర్కు సుప్రీంకోర్టు తుది గడువు
ఢిల్లీ: శివసేన, ఎన్సీపీ విభేదాలకు సంబంధించి దాఖలైన అనర్హత పిటిషన్లను పరిష్కరించడానికి మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సుప్రీంకోర్టు నేడు తుది గడువును విధించింది. శివసేన విబేధాలపై డిసెంబర్ 31, 2023 నాటికి, ఎన్సీపీ అనర్హత పిటిషన్లపై జనవరి 31, 2024లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాలకు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ శివసేన సభ్యుడు సునీల్ ప్రభు (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ సభ్యుడు జయంత్ పాటిల్ (శరద్ పవార్) దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కాగా.. శివసేన పార్టీలో చీలికకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఫిబ్రవరి 29, 2024 వరకు సమయం కావాలని కోరిన మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ వైఖరిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విబేధాలపై ఇంతకాలం కాలయాపన చేసి మళ్లీ గడువు కోరడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ రాహుల్ నార్వేకర్ తరఫున వాదనలు వినిపించిన భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జనవరి 31లోగా విచారణ పూర్తవుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఐ డీవై చంద్రచూడ్.. డిసెంబర్ 31లోగా తేల్చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. 2022 జులైలో ఈ ఘటనలు చోటుచేసుకోగా.. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కే ఉందని ఈ ఏడాది మేలోనే రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయితే.. రాబోయే దీపావళి సెలవులు, అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఉటంకిస్తూ జనవరి 31లోపు పూర్తి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ విన్నవించారు. వాదనల అనంతరం డిసెంబర్ 31లోపు విచారణ పూర్తి చేయాల్సిందేనని ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్సీపీ విభేదాలకు సంబంధించి మాత్రం జనవరి 31 వరకు సమయం ఇచ్చింది. కానీ ఎన్సీపీ విబేధంపై గడువు ఇవ్వడాన్ని అజిత్ పవార్ వర్గం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ నిరసించారు. ఈ ఏడాది జూలై, సెప్టెంబర్లలో మాత్రమే పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పారు. అయితే.. ఈ ఏడాది జులైలో తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను మాత్రమే ఈ దశలో పరిగణిస్తామని ధర్మాసనం తెలిపింది. శివసనే, ఎన్సీపీ అనర్హత పిటిషన్లను త్వరితగతిన విచారించడానికి తగిన షెడ్యూల్ను రూపొందించడానికి మహారాష్ట్ర స్పీకర్కు కోర్టు చివరి అవకాశాన్ని ఇప్పటికే ఇచ్చింది. ముఖ్యమంత్రి శిందేతో సహా పలువురు శివసేన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉద్ధవ్ వర్గం పెట్టుకున్న అర్జీలపై ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారని స్పీకర్పై ఇంతకుముందు ఆగ్రహం వ్యక్తంచేసింది. కాగా.. శివసేనలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏక్నాథ్ షిండే, ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం ఆదేశించినా స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు ఎన్సీపీలోనూ తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ వర్గంపై అనర్హత ప్రకటించాలని కోరుతూ శరద్ పవార్ మద్దతుదారులు సర్వోన్నత న్యాయస్థానానికి చేరారు. దీనిపై విచారణ జరుపుతున్న సీజేఐ ధర్మాసనం నేడు తుది గడువును విధించింది. ఇదీ చదవండి: హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు: మూర్తి అలా అనలేదంటున్న గుర్నానీ -
‘వారసత్వ రాజకీయాలు విషతుల్యం’
భోపాల్: వారసత్వ రాజకీయాలు విషంతో సమానమని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. వీటివల్ల ఒకే కుటుంబం చెప్పుచేతల్లో పార్టీ, ప్రభుత్వం ఉంటాయన్నారు. కాంగ్రెస్, డీఎంకే, శివసేన(ఉద్ధవ్)వర్గం కుటుంబ రాజకీయాలను నడిపిస్తున్నాయని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కుల ఉద్యమాలను ప్రోత్సహిస్తోందన్నారు. వీటివల్లే 2018లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని చెప్పారు. -
సోదరులిద్దరూ కలిసేనా? ఒకతాటిపైకి ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ ఠాక్రే!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (చీఫ్) రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఒకతాటిపైకి వస్తుండవచ్చనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. దివంగత బాల్ ఠా క్రే స్మారకం విషయంపై చర్చించేందుకు తన సోదరుడైన రాజ్ఠాక్రేకి ఫోన్ చేయాల్సి ఉందని ఇటీ వల ఓ ఇంటర్వ్యూలో ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. అయితే అది ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు. కాగా.. రాజ్–ఉద్ధవ్లు ఒకటయితే బాగుంటుందని ఇరు పార్టీల కార్యకర్తలు కొంత కాలంగా కోరుకుంటున్నా రు. అంతేగాకుండా ఇటీవల అక్కడక్కడా ఫ్లె క్సీలు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇద్దరు ఠాక్రేలు ఒకటైతే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఎవరు.. ఏ పార్టీలో ఉన్నారో? రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల ఊహించని మార్పులు జరుగుతున్నాయి. నాయకులు ఓ పార్టీ నుంచి బయటపడి ప్రత్యర్థి పారీ్టలో చేరడం, లేదంటే కొత్త పార్టీ ఏర్పాటు వంటివి చేస్తున్నారు. కూటములు ఏర్పడుతున్నాయి దీంతో ఎవరు, ఏ పారీ్టలో ఉన్నారో తెలియని గందరగోళ పరిస్ధితి నెలకొంది. గత సంవత్సరం ఏక్నాథ్ శిందే.. శివసేనను చీల్చి బీజేపీలో చేరారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిపోవడం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయం నుంచి తేరుకోకముందే మహా వికాస్ ఆఘాడిలో మిత్రపక్షంగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ కూడా బయటపడ్డారు. పార్టీని చీల్చి తన మద్దతుదారులతో ఆయన బీజేపీ ప్రభుత్వంలో చేరారు. వారికి కొన్ని మంత్రిపదవులు సైతం లభించాయి. అందరూ స్వార్థ రాజకీయాలు చేస్తున్న వేళ.. వీరెందుకు (రాజ్–ఉద్ధవ్) ఒకటి కాకూడదనే అంశాన్ని ఇరుపార్టీల పదాధికారులు, కార్యకర్తలు తెరమీదకు తెచ్చారు. బీజేపీ నుంచి ప్రతికూల సంకేతాలు.. బీజేపీతో సాన్నిహిత్యంగా మెలుగుతున్న తీరును బట్టి ఆ పారీ్టతో పొత్తు పెట్టుకుంటుండవచ్చని అప్పట్లో అందరు భావించారు. కానీ ఉత్తర భారతీయుల ఓట్లను దృష్టిలో ఉంచుకుని రాజ్ఠాక్రేకు కొంత దూరంగా ఉంచడమే ఉత్తమమని బీజేపీ వర్గాలు భావించాయి. ఆ తరువాత మసీదులపై లౌడ్స్పీకర్లు తొలగించాలని చేపట్టిన ఆందోళన రాజ్ను బీజేపీకి మరింత దగ్గర చేసింది. ఈ నేపథ్యంలోనే దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ శిందే, చంద్రకాంత్ పాటిల్సహా పలువురు బీజేపీ మంత్రులు, నేతలు రాజ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు ఆయన నివాసమైన శివాజీపార్క్లోని రాజ్ఘడ్కు వెళ్లడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రాజ్ ఠాక్రే బీజేపీతో జత కట్టడం ఖాయమని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. కానీ వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్ లాంటి ఇద్దరు బలమైన నాయకులు లభించారు. ఫలితంగా బీజేపీతో పొత్తుపై ఎమ్మెన్నెస్ పెట్టుకున్న ఆశలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే.. బాల్ ఠాక్రే స్మారకం విషయంపై స్వయంగా రాజ్ ఠాక్రేకు ఫోన్ చేస్తానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీంతో ఇరువురు ఠాక్రేలు స్మారకం అంశంతో పాటు తాజా రాజకీయలు, పొత్తు అంశంపై కూడా చర్చస్తుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే ఎలా స్పందిస్తారనే దానిపై ఇరు పారీ్టల పదాధికారులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఉద్ధవ్తో మైత్రికి ప్రయత్నాలు.. అయితే అప్పటికే రాష్ట్ర రాజకీయాలపై రాజ్ ఠాక్రే నిప్పులు చెరుగుతున్నారు. మనం ఎవరికి ఓటు వేశాం..? మనం ఓటువేసిన ప్రతినిధి ఏ పార్టీలో కొనసాగుతున్నారో తెలుసుకోలేని పరిస్ధితుల్లో ఓటర్లు ఉన్నారని పలుమార్లు అన్నారు. తను భవిష్యత్తులో ఎవరితోను పొత్తుపెట్టుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు అనేక సందర్బాల్లో వెల్లడించారు. అంతేగాకుండా సోదరులిద్దరూ ఒకటయ్యే విషయంపై ఇదివరకు ఉద్ధవ్కు రెండు సార్లు మైత్రి హస్తం చూపానని రాజ్ అన్నారు. కానీ ఏకైక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెన్నెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదని ఉద్ధవ్ భావించి ఉండవచ్చని అనేక సంవత్సరాలు వేచి చూశారు. ఉద్ధవ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో దూరంగా ఉండడమే ఉత్తమని రాజ్ భావించారు. -
ఆగస్టు 25, 26న ‘ఇండియా’ కూటమి సమావేశం
న్యూఢిల్లీ: 26 పార్టిలతో కూడిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 25, 26న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగనుంది. ఈ భేటీకి శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(శరద్ పవార్) ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. విపక్షాల తొలి సమావేశం బిహార్ రాజధాని పాటా్నలో, రెండో సమావేశం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగే మూడో సమావేశంలో ప్రధానంగా సీట్ల పంపకంపై విపక్ష నాయకులు చర్చించనున్నట్లు సమాచారం. -
‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్ను కలిసిన ఉద్ధవ్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీలో చీలిక తర్వాత మహా పాలిటిక్స్లో ‘పవార్’ పేరే జోరుగా వినిపిస్తోంది. తాజాగా ఎన్సీపీ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను శివసేన నేత (యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. బుధవారం ముంబైలో జరిగిన ఈ భేటీలో శివసేన నేత ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. కాగా అజిత్ పవార్ బీజేపీ, శివసేన (షిండే) ప్రభుత్వంలో చేరిన తర్వాత వీరిరువురు కలవడం ఇదే తొలిసారి. అయితే అజిత్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే గతంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సంగతి విదితమే. శివసేనలో చీలిక ఏర్పడి ఎంవీఏ ప్రభుత్వం కూలిపోవడానికి ముందు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవార్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అజిత్ పనితీరు తెలుసు: ఉద్ధవ్ అజిత్తో భేటీ అనంతరం ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు.. అజిత్ను మర్యాదపూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర ధృతరాష్ట్రుడిలా గుడ్డిది కాదని, ఛత్రపతి శివాజీ మహారాజా నడియాడిన రాష్ట్రమని తెలిపారు. అజిత్ రాష్ట్ర ప్రజలు, రైతుల కోసం మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో అజిత్తో కలిసి పనిచేశాను కాబట్టి అతని పని తీరు తెలుసని చెప్పారు. చదవండి: మేం వాళ్లకు అంటరానివాళ్లమేమో!: ఎంఐఎం విపక్షాల భేటీ మరుసటి రోజే.. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బెంగుళూరులో రెండు రోజులపాటు జరిగిన ప్రతిపక్ష పార్టీల కీలక భేటీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే అజిత్తో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు అజిత్ పవార్ సైతం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో సమావేశమయ్యారు. ఎన్డీయేలో చేరాలని శరద్ను కోరారు. కాగా అజిత్ తన బాబాయిని 24 గంటల వ్యవధిలో రెండుసార్లు (ఆది, సోమవారం) కలిశారు. అజిత్ తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్ పవార్ నివాసానికి చేరుకొని, పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. అయితే, తమ విజ్ఞప్తిని విన్న శరద్ పవార్.. మౌనంగా ఉన్నారని, ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. చదవండి: షాకింగ్ వీడియో.. మహిళా పైలట్ను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి.. VIDEO | Shiv Sena (UBT) leader Uddhav Thackeray meets Maharashtra Deputy CM Ajit Pawar in Mumbai. (Source: Third Party) pic.twitter.com/38w33jcPnv — Press Trust of India (@PTI_News) July 19, 2023 -
Sharad Pawar: ఆది నుంచి ఫిరాయింపులే!
1958 నాటి సంగతి; పూనా(ఇప్పుడు పుణె) సిటీ, ‘బృహన్ మహారాష్ట్ర కాలేజి ఆఫ్ కామర్స్’లో స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇరు ప్యానల్ అభ్యర్థులు చివరి రోజు రాత్రి తమ తమ విజయావకాశాలను బేరీజు వేసుకున్నారు. ఓటమిని శంకించిన ఓ గ్రూప్ లీడర్ ఒక పథకం వేశాడు. ఆ రోజు మధ్య రాత్రి, ఆయన ఓ నలుగురు మిత్రులతో హాస్టల్ గదుల్లో నిద్రిస్తున్న కొందరు రైవల్ గ్రూప్ విద్యార్థులను నిద్ర లేపి తమ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా బతిమాలాడు. బదులుగా, తన టీం గెలిచిన వెంటనే కాలేజి యాజమాన్యంతో సంప్రదించి వారి సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చాడు. తెల్లవారే వరకు ఈ ప్రచారం నడిచింది. మరుసటి రోజు జరిగిన ఎన్నికల్లో ఆయన టీం గెలిచింది. ఆ టీమ్ లీడర్ మరెవరో కాదు– శరద్ చంద్ర గోవిందరావ్ పవార్. కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన శరద్ రావ్ నేరుగా యూత్ కాంగ్రెస్ కార్యకర్త అయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎదిగి, తన 27వ ఏట (1967లో) ఎమ్మెల్యేగా ఎన్నికై వైబీ చవాన్ ఆశీస్సులతో మొదటిసారి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి (1972) కూడా అయ్యారు. 1977 లోక్ సభ ఎన్నికలలో జనతా పార్టీ ప్రభంజనంతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవటమే కాక, నిలువునా చీలి రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ (1978)గా ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1978లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ సాధించక పోవటంతో, రెండు కాంగ్రెస్ పార్టీలూ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వసంత్ దాదా పాటిల్ (రెడ్డి కాంగ్రెస్) ముఖ్య మంత్రి అయ్యారు. శరద్ పవార్ రెవెన్యూ మంత్రిగా ఆయన క్యాబినెట్లో చేరారు. కొన్ని రోజులకే, జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర శేఖర్ (మాజీ కాంగ్రెస్ యంగ్ టర్క్ లీడర్) స్నేహాన్ని ఆసరా చేసుకుని, యంగ్ పవార్ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పార్టీని వీడి, ప్రతిపక్ష జనతా పార్టీ మద్దతుతో తన 38వ ఏట (జూలై, 1978) ముఖ్య మంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తెల్లబోవటం కాకలు తీరిన రాష్ట్ర కాంగ్రెస్ నేతల వంతైంది. ఇందిరా గాంధీ 1980లో కేంద్రంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో శరద్ పవార్ సీఎం పదవి కోల్పోయారు. ఆ తర్వాత ‘కాంగ్రెస్ (సెక్యులర్)’ పేరుతో కొంత కాలం ప్రాంతీయ పార్టీ నడిపించారు పవార్ సాబ్. ఇందిరాజీ హత్య తరువాత రాజీవ్ గాంధీ పవార్ను, తన పార్టీ బలగంతో తిరిగి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. 1988 జూన్లో శరద్ పవార్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 1991లో నాగపూర్ అసెంబ్లీ సమావేశాల్లో, శివసేన పార్టీ అంతర్గత కుమ్ములాటను గమనించి, ఆ పార్టీ ఓబీసీ నేత చగన్ భుజ్బల్, మరో 16 మంది శివ సేన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ తీర్థం ఇప్పించారు సీఎం పవార్. ఆయన పర్యవేక్షణలో అలా శివసేన నుండి మొదటిసారిగా ‘వలసలు’ ప్రారంభమయ్యాయి. ఇక పదేళ్ల అనంతరం (2001) కొంతమంది పార్టీ నాయకులను తీసుకొని కాంగ్రెస్కు మరోసారి తిలోదకాలు ఇచ్చి, ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ’ (ఎన్సీపీ)ని స్థాపించారు. 1989 నుండి మూడు దశాబ్దాల వరకు హిందూత్వ భావజాలం పులుముకున్న శివసేన – భారతీయ జనతాపార్టీలు ప్రతీ ఎన్నికలోనూ కలిసే పోటీ చేశాయి. 1995–2000 ఈ కూటమి ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేసింది. ఇక 2019 ఎన్నికల్లో ఈ కూటమి 161 సీట్లు గెలవటంతో సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది, కాని అది కుదర్లేదు. కారణం, ముఖ్యమంత్రి పదవి తమకే చెందాలని 56 సీట్లు గెలుచుకున్న శివసేన మారాం చేయడమే. ఇంతలో ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, తన బాబాయి సీనియర్ పవార్ను కాదని భాజపాతో చేతులు కలిపారు. ఫలితంగా భాజపా నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం, అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం ఏర్పడింది. తనను విడిచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను పవార్ సాహెబ్ చాకచక్యంగా తిరిగి తన గూటిలోకి చేర్చుకోవటంతో అజిత్ పవార్ పాచిక పారలేదు. ఇక సంఖ్యా బలం కోల్పోయిన ఈ కొత్త ప్రభుత్వం, 60 గంటల్లోనే (26.11.2019న) పడిపోవటం విశేషం. ఆ తర్వాత శరద్ పవార్ రంగంలోకి దిగి, తనదైన శైలిలో చకచకా పావులు కదిలించారు. ‘మహా వికాస్ అఘాడి’ పేరుతో శివసేన (56), ఎన్సీపీ (54), కాంగ్రెస్ (44) కూటమిని ఏర్పాటు చేసి, శివసేన కోరిక మేరకే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా (28.11.2019) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో 105 స్థానాలు గెలిచిన భాజపా ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. దిగ్భ్రాంతికి గురైన భాజాపా తనతో శివసేనకు ఉన్న మూడు పదుల దోస్తీని తుంచిన శరద్ పవార్తో పాటు, శివసేన అధినాయకుడు ఉద్ధవ్కూ గుణపాఠం నేర్పాలని పకడ్బందీగా ప్లాన్ చేసింది. 45 ఏళ్ల క్రితం పవార్ రచించిన రాజకీయ స్క్రిప్ట్నే ఆదర్శంగా తీసుకొని 2022 జూన్లో ఏక్నాథ్ శిందేని ఉపయోగించి శివసేననూ, 2023 జూలైలో అజిత్ పవార్ను ఉపయోగించి ఎన్సీపీని... చీల్చి కొత్త ప్రభుత్వాల ఏర్పాటును దిగ్విజయంగా పూర్తి చేసి ‘టిట్ ఫర్ టాట్’ అంది భారతీయ జనతా పార్టీ. ఔను మరి, మహారాష్ట్రలో ప్రస్తుతం ఈ రెండు ప్రాంతీయ పార్టీలు (శివసేన, ఎన్సీపీ) సంస్థాపరంగా చెదిరి, కోలుకోలేని స్థితిలో, తెరచాప తెగిన నావలా మారాయి. చివరిగా, క్యాన్సర్ జబ్బుకు ‘షికార్’ అయినప్పటికీ, 83 ఏళ్ల సీనియర్ నేత శరద్ చంద్ర పవార్, ‘నా టైర్డ్ హు, నా రిటైర్డ్ హు’ అంటూ, ధీమాగా సానుభూతి కోసం (ఓటు బ్యాంకు), రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఇప్పుడు సుడిగాలి ప్రచారం మొదలు పెట్టారు. తన ఫార్ములా తనకే బెడిసి కొట్టడంతో ఏర్పడ్డ (రాజకీయ) గాయం, మరో వైపు పార్టీ అనుయాయులు తననే పార్టీ అధ్యక్ష పదవి నుండి వెలివేయటంతో ఒంటరి పక్షి అయ్యారు. ఈ సంక్షోభం నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి మరి! (శరద్ పవార్ స్వీయచరిత్ర ‘ఆన్ మై టర్మ్స్’, వైభవ్ పురంధరే రాసిన ‘ది రైజ్ ఆఫ్ ది శివసేన’ ఆధారంగా) జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత పి.ఎఫ్. కమిషనర్ ‘ 9819096949 -
ఇరు‘సేన’లకూ నోటీసులు.. వారంలోగా బదులివ్వాలి: స్పీకర్
ముంబై: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో శివసేన షిండే వర్గానికి చెందిన 40 మంది, యూబీటీ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చినట్టు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ శనివారం వెల్లడించారు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లకు ఏడు రోజుల్లోగా బదులివ్వాల్సిందిగా కోరినట్టు వివరించారు. వీరిలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, యూబీటీ వర్గం నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే తదితరులున్నారు. గతేడాది శివసేనలో చీలిక అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎంబీటీ వర్గానికి చెందిన రుతుజా లాట్కేకు నోటీసులు ఇవ్వలేదు. శివసేన నియమావళి తాలూకు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందుకున్నట్టు, షిండేతో పాటు 16 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ త్వరలో మొదలవుతుందని స్పీకర్ శుక్రవారం వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. అయితే తమకింకా ఎలాంటి నోటీసులూ రాలేదని సేన ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి సంజయ్ షిర్సత్ తెలిపారు. షిండే వర్గంపై తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై వేగవంతంగా విచారణ జరిపేలా స్పీకర్ను నిర్దేశాలు జారీ చేయాలంటూ కొద్ది రోజుల క్రితం సేన (యూబీటీ) వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ‘గత రెండు నెలలుగా ఈ విషయంలో స్పీకర్ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది’ అని యూబీటీ నేత అర్వింద్ సావంత్ చెప్పారు. ఇదీ చదవండి: అబద్ధాల బజార్లో దోపిడీ దుకాణం -
అజిత్ పవార్ చేరికపై అసంతృప్తి, సీఎం రాజీనామా!.. స్పందించిన శివసేన
సార్వత్రిక ఎన్నికలకు ముందు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతిపక్ష కూటమిలోనూ ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు చేయడంతో రోజుకో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీపై పట్టుకోసం బాబాయ్-అబ్బాయ్ మధ్య తీవ్ర వార్ నడుస్తోంది. అయితే ఎన్సీపీ నేత అజిత్ పవార్ పార్టీని చీల్చుతూ ఆయన మద్దతుదారులతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం, ఎనిమిది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఏక్నాథ్ శిండే(శివసేన) వర్గంలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శివసేనలో చిచ్చు మంత్రి పదవులు దక్కని కొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారని, అసంతృప్తితో ఉన్న 8–10 మంది మళ్లీ ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సైతం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. పార్టీలో నెలకొన్న అనిశ్చితిపై చర్చించేందుకే ముఖ్యమంత్రి షిండే తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని హడావిడీకి ముంబైకి వచ్చారని వదంతులు వ్యాపించాయి. ఏ గందరగోళం లేదు తాజాగా శివసేనపై వస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ నేత ఉదయ్ సావంత్ ఘాటుగా స్పందించారు. ఎన్సీపీ తిరుగుబాటు నేతలు అజిత్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరడంపై శివసేనలో ఎలాంటి విభేదాల్లేవని, ఎవరో గిట్టనివారు వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఏక్నాథ్ షిండే సీఎం పదవి నుంచి తప్పుకునే ఆలోచనలు కూడా లేనట్లు స్పష్టం చేశారు. తాము రాజీనామా లేఖలు ఇచ్చేవాళ్లం కాదని, తీసుకునే వాళ్లమని వ్యాఖ్యానించారు. చదవండి: NCP Crisis: అబ్బాయికి బాబాయ్ చురకలు సీఎం అత్యవసర భేటీ బుధవారం ముర్ముకు స్వాగతం పలికేందుకు నాగ్పూర్కు వెళ్లిన శిండే తన పర్యటనను అర్థంతరంగా ముగించుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన నివాసంలో అత్యవసరంగా భేటీ అయిన సంగతి తెలిసందే. ఈ క్రమంలో ఉదయ్ సావంత్ మాట్లాడుతూ.. ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగమని అన్నారు. షిండే సారథ్యంలో తమ ప్రభుత్వం ప్రశాంతంగా ముందుకు సాగుతోందని చెప్పారు. సీఎం ప్రతి ఒక్కర్నీ కలుపుకొంటూ వెళ్తారని, చివరి వరకు ఓపిక పట్టడమే ఆయన నాయకత్వ లక్షణమని ఆయన అన్నారు. బుధవారం నాటి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలందరూ సీఎంకు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఎన్సీపీతో వెళ్లవద్దని వాదన? శిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారని ఎన్సీపీతో వెళ్లకూడదని ఓ ఎమ్మెల్యే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయని, అలాంటిదేమీ జరగలేదన్నారు. ఎవరూ ఎటు వెళ్లాల్సిన పని లేదని, ప్రస్తుతానికి తమ ప్రభుత్వానికి 200 మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణ మెజార్టీ ఉందన్నారు. గతంలో తాము ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(ఉద్దవ్) నుంచి బయటకి వస్తే.. మమ్మల్ని ద్రోహులుగా చిత్రీకరించారని, ప్రస్తుతం ఎన్సీపీ కూడా అదే బాట పట్టిందని సామంత్ అన్నారు. అజిత్ పవార్ తమ ప్రభుత్వంలో కలవడం అంటే ఇప్పుడు శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి సరిగ్గా లేదనే అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. -
ఎన్సీపీ కొత్త చీఫ్గా అజిత్ పవార్.. జూన్ 30నే తీర్మానం!
ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో తలెత్తిన సంక్షోభం ముదిరింది. పార్టీలో రోజుకో కీలక మలుపు చోటు చేసుకుంటోంది. ఎన్సీపీపై ఆధిపత్యం కోసం పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, చీలిక వర్గం నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా శరద్ పవార్ను పార్టీ చీఫ్ పదవి తొలగిస్తూ ఆయన స్థానంలో అజిత్ పవార్ను నియమిస్తూ జూన్ 30నే తీర్మానం చేసినట్లు ఎన్సీపీ తిరుగుబాటు నేతలు వెల్లడించారు. రెండు రోజుల ముందే తీర్మాణం ఎన్సీపీ నుంచి వేరుపడే కొన్ని రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజిత్ వర్గం పేర్కొంది. ఈ మేరకు అజిత్ వర్గం ఎన్నికల కమిషన్కు బుధవారం ఒక పిటిషన్ సైతం సమర్పించింది. ఇందులో జూన్ 30న జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడిగా అజిత్ పవార్ను ఎన్నుకుంటూ తీర్మాణాన్ని ఆమోదించినట్లు తెలిపారు. దీనిపై దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మద్దతు ఇస్తూ ఆఫిడవిట్లపై సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు. హోటల్కు అజిత్ గ్రూప్ ఎమ్మెల్యేలు ఎన్సీపీ నుంచి వేరు కుంపటి ఏర్పాటు చేసిన అజిత్ గ్రూప్ పార్టీ పేరు, గుర్తు కోసం ఈసీని ఆశ్రయించారు. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమదే నిజమైన ఎన్సీపీ అని పార్టీ పేరు, గుర్తు తమకు కేటాయించాలని ఆరోపిస్తున్నారు. అంతేగాక అజిత్ పవార్ తన గ్రూప్ ఎమ్మెల్యేలందరిని ముంబై హోటల్లో ఉంచారు. అయితే తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శరద్ పవార్ విధేయుడు జయంత్ పాటిల్ నుంచి కూడా తమకు లేఖ అందిందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. చదవండి: 'అక్కడ చూస్తే నవ్వొచ్చింది..' ప్రతిపక్ష కూటమిపై ప్రపుల్ పటేల్ సెటైర్.. షిండే ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కాగా ఆదివారం అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఉప ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలోని బిజెపి-శివసేన ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసందే. అయితే ఈ పరిణామంపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి తన అపాయింట్మెంట్లన్నింటినీ రద్దు చేసుకొని తన అధికారిక నివాసంలో అత్యవసరంగా పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే, ఎన్సీపీతో ఎప్పుడు బంధం కలిగి లేరనే విషయాన్ని ఎత్తి చూపుతూ.. ఎన్సీపీతో పొత్తుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అజిత్ వెంట 32 మంది ఎన్సీపీ పార్టీపై ఆధిపత్యం కోసం ఇరువురు నేతలు బుధవారం బల ప్రదర్శనకు దిగారు. ఎమ్మెల్యేలు, అనుచరులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. పరస్పరం వాగ్బాణాలు విసురుకున్నారు. అయితే నంబర్గేమ్లో బాబాయిపై అబ్బాయి అజిత్దే పై చేయి అయింది. 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో అజిత్ సభకు 32 మంది హాజరయ్యారని ఆయన వర్గం నేతలు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకొచ్చారు. చదవండి: మొత్తం శరద్ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్పై సంచలన వ్యాఖ్యలు వారే కీలకం 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్సీల్లో ఐదుగురు ఇప్పటికే అజిత్కు మద్దతు ప్రకటించారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే అజిత్కు 36 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఆయనకు 40 మంది అండ ఉందని చీలిక వర్గం ఎమ్మెల్యే అనిల్ పాటిల్ చెప్పారు. ఇక శరద్ భేటీకి 18 మంది ఎమ్మెల్యేలే హాజరైనట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు ఇరు భేటీల్లోనూ పాల్గొనడం విశేషం!. మరికొందరు రెండు సమావేశాలకు హాజరుకాలేదు. అయితే ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలుండగా ఏ భేటీకీ వెళ్లని ఎమ్మెల్యేల మద్దతు రెండు వర్గాలకూ కీలకంగా మారేలా కన్పిస్తోంది. -
మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలో ఒక్కరోజులోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేతో కలిసి బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడం రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఏకంగా అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా తన వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి తాజాగా అజిత్ పవార్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరడంపై శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. త్వరలోనే మహారాష్ట్ర సీఎం మారనున్నారని వ్యాఖ్యానించారు. ఏక్నాథ్ షిండేకు పదవి గండం మొదలైందని, అజిత్ పవార్ త్వరలోనే మహారాష్ట్ర సీఎంగా బాద్యతలు చేపట్టనున్నారని చెప్పారు. దీంతో షిండే తన పదవిని కోల్పేయే ప్రక్రియ మొదలైందని, ఆయన 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని అన్నారు. ఈ పరిణామాన్ని ట్రిపుల్ ఇంజిన్ సర్కార్గా చూడరాదని.. రెండు ఇంజిన్లలో ఒకటి ఫెయిలవుతోందంటూ పేర్కొన్నారు. #WATCH | Uddhav Thackeray faction leader and MP Sanjay Raut, says "Today I am saying this in front of the camera, the Chief Minister of Maharashtra is going to change. Eknath Shinde is being removed. Eknath Shinde and the 16 MLAs are going to be disqualified" pic.twitter.com/R0YI0MwQwR — ANI (@ANI) July 3, 2023 సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు. ఈ విషయాన్ని నేను ఈ రోజు కెమెరా ముందు చెబుతున్నాను. ఏక్నాథ్ షిండేను సీఎంగా తొలిగిస్తారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా అనర్హత వేటుకు గురవుతారు. పవార్కు పట్టాభిషేకం చేస్తారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లను బీజేపీ విచ్ఛిన్నం చేస్తోంది. అయితే దీని వల్ల వారికి (బీజేపీ) ఎటువంటి ప్రయోజనం లేదు. 2024 ఎన్నికల్లో మేమంతా కలిసే పోరాడుతాం. ఎన్సీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని మోదీయే చెప్పారు. ఇప్పుడు అదే నేతలు రాజ్భవన్లోప్రమాణం స్వీకారం చేయడం షాకింగ్గా ఉంది’ అని పేర్కొన్నారు. కాగా ఎన్సీపీలో ఆదివారం చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అనూహ్యంగా షిండే- బీజేపీ ప్రభుత్వంలో చేరడంతో ఆ పార్టీ చీఫ్ శరద్పవార్కు పెద్ద షాక్ తగిలినటైంది. అజిత్ పవార్తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్ పాటిల్, సంజయ్ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రమేశ్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్ తోపాటు డిప్యూటీ స్పీకర్ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. #WATCH | Uddhav Thackeray faction leader and MP Sanjay Raut, says "BJP is breaking Shiv Sena, NCP and Congress but this will not benefit them at all. In Maharashtra, we will fight unitedly. It is shocking that PM Modi had said that the leaders of NCP are involved in corruption… pic.twitter.com/6VodgbNNXI — ANI (@ANI) July 3, 2023 -
హైదరాబాద్ లో మొదటి సారి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుంది
-
మాకు మద్దతివ్వండి
ముంబై: నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై విశ్వాసం లేదని, అందుకే ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు. ఆయన బుధవారం ముంబైలో శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా తమ పోరాటానికి మద్దతివ్వాలని ఠాక్రేను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్పై రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును వ్యతిరేకిస్తామని ఉద్ధవ్ హామీ ఇచ్చారన్నారు. సభలో ఈ బిల్లు విఫలమైతే 2024లో బీజేపీ ఓటమి తథ్యమని చెప్పారు. తమ పోరాటం కేవలం ఢిల్లీ కోసం కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఓడించడానికి తాము చేతులు కలిపామని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఈసారి బీజేపీని ఓడించకపోతే దేశంలో ఇక ప్రజాస్వామ్యం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఠాక్రే వర్గం శివసేనకు రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. కేజ్రివాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసి, మద్దతు కోరిన సంగతి తెలిసిందే. -
మహారాష్ట్ర సర్కార్కు ముప్పు లేదు.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సంక్షోభ సమయంలో తిరుగుబాటు చేసిన షిండేకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా అధికార ప్రభుతానికి ఎలాంటి ముప్పు లేదని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరనున్నారంటూ గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా అప్పటి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు ఎగరవేసిన ఏక్నాథ్ షిండే వర్గం 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్ధవ్ వర్గం శివసేన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్కు 79 పేజీల లేఖను అందజేసింది. స్పీకర్ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల డిప్యూటీ స్పీకర్కు లేఖ అందించినట్లు శివసేన నేత ప్రభు తెలిపారు. చదవండి: కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్ నుంచి వసూలు చేసుకోండి! దీనిపై అజిత్ పవార్ మాట్లాడుతూ..ఒకవేళ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా.. షిండే, ఫడ్నవీస్ల ప్రభుత్వం పడిపోదని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని సోమవారం ముంబైలో విలేకరు సమావేశంలో పేర్కొన్నారు. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా ప్రభుత్వం తన మెజారిటినీ కోల్పోదని తెలిపారు. కాగా ఏక్నాథ్ షిండే శివసేన, బీజేపీకి ప్రస్తుతం అసెంబ్లీలో 145 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతరులతో కలిపి మొత్తం అధికార కూటమికి 162 మంది శాసన సభ్యుల బలం ఉంది. అంతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్య కంటే 17 మంది ఎక్కువే ఉన్నారు. ఇదిలా ఉండగా శివసేన పార్టీలో ఏర్పడిన సంక్షోభంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సభలో ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయినట్లు నిర్ధారణకు రావడానికి తగిన సమాచారం లేకపోయినా మెజార్టీ నిరూపించుకోవాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించడం సరైంది కాదని తెలిపింది. గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ తన విచక్షాణాధికారాలను ఉపయోగించిన తీరు చట్టబద్దంగా లేదని తెలిపింది. అయితే ఉద్ధవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తేల్చిచెప్పింది. శాసనసభలో బల పరీక్షలను ఎదుర్కోకుండా ఆయన స్వచ్చందంగా రాజీనామా చేశారని తెలపింది. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. -
సరిదిద్దలేని మహా తప్పిదాలు
ఉత్కంఠగా ఎదురుచూసిన కోర్టు తీర్పు వచ్చింది. కానీ, న్యాయం మాత్రం ఇంకా జరగాల్సి ఉంది. శివసేన రెండు ముక్కలై వీధికెక్కిన వివాదంలో అయిదుగురు సభ్యుల సుప్రీమ్ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా గురువారం ఇచ్చిన తీర్పు తర్వాత పరిస్థితి అదే. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ శిందే వర్గాల మధ్య శివసేనలో అంతర్గత కలహాలు చివరకు ప్రభుత్వ మార్పిడిగా పర్యవసించినప్పుడు మహారాష్ట్ర గవర్నర్, శాసనసభ స్పీకర్లు అత్యుత్సాహం చూపిన తీరును కోర్టు తీవ్రంగా తప్పు బట్టింది. వారు చట్టప్రకారం నడుచుకోలేదని కుండబద్దలు కొట్టింది. కానీ, శివ సేనను వీడి, పార్టీని శిందే రెండు ముక్కలు చేసిన సందర్భంలో సభలో బలపరీక్షకు నిలవకుండానే రాజీనామా సమర్పించిన ఉద్ధవ్ సర్కార్ను పునరుద్ధరిస్తూ ఆదేశాలివ్వలేమనీ పేర్కొంది. జరిగింది తప్పేనని తీర్పు చెబుతూనే, పాత తప్పును ఇప్పుడు సరిదిద్దలేమని అశక్తత వ్యక్తం చేసింది. అంటే శిందే సర్కార్ కొనసాగేలా ఇప్పటికి ఊరట నిచ్చింది. అదే సమయంలో ఉద్ధవ్ రాజీనామా చేయకుండా, సభలో బలపరీ క్షకు దిగుంటే... ఆ బలపరీక్షే చట్టవిరుద్ధం గనక ఆయన సర్కారును పునరుద్ధరించే వీలుండేదని కోర్ట్ అభిప్రాయపడింది. అలా అప్పట్లో విప్ను ధిక్కరించిన శిందే అనర్హతకు తలుపు తెరిచే ఉంచింది. పార్టీ అంతర్గత విభేదాల లెక్క తేల్చేందుకు నాటి మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారీ శాసనసభలో బలపరీక్ష పెట్టాలని నిర్ణయించడం శుద్ధ తప్పు అనే మాట లోతైనది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్కు రాజకీయ పార్టీల అంతర్గత విభేదాలతో పనేమిటి? ప్రభుత్వం మద్దతు కోల్పోయినట్టు తగిన సాక్ష్యాధారాలేమీ లేకుండానే, స్వయానా గవర్నరే బలపరీక్ష జరపా లని కోరడమంటే... చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని అనివార్యంగా మెజారిటీ కోల్పోయేలా చేసి, కూలి పోయేలా చూడడమే! అంటే, కారణాలేమైనా తన చర్యల ద్వారా ఒక నిర్ణీత ఫలితం వచ్చేలా చేయ డమే! ఉద్ధవ్ సారథ్యంలోని ‘మహా వికాస్ అఘాడీ’ (ఎంవీఏ) కూటమి సర్కార్ రాజీనామాకు ఇదే కారణమైంది. ఇది గవర్నర్లు చేయాల్సిన పనేనా? ఈ కేసులో వాదనల సందర్భంగా సుప్రీమ్ ప్రస్తావించిన ఈ అంశాలు ఆలోచించాల్సినవి. కావాల్సిన పార్టీలకు అధికారం కట్టబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు గవర్నర్ల వ్యవస్థను వాడుకుంటున్న విషాదానికి ఇవన్నీ మహా చిహ్నాలు. మరోపక్క శిందే వర్గమే ‘అసలైన’ శివసేన అని గుర్తిస్తూ, దానికే పార్టీ చిహ్నమైన విల్లంబులను ఎన్నికల సంఘం కేటాయించడమూ తొందరపాటే. అలాగే, అసెంబ్లీ స్పీకర్ సైతం శిందే వర్గానికి అనుకూలంగా ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకటించే వరకు ఆ వర్గపు ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత ఫిర్యాదులను నానబెట్టడం మరో తప్పు. ఇలా గవర్నర్, స్పీకర్, ఎన్నికల సంఘం సహా అన్ని రాజ్యాంగ సంస్థలూ తప్పుదోవ పట్టిన తీరును సుప్రీమ్ తన తీర్పులో బలంగా ప్రస్తావించడం గమనార్హం. శివసేన కథలో తదుపరి ఘట్టం మరింత విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందున్న వేళ ఇవన్నీ కూడా మళ్ళీ లెక్కలోకి రాక మానవు. అలాగే, విప్ జారీ అయినా సరే చీలిక ముసుగులో పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే తిప్పలు తప్పవనీ తేలిపోనుంది. వెరసి, తాజా తీర్పు మన ప్రజాస్వామ్య వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపడం ఖయం అనిపిస్తోంది. గతంలోకెళితే ఈ కథలో ఎన్నో మలుపులు. 2019 అక్టోబర్లో బీజేపీ–శివసేన కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. మరిన్ని మంత్రి పదవులు, రెండున్నరేళ్ళ పాటు సీఎం పీఠం కట్టబెట్టాలని ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన డిమాండ్ చేసింది. అలాంటి ఒప్పందమేదీ లేదని బీజేపీ అడ్డం తిరిగింది. దాంతో గెలిచిన పక్షం రోజులకే కూటమి విచ్ఛిన్నమైంది. కమలనాథుల సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సొచ్చింది. అప్పటి నుంచి మహారాష్ట్రలో కొత్త పొత్తులు, ప్రభుత్వాలు– సీఎంల మార్పులు, కాంగ్రెస్– ఎన్సీపీ– శివసేనల ‘ఎంవీఏ’ కూటమి ఆవిర్భావం... ఇలా అనేకం జరిగాయి. వాటిలో భాగమే 2022 జూన్లో ఏకంగా శివసేన వ్యవస్థాపకుడైన బాల్ఠాక్రే కుమారుడూ, అప్పటి మహారాష్ట్ర సీఎం అయిన ఉద్ధవ్పై శిందే తిరుగుబాటు. గవర్నర్ బలపరీక్ష నిర్ణయంతో ఉద్ధవ్ జూన్ 29న రాజీనామా చేశారు. ఆ మర్నాడే బీజేపీ అండతో శిందే సీఎం కుర్చీ ఎక్కారు. శిందే, ఆయనతో బయటకొచ్చి పార్టీ తమదేనన్న మరో 15 మంది అనర్హత కథ కొన్నాళ్ళుగా కోర్టులో నలుగుతోంది. తీర్పు నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి శిందే సర్కార్ రాజీనామా చేయాలని ఉద్ధవ్ కోరుతుంటే, కోర్టు వ్యాఖ్యలెలా ఉన్నా తమను కొనసాగనివ్వడమే ప్రజాస్వామ్య విజయమని శిందే, ఫడ్నవీస్లు జబ్బలు చరుస్తున్నారు. విస్తృత ధర్మాసనంలో కథ ఏ కొత్త మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమను కాదని ప్రత్యర్థులతో కూటమి కట్టిన మునుపటి మిత్రపక్షం శివసేనను నిలువునా చీల్చడంలో బీజేపీ ఇప్పటికే సఫలమైంది. సొంతంగా చక్రం తిప్పేందుకు అదను కోసం చూస్తోంది. అది రుచించకున్నా, బీజేపీ దోస్తీ లేకుండా శిందే సేన మనుగడ కష్టం. మరోపక్క తన వెంట మిగిలిన కొద్దిమందీ చేజారిపోకుండా కాపాడుకోవడం ఉద్ధవ్ ముందున్న సవాలు. ఈ పరిస్థితుల్లో తాజా తీర్పు ఉద్ధవ్కు నైతికంగా బలమిచ్చింది. కోర్టు తీర్పుతో కుర్చీ దక్కకున్నా, గవర్నర్ అవాంఛనీయ పాత్రతో ప్రత్యర్థులు అధికారం చేజిక్కించుకున్న తీరును తప్పుబట్టడమే ఊరట. అనర్హతలపై స్పీకర్ సత్వరమే నిర్ణయించాలనీ కోర్ట్ చెప్పడం గమనార్హం. అందుకే, ముందే అన్నట్టు తీర్పు వచ్చినా, న్యాయం ఇంకా జరగాల్సి ఉంది. కోర్టు లోపల ఒక దశ పోరాటం ముగిసి ఉండవచ్చు. మరోదశ మిగిలివుంది. కోర్టు బయట కూడా ఉద్ధవ్ తదితరుల నైతిక పోరాటం దీర్ఘకాలం కొనసాగుతుంది. సుప్రీమ్ వ్యాఖ్యలతోనైనా మన రాజ్యాంగ వ్యవస్థలు దిద్దలేని తప్పిదాలకు దూరంగా ఉంటాయా? -
థాక్రేకు ఫడ్నవీస్ కౌంటర్.. మీకు ఆ పదాలు సూట్ కావు అంటూ..
ముంబై: మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర గవర్నర్ బలపరీక్ష నిర్ణయాన్ని తప్పు పట్టింది. చీలిక వర్గానికి శివసేన అని చెప్పుకునే అధికారం లేదు. బలపరీక్ష ప్రాతిపదికన పార్టీ గుర్తు కేటాయించడం సరికాదు. మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. పార్టీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం రాజ్యాంగ సమ్మతం కాదు. ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. బలపరీక్ష ఎదుర్కోలేదు. కాబట్టి స్టేటస్కోను పునరుద్ధరించడం సాధ్యం కాదు. తిరిగి ఆయనను సీఎంగా నియమించలేం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ఉద్దవ్ థాక్రేకు పొలిటికల్ కౌంటర్ ఇచ్చారు. కాగా, ఫడ్నవీస్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దవ్ థాక్రే వర్గానికి నైతికత గురించి మాట్లాడే హక్కులేదు. వారు బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, తర్వాత కాంగ్రెస్తో జట్టుకట్టారు. నైతిక విలువలు వంటి పదాలు ఉద్ధవ్కు సరిపోవు. నేను ఆయన్ను ఓ విషయం అడగాలనుకుంటున్నా. సీఎం పదవి కోసం ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసినప్పుడు ఆ విలువలను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. గతంలో ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు. అంతకాలం తనతో ఉన్నవ్యక్తులు వెళ్లిపోవడంతో భయపడి రాజీనామా చేశారు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇదే క్రమంలో ఉద్దవ్ వర్గంపై విరుచుకుపడ్డారు. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కుట్రలు ఓడిపోయాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చట్టబద్ధతపై ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇది పూర్తిగా చట్టబద్ధమైంది అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. ప్రభుత్వాన్ని పునరుద్దరించి ఉండేవాళ్లం -
థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. : సుప్రీం కోర్టు
ఢిల్లీ: శివసేన కేసులో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నైతిక విజయంగా భావిస్తోంది థాక్రేకు చెందిన శివసేన వర్గం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో థాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమన్న రాజ్యాంగ ధర్మాసనం.. అసెంబ్లీలో జరిగే బలపరీక్షలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కిందటి ఏడాది శివసేన పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభ పరిస్థితుల్లో.. బలనిరూపణ పరీక్షకు వెళ్లకుండానే ఉద్దవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఇవాళ్టి తీర్పులో ప్రధానంగా ప్రస్తావించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్. ఒకవేళ థాక్రే గనుక రాజీనామా చేసి ఉండకపోయి ఉంటే.. ఈ కోర్టు ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించి ఉండేదని స్పష్టం చేసింది. ► విప్ను నియమించాల్సింది రాజకీయ పార్టీ. అంతేగానీ శాసనసభా పక్షం కాదు. కాబట్టి, ఏక్నాథ్ షిండే క్యాంప్ నియమించిన విప్ చెల్లుబాటు కాదు. కాబట్టి, శివసేన విప్గా భరత్ గోగావాలేను నియమిస్తూ హౌజ్ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సరికాదు. ► అలాగే.. ఒక పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలను, లేదంటే పార్టీల మధ్య నెలకొన్న కలహాలను బలనిరూపణ పరీక్ష పరిష్కరించలేదు. ► ఆ సమయంలో ఉద్దవ్ థాక్రే పార్టీ మెజార్టీ కోల్పోయారనే అధికారిక సమాచారం నాటి గవర్నర్ వద్ద లేదు. అయినా ఆయన బలనిరూపణకు ఆదేశించారు. ఆయనది రాజకీయ జోక్యం.. తొందరపాటు నిర్ణయం. ఆ నిర్ణయం తప్పు కూడా అని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ► గవర్నర్ విచక్షణాధికారం అమలు చేయడం చట్టానికి అనుగుణంగా లేదని సుప్రీం కోర్టు కానిస్టిట్యూషన్ బెంచ్ అభిప్రాయపడింది. ► అయితే.. బలపరీక్షకు వెళ్లకుండా ఉద్దవ్ థాకక్రే రాజీనామా చేసిన క్రమంలో.. బీజేపీ మద్దతు ద్వారా మెజార్టీ ఉందని ప్రకటించుకున్న షిండే వర్గాన్ని.. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడం ద్వారా గవర్నర్ సరైన పనే చేశారని బెంచ్ అభిప్రాయపడింది. అలాగే.. బలనిరూపణకు ముందుకు వెళ్లలేని సీఎంను.. ఇవాళ తన ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించమని అడిగే హక్కు కూడా ఉండదు అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ► చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్తో పాటు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. మొత్తం 141 పేజీల తీర్పు కాపీని ఈ కేసు కోసం సిద్ధం చేసింది. ► ఈ సందర్భంగా 2018 నాబమ్ రెబియా కేసు(తన తొలగింపును కోరుతూ తీర్మానం పెండింగ్లో ఉన్నప్పుడు స్పీకర్ అనర్హత ప్రక్రియను ప్రారంభించలేరని)ను ప్రస్తావించిన బెంచ్.. ఆ కేసులోనూ పలు అంశాలపై నిర్ణయాలు జరగలేదని, కాబట్టి విస్తృత ధర్మాసనానికి అంశాల్ని బదిలీ చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. దీంతో.. శివసేన కేసులో ఇంకా తుది తీర్పు రాలేదనే భావించాలి. ► ఇక సుప్రీం కోర్టు తీర్పు తమ నైతిక విజయమని పేర్కొన్న ఉద్దవ్ థాక్రే.. ఇప్పుడున్న సీఎం, డిప్యూటీ సీఎంలకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా తన మాదిరే రాజీనామా చేయాలంటూ ఉద్దవ్ థాక్రే పిలుపు ఇచ్చారు. ► మరోవైపు సుప్రీం కోర్టు తమకు అనుకూలంగానే ఉందని షిండే వర్గం ప్రకటించుకుంది. మహారాష్ట్రలో ఇప్పుడు సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగేందుకు వీలు కలిగిందని అభిప్రాయపడింది. -
శరద్ పవార్ రాజీనామా చేశారంటే.. దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది..!
ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం తనను షాక్కు గురి చేసిందని తెలిపారు ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. ఆయన అంత పెద్ద నిర్ణయం తీసుకన్నారంటే కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఏదో అలజడి జరగబోతోందని అన్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంతో చూసి తాము ఓ నిర్ణయం తీసుకుంటామని రౌత్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచిననట్లు తెలిపారు. గతంలో బాలాసాహెబ్ థాక్రే కూడా దిగజారుడు రాయకీయాలు చూసి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే శివసైనికుల విజ్ఞప్తులతో బాలాసాహెబ్ అప్పుడు తన నిర్ణయాన్ని ఉపసంహరిచుకున్నారని, ఇప్పుడు పవార్ కూడా రాజీనామాను వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. పవార్ను బాలాసాహెబ్తో పోల్చారు. చదవండి: శరద్ పవార్ రాజీనామా తదనంతరం మరో ఎన్సీపీ నేత రాజీనామా కాగా.. తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్ల పవార్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయవద్దని ప్రాధేయపడుతున్నారు. ఓ కార్యకర్త అయితే రాజీనామా ఉపసంహంరించుకోవాలని పవార్కు రక్తంతో లేఖ రాశాడు. మరోవైపు పవార్ రాజీనామా అనంతరం ఎన్సీపీ కార్యదర్శి జితేంద్ర అవ్హాద్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. థానే ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు అందరూ కూడా రాజీనామ ా చేసినట్లు తెలిపారు. పవార్ తప్పుకోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు.. -
మహారాష్ట్రలో మరో ట్విస్ట్.. పవార్, ఉద్దవ్కు బిగ్ షాక్!
ముంబై: మహారాష్ట్రలో మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే, పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సమంత్ సంచలన కామెంట్స్ చేశారు. ఉద్దవ్ వర్గం శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి చెందిన 33 మంది ఎమ్మెల్యే తమతో టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు పొలిటికల్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వివరాల ప్రకారం.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్లో ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు షిండే గ్రూపుతో టచ్లో ఉన్నారని మంత్రి ఉదయ్ సమంత్ పేర్కొన్నారు. అలాగే, మహాబలేశ్వర్లోని సీఎం షిండేతో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రహస్యంగా సమావేశమయ్యారని అన్నారు. కాగా, ఉదయ్ సమంత్ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండేతో టచ్లో ఉన్నారని తెలిపారు. సీఎంకు మద్దతు తెలిపేందుకు రెడీ ఉన్నారని స్పష్టం చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్దవ్ వర్గం అప్రమత్తమైనట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ఖర్ఘర్ ఘటన తర్వాత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఆ పదవి నుంచి తప్పిస్తారనే చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా, షిండే వ్యవహార శైలి వల్ల బీజేపీ మంత్రులు, నాయకుల్లో ఆగ్రహం పెరుగుతోందని, సీఎం పలు ఫైళ్లను క్లియర్ చేయడం లేదని సమాచారం. బీజేపీ రాష్ట్ర నేతలు హైకమాండ్కు సమాచారం అందించినప్పటికీ, కర్ణాటక ఎన్నికల వరకు వేచి ఉండాలని రాష్ట్ర నాయకత్వానికి చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్.. బీజేపీ నేతలతో టచ్లోకి వచ్చినట్టు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో, అజిత్ పవార్ మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ స్పందించారు. తన చివరి శ్వాస వరకు ఎన్సీపీలోనే ఉంటానని పవార్ స్పష్టం చేశారు. #BREAKING "13 remaining MLAs of the Shiv Sena (UBT), around 20 MLAs & senior Congress leaders too are in touch with CM #EknathShinde," Maharashtra minister #UdaySamant claims.@AruneelS shares more developments in Maharashtra's politics with @prathibhatweets. pic.twitter.com/gNIJUeFz2h — TIMES NOW (@TimesNow) April 28, 2023 ఇది కూడా చదవండి: సినీ ఫక్కీలో బీజేపీ నేత హత్య -
మహా వికాస్ అఘాడీకి కోర్టులో చుక్కెదురు
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో 227 వార్డులుండాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలాగే కొనసాగించాలని ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో 236 వార్డులుండాలని దాఖలుచేసిన రెండు పిటిషన్లను తిరస్కరించింది. ఫలితంగా హైకోర్టులో మహా వికాస్ అఘాడీకి గట్టి దెబ్బ తగిలినట్లైంది. అంతేగాకుండా హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ మహా వికాస్ అఘాడీ సుప్రీంకోర్టును ఆశ్రయించని పక్షంలో ఓటర్ల జాబితా, వార్డుల రిజర్వేషన్, వార్డుల పునరి్వభజన, ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తదితర ప్రక్రియ పూర్తిచేయాలి. దీన్ని బట్టి బీఎంసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. అక్టోబరులో లేదా నవంబరులో అంటే దీపావళిలోపు బీఎంసీ ఎన్నికల నగారా మోగే అవకాశముంది. అఘాడీ ప్రభుత్వంలోనే నిర్ణయం రెండేళ్ల కిందట ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఎంసీ వార్డుల సంఖ్య 227 నుంచి 236కు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అందుకు వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ముంబై సిటీ, పశ్చిమ ఉపనగరం, తూర్పు ఉపనగరంలో మూడు చొప్పున ఇలా తొమ్మిది వార్డులు పెరిగాయి. కానీ వార్డుల హద్దులన్నీ తారుమారయ్యాయి. ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాలన్నీ మరో వార్డులోకి వెళ్లిపోయాయి. దీంతో కచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్న సిట్టింగ్ కార్పొరేటర్ల అంచనాలు తారుమారయ్యాయి. కానీ ఏక్నాథ్ షిందే 50 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంవల్ల మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తరువాత షిందే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 2022 జూన్ ఒకటో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మహా వికాస్ అఘాడీ తీసుకున్న 236 వార్డుల పెంపు నిర్ణయాన్ని రద్దు చేసింది. 2017లో జరిగిన జనగణన ప్రకారం 227 వార్డులు ఉండాలని షిందే, ఫడ్నవీస్ మంత్రివర్గం తీర్మానించింది. కానీ 227 ఉంచాలని షిందే, ఫడ్నవీస్ మంత్రిమండలి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు రాజు ఫడ్నేకర్, సమీర్ దేశాయ్ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎస్.బి.శక్రే, ఎం.డబ్ల్యూ చాంద్వాని బెంచి ఇరువురు సమర్పించిన పిటిషన్లను కొట్టివేసింది. మూడోసారి వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వార్డుల రిజర్వేషన్ లాటరీ జాబితాను ఇదివరకు రెండుసార్లు రద్దు చేయాల్సి వచి్చంది. ఇప్పుడు తాజాగా కోర్టు తీర్పుతో మూడోసారి వార్డుల రిజర్వేషన్ లాటరీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మొదటిసారి రాష్ట్ర ఎన్నికల సంఘం 2021, మే 31న వార్డుల రిజర్వేషన్ లాటరీ వేసింది. ఆ తరువాత ప్రత్యేక వెనకబడిన తరగతులు (ఓబీసీ) రిజర్వేషన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడంతో జూలై 29న మళ్లీ కొత్తగా వార్డుల రిజర్వేషన్ లాటరీ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చింది. ఇప్పుడు 227 వార్డులు ఉంచాలని షిందే, ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలాగే కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మూడోసారి వార్డుల రిజర్వేషన్, వార్డుల పునరి్వభజన చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. 2021 జనగణన జరగకుండా వార్డుల సంఖ్య పెంపు ఎలా? బీఎంసీలో కార్పొరేటర్ల సంఖ్య 2001లో జరిగిన జనగణన ప్రకారం 227 ఉండాలని నిర్ణయించారు. కానీ 2011లో చేపట్టిన జనగణనలో జనాభా పెరిగినప్పటికీ కార్పొరేటర్ల సంఖ్య పెంచలేదు. కాగా 2001 నుంచి 2011 మధ్య కాలంలో ముంబైలో జనాభా 3.87 శాతం పెరిగింది. దీంతో పెరిగిన జనాభా, పెరిగిన నగర విస్తరణను పరిగణంలోకి తీసుకుని కార్పొరేటర్ల సంఖ్య 227 నుంచి 236కు పెంచాలని అప్పటి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ముంబై సిటీ, పశి్చమ, తూర్పు ఉప నగరాల్లో మూడు చొప్పున మొత్తం 9 వార్డులు పెంచింది. కానీ వార్డుల సంఖ్య పెంచాలంటే తాజాగా అంటే 2021లో చేపట్టిన జనగణనను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 2021లో జనగణన జరగనే లేదు. ఇక 9 వార్డులు పెంచాల్సిన అవసరమేముందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అనేక సార్లు ప్రశ్న లేవనెత్తింది. అయినప్పటికీ ఎన్నికల సంఘం వార్డుల రిజర్వేషన్ లాటరీ ప్రక్రియ పూర్తిచేసి జాబితా కూడా విడుదల చేసింది. ఆ తరువాత ఓబీసీ రిజర్వేషన్ అమలు కావడంతో రెండోసారి లాటరీ ప్రక్రియ చేపట్టాల్సి వచి్చంది. చివరకు ఏక్నాథ్ షిందే తిరుగుబాటు చేసి శివసేన నుంచి బయటపడటం, ఆ తరువాత నాటకీయ పరిణాల మధ్య షిందే ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడం అన్ని చకచకా జరిగిపోయాయి. దీంతో మçహా వికాస్ అఘాడీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి ఎప్పటి లాగే వార్డుల సంఖ్య 227 ఉంచాలని నిర్ణయం తీసుకుంది. వార్డుల సంఖ్య తగ్గింపు శివసేనపై ప్రభావం వార్డుల సంఖ్య 236 నుంచి 227కు తగ్గడంవల్ల దీని ప్రభావం శివసేనపై చూపనుంది. వార్డుల పునరి్వభజన, తొమ్మిది వార్డులు తగ్గిపోవడంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో వివిధ పారీ్టలతో పోలిస్తే శివసేనకు ఎక్కువ శాతం నష్టం వాటిళ్లే ప్రమాదముంది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం తొమ్మిది వార్డులు పెంచాలని అప్పట్లో తీసుకున్న నిర్ణయంతో వార్డులను పునర్విభజన చేశారు. మొత్తం 236 వార్డుల్లో అధిక శాతం శివసేనకు అనుకూలంగా ఉన్నాయి. కానీ తాజాగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమరి్థంచడంతో పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. 2017 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో శివసేన 84, బీజేపీ 82 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వాలు మారడంతో ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరులో జరిగే బీఎంసీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. -
Maharashtra: శిండే వర్గంతో కలిసే పోటీ! అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ..
సాక్షి, ముంబై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది సూచనప్రాయంగా ఓ అంగీకారానికి వచ్చామని, వచ్చే ఎన్నికల్లో శిండే వర్గంతో కలిసే పోటీచేయనున్నట్లు బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ భావన్కుళే వెల్లడించారు. ఇరువురం కలిసి 200 స్థానాలకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున సీట్ల పంపకాలు, సర్దుబాట్లపై పలు చర్చలు జరుపుతామని ఆ తర్వాతే తుది జాబితాను అధికారికంగా విడుదల చేస్తామని భావన్ కుళే శనివారం మీడియాకు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా అందులో బీజేపీ 240, శివసేన (శిండే వర్గం) 48 స్థానాల్లో పోటీ చేస్తుందని బావన్కుళ్లే తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరగనున్న నేపథ్యంలో దాదాపు ఏడాది కాలం సమయం అన్ని పారీ్టలకు ఉండగా...శిందే, బీజేపీ శిబిరంలో మాత్రం ఎన్నికల వాతావరణం అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది. ఎంవీఏ ఒప్పందంతో మొదలైన వేడి మహా వికాస్ ఆఘాడి నేతలు లోక్సభ ఎన్నికల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే ఫార్మూలా రూపొందించిన విషయం తెలిసిందే. మొత్తం 48 లోక్సభ స్థానాల్లో శివసేన 21, ఎన్సీపీ 19, కాంగ్రెస్ 8 స్థానాల్లో పోటీ చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శిండే, ఫడ్నవీస్ కూడా అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన సూచనప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ శిండే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తన మొదటి ప్రసంగంలో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మేం, బీజేపీ కలిసే పోటీ చేస్తామని ప్రకటించారు. ఇరువురం కలిసి 200 స్థానాల్లో గెలుస్తామని ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ మేరకు సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోంది. వైరల్ అవుతోన్న భావన్ కుళే వ్యాఖ్యలు ఇదిలాఉండగా చంద్రశేఖర్ భావన్ కుళే మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో పోటీ చేస్తుందని, దీంతో కార్యకర్తలందరూ ఇప్పటి నుంచి అప్రమత్తమై, పనుల్లో నిమగ్నం కావాలని సూచించినట్లు ఉంది. అంటే శిండే వర్గానికి కేవలం 48 స్థానాలు లభిస్తాయని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. భావన్ కుళే వ్యాఖ్యలపై శిండే వర్గానికి చెందిన సంజయ్ శిర్సాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఎంత వరకు మాట్లాడే అధికారముందో అంతే మాట్లాడాలని అంతకుమించి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు. అసెంబ్లీ సీట్ల పంపకంపై ఇంతవరకు ఎలాంటి చర్చ జరగలేదని, ఇది కేవలం భావన్ కుళే అభిప్రాయమని స్పష్టం చేసి ఈ అంశానికి అక్కడితో తెరదించారు. ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే అంశంపై దృష్టి కేంద్రీకరించామని శిర్సాట్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీట్ల పంపకంపై పలుమార్లు చర్చలుంటాయని, ఆ తర్వాత తుది నిర్ణయానికి రాగానే అధికారికంగా జాబితా వెల్లడిస్తామని తెలిపారు. అప్పటివరకు అసెంబ్లీ, లోక్సభ సీట్లు సర్దుబాటు ఫార్మూలాపై వచ్చిన ఎలాంటి వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. -
బహిరంగంగానే మహిళా నేతను ముద్దు పెట్టుకున్న శివసేన ఎమ్మెల్యే?
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే చిక్కుల్లో పడ్డారు. దహిసర్లో ఆశీర్వాద్ యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ ర్యాలీలో పార్టీ మహిళా నేతను ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఎమ్మెల్యే.. పార్టీ అధికార ప్రతినిధి షీతల్ మ్హత్రేను బుగ్గ మీద ముద్దాడినట్లు కనిపిస్తుంది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ర్యాలీకి శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే, పార్టీ అధికార ప్రతినిధి శీతల్ మ్హత్రే హాజరయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ వాహనం మీద ఉన్నారు. ఆయన పక్కనే షీతల్ నిలబడి ఉన్నారు. ఉన్నట్టుండి ఎమ్మెల్యే రెండుసార్లు కిందకు వంగి మహిళా నేతను ముద్దు పెట్టుకున్నట్లు, ఆమె వైపు చూస్తూ నవ్వడం వీడియో ద్వారా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వీడియోపై ఎమ్మెల్యే స్పందించారు. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో ఫేక్ అని తేల్చారు. తన పరువు తీసేందుకు, రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి వీడియోను మార్ఫింగ్ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. అంతేగాక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివసేన నేతలు ముద్దుపెట్టుకుంటున్న వీడియోను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 354,509,500,34, 67 కింద దహిసర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుతో సంబంధమున్న ఇద్దరు నిందితులను 26 ఏళ్ల మానస్ కువార్, 45 ఏళ్ల అశోక్ మిశ్రాగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. खुल्लम खुल्ला प्यार करेंगे हम दोनो. .. .. pic.twitter.com/6ubh6gg4MZ — जाग्रुत जनता (@foundat11) March 12, 2023 అంతేగాక ఈ వ్యవహారంపై శీతల్ మ్హత్రే స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్లో ’రాజకీయాల్లో ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు ఇంత నీచానికి దిగజారుతారా? ఇదేనా మీ సంస్కృతి? మాతోశ్రీ అనే ఫేస్బుక్ పేజీ నుంచి మార్ఫింగ్ చేసిన వీడియోని అప్లోడ్ చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో మీకు బాలాసాహెబ్ సంస్కారం గుర్తుకు రాలేదా?’ అంటూ దుయ్యబట్టారు. राजकारणामधील महिलेसंदर्भात बोलण्यासारखे काही नसले तर तिचे चारित्र्यहनन करणे हेच उद्ध्वस्त गटाचे संस्कार आहेत?? मातोश्री नावाच्या fb पेजवरुन एका स्त्री संदर्भात असा morphed video upload करताना बाळासाहेबांचे संस्कार नाही का आठवले? pic.twitter.com/rpaqbMtiZU — sheetal mhatre (@sheetalmhatre1) March 11, 2023 -
ఊహించని పరిణామం.. ఉద్దవ్తో కేజ్రీవాల్ భేటీ.. దేనికి సంకేతం!
ముంబై: మహారాష్ట్రలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. శివసేన(ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అధినేత ఉద్దవ్ ఠాక్రేను కలిశారు. ముంబైలోని బాంద్రాలో ఉద్దవ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎంపీలు రాఘవ్ చద్దా, సంజయ్ రౌత్లు కూడా పాల్గొన్నారు. కేజ్రీవాల్కు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య థాక్రే, భగవంత్మాన్ దగ్గరుండి స్వాగతం పలికారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ఆదిత్య ఠాక్రే ట్విటర్లో షేర్చేశారు. తమ ఆహ్వానాన్ని అంగీకరించి టీ తాగూందేరేమాతోశ్రీకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఉద్దవ్ మాట్లాడుతూ.. దేశాన్ని బలోపేతం చేసే మార్గాలపై నేతలంతా చర్చించినట్లు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు వెల్లడించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించున్నట్లు పేర్కొన్నారు. మూడేళ్లుగా ఉద్ధవ్ను కలవాలనుకుంటున్నా కోవిడ్ తదితర కారణాల వల్ల కలవలేకపోయానని కేజ్రీవాల్ చెప్పారు. శివసేన పార్టీ పేరును, గుర్తును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం లాక్కుందని విమర్శించారు. ఠాక్రేకు మద్దతిస్తూ.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఉద్ధవ్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఉద్ధవ్తో ఆప్ అధినేత సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి జోష్లో ఉన్న ఆప్.. బీఎంసీ ఎన్నికలపై సైతం దృష్టి పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ ఎన్నికల్లో ఆప్, ఉద్దవ్ శివసేన రెండూ కలిసి పోటీ చేసే అవకాశమూ లేకపోలేదు. అయితే ప్రస్తుతానికి దీనిపై స్పష్టత రాలేదు. ఇదే విషయంపై కేజ్రీవాలన్ను ప్రశ్నించగా.. ఎన్నికలు వచ్చినప్పుడు మీకే తెలుస్తుందని అన్నారు. కాగా ఇటీవలే సీఎం ఏక్నాథ్ షిండే వర్గాన్నే అసలైన శివసేనగా ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ గుర్తు విల్లు బాణాన్ని సైతం షిండే వర్గానికే కేటాయించింది. ఇది జరిగిన వారం రోజుల్లోనే కేజ్రీవాల్, ఉద్దవ్ను కలవడం విశేషం. వీరి భేటీ బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. Thank you CM @ArvindKejriwal ji for accepting our humble invite for a cup of tea at Matoshri and coming along with CM @BhagwantMann ji and MPs Sanjay Singh ji and @raghav_chadha today. pic.twitter.com/HOhYAqfyul — Aaditya Thackeray (@AUThackeray) February 24, 2023 -
శివసేన వివాదం: షిండే వర్గానికి సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: శివసేన పార్టీ పేరు, గుర్తును ఏక్నాథ్ షిండే(ప్రస్తుత మహరాష్ట్ర ముఖ్యమంత్రి) వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్దవ్ థాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా.. థాక్రే వర్గానికి ఊరట ఇవ్వలేదు దేశ అత్యున్నత న్యాయస్థానం. కానీ, థాక్రే వర్గ పిటిషన్కు కౌంటర్ దాఖలు చేయాలంటూ షిండే క్యాంప్కు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఇక పార్టీ పేరు, గుర్తును ఒక వర్గానికి కేటాయించిన ఈసీ ఆదేశాలపై స్టే విధించాలని థాక్రే వర్గం సుప్రీంను అభ్యర్థించగా.. అందుకు మాత్రం నిరాకరించింది సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. వాళ్లు(షిండే శిబిరం) ఈసీ వద్ద విజయం సాధించారు. ఈ తరుణంలో స్టే విధించలేమంటూ బెంచ్ స్పష్టం చేసింది. అలాగే.. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా లేని ఏదైనా చర్య తీసుకుంటే గనుక.. చట్టానికి సంబంధించిన ఇతర పరిష్కారాలను అనుసరించవచ్చని సుప్రీం కోర్టు థాక్రే శిబిరానికి సూచించింది. శివసేన ఉద్దవ్ బాలాసాహెబ్ థాక్రే పేరుతో పార్టీ పేరును.. వెలుగుతున్న టార్చ్ సింబల్ను గుర్తుగా ఉపయోగించుకోవచ్చన్న ఈసీ నిర్ణయాన్ని చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా పిటిషనర్కు సూచించారు. ఆపై పిటిషన్పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు. -
ఎన్నికల్లో నిలబడ్డా ఈ పార్టీలు కక్షగట్టి ఓడిస్తాయ్ సార్!
ఎన్నికల్లో నిలబడ్డా ఈ పార్టీలు కక్షగట్టి ఓడిస్తాయ్ సార్! -
ఇంతకూ శివసేన ఆస్తులు ఎవరివో!? లెక్క తేలుతుందో?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఆగర్భ శత్రువుల్లాంటి పాపార్టీ లతో జట్టుకట్టిన ఉద్ధవ్ ఠాక్రే, అందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. అదను చూసి సొంత పార్టీ నేత ఏక్నాథ్ షిండే చేసిన తిరుగుబాటుతో అటు అధికారమూ కోల్పోయారు. షిండే వర్గానిదేనన్న సిసలైన శివసేన అన్న ఈసీ తాజా నిర్ణయంతో ఇటు తన తండ్రి స్థాపించి, వారసత్వంగా తనకప్పగించి వెళ్లిన పార్టీ కే పరాయి వాడిగా మిగిలిపోయారు! ఇప్పుడిక శివసేన కార్యాలయం, ఆస్తులు, నిధులు తదితరాలన్నీ కూడా షిండే వర్గం పరమవుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది... – సాక్షి, నేషనల్ డెస్క్ శివసేన పేరు, పార్టీ గుర్తు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికే చెందుతాయన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ఉద్ధవ్కు భారీ ఎదురుదెబ్బే. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కుమారునిగా ఆయనకు ఇంతటి దుస్థితి కొంతకాలం క్రితం ఎవరూ ఊహించనిదే! చివరి ప్రయత్నంగా ఈసీ తీర్పుపై ఉద్ధవ్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కోర్టు తీర్పుపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. కానీ ఈలోపు పార్టీని పూర్తిగా చెప్పుచేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలకు షిండే వర్గం పదును పెడుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన శాసనసభాపక్ష కార్యాలయాన్ని సోమవారమే స్వాదీనం చేసుకుంది. తాజాగా పార్లమెంటులోని శివసేన కార్యాలయాన్ని కూడా షిండే వర్గానికే కేటాయిస్తున్నట్టు లోక్సభ సచివాలయం మంగళవారం పేర్కొంది. ఇదే ఊపులో శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం, ముంబైతో పాటు మహారాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ప్రాంతీయ కార్యాలయాలు, ఇతర ఆస్తులు, సొంత పత్రిక సామ్నాతో పాటు పార్టీ నిధులను కూడా సొంతం చేసుకుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉద్ధవ్ వర్గం అదీనంలో ఉన్న పార్టీ ఆస్తుల అప్పగింత కోరబోమని షిండే గతంలో చెప్పినా దానికిప్పుడు కట్టుబడబోరని పరిశీలకులు అంటున్నారు. ‘‘ఇలాంటి ఆస్తుల తాయిలాలకు లొంగినవారే 2019లో అధికార లాలసతో తప్పటడుగు వేశారు. ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ ఆగర్భ శత్రువులైన పార్టీలతో జట్టుకట్టారు. అందుకే ఆస్తులు, పార్టీ నిధులపై మాకెలాంటి ఆశా లేదు. కేవలం బాల్ఠాక్రే ఆదర్శాలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా ఏకైక లక్ష్యం’’ అని అప్పట్లో షిండే పదేపదే చెప్పుకొచ్చారు. అయితే, ‘‘మా తిరుగుబాటులో న్యాయముందని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడమే మా నాయకుని వ్యాఖ్యల అంతరార్థం. అంతే తప్ప న్యాయంగా మాకు దక్కాల్సిన వాటిని వదులుకునే ప్రశ్నే లేదు’’ అని షిండే వర్గం కుండబద్దలు కొడుతోంది. శివసేనపై సర్వం సహా హక్కులు తమవేనని రుజువు చేసుకోవడం కోసమైనా భవనాలు, ఆస్తులు తదితరాలన్నింటినీ వీలైనంత త్వరగా తమపరం చేసుకోవడమే సరైందని ఆయన వర్గం గట్టిగా భావిస్తున్నట్టు సమాచారం. పార్టీ నిధుల మాటేమిటి? గ్రాంట్లు, విరాళాలు, చందాలు, పత్రిక విక్రయాలు తదితరాల రూపేణ శివసేనకు 2020–21లో రూ.13 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్టు ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికను బట్టి తెలుస్తోంది. ఇవి తమకే చెందుతాయని షిండే వర్గం కోరవచ్చు. దీన్ని ఊహించే ఈ నిధులను ఉద్ధవ్ ఇప్పటికే వేరే ఖాతాలకు మళ్లించినట్టు చెబుతున్నారు. దీనిపైనా కీచులాట తప్పకపోవచ్చు. అనుబంధ సంఘాలు ఇక శివసేన అనుబంధ సంఘాలైన స్థానీయ లోకాధికార్ సమితి, భారతీయ కామ్గార్ సేన వంటివి సంఘాలు, విభాగాలుగానే పరిగణనలోకి వస్తాయే తప్ప పార్టీగా కాదు. కనుక వీటి యాజమాన్యం ఎవరిదన్నది కేంద్ర కారి్మక చట్టాల ఆధారంగా తేల్చాల్సి ఉంటుందని శివసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సేన ప్రాంతీయ కార్యాలయాలు శివసేనకు ఆయువుపట్లుగా భావించే పార్టీ ప్రాంతీయ కార్యాలయాలు (శాఖలు) ముంబై, పరిసర ప్రాంతాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. వీటిని వీలైనంత త్వరగా స్వా«దీనం చేసుకునే దిశగా షిండే వర్గం పావులు కదుపుతోంది. అయితే దీనికి చెక్ పెట్టేందుకు శాఖలను శివాయ్ సేవా ట్రస్ట్కు బదలాయించాలని ఉద్ధవ్ వర్గం భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా, ముంబై వెలుపల ఉన్న శాఖలు చాలావరకు ఆయా శాఖా ప్రముఖ్లు (స్థానిక మండళ్లు), ట్రస్టుల పేరిటే ఉన్నాయని ఉద్ధవ్ వర్గం ఇప్పటికే గట్టిగా వాదిస్తోంది. అవి తమకే చెందాలని షిండే వర్గం గానీ, మరెవరు గానీ కోరడానికి అవకాశం లేదని ఉద్ధవ్ సేన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్ చెబుతున్నారు. ఈ లెక్కన ప్రాంతీయ కార్యాలయాల విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య సంఘర్షణ తప్పేలా కన్పించడం లేదు. శివసేన భవన్ శివసేన ప్రధాన కార్యాలయం. ముంబైలో ఉంది. షిండే వర్గమే అధికారిక శివసేనగా రుజువైతే ఈ భవనం వారికే సొంతం కావాలి. కానీ అది శివసేన ట్రస్టు యాజమాన్యంలో ఉండటం అడ్డంకిగా మారేలా కని పిస్తోంది. పైగా దీని సారథి సుభాష్ దేశాయ్ ఠాక్రేల కుటుంబానికి విధేయుడు. అంతేగాక ఉద్ధవ్, దేశాయ్తో పాటు ట్రస్టీలుగా ఉన్న మిగతా నలుగురూ ఉద్ధవ్ అనుయాయులే! అంతమాత్రాన శివసేన భవన్ ఉద్ధవ్ వర్గం చెప్పుచేతుల్లోనే ఉంటుందని కూడా చెప్పలేని పరిస్థితి! ఎందుకంటే ట్రస్టు ఆస్తిగా ఉన్న భవనాన్ని దశాబ్దాల పాటుగా రాజకీయ పార్టీ కార్యాలయంగా వాడుకోవడం మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్టుల చట్టం నిబంధనలకు విరుద్ధం. అధికారంలో ఉన్న షిండే వర్గం ఈ కోణం నుంచి నరుక్కొస్తే భవన వివాదంపై పీటముడి పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిపై ఓ న్యాయవాది ఇప్పటికే కోర్టుకెక్కారు కూడా. ఆ కేసులో ఉద్ధవ్ వర్గం వాదనలు విని పించాల్సి ఉంది. సామ్నా ఎవరికో? శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్థాపించిన సామ్నా అప్పట్లో మహారాష్ట్ర రాజకీయాల్లోనే గాక దేశవ్యాప్తంగా కూడా సంచలనమే. ముఖ్యంగా తీవ్ర పదజాలంతో బాల్ ఠాక్రే రాసే సంపాదకీయాలు, విమర్శనాత్మక కథనాలు, మరీ ముఖ్యంగా వ్యంగ్య కార్టూన్లు జాతీయ స్థాయిలో సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారేవి. దానితో పాటు కార్టూన్ మేగజైన్ మార్మిక్ ను కూడా శివసేన వెలువరిస్తోంది. ఈ పత్రికలు, వాటి కార్యాలయాల యాజమాన్యం షిండే వర్గం చేతికి రావడం కష్టంగానే కని పిస్తోంది. ఎందుకంటే అవి కూడా పార్టీ అజమాయిషిలో కాకుండా ప్రబోధన్ ప్రకాశన్ అనే ట్రస్టు యాజమాన్యంలో కొనసాగుతున్నాయి. -
ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి: ఉద్ధవ్
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ‘శివసేన పేరు, విల్లు, బాణం గుర్తును మా వద్ద నుంచి దొంగిలించారు. కానీ, థాకరే పేరును మాత్రం దొంగిలించలేరు’ అని సోమవారం మీడియాతో అన్నారు. ఈసీ అంత హడావుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై తాము వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో బహుశా మంగళవారం విచారణకు రావొచ్చని అన్నారు. ‘‘ఎన్నికల సంఘం ఉత్తర్వులు తప్పు. సుప్రీంకోర్టే మా చివరి ఆశా కిరణం’’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ‘నేడు మాకు జరిగినట్లే రేపు మరొకరికి జరగొచ్చు. ఇలాగే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. ఎన్నికలూ ఉండవు’ అని హెచ్చరించారు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల నేపథ్యంలో మమతా బెనర్జీ, శరద్ పవార్, నితీశ్ కుమార్, తదితర విపక్ష నేతలు తనకు ఫోన్ చేసి మద్దతు తెలిపారన్నారు. సుప్రీం తలుపుతట్టిన ఉద్ధవ్ వర్గం షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ, విల్లు, బాణం ఎన్నికల గుర్తు కేటాయించడాన్ని ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్పై అత్యవసర విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తిరస్కరించింది. ‘‘నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. సరైన ప్రక్రియను అనుసరించి మంగళవారం న్యాయస్థానం ముందుకు రండి’’ అని సీజేఐ సూచించారు. -
అమిత్ షాపై విమర్శ.. బీజేపీ కౌంటర్
ముంబై: ఎన్నికల సంఘం నిర్ణయంతో శివసేన పార్టీ పేరు, గుర్తు చేజారిపోయిన క్రమంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే తీవ్ర విమర్శలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి.. తీవ్ర విమర్శలు చేశారాయన. అలాగే.. మొగాంబో ఖుష్ హువా, అమిత్ షాపై థాక్రే చేసిన కామెంట్ రాజకీయ దుమారం రేపింది. మొగాంబో అనేది ఎయిటీస్లో(1987) వచ్చిన మిస్టర్ ఇండియా చిత్రంలోని విలన్ క్యారెక్టర్. శేఖర్కపూర్ డైరెక్షన్లో అనిల్కపూర్-శ్రీదేవి కాంబోలో వచ్చిన ఈ సూపర్ హీరో చిత్రం.. క్లాసిక్గా నిలిచింది. ఈ చిత్రంలో విలన్ మొగాంబో పాత్రను అమ్రిష్ పురి అత్యద్భుతంగా పండించారు. ఆ విలన్ను క్యారెక్టర్ను.. అమిత్ షాకు ఆపాదించడంతో బీజేపీ కౌంటర్ ఎటాక్కు దిగింది. అమిత్ షా మొగాంబో అయితే.. ఉద్దవ్ థాక్రే మాత్రం మిస్టర్ ఇండియా హీరో రోల్ అంటూ సెటైర్లు వేశారు ముంబై బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భట్ఖాల్కర్. ఉద్దవ్ థాక్రే బీజేపీ అధినాయకత్వాన్ని మొగాంబోతో పోలుస్తున్నారు. ఇలాంటి మూర్ఖపు కామెంట్ల నడుమ ఆయనకు అర్థంకాని విషయం ఒకటి ఉంది. ఆయన తనకు తెలియకుండానే మిస్టర్ ఇండియా(వాచీ పెట్టకుని మాయమైపోయే హీరో క్యారెక్టర్) లాగా మాయమైపోతున్నాడు. మహారాష్ట్ర రాజకీయాల నుంచి ఉద్దవ్ థాక్రే దాదాపు కనుమరుగు అయ్యే పరిస్థితికి చేరుకున్నారు. ఇక మీరు ఇంట్లోనే ఉండాల్సిన టైమొచ్చింది అని ఉద్దవ్ థాక్రేను ఉద్దేశించి అతుల్ సెటైర్లు సంధించారు. -
ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి: థాక్రే
ముంబై: శివసేన విషయంలో.. సుప్రీం కోర్టు తమకున్న చివరి ఆశాకిరణమని పేర్కొన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే పేర్కొన్నారు. షిండే(ప్రస్తుత ముఖ్యమంత్రి) వర్గానికి శివసేన పార్టీ పేరు, గుర్తును ఎన్నికల సంఘం.. కేటాయించడం తెలిసిందే. ఈ పరిణామంపై ఇవాళ(సోమవారం) సుప్రీం కోర్టును ఆశ్రయించింది థాక్రే వర్గం. ఆపై ఉద్దేవ్ థాక్రే మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ పేరు, గుర్తు నేరుగా ఒక వర్గానికి కేటాయించిన సందర్భం గతంలో ఏనాడూ లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారాయన. ములాయం సింగ్ ఏనాడూ కోర్టుకు వెళ్లలేదు. అందుకే సమాజ్వాదీ పార్టీ నేరుగా అఖిలేష్ యాదవ్ చేతికి వెళ్లింది. మరి అలాంటప్పుడు ఎన్నిక సంఘం ఎందుకు అంత ఆదరా బాదరాగా పార్టీ పేరును, గుర్తును షిండే వర్గానికి కేటాయించింది. అసలు ఎన్నికల సంఘానికి కేవలం గుర్తుల నియంత్రణ మాత్రమే ఉంటుందన్న విషయాన్ని గుర్తుచేశారాయన. అలాగే దేశంలో ఎన్నికల కమిషన్ను రద్దు చేయాలని, ఎన్నికల కమిషనర్లను ప్రజలే ఎన్నుకోవాలని ఉద్ధవ్ థాక్రే అభిప్రాయపడ్డారు. ఇక ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎన్నికల సంఘం వేచి ఉండాల్సిందని థాక్రే పేర్కొన్నారు. ఇవాళ మీరంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు? నా దగ్గర ఏమీ లేకుండా పోయింది. ప్రతీది నా నుంచి దోచుకున్నారు. అయినా మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారని నేను అడగాలనుకుంటున్నాను. మరో వర్గం మా పార్టీ పేరు, గుర్తు తీసేసుకున్నప్పటికీ.. థాక్రే అనే మా పేరును మాత్రం లాక్కోలేరు. బాలాసాహెబ్ థాక్రే(బాల్ థాక్రే) కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. ఢిల్లీ సహాయంతో కూడా వాళ్లు దానిని పొందలేరు అని తీవ్ర అసంతృప్తిగా వ్యక్తం చేశారాయన. ప్రజాస్వామ్యిక సంస్థల సాయంతోనే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని థాక్రే ఆవేశపూరితంగా మాట్లాడారు. ఇవాళ బీజేపీ మనకు ఏదైతే చేసిందో.. ఎవరితోనైనా చేయగలదు. ఇది ఇలాగే కొనసాగితే.. 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు అనేవి కనిపించవు. నేనెప్పుడూ హిందుత్వాన్ని విడిచిపెట్టలేదు, హిందువులెవరైనా ఇప్పుడు మాట్లాడాలి అని పేర్కొన్నారాయన. -
శివసేనను షిండేకు ఇవ్వడంపై సుప్రీంకోర్టుకు ఉద్ధవ్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టను ఆశ్రయించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకోకుండానే ఈసీ నిర్ణయం తీసుకుందని, శివసేన మెజారిటీ కార్యకర్తలు తమవెంటే ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను వీలనైంత త్వరగా విచారించాలని థాక్రే తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ అత్యున్నత స్థానాన్ని అభ్యర్థించారు. అయితే న్యాయస్థానం మాత్రం ఈ పిటిషన్ ఇవాల్టి లిస్టింగ్లో లేదని మంగళవారం సరైన ప్రక్రియతో రావాలని సూచించింది. అయితే సీఎం ఏక్నాథ్ షిండే కూడా సుప్రీంకోర్టును ముందుగానే ఆశ్రయించారు. శివసేన గుర్తు కేటాయింపుపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని థాక్రే సవాల్ చేయవచ్చని, దీనిపై ఆదేశాలు ఇచ్చే ముందు మహారాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయన్ని తీసుకోవాలని కోరారు. చదవండి: శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం రూ.2,000 కోట్ల డీల్: సంజయ్ రౌత్ -
షిండే వర్గమే సిసలైన శివసేన: ఈసీ
ముంబై: మహారాష్ట్ర రాజకీయంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏక్నాథ్ షిండే వర్గానికే సిసలైన శివసేన గుర్తింపు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అంతేకాదు పార్టీ విల్లు బాణం గుర్తును షిండే వర్గానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్రలో ఎనిమిది నెలల ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. బాల్ థాక్రే తనయుడు ఉద్దవ్ థాక్రేకు షాక్ ఇస్తూ.. శివసేన పార్టీ గుర్తింపును ఏక్నాథ్ షిండే(ప్రస్తుత మహారాష్ట్ర సీఎం) వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసింది. మహా వికాస్ అఘాడి కూటమి(శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఇతరులు)ని వ్యతిరేకిస్తూ.. గత జూన్ నెలలో కొందరు ఎమ్మెల్యేలతో శివసేన నుంచి బయటకు వచ్చేశారు ఏక్నాథ్ షిండే. ఆపై బీజేపీ సాయంతో రెబల్స్ను పలు ప్రాంతాలకు తిప్పుతూ.. చివరకు బీజేపీ సాయంతోనే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా షిండే, డిప్యూటీగా బీజేపీ నేత.. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్లు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ తరుణంలో థాక్రే వర్గం, షిండే వర్గం సిసలైన శివసేన గుర్తింపు కోసం న్యాయ పోరాటానికి దిగాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం.. శివసేనపార్టీ పేరును, పార్టీ గుర్తైన విల్లు బాణంను పక్కనపెట్టి మరీ ఇరు వర్గాలకు ప్రత్యేక పేర్లు, గుర్తులను కేటాయించాలి. అయితే ఈసీ నిర్ణయంపై థాక్రే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. కిందటి నెలలో.. ఇరు వర్గాలు సిసలైన శివసేన అంటూ తమ తమ వాదనలతో కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట రాతపూర్వక ప్రకటనలు సమర్పించారు. ఈ తరుణంలో పోలింగ్ విభాగం ఇవాళ షిండే వర్గానికి శివసేన పార్టీ గుర్తును, సింబల్ను కేటాయించి.. థాక్రే వర్గానికి భారీ షాక్ ఇచ్చింది. -
అవిశ్వాసం పెండింగ్లో ఉన్నందున నిర్ణయాధికారం లేదంటూ సుప్రీం తీర్పు
-
మహారాష్ట్ర ఎమ్మెల్యేల అనర్హత కేసు.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి షాక్!
న్యూఢిల్లీ: 2016 నబం రెబియా తీర్పును పునఃపరిశీలన కోసం ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి పంపాలన్న శివసేన థాక్రే వర్గం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరిస్కరించింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నిజానిజాల గురించి తెలుసుకోకుండా పున:పరీశలనకు పంపలేమని చెప్పింది. శివసేన థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గం మధ్య విభేదాల గురించి ఫిబ్రవరి 21న విచారణ చేపడతామని శుక్రవారం పేర్కొంది. 2016 తీర్పు.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్కున్న అధికారాలపై అరుణాచల్ ప్రదేశ్లోని నబమ్ రెబియా కేసులో 2016లో సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం శాసనసభ స్పీకర్ను తొలగించిన నిర్ణయం సభలో పెండింగ్లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం సభాపతికి ఉండదు. దీని ఆధారంగా తమపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లదని ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన షిండే వర్గం ఎమ్మెల్యేలు వాదించారు. దీంతో న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే దీన్ని థాక్రే వర్గం సవాల్ చేసింది. రెబియా కేసులో తీర్పును పునఃసమీక్షించాలని, విసృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని కోరింది. కానీ సుప్రీంకోర్టు ఇందుకు నిరాకరించింది. కేసు యోగ్యతలు తెలుసుకోకుండా అలాంటి సూచన చేయలేమని స్పష్టం చేసింది. చదవండి: అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్ -
కర్ణాటకతో సరిహద్దు వివాదంపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ముంబై: మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదంపై శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా బలగాలు భారత్లోకి ప్రవేశించినట్లే తాము కూడా కర్ణాటకలోకి వెళ్తామన్నారు. ఈ విషయంలో తమకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. కర్ణాటక సీఎంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని తాము భావించామని, కానీ ఆయనే అగ్గి రాజేసి రెచ్చగొడుతున్నారని రౌత్ విమర్శించారు. ఇటు మహారాష్ట్రలో ప్రస్తుతం బలహీన ప్రభుత్వం అధికారంలో ఉందని, సరిహద్దు వివాదంపై తటస్థంగా ఉంటూ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈమేరకు రౌత్ బుధవారం మీడియాతో మాట్లాడారు. #WATCH | Like China has entered, we will enter (Karnataka). We don't need anyone's permission. We want to solve it through discussion but Karnataka CM is igniting fire. There is a weak govt in Maharashtra & is not taking any stand on it: Sanjay Raut, Uddhav Thackeray's faction pic.twitter.com/d0okV6Wq8X — ANI (@ANI) December 21, 2022 మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం ఆందోళనకర స్థాయికి చేరింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటివలే చర్చలు జరిపారు. అయితే ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. చదవండి: జోడో యాత్రపై రాహుల్కు కేంద్రం హెచ్చరిక.. -
మహా వికాస్ అఘాడీ భారీ నిరసన ర్యాలీ
ముంబై: ఏక్నాథ్ షిండే– బీజేపీ నేతృత్వంలోని రాష్ట్రపాలనను వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ (మహా వికాస్ అఘాడీ–ఎంవీఏ) కూటమి ఆధ్వర్యంలో ముంబైలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఛత్రపతి శివాజీ మహరాజ్, మహా త్మా ఫూలే వంటి మహనీయులను మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీ అవమానించడాన్ని ఎంవీఏ కూటమి తీవ్రంగా తప్పబట్టింది. కోష్యారీని గవర్నర్ పదవి నుంచి వెంటనే తప్పించాలని కూటమి అగ్రనేతలు డిమాండ్చే శారు. ముంబైలోని బైకుల్లాలో ప్రారంభమైన ‘హల్లా బోల్’ నిరసన ర్యాలీ.. నాలుగు కిలో మీటర్లు కొనసాగి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ వద్దకు చేరుకున్నాక ఉద్ధవ్ ఠాక్రేసహా కూటమి నేతలు ర్యాలీ వేదికపై ప్రసంగించారు. ‘ గవర్నర్ను పదవి నుంచి వెంటనే తప్పించాలి. లేదంటే మీకు గుణపాఠం నేర్పిస్తాం’ అని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ హెచ్చరించారు. -
ఉద్ధవ్పై కేసు.. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుటుంబసభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని గురువారం బాంబే హైకోర్టుకు ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తెలిపారు. మరోవైపు, ఉద్ధవ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలంటూ బాంబే హైకోర్టులో మహిళా పబ్లిషర్ గౌరి బిధే వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై తీర్పును డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది. చదవండి: (కొలీజియం మన దేశ చట్టం.. అందరూ అనుసరించాల్సిందే: సుప్రీంకోర్టు) -
రాహుల్ను ప్రశంసలతో ముంచెత్తిన సంజయ్ రౌత్.. కటీఫ్ లేనట్టే?
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా గతవారం వీర్ సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. సావర్కర్ను అవమానించేలా మాట్లాడితే అవసరమైతే కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుంటామని శివసేన హెచ్చరించింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినట్లు కన్పిస్తోంది. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. రాహుల్పై ప్రశంసల వర్షం కురిపించడం చూస్తుంటే ఇది స్ఫష్టమవుతోంది. సోమవారం ట్వీట్ చేసిన రౌత్.. రాహుల్ గాంధీ తనకు ఆదివారం ఫోన్ చేసినట్లు వెల్లడించారు. జైలు నుంచి తిరిగివచ్చిన తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని, యోగ క్షేమాలు అడిగితెలుసుకున్నట్లు వివరించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ తీరిక లేకుండా ఉన్నప్పటికీ రాహుల్ తనతో మాట్లాడారని రౌత్ చెప్పుకొచ్చారు. తాను జైలుకు వెళ్లినప్పుడు బీజేపీలోని తన మిత్రులు సంబరపడ్డారని విమర్శించారు. వాళ్లు మొగలుల కాలం నాటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ రాహుల్ తమతో కలిసి ముందుకు సాగాలనుకుంటున్నట్లు రౌత్ పేర్కొన్నారు. ప్రేమ, కరుణపైనే ప్రధానంగా దృష్టి సారించి ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని కొనియాడారు. రౌత్ వ్యాఖ్యలను గమనిస్తే మహావికాస్ అఘాడీకి బీటలు పడే అవకాశాలు లేనట్లే కన్పిస్తోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి. pic.twitter.com/FpaxllR7jk — Sanjay Raut (@rautsanjay61) November 21, 2022 చదవండి: మెగాస్టార్పై ప్రధాని ప్రశంసల వర్షం.. తెలుగులో ట్వీట్ చేసిన మోదీ -
శిందే వర్గంలో చేరే ప్రసక్తే లేదు.. ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోనే..
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గంలో తాను చేరే ప్రసక్తే లేదని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మహిళా నేత రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ నీలమ్ గోర్హె స్పష్టం చేశారు. తానెప్పటికీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోనే కొనసాగుతానని వెల్లడించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...తాను శిందే వర్గంలో చేరబోతున్నానంటూ మీడియా ఆధారాల్లేని వార్తల్ని రాసిందని, ఆ వార్తల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. శ్రద్ధావాకర్ హత్యకేసులో అఫ్తాబ్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించేందుకు మాత్రమే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశానని, ఆ భేటీలో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆమె వెల్లడించారు. అదేవిధంగా అదే కార్యక్రమంలో సీఎం శిందే, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్లు కూడా పాల్గొని బిర్లాను కలిశారని తెలిపారు. చదవండి: నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. గుజరాత్లో బీజేపీకి షాక్ తగులుతుందా? -
ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యల దుమారం... ఏక్నాథ్ షిండ్పై విమర్శలు
ముంబై: ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అలా ఎలా చూస్తూ... కూర్చొన్నారంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. గవర్నర్ భగత్ సింగ్ని తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్ని కూడా రాజీనామ చేయాలంటూ డిమాండ్ చేశారు. గవర్నర్ భగత్ సింగ్ ఈ ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు రౌత్. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ మౌనంగానే ఉందంటూ విరుచుకుపడ్డారు. ఆత్మగౌరవ నినాదం ఇచ్చి మరీ శివసేనను విచ్ఛిన్నం చేసి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన షిండేకు ప్రస్తుతం ఆ ఆత్మగౌరవం ఏమైందంటూ ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు కూడా శివాజీ మహారాజ్ ఔరంగజేబుకు ఐదు సార్లు క్షమాపణలు చెప్పారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు మహారాష్ట్రకు క్షమాపణ చెప్పడమే కాకుండా తక్షణమే గవర్నర్ని తొలగించాలి అని ఒత్తిడి చేశారు . తాము కాంగ్రెస్ నాయకుడు రాహల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా వీర సావర్కర్పై చేసిన వ్యాఖ్యలను ఖండించి తమ పార్టీ నిరసన తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీ బహిరంగంగానే శివాజీ మహారాజ్ని పలుమార్లు విమర్మించిందన్నారు. కాబట్టి షిండే రాజీనామ చేయాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వంలో కొనసాగకూడదంటూ సీరియస్ అయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.... శివాజీ మహారాజ్ పాత విగ్రహాలు అయిపోయాయని, ఇప్పుడూ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నితిన్ గడ్కరీ వంటి వారెందరో అందుబాటు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉద్ధవ ఠాక్రే వర్గానికి చెందిన వ్యక్తులకు గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు మింగుడుపడం లేదు. దీంతో గవర్నర్ గొప్ప గొప్ప వ్యక్తులను అగౌరవపరిచే వ్యక్తి అంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. రాహుల్ వీర సావర్కర్పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ బూట్లతో దాడి చేస్తోంది. మరీ ఇప్పుడూ గవర్నర్ చేసిన పనికి రాజ్భన్పైకి చెప్పులతో వెళ్లాలంటూ మండిపడ్డారు. గవర్నర్ వ్యాఖ్యలు ప్రకారం కృష్ణుడు, రాముడు పాత్ర విగ్రహాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడూ మనం కొత్త దేవతలను ఆరాధించాలా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అలాగే శివసేన పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే ఛత్రపతి శివాజీ మహారాజ్ మా ఆరాధ్యదైవం మాత్రమే కాదు, ఎప్పటికీ అందరికి ఆదర్శప్రాయుడని అన్నారు. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్తో శివసేన తెగదెంపులు?) -
ఉద్ధవ్ శివసేన కార్యాలయం కూల్చివేత..ముంబైలో ఉద్రిక్తత..
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయాన్ని అధికారులు శనివారం కూల్చివేశారు. శివసేన కార్యకర్తలు దీన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్యాణ్ ఈస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగానే ఈ కార్యాలయన్ని తొలగించినట్లు కల్యాణ్ డాంబివిల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఓ ఆటస్థలానికి కేటాయించిన స్థలంలో శివసేన కార్యాలయం ఉందని, అందుకే కూల్చివేశామని చెప్పారు. ఈ ఆఫీస్తో పాటు ఇతర అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసినట్లు స్పష్టం చేశారు. ఉద్ధవ్ శివసేన వర్గం మాత్రం రాజకీయ ప్రతీకారంతోనే తమ కార్యాలయాన్ని కూల్చివేశారని పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిడితోనే అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. గత 17 ఏళ్లుగా ఈ కార్యాలయం ఉందని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు చెప్పడమేంటని ప్రశ్నించారు. చదవండి: సౌరాష్ట్ర ఎవరికి సై? -
రాహుల్ వ్యాఖ్యలపై రగడ.. మహా వికాస్ అగాడీకి బీటలు?
ముంబై: వీర సావర్కార్పై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విమర్శలు మహారాష్ట్రలో రాజకీయ కాక రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గురువారం సావర్కర్పై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. ఆయన బ్రిటిష్ వారికి భయపడి క్షమాభిక్ష కోరారని, గాంధీ, పటేల్, నెహ్రూ వంటి స్వాతంత్య్ర సమర యోధులకు ద్రోహం చేశారని ఆరోపణలు గుప్పించారు. వీటిపై కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మండిపడుతోంది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహా వికాస్ అగాడీ నుంచి బయటికి వచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. రాహుల్ వ్యాఖ్యలను ఉద్ధవ్ ఠాక్రే వెంటనే ఖండించడం తెలిసిందే. మహారాష్ట్రులకు ఆరాధ్యుడైన సావర్కర్ వ్యతిరేక వ్యాఖ్యలను తాము సహించే ప్రసక్తే లేదని ఉద్ధవ్ వర్గానికి చెందిన నేత అరవింద్ సావంత్ కుండబద్దలు కొట్టారు. ఇటీవలే రాహుల్తో కలిసి జోడో యాత్రలో నడిచిన ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా తాజాగా అదే మాట చెప్పారు. రాహుల్ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఉద్ధవ్ వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా శనివారం అభిప్రాయపడ్డారు. అవి అగాడీ కూటమి మనుగడపై ప్రభావం చూపుతాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ కాకను మరింత పెంచేలా సావర్కర్పై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే శనివారం మరిన్ని విమర్శలు గుప్పించారు! బ్రిటిష్ వారి నుంచి సావర్కర్ రూ.60 పెన్షన్ తీసుకున్నారంటూ మరోసారి వివాదాల తేనెతుట్టెను కదిపారు. రాహుల్ వ్యాఖ్యలను విమర్శిస్తున్న వారు ముందుగా దీనికి బదులివ్వాలన్నారు. మరోవైపు ఉద్ధవ్కు సావర్కర్పై ఏ మాత్రం గౌరవమున్నా కాంగ్రెస్కు తక్షణం గుడ్బై చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్సాహెబ్ దన్వే శనివారం డిమాండ్ చేశారు. ఆ ఉద్దేశముందో లేదో చెప్పాలని సవాలు చేశారు. -
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్తో శివసేన తెగదెంపులు?
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా వీర్ సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రాలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. సావర్కర్ను అవమానిస్తే మహావికాస్ అఘాడీతో తెగదెంపులు చేసుకునేందుకైనా వెనుకాడబోమని శివసేన సీనియర్ నేత సంజయ్రౌత్ హెచ్చరించారు. ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతారని పేర్కొన్నారు. సావర్కర్ విషయం తమకు చాలా ముఖ్యమని, ఆయన హిందుత్వ సిద్ధాంతలను శివసేన నమ్ముతుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. సావర్కర్ గురించి కాంగ్రెస్ మాట్లాడవద్దని సూచించారు. ఈ విషయంలో ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్లతే తుది నిర్ణయమని థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కూడా ఇప్పటికే ప్రకటించారు. శివసేన నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ వాళ్ల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు మొదలుపట్టింది. రాహుల్ గాంధీ సావర్కర్ను అవమానించలేదని, చరిత్రలో జరిగిన విషయాన్ని మాత్రమే చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఈ విషయంపై సంజయ్ రౌత్తో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో మహావికాస్ అఘాడీ(ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి)పై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిషర్లను క్షమాపణలు కోరిన వ్యక్తి అని అన్నారు. అండమాన్ జైలులో మూడు నాలుగేళ్లకే భయపడి బ్రిటిషర్లకు లేఖలు రాశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతులను ఆధారంగా చూపారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. సావర్కర్ను అవమానించిన వారికి మహారాష్ట్ర ప్రజలే తగిన రీతితో బుద్ధి చెబుతారని విమర్శించింది. చదవండి: 'ఇండోర్లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు -
‘షిందేజీ! ఉద్ధవ్ కోసమే సంజయ్ రౌత్ బెయిల్ సంపాదించినట్లు అనిపిస్తోంది’
‘‘సంజయ్ రౌత్ జైలు నుంచి బయటికి వచ్చాడట..’’ అన్నారు దీపక్ కేసర్కర్! ఆ మాటను ఆయన నాకు బాగా సమీపానికి వచ్చి, మెల్లిగా... నా రెండు చెవుల్లో ఒక చెవికి మాత్రమే వినిపించేలా చెప్పారు. అప్పుడా సమయంలో చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే నా పక్కన ఉన్నారు. ఒకప్పుడు బాల్ ఠాక్రేజీ పక్కన ముప్పై ఏళ్ల పాటు ఉన్నవాళ్లు.. ఇప్పుడు నెలన్నరగా నా పక్కన ఉంటున్నారు. ఠాక్రేజీ జీవించి ఉండగా ఆయనకు వచ్చే ఫోన్లను థాపా, రాజేలే లిఫ్ట్ చేసేవాళ్లు. ఠాక్రేజీ చెప్పదలచుకుంది కూడా వాళ్లే ఫోన్లో అవతలి వైపునకు బట్వాడా చేసేవాళ్లు. ‘‘షిందేజీ, అదేంటంటే.. ’’ అంటూ, వాళ్లిద్దరి వైపు చూస్తూ ఆగారు దీపక్. ‘‘పర్లేదు చెప్పండి దీపక్జీ. ఠాక్రేజీ దగ్గర నమ్మకంగా ఉన్న మనుషులు ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే వైపు వెళ్లకుండా మనవైపు ఉండేందుకు వచ్చారంటే.. సంజయ్ గురించే కాదు, ఉద్ధవ్ గురించి కూడా మనం నిస్సంకోచంగా మాట్లాడుకోవచ్చు..’’ అన్నాను. ‘‘షిందేజీ! సంజయ్ రౌత్ని చూస్తుంటే ఉద్ధవ్ ఠాక్రే కోసం ఏం చేయడానికైనా సిద్ధమై అతడు బెయిల్ సంపాదించినట్లుగా నాకు అనిపిస్తోంది..’’ అన్నారు దీపక్. ‘‘అతడేమీ దేశభక్తుడు కాదు కదా దీపక్జీ.. ఏం చేయడానికైనా సిద్ధమవడానికి..’’ అని నవ్వాను. ‘‘కానీ షిందేజీ, అతడి మౌనం చూస్తుంటే దేశభక్తుడే నయం అనిపించేలా ఉన్నాడు..’’ అన్నారు దీపక్! దీపక్ మునుపెన్నడూ అంత హెచ్చరికగా మాట్లాడ్డం నేను వినలేదు! నా మంత్రివర్గంలో సీనియర్ మినిస్టర్ ఆయన. నాలుగు మినిస్ట్రీలను నడిపిస్తున్నారు. నా కన్నా పదేళ్లు పెద్దవారు. ‘‘దేశభక్తుడిని సైతం జైలు జీవితం మామూలు మనిషిగా మార్చేస్తుందని విన్నాను దీపక్జీ! కానీ మీరేం చెబుతున్నారంటే.. జైలుకు వెళ్లిన సంజయ్ రౌత్ అనే ఒక మామూలు మనిషి దేశభక్తుడిగా మారి, జైలు బయటికి వచ్చేశాడని!! అదెలా సాధ్యం?’’ అని అడిగాను. ‘‘జైలు నుంచి బయటికి రాగానే సంజయ్ రౌత్ నేరుగా సెంట్రల్ ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్లాడు షిందేజీ! ఆ తర్వాత అతడు సౌత్ ముంబైలోని హనుమాన్ టెంపుల్కి వెళ్లాడు. తర్వాత శివాజీ పార్క్లోని బాల్ ఠాక్రే మెమోరియల్కి వెళ్లాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లాడు! సాయంత్రం 6.50 కి ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతడు విడుదలైతే.. నాహుర్లోని తన ఇంటికి వెళ్లేసరికి రాత్రి 10.20 అయింది. ఈ మూడున్నర గంటల వ్యవధిలో అతడు మాట్లాడిన సమయం తక్కువ. మౌనంగా ఉన్న సమయం ఎక్కువ. అదే నాకు ఆందోళన కలిగిస్తోంది షిందేజీ.. ’’ అన్నారు దీపక్. ‘‘ఆందోళన దేనికి దీపక్జీ?!’’ అన్నాను. ‘‘దేనికంటే.. అతడు మాట్లాడిన ఆ తక్కువ సమయంలోనే ఉద్ధవ్తో చాలా ఎక్కువ మాట్లాడాడు. మౌనంగా ఉన్న ఆ ఎక్కువ సమయంలోనే మన గురించి చాలా తక్కువగా మౌనం వహించాడు..’’ అన్నారు దీపక్. ‘‘అర్థం కాలేదు దీపక్జీ..’’ అన్నాను. ‘‘మూడు నెలలు జైల్లో ఉండి వచ్చాక కూడా ఉద్ధవ్దే రియల్ శివసేన అని అతడు అంటున్నాడు షిందేజీ! అంటే మనది రియల్ శివసేన కాదనీ, మీరూ రియల్ ముఖ్యమంత్రి కాదనే కదా అతడి ఉద్దేశం!’’ అన్నారు దీపక్! చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే మాకు కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. నవంబర్ 17న ఠాక్రేజీ 10వ వర్ధంతి. ఆ సంస్మరణ సభలో వాళ్లిద్దరి చేత మాట్లాడిస్తే?!వాళ్లే చెబుతారు.. రియల్ శివసేన ఎవరిది కాదో, రియల్ సీఎం ఎవరు కారో?! దీపక్ నా వైపే చూస్తూ ఉన్నారు. ‘‘దీపక్జీ! అసలైన దాన్ని ఎవరూ మార్చలేరు. సంజయ్ రౌత్ అనే ఒక దేశభక్త ఎంపీ మార్చగలడా?’’ అన్నాను నవ్వుతూ. -
ఫడ్నవీస్పై సంజయ్ రౌత్ ప్రశంసల వర్షం.. జైలు నుంచి వచ్చిన మరునాడే..
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత్రాచల్ కుంభకోణం కేసులో అరెస్టై విడుదలైన మరుసటి రోజే మహారాష్ట్ర ప్రభుత్వం, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్రలోని కొత్త ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటోందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన పనులను వ్యతిరేకించాలి కాబట్టి తాము వ్యతిరేకించమని.. అలా ఎప్పుడూ చేయలేదని తెలిపారు. ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నడుపుతున్నారని నేను భావిస్తున్నాను. ఫడ్నవిస్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. నేను జైలులో వీలైనప్పుడల్లా న్యూస్పేపర్ చదివాను. పేదలకు గృహనిర్మాణం వంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని నేను స్వాగతిస్తాను’ అంటూ కొనియాడారు. కాగా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేతో కలిసి బీజేపీ గత జూన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను కలిసే ముందు గురువారం తన ఇంటి వద్ద సంజయ్ రౌత్ పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు. ‘మూడు నెలల్లో ప్రజలు నన్ను మర్చిపోతారని అనుకున్నాను. కానీ విడుదలైనప్పటి నుంచి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నాతో క్రమం తప్పకుండా టచ్లో డేవారు. శరద్ పవార్ కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు సంబంధించిన కొన్ని పనుల కోసం ఫడ్నవీస్ను కలవనున్నాను. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలవబోతున్నాను. వారిని కలిసి నాకు జరుగుతున్న పరిణామాల గురించి వివరించాలి. రాష్ట్రంలో రాజకీయ దుమారం తగ్గించాలంటూ ఫడ్నవీస్ చెప్పిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను’ అని తెలిపారు. అదే విధంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను సైతం కలుస్తానని సంజయ్ రౌత్ చెప్పారు. చదవండి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ తన అరెస్ట్ చట్టవిరుద్దమంటూ కోర్టు ఇచ్చిన తీర్పుపై సంజయ్ రౌత్ మాట్లాడారు.. ఎవరి పేరు ప్రస్తావించకుండా తన అరెస్ట్ వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. నేను జైలులో ఉండగా నా కుటుంబం ఎన్నో కష్టాలు పడింది. జైలులో నా ఆరోగ్యం దెబ్బతింది. జైలు జీవితం అంత సులువేమీ కాదు. అక్కడ ఎత్తయిన గోడలు ఉంటాయి. వాటితోనే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి హిందూత్వ దిగ్గజం సావర్కర్ పదేళ్ళపాటు జైలు జీవితం గడిపారు. బాలగంగాధర్ తిలక్, అటల్ బిహారీ వాజ్పాయి వంటి నాయకులు జైలులో గడిపారు. వీరంతా ఎలా గడిపారోనని తరచూ అనుకునేవాడిని. కానీ రాజకీయాల్లో ఎవరున్నా ఏదో ఒక సమయంలో జైలుకు వెళ్లాల్సిందేనని నాకు నేనే చెప్పుకున్నాను. నేను వ్యవస్థను తప్పుపట్టడం లేదు. కోర్టు తీర్పు, ఈడీపై ఎలాంటి కామెంట్ చేయను. నా మౌనం వారికి సంతోషాన్ని కలిగిస్తే.. సంతోషపడనివ్వండి. నా మనసులో ఎవరిపై పగ లేదు. ఏ కేంద్ర దర్యాప్తు సంస్థను నిందించడం లేదు.’ అని వ్యాఖ్యానించారు. కాగా పాత్రాచల్ రీడెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఈడీ గత ఆగస్టు నెలలో సంజయ్ రౌత్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తొలుత ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకోగా తర్వాత కోర్టు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది. దాదాపు మూడు నెలలు జైల్లో గడిపారు. ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి సంజయ్ రౌత్ బుధవారం విడుదలయ్యారు. అయితే జైలు నుంచి విడుదలైన మరునాడే సంజయ్ బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: లాలూ కుమార్తె గొప్ప మనసు.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు.. -
ఉప ఎన్నికలో నోటాకి సెకండ్ ప్లేస్
ముంబై: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో దెబ్బ పడింది కాంగ్రెస్కే. హర్యానా, తెలంగాణల్లో రెండు స్థానాలను పొగొట్టుకుంది. అందులో ఒకటి బీజేపీ, మరొకటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) వశం అయ్యాయి. ఇక మహారాష్ట్ర అంధేరీ(తూర్పు) నియోజకవర్గం నుంచి శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం నుంచి రుతుజా రమేష్ లాట్కే.. 66వేల ఓట్ల మార్జిన్తో ఘన విజయం సాధించారు. శివసేన ఎమ్మెల్యే రమేష్ లాట్కే ఈ మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ(తూర్పు) స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతు మాత్రమే కాదు.. బీజేపీ సైతం ఇక్కడ తమ అభ్యర్థిని దింపకపోవడంతో.. రుతుజాకి బాగా కలిసొచ్చింది. ఈ క్రమంలో..ఈ ఉప ఎన్నికలో అంధేరీ ఓటర్లు భలే సర్ప్రైజ్ ఇచ్చారు. రుతుజాతో పాటు ఈ ఉప ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. ఆ ఆరుగురు అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇలా.. అభ్యర్థుల(ప్రధాన పార్టీ అభ్యర్థులు కాదు) కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోల్ కావడం గమనార్హం. అంటే రుతుజా తర్వాత నోటా ఓట్లే రెండు స్థానంలో నిలిచాయన్నమాట. రుతుజా లాట్కే.. గతంలో బృహణ్ముంబై మున్సిపల కార్పొరేషన్లో క్లర్క్గా పని చేశారు. రాజీనామా అనంతరం ఆమె ఉప ఎన్నికల బరిలో దిగారు. త్వరలో ముంబై స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండడంతో.. థాక్రే వర్గంలో ఈ విజయం జోష్ను నింపింది. మరోవైపు ప్రజలు తమవైపే ఉన్నారనడానికి ఈ ఫలితమే నిదర్శనమని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించుకున్నారు. ఇదీ చదవండి: ప్చ్.. కారు హవాను తక్కువగా అంచనా వేశాం! -
By-poll Results 2022: ఏడింట్లో నాలుగు బీజేపీకి...
న్యూఢిల్లీ: ఈ నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరిగిన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. ఇందులో నాలుగు బీజేపీ గెలుచుకోగా, ఆర్జేడీ, శివసేన ఠాక్రే వర్గం, టీఆర్ఎస్ తలొకటి దక్కించుకున్నాయి. యూపీలోని గోలా గోరఖ్నాథ్ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. పార్టీకి చెందిన అమన్ గిరి సమీప ప్రత్యర్థి, సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిని 34 వేల ఓట్ల తేడాతో ఓడించారు. బిహార్లోని గోపాల్గంజ్లో బీజేపీకి చెందిన కుసుమ్ దేవి సమీప ప్రత్యర్థి ఆర్జేడీకి చెందిన మోహన్ గుప్తాపై 68 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. ఇదే రాష్ట్రంలోని మొకామాలో ఆర్జేడీ అభ్యర్థిని నీలం దేవి 16వేల ఓట్ల మెజారిటీ గెలిచారు. ఒడిశాలోని ధామ్నగర్లో బీజేడీకి చెందిన అవంతిదాస్పై బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ 4,845 ఓట్ల మెజారిటీ సాధించారు. తెలంగాణలోని మునుగోడు నుంచి టీఆర్ఎస్కు చెందిన కె.ప్రభాకర్రెడ్డి గెలిచారు. ముంబైలోని అంధేరి (వెస్ట్)నియోజకవర్గం నుంచి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన రుతుజా లట్కే విజయం సాధించారు. ఎమ్మెల్యే రమేశ్ లట్కే గత మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రమేశ్ భార్య రుతుజకు పోటీగా బీజేపీ సహా ప్రధానపార్టీలు అభ్యర్థిని నిలబెట్టలేదు. రెండో స్థానంలో 14.79 శాతం మంది నోటాకు ఓటేశారు. భజన్లాల్ మనవడి విజయం హరియాణాలోని ఆదంపూర్లో బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్కు చెందిన జై ప్రకాశ్పై 16 వేల మెజారిటీ సాధించారు. మాజీ సీఎం భజన్లాల్ కుటుంబానికి 1968 నుంచి ఇక్కడ వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. భజన్లాల్ 9 సార్లు, ఆయన భార్య ఒక పర్యాయం, కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్ 4 సార్లు ఇక్కడ విజయం సాధించారు. భజన్లాల్ మనవడే భవ్య బిష్ణోయ్. కుల్దీప్ బిష్ణోయ్ ఆగస్ట్లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. -
శివసేన నేత దారుణ హత్య.. నిందితుడి కారులో కమెడియన్ ఫోటో!
పంజాబ్కు చెందిన శివనేత నేత సుధీర్ సూరి శుక్రవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సుధీర్ను కాల్చి చంపిన నిందితుడిని సంఘటన స్థలంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు ఉపయోగించిన ఏ30 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సందీప్ సింగ్ అలియాస్ సన్నీగా గుర్తించారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే బట్టల దుకాణం నడుపుతున్నట్లు పేర్కొన్నారు. సందీప్ తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేగాక అతని కారులో బాలీవుడ్ కమెడియన్ భారతీ సింగ్, ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మణిందర్జీత్ సింగ్ బిట్టా ఫోటోలు లభించినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. కాగా అమృత్సర్ నగరంలోని గోపాల్ దేవాలయం ఎదుట నిరసన చేస్తున్న శివసేన నేత సుధీర్ సూరిపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే శివసేన నేత సుధీర్ చుట్టూ భారీ పోలీసుల భద్రత ఉన్నప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆలయం వెలుపల చెత్తకుప్పలో కొన్ని విగ్రహ శకలాలు కనిపించగా.. దేవాలయ అధికారులకు వ్యతిరేకంగా కార్యకర్తలతో కలిసి సూరి ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో గుంపులో నుంచి బయటకు వచ్చిన దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. సూరి అయిదుసార్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Punjab #Live : Shiv Sena leader Sudhir Suri shot dead in Amritsar in presence of Police. They were sitting on a dharna outside the temple against the desecration of hindu idols. Security personnel are also stationed with Suri at all times !! + pic.twitter.com/1reGHy5ypT — Ashwini Shrivastava (@AshwiniSahaya) November 4, 2022 ఇదిలా ఉండగా ఆలయ నిర్వహణ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు కమిషనర్ అరుణ్ పాల్ సింగ్ తెలిపారు. వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారిస్తన్నట్లు వెల్లడించారు. ఓ వర్గాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సూరి ఇప్పటికే గ్యాంగ్స్టర్లు కొన్ని రాడికల్ సంస్థల హిట్-లిస్ట్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆయనకు వై కేటిగిరీ భద్రత కల్పించామని, ఆయన సెక్యూరిటీలో 12 మందికి పైగా పోలీసులు ఉన్నారని తెలిపారు. -
గుర్తులపై కొత్త వివాదం.. అయోమయంలో ఉద్ధవ్, శిండే వర్గాలు
సాక్షి, ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండేకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు కొత్త వివాదానికి కారణమయ్యాయి. దీంతో ఇరువర్గాల అభ్యర్థుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్ధవ్ వర్గానికి కేటాయించిన కాగడ గుర్తుపై సమతా పార్టీ, శిండే వర్గానికి కేటాయించిన కత్తులు–డాలు గుర్తుపై సిక్కులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాటిని రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో అంధేరీ ఉప ఎన్నిక వివాదాస్పదంగా మారే ప్రమాదం ఏర్పడింది. అభ్యర్థులకు కొత్త చిక్కులు... ఠాక్రే వర్గం తరఫున పోటీ చేస్తున్న రుతుజా లట్కే, బీజేపీ తరఫున పోటీచేస్తున్న మూర్జీ పటేల్ శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. శనివారం నుంచి ప్రచారం చేయడం ప్రారంభించారు. కాని గుర్తుల కేటాయింపుపై కొత్త వివాదం తెరమీదకు రావడంతో ఇరు పార్టీల అభ్యర్ధులు అయోమయ స్ధితిలో ఉన్నారు. నవంబర్ మూడో తేదీన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అంతకు ముందు నుంచే శివసేన తమదేనంటూ ఉద్ధవ్ వర్గం, కాదు అసలైన వారసులం మేమేనని, మాకే మెజార్టీ ఉందని ఇటు శిండే వర్గం మధ్య వాగ్వాదం మొదలైన సంగతి తెలిసింది. చివరకు ఈ వివాదం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కాని సుప్రీం కోర్టు ఈ వివాదం పరిష్కరించే బాధ్యతలు ఎన్నికల సంఘానికే కట్టబెట్టింది. దీంతో తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు గాని, విల్లు–బాణం (ధనుశ్య–బాణ్) గుర్తుగాని ఎవరూ, ఎక్కడా వినియోగించరాదని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అంతేగాకుండా మూడు గుర్తులు, మూడు పార్టీ పేర్లు మీరే సూచించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ మేరకు ఉద్ధవ్, శిండే వర్గాలు మూడు పార్టీ గుర్తులు, మూడు పార్టీ పేర్ల చొప్పున సూచించడంతో అందులోంచి ఠాక్రే వర్గానికి కాగడ, శిండే వర్గానికి కత్తులు–డాలు (తల్వార్–డాల్) కేటాయించిన విషయం తెలిసిందే. కాని మత సామరస్యాలకు సంబంధించిన గుర్తులు కేటాయించరాదని ఎన్నికల సంఘానికి నియమాలున్నాయి. ఆ ప్రకారం శిండే వర్గానికి కేటాయించిన కత్తులు–డాలు గుర్తు సిక్కు సమాజానికి ప్రతీకగా ఉన్నాయి. అదేవిధంగా ఉద్ధవ్ వర్గానికి కేటాయించిన కాగడ (మషాల్) గుర్తు 1996 నుంచి తమ వద్దే ఉందని సమతా పార్టీ పేర్కొంది. దీంతో మా పార్టీ గుర్తును మరో పార్టీకి ఎలా కేటాయిస్తారంటూ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. చదవండి: మనీష్ సిసోడియాను రేపు సీబీఐ అరెస్ట్ చేస్తుంది: ఆప్ సీనియర్ నేత మరోపక్క అప్పట్లో శిండే సూచించిన త్రిశూలం గుర్తు మత సామరస్యానికి సంబంధించినదంటూ కేటాయించలేదు. సిక్కులకు ప్రతీకగా ఉన్న కత్తులు–డాలు గుర్తు కూడా అదే కోవకు చెందినదంటూ, దీంతో ఆ గర్తును రద్దు చేయాలని సచ్ఖండ్ గురుద్వార్కు చెందిన మాజీ సభ్యుడు రంజీత్ కామ్టేకర్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అంతేగాకుండా కాగడ గుర్తు రద్దు చేయడమేగాకుండా దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వలంటూ సమతా పార్టీ ఢిల్లీలోని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. దీనిపై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాల్సిందే. మరోపక్క రంజీత్ కామ్టేకర్ రాసిన లేఖపై ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తిగా మారింది. -
ఉద్ధవ్ థాక్రే వర్గానికి బిగ్ రిలీఫ్.. ఉపఎన్నికల్లో ఆమె పోటీకి లైన్ క్లియర్
ముంబై: శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్ 3న జరగే అంధేరీ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. థాక్రేవర్గం తరఫున పోటీ చేయనున్న రుతుజా లాట్కే రాజీనామాను బృహన్ముంబై పురపాలక కమిషనర్ శుక్రవారం ఉదయం 11గంటల్లోగా ఆమోదించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒక ఉద్యోగి రాజీనామా చేస్తే ఆమోదించడానికి ఇంత సమయం ఎందుకుపట్టిందని, ఇది కోర్టుకు రావాల్సిన విషయం కూడా కాదని ముంబై పురపాలక కమిషనర్ ఇక్బాల్ చాహల్ను ఉన్నత న్యాయస్థానం మందలించింది. అంధేరీ ఎమ్మెల్యే రమేశ్ లాట్కే మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉద్దవ్ థాక్రే వర్గం తరఫున రమేశ్ లాట్కే సతీమణి రుతుజా లాట్కే పోటీ చేస్తున్నారు. అయితే ఆమె బృహన్ ముంబై కార్పొరేషన్లో క్లర్క్గా పనిచేస్తున్నారు. ఉపఎన్నికకు నామినేషన్ వేయాలంటే ఆమె పదవికి రాజీనామా చేయాలి. సెప్టెంబర్ 2నే రాజీనామా సమర్పించినప్పటికీ దాన్ని కమిషనర్ ఆమోదించలేదు. నామినేషన్లకు శుక్రవారం(అక్టోబర్ 14) చివరి తేదీ కావడంతో రితిజా హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా కావాలనే రాజీనామా ఆమోదించడం లేదని కోర్టుకు తెలిపారు. షిండే ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. వాదనలు విన్న న్యాయస్థానం రుతుజాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అనంతరం ఆమె నేరుగా వెళ్లి ఉద్ధవ్ థాక్రేను కలిశారు. చివరిరోజైన శుక్రవారం నామినేషన్ సమర్పించనున్నారు. అంధేరీ ఉపఎన్నికలో థాక్రేవర్గం అభ్యర్థికి కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుగా ఉన్నాయి. మరోవైపు షిండే వర్గం మద్దతుతో బీజేపీ తమ అభ్యర్థిని నిలబెడుతోంది. చదవండి: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె! -
అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!
సాక్షి, ముంబై: తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్ధి రుతుజా లట్కేను తమవైపు లాక్కునేందుకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపినట్లయింది. మొన్నటివరకు అసలైన శివసేన పార్టీ తమదేనంటూ, విల్లు–బాణం (ధనుశ్య–బాణ్) గుర్తు తమకే దక్కాలని ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, అటు ఏక్నాథ్ శిందే వర్గం పోటీ పడ్డాయి. చివరకు ఎన్నికల సంఘం తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు, విల్లు–బాణం వినియోగించరాదని ఉద్ధవ్కు, శిందేను ఈసీ ఆదేశించింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. కానీ రుతుజా లట్కేను తమవైపు లాక్కుని బీజేపీ టికెట్టుపై పోటీ చేయించాలనే ప్రయత్నాలు శిందే చేస్తున్నారు. భర్త మృతి.. అభ్యర్థిగా భార్య ఈ ఏడాది మార్చిలో కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లిన తూర్పు అంధేరీ నియోజక వర్గం శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే అక్కడే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది. నవంబర్ మూడో తేదీన ఉప ఎన్నిక, ఆరో తేదీన ఓట్ల లెక్కింపు ఉంది. కాని మృతి చెందిన రమేశ్ లట్కే సతీమణి రుతుజా లట్కేకు తమ పార్టీ తరఫున పోటీచేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్ధిత్వం ఇచ్చారు. సానుభూతి ఓట్లతో రుతుజా సునాయాసంగా గెలుస్తుందనే ధీమాతో ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. రుతుజా గెలవడంవల్ల తమ పార్టీ ఎమ్మెల్యే సంఖ్య యథాతధంగా ఉంటుంది. ఏక్నాథ్ శిందే ఎత్తుగడలు రమేశ్ లట్కే కుటుంబంతో ఏక్నాథ్ శిందేకు సంత్సంబంధాలున్నాయి. దీంతో రుతుజాకు తమ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం ఇవ్వాలని శిందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే శివసేన వాటాలో ఒక ఎమ్మెల్యే సంఖ్య తగ్గిపోయి, తమ వాటాలో ఒక ఎమ్మెల్యే సంఖ్య పెరుగుతుందని శిందే భావిస్తున్నారు. ప్రస్తుతం శివసేన పార్టీ ఎవరిది..? విల్లు–బాణం ఎవరికి ఇవ్వాలో నిర్ణయం తీసుకునే అధికారం సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే సమయంలో ఎమ్మెల్యేల సంఖ్య ఏ వర్గానికి ఎక్కువ ఉందో ఆ వర్గానికి శివసేన పేరు, విల్లు–బాణం గుర్తు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతో ఏక్నాథ్ శిందే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నలిగి పోతున్న బీఎంసీ కమిషనర్ కాగా ఉద్ధవ్ ఠాక్రే వర్గం తరపున రుతుజా లట్కే గురువారం భారీ బలప్రదర్శన చేస్తూ నామినేషన్ వేస్తారని ఇదివరకే పార్టీ వర్గాలు ప్రకటించాయి. రుతుజా లట్కేకు మహావికాస్ ఆఘాడి మద్దతు ఉంటుందని కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా ప్రకటించాయి. కానీ ఆమె ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆమె బీఎంసీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల మూడో తేదీన ఆమె బీఎంసీ కమిషనర్కు రాజీనామా సమర్పించారు. కానీ కమిషనర్ ఇంతవరకు ఆమె రాజీనామాను ఆమోదించలేదు. ఫలితంగా గురువారం ఆమె నామినేషన్ వేయలేకపోయారు. దీంతో రాజీనామా ఆమోదించాలని ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి, ఆమోదించవద్దని అటు ఏక్నాథ్ శిందే వర్గం నుంచి బీఎంసీ కమిషనర్పై ఒత్తిడి వస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్యలో బీఎంసీ కమిషనర్ నలిగి పోతున్నారు. నియమాలు ఏమంటున్నాయి.. బీఎంసీ 1989 నియమాల ప్రకారం స్వచ్చందంగా పదవీ విరమణ పొందేవారు మూడు నెలల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. రాజీనామా చేసే వారు నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. ఒకవేళ నెల రోజుల ముందు నోటీసు ఇవ్వని పక్షంలో ఒక నెల వేతనం బీఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. కాని ఆమె ఈ నెల మూడో తేదీన నోటీసు ఇచ్చారు. నియమాల ప్రకారం రుతుజా లట్కే నెల రోజుల ముందు నోటీసు ఇవ్వకపోవడంతో నెల రోజుల వేతనం రూ.67,590 నగదు బీఎంసీకి చెల్లించారు. సంబంధిత డిపార్టుమెంట్ నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) కూడా పొందారు. అయినప్పటికీ బీఎంసీ కమిషనర్ ఇంతవరకు ఆమె రాజీనామాను ఆమోదించలేదు. ఇటు ఉద్ధవ్ వర్గం, అటు శిందే వర్గం ఒత్తిళ్ల మధ్య బీఎంసీ కమిషనర్ ఏం నిర్ణయం తీసుకుంటారో ఉత్కంఠ నెలకొంది. రాజీనామ ఆమోదించే వరకు రుతుజాకు నామినేషన్ వేయడానికి వీలులేదు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం బాంబే కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు రుతుజా రాజీనామాను ఆమోదించాలని ఉన్నత న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ నుంచి మూర్జీ పటేల్ ? ఇదిలాఉండగా బీజేపీ నుంచి మూర్జీ పటేల్ పేరును దాదాపు ఖరారు చేసినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. నామినేషన్ వేయడానికి శుక్రవారం వరకు గడువుంది. ఆలోపు ఏదైన అద్భుతం జరగవచ్చు. గతంలో తనతో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుని రుతుజా లట్కేను తమవైపు లాక్కుని బీజేపీ తరఫున నామినేషన్ వేయించాలనే ప్రయత్నంలో శిందే ఉన్నారు. ఒకవేళ రుతుజా బీజేపీ తరఫున నామినేషన్ దాఖలుచేస్తే రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి దుమారం లేపడం ఖాయమని చెప్పకనే చెబుతోంది. దీంతో రుతుజా తుది నిర్ణయం తీసుకోవాలంటే ఆచి, తూచి ఆడుగేయాల్సి ఉంటుంది. ఒకవేళ శిందే ఒత్తిళ్లకు యపడి బీజేపీ తరఫున రుతుజా నామినేషన్ వేస్తే మూర్జీ పటేల్ పరిస్ధితి ఏంటనే అంశం తెరమీదకు రానుంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూర్జీ పటేల్కు అభ్యర్ధిత్వం ఇవ్వకపోవడంతో బీజేపీపై తిరుగుబాటుచేసి స్వతంత్రంగా బరిలో దిగారు. ఆ సమయంలో రమేశ్ లట్కే గెలుపొందగా మూర్జీ పటేల్ రెండో స్ధానంలో నిలిచారు. రుతుజా బీజేపీ తరఫున నామినేషన్ వేస్తే ఇప్పుడు అదే పరిస్ధితి పునరావృతమయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కొంత అయోమయ పరిస్ధితిలో ఉన్నట్లు తెలుస్తోంది. (క్లిక్: ‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్ రౌత్ భావోద్వేగ లేఖ) -
‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్ రౌత్ భావోద్వేగ లేఖ
సాక్షి, ముంబై: పత్రాచల్ భూకుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న శివసేన ఫైర్బ్రాండ్, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తన తల్లికి భావోద్వేగ లేఖ రాశారు. తను ఖచ్చితంగా తిరిగి వస్తానని, అప్పటి వరకు ఉద్దవ్ ఠాక్రే, శివ సైనికులు నిన్ను(తల్లి) జాగ్రత్తగా చూసుకుంటారని హామీ ఇచ్చారు. శివసేనకు ద్రోహం చేసేలా ఒత్తిడి తీసుకొచ్చారని, వాళ్ల ఒత్తిళ్లకు లొంగకపోవడం వల్లే నేడు తల్లికి దూరంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ లేఖను సంజయ రౌత్ తన ట్విటర్లో బుధవారం పోస్టు చేశారు. ‘నీలాగే(తల్లి) శివసేన కూడా నాకు అమ్మతో సమానం. నా తల్లికి(శివసేన) ద్రోహం చేసేలా ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని బెదిరించారు. వారి బెదిరింపులకు లొంగకపోవడం వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణం వల్లే ఈరోజు నేను నీకు దూరంగా ఉన్నాను. దేశం కోసం సరిహద్దుల్లో నిలబడి పోరాడుతున్న వేలాది మంది సైనికులు నెలల తరబడి ఇంటికి రారు. కొందరు ఇంటికి ఎప్పటికీ వెళ్లరు. నేను కూడా మహారాష్ట్ర, శివసేన శత్రువులకు తలవంచలేను. మహారాష్ట్ర, దేశ విధేయుడిని అంత తేలిగ్గా చంపలేరు. చదవండి: తండ్రి చితికి నిప్పుపెట్టిన మరునాడే అఖిలేశ్ ఎమోషనల్ పోస్ట్ రాజకీయ ప్రత్యర్థుల ముందు తలవంచబోను. ఈ ఆత్మగౌరవాన్ని నేను మీ నుంచే నేర్చుకున్నా. శివసేన, బాలాసాహెబ్ పట్ల నిజాయితీగా ఉండాలని మీరు కునా నేర్పించారు. శివసేన గడ్డు పరిస్థితుల్లో ఉంటే బాలాసాహెబ్ ఏమి చేస్తారో అది చేయాలని నేర్పించారు.’ అని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 8న రాసిన లేఖలో ఈడీ కస్టడీ ఇప్పుడే ముగిసిందని, జ్యుడీషియల్ కస్టడీలోకి వెళ్లే ముందు సెషన్స్ కోర్టు ప్రాంగణంలో కూర్చొని ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తల్లికి లేఖ రాసి చాలా ఏళ్లు అవుతోందని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ లేఖ రాసేందుకు అవకాశం దక్కిందని పేర్కొన్నారు. प्रिय आई, जय महाराष्ट्र, .....तुझा संजय (बंधू) pic.twitter.com/EXAtkcyRLi — Sanjay Raut (@rautsanjay61) October 12, 2022 కాగా పత్రాచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో (మానీలాండరింగ్ కేసు) ఆగస్టు 1న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఆగస్టు 8న ఆయన్ను జ్యూడీషియల్ కస్టడీగి అప్పగించారు అప్పటి నుంచి ఆయన జ్యూడీషియల్ కస్టడీని పొడిగిస్తూనే ఉన్నారు. కాగా ఈనెల 10న సంజయ్ రౌత్ కస్టడీని అక్టోబర్ 17 వరకు కోర్టు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అలాగే ఈ కేసులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆయన భార్య, సన్నిహతుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. సంజయ్ రౌత్ భార్యను కూడా ఈడీ ప్రశ్నించింది. చదవండి: విషాదం.. ఉన్నట్టుండి స్టేజ్పై కుప్పకూలిన శివుడి వేషధారి.. -
షిండే వర్గానికి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ
ముంబై: అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు శివసేన ఏకానాథ్ షిండే వర్గానికి 'రెండు కత్తులు-డాలు' గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించించి. షిండే వర్గం పార్టీ పేరును 'బాలాసాబెబ్చీ శివసేన'గా ఈసీ సోమవారం ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. అసలైన శివసేన తమదంటే తమదే అని ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని ఈసీ తాత్కాలికంగా సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నికల కోసం కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి షిండే, థాక్రే వర్గాలు ఈసీకి కొన్ని ప్రతిపాదలను పంపాయి. వీటిని పరిశీలించిన అధికారులు థాక్రే వర్గానికి 'శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)' పేరు, కాగడా గుర్తును సోమవారం ఖరారు చేసింది. అలాగే షిండే వర్గానికి 'బాలాసాహెబ్ శివసేన' పేరును ఫైనల్ చేసింది. కానీ షిండే అడిగిన ఎన్నికల గుర్తులు కొన్ని ఇప్పటికే రిజిస్టర్ అయినందున ఎలాంటి గుర్తును కేటాయించలేదు. మళ్లీ కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే షిండే వర్గం మంగళవారం సూర్యుడు, కత్తి-డాలు, రావిచెట్టు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఈసీని మళ్లీ కోరింది. వీటిని పరిశీలించిన ఈసీ రెండు కత్తులు-డాలు గుర్తును ఫైనల్ చేసింది. శివసేన ఎవరిదో తేలేవరకు షిండే, థాక్రే వర్గాలకు ఈ పార్టీ పేర్లు, గుర్తులే ఉండనున్నాయి. చదవండి: ఇదేనా మీకు నేర్పింది? రిక్షా బోల్తాపడినా ఆగని కలెక్టర్ కాన్వాయ్ -
మూడింటిలో ఏదో ఒక గుర్తు ఇవ్వండి.. ఈసీకి షిండే ప్రతిపాదనలు
ముంబై: అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు తమకు మూడు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది ఏక్నాథ్ షిండే వర్గం శివసేన. సుర్యూడు, కత్తి-డాలు, రావి చెట్టు గుర్తులను పరిశీలించాలని కోరింది. మరి ఈ మూడింటిలో ఎన్నికల సంఘం ఏది ఖరారు చేస్తుందో చూడాలి. అసలైన శివసేన తమదంటే తమదే అని ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని ఈసీ తాత్కాలికంగా సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నికల కోసం కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి షిండే, థాక్రే వర్గాలు ఈసీకి కొన్ని ప్రతిపాదలను పంపాయి. వీటిని పరిశీలించిన అధికారులు థాక్రే వర్గానికి 'శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)' పేరు, కాగడా గుర్తును సోమవారం ఖరారు చేసింది. అలాగే షిండే వర్గానికి 'బాలాసాహెబ్ శివసేన' పేరును ఫైనల్ చేసింది. కానీ షిండే అడిగిన ఎన్నికల గుర్తులు కొన్ని ఇప్పటికే రిజిస్టర్ అయినందున ఎలాంటి గుర్తును కేటాయించలేదు. మళ్లీ కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే షిండే వర్గం మంగళవారం సూర్యుడు, కత్తి-డాలు, రావిచెట్టు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఈసీని మళ్లీ కోరింది. చదవండి: థాక్రే వర్గానికి పార్టీ పేరు గుర్తు ఖరారు చేసిన ఈసీ.. షిండేకు షాక్! -
శిండే, ఠాక్రే వివాదంలో జోక్యం వద్దు..రాజ్ ఠాక్రే ఆదేశం
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే మధ్య జరుగుతున్న రాజకీయ వివాదంలో జోక్యం చేసుకోవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే పార్టీ పదాధికారులకు, శ్రేణులకు ట్విట్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో స్ధానికంగా జరిగే సభలు, సమావేశాల్లో ఎలాంటి వివాదాస్పద ప్రసంగాలు చేయవద్దని, సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చేసిన క్లిప్పింగులు, రాతలుగానీ పెట్టవద్దని సూచించారు. ఇరువురు మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగాక సమయం చూసుకుని తానే స్వయంగా అభిప్రాయాలను వెల్లడిస్తానని పదాధికారులకు, కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వాడీవేడిగా ఉన్నాయి. శివసేన ఎవరిదనే విషయం తాజాగా ఉండగానే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు, విల్లు–బాణం గుర్తును వినియోగించడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇలాంటి సమయంలో మీరు జోక్యం చేసుకుంటే పరిస్ధితి మరో విధంగా మారుతుందని రాజ్ అన్నారు. గతంలో ఎమ్మెన్నెస్ నేత సందీప్ దేశ్పాండే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వ్యాఖ్యలు, సందేశాలు దుమారం లేపాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎమ్మెన్నెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది కొద్దిరోజుల వరకు సాగింది. గత అనుభవం, తాజా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని ఈ వివాదంలో ఎవరూ మాట్లాడవద్దని, రాయవద్దని రాజ్ హెచ్చరించారు. -
గుర్తింపు పోరాటం!
మహారాష్ట్ర రాజకీయం మరో అంకానికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గాలలో ఎవరిది అసలైన శివసేన పార్టీ అనే పంచాయతీలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రస్తుతానికి ఇద్దరినీ సమదూరం పెట్టేసింది. బాలాసాహెబ్ ఠాక్రే పెట్టిన అసలు శివసేన పార్టీ పేరు, విల్లంబుల చిహ్నం ఇరువర్గాలూ వాడకుండా స్తంభింపజేస్తూ, మధ్యంతర నిర్ణయం తీసుకుంది. మూడు ప్రత్యామ్నాయాలతో కొత్త పేరు, కొత్త ఎన్నికల గుర్తు ప్రతిపాదనల్ని సోమవారాని కల్లా పంపాల్సిందని నిర్దేశించింది. రెండుగా చీలిన శివసేన ఇప్పుడు ప్రత్యామ్నా యమైన పేర్లు, ఎన్నికల గుర్తుల కసరత్తుతో గుర్తింపు సమస్యలో పడింది. నవంబర్ 3న అంధేరీ (ఈస్ట్) అసెంబ్లీ ఉప ఎన్నిక, ఆపై రానున్న ముంబయ్ కార్పొరేషన్ ఎన్నికలతో ఇది కీలకంగా మారింది. ఉప ఎన్నికలో కమలం గుర్తుపై సొంత అభ్యర్థిని నిలబెట్టి, శిందే వర్గాన్ని అక్కున చేర్చుకున్న బీజేపీకి ఇది కలిసొచ్చే అంశం. ఉప ఎన్నిక దగ్గరవుతున్నందున మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్న తమకే పార్టీ విల్లంబుల గుర్తు ఇవ్వాలంటూ శివసేన తిరుగుబాటు వర్గానికి సారథ్యం వహిస్తున్న శిందే అక్టోబర్ 4న ఈసీని అభ్యర్థించారు. అయితే, ఎమ్మెల్యేలు గోడ దాటినా, కార్యకర్తల్లో అధిక సంఖ్యాకులు తన వైపే ఉన్నారన్నది ఉద్ధవ్ వాదన. వీటి ఫలితమే – ఈ తాత్కాలిక ఆదేశం. ఎన్నికల్లో గందరగోళం నివారించడానికే ఈ నిర్ణయమని ఈసీ తేల్చేసింది. నిజానికి కాంగ్రెస్, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలను అక్కునచేర్చుకొని, అసలైన శివసేన సిద్ధాంతాలకు ఉద్ధవ్ తిలోదకాలిస్తున్నారని శిందే వాదన. ఆ ఆరోపణలు చేస్తూనే మొన్న జూన్లో ఆయన తన వర్గంతో బయటకొచ్చి, పార్టీని నిలువునా చీల్చారు. బాలాసాహెబ్ అసలైన సేన తమదేనని వాదిస్తున్నారు. అయితే, శివసేన సంస్థాపకుడి వారసుడిగా పార్టీని నడుపుతున్న ఉద్ధవ్ను శివసేన గుర్తుకు దూరం చేస్తూ ఈసీ ఇచ్చిన ఆదేశం ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయడమేనని కపిల్ సిబల్ తదితరుల విమర్శ. బీజేపీతో అంట కాగుతున్న శిందే వర్గానికి అప్పనంగా అన్నీ అప్పజెప్పడానికే ఈ ప్రయత్నమని వారి ఆరోపణ. నిజానికి, ఒకే పార్టీకి చెందిన ప్రత్యర్థి వర్గాలు గనక పార్టీ పేరు, జెండా, గుర్తులపై అధికారంపై జగడానికి దిగితే, ‘ఎన్నికల చిహ్నాల (కేటాయింపు) ఆదేశం–1968’, సెక్షన్ 15 ప్రకారం నిర్ణయాధికారం ఈసీదే. అసలు శివసేన ఎవరిదనే విషయంలో ఈసీ నిర్ణయం తీసుకోవడం సుదీర్ఘ ప్రకియ. అందుకు నెలలు పడుతుంది. ఇటీవలే సుప్రీమ్ కోర్ట్ సైతం ఉద్ధవ్ వర్గం వేసిన పిటిషన్పై రూలింగ్ ఇస్తూ, ‘అసలైన శివసేన’ ఎవరిది లాంటి అంశాలు నిర్ణయించే అధికారం ఈసీదేనని స్పష్టం చేసింది. శిందే వర్గంలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై మాత్రం విచారణ జరుపుతోంది. ఈ పరిస్థితుల్లో ఈసీ నిర్ణయం ‘అన్యాయ’మని అభివర్ణిస్తున్న ఉద్ధవ్ చేసేదేమీ లేక ప్రస్తుతానికి వేరే గుర్తులు ప్రతిపాదిస్తూ, తమను ‘బాలాసాహెబ్ ఠాక్రే శివసేన’గా గుర్తించాలని కోరారు. విజయదశమికి ఉద్ధవ్, శిందే వర్గాలు పోటాపోటీ ర్యాలీలు జరిపి, బలప్రదర్శనకు దిగాయి. అసలు బలం వచ్చే వివిధ ఎన్నికల్లో తేలనుంది. మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చనుంది. రాష్ట్రంలో రెక్కలు చాస్తున్న బీజేపీ, ఉద్ధవ్పై పాత పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది. కన్ను మూసిన తమ ఎమ్మెల్యే స్థానంలో ఆయన భార్యను నిలబెట్టిన ఉద్ధవ్ సేన అసెంబ్లీలో కాకున్నా ప్రజల్లో బలం తమదేనని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో పడింది. అసలే ఎమ్మెల్యేలు చేయిదాటి పోయి, కార్యకర్తలపై పట్టుపోతున్న వేళలో ఈ ఎన్నికలు, అందులోనూ అలవాటైన ఎన్నికల గుర్తు లేకపోవడం ఉద్ధవ్కు ఇరకాటమే. కొత్త గుర్తు, పేరు జనంలోకి తీసుకెళ్ళడం ఇప్పటికిప్పుడు తేలికేమీ కాదు. కాకపోతే, ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్ వర్గం సోమవారం ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించింది. రేపు కథ సుప్రీమ్ దాకా వెళ్ళవచ్చు. అప్పుడు విల్లంబుల గుర్తు శాశ్వత స్తంభనకు గురికావచ్చు. గతంలో 1969లో సీనియర్లతో ఇందిరా గాంధీకి తీవ్ర విభేదాలు వచ్చినప్పడు కాంగ్రెస్ అసలు గుర్తు కాడి – జోడెద్దులు గుర్తు శాశ్వత స్తంభనకు గురైంది. ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ (ఆర్)కు ఆవు – దూడ గుర్తు, కాంగ్రెస్ (ఒ)కు చరఖాపై నూలు వడుకుతున్న స్త్రీ గుర్తు ఇవ్వడం ఓ చరిత్ర. అప్పట్లో ఇందిరా గాంధీ కొత్త ఎన్నికల గుర్తు ఆవు – దూడపైనే పోటీ చేసి, ‘గరీబీ హఠావో’ నినా దంతో 1971 లోక్సభ ఎన్నికల్లో, 1972 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 1978లో కాంగ్రెస్ రెండోసారి చీలినప్పుడు ఇందిర వర్గానికి హస్తం గుర్తు దక్కింది. 1960లలో కమ్యూనిస్ట్ పార్టీ చీలిక వేళ, సీపీఐ (ఎం) కొడవలి – సుత్తి – నక్షత్రం గుర్తును ఎంచుకోవడం మరో కథ. ఆ మధ్య 2017లో ఓ ఉప ఎన్నిక వేళ అన్నాడిఎంకే వర్గాల మధ్య పోరులో రెండు ఆకుల చిహ్నాన్ని ఇప్పటిలాగే ఈసీ తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఇలా ఎన్నికల చిహ్నాలపై పార్టీలలో చీలిక వర్గాలలో పోరు కొత్త కాదు. శివసేన వ్యవహారం రేపు ఏ మలుపు తీసుకుంటుందన్నది చూడాలి. ఒకరకంగా ఈసీ తన నిష్పాక్షికతనూ, స్వతంత్ర ప్రతిపత్తినీ మరోసారి నిరూపించుకోవాల్సిన సందర్భం ఇది. ఫలితం ఏమైనా, యాభై ఆరేళ్ళ క్రితం 1966 జూన్లో బాలాసాహెబ్ చేతుల మీదుగా ఆరంభమై, మరాఠా రాజకీయాలను దశాబ్దాలుగా శాసించిన బలమైన ప్రాంతీయ పార్టీకి ఇది దీర్ఘకాలంలో దెబ్బే. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన విధంగా ఈ గొడవలో చివరకు లాభపడేది కమలనాథులే! -
ఈసీ నిర్ణయంతో అయోమయం.. థాక్రే కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే!
ముంబై: శివసేన పార్టీ, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 3న జరిగే తూర్పు అంధేరీ ఉపఎన్నికల్లో ఈ పార్టీ పేరు, గుర్తును ఉపయోగించడానికి ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వార్గాలకు వీల్లేకుండా పోయింది. రెండు వర్గాలు పార్టీ తమదంటే తమదని చెప్పినా ఈసీ ఎవరికీ కేటాయించలేదు. దీంతో థాక్రే వర్గం కొన్ని ప్రతిపాదనలను ఈసీ ముందుకు తీసుకెళ్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తూర్పు అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు తమకు 'శివసేన బాలా సాహెబ్ థాక్రే', లేదా 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే' పార్టీ పేర్లలో ఏదో ఒకదాన్ని కేటాయించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల గుర్తుగా త్రిశూలం, లేదా ఉదయించే సూర్యుడి చిత్రాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. తమ మొదటి ఎంపిక శివసేన బాలా సాహెబ్ థాక్రే, త్రిశూలం గుర్తు అని, అవి కుదరకపోతే రెండో ఆప్షన్కు ఈసీ ఓకే చేయాలని థాక్రే వర్గం కోరుతోంది. అసలైన శివసేన తమదంటే తమదని థాక్రే, షిండే వర్గాలు వాదించడంతో ఆ పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ శనివారం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. వచ్చే ఉపఎన్నికల్లో వీటిని ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రెండు వర్గాలు పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి మూడు ఆప్షన్లతో తమ ముందుకు రావాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే థాక్రే వర్గం కాస్త ముందుగా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. శివసేన బాలాసాహెబ్ థాక్రే పార్టీ పేరు, త్రిశూలం గుర్తు తమకు వస్తుందని ఆశిస్తోంది. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి.. సీఎం దిగ్భ్రాంతి -
షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్!
న్యూఢిల్లీ:అంథేరీ ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో శివసేన పేరు, ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ను ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేవర్గాలు ఉపయోగించుకోకుండా ఎన్నికల సంఘం(ఈసీ) నిషేధం విధించింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు వాడుకోవద్దని రెండు వర్గాలను ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉప ఎన్నిక కోసం ఏవైనా మూడు నచ్చిన పేర్లను, అందుబాటులో ఉన్న గుర్తుల్లో కొన్నింటిని ఎంపిక చేసుకొని, సోమవారంలోగా తమకు తెలియజేయాలని సూచించింది. వాటిని రెండు వర్గాల అభ్యర్థులకు కేటాయిస్తామని పేర్కొంది. పార్టీ ఎన్నికల గుర్తును తమ అభ్యర్థికే కేటాయించాలని షిండే వర్గం కోరగా ఈసీ తిరస్కరించింది. శివసేన ఈ ఏడాది జూన్లో రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అసలు శివసేన తమనంటూ షిండే, ఠాక్రే వర్గాలు వాదిస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పార్టీపై హక్కును నిరూపించుకోవడానికి అక్టోబర్ 7లోగా ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలకు ఈసీ ఆదేశించింది. చదవండి: థరూర్.. ఓ విఫల ప్రయత్నం.! -
థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్లైన్
సాక్షి,న్యూఢిల్లీ: శివసేన ఎన్నికల గుర్తు కేటాయింపుపై ఉద్ధవ్ థాక్రే వర్గానికి డెడ్లైన్ విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. శనివారం మధ్యాహ్నం 2గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అసలైన శివసేన తమదే అని, తూర్పు అంధేరీ ఉపఎన్నికలో విల్లు-బాణం గుర్తు తమకే కేటాయించాలని ఏక్నాథ్ షిండే వర్గం ఈసీని కోరిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన గడవులోగా తప్పకుండా వివరణ ఇస్తామని థాక్రే వర్గం స్పష్టం చేసింది. ఇప్పటికే శుక్రవారం ఈసీ అధికారులను కలిసి శివసేన పార్టీని షిండే వర్గం వారే స్వచ్ఛందంగా విడిచివెళ్లారని, కాబట్టి వారికి విల్లు-బాణం గుర్తు ఇవ్వొద్దని కోరింది. కానీ షిండే వర్గం శివసేన తమదే అని ఈసీకి శుక్రవారం రోజే చెప్పడంతో అధికారులు థాక్రే వర్గాన్ని మరోమారు వివరణ కోరారు. శనివారం మధ్యాహ్నం 2గంటల్లోగా స్పందించకపోతే నిబంధనల ప్రకారం గుర్తు ఎవరికి దక్కితే వారికే కేటాయిస్తామన్నారు. అంధేరి ఉపఎన్నికలో శివసేన(థాక్రే వర్గం) అభ్యర్థిగా రుతుజా లట్కే బరిలోకి దిగుతున్నారు. ఆమె భర్త రమేశ్ లట్కే మృతితో ఈ ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా మున్సిపల్ కార్పోరేటర్ ముర్జి పటేల్ పోటీ చేస్తున్నారు. షిండే వర్గం ఈయనకు మద్దతు తెలుపుతోంది. మిహావికాస్ అఘాడీ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీలు రుతుజా లట్కేకే మద్దతుగా ఉంటున్నాయి. చదవండి: శివసేన గుర్తు వాళ్లదెలా అవుతుంది: ఉద్ధవ్ థాక్రే -
శివసేన గుర్తు వాళ్లదెలా అవుతుంది: ఉద్ధవ్ థాక్రే
ముంబై: శివసేన పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందదని ఉద్ధవ్ థాక్రే వర్గం ఎన్నికల సంఘానికి తెలిపింది. ఆ వర్గం వారంతా స్వచ్ఛందంగా పార్టీని వీడి వెళ్లిపోయారని, అలాంటప్పుడు పార్టీ గుర్తు వాళ్లది చెందకూడదని పేర్కొంది. నవంబర్ 3న మహారాష్ట్రలోని తూర్పు అంధేరి ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలోనే శివసేన ఎన్నికల గుర్తు ఎవరిదనే విషయంపై వివరణ ఇవ్వాలని ఉద్దవ్ థాక్రే వర్గాన్ని కోరింది ఎన్నికల సంఘం. ఈ గడువు శనివారం వరకు ఉన్నప్పటికీ ఒక రోజు ముందుగానే థాక్రే వర్గం వివరణ ఇచ్చింది. అంధేరి ఉపఎన్నికలో శివసేన(థాక్రే వర్గం) అభ్యర్థిగా రుతుజా లట్కే బరిలోకి దిగుతున్నారు. ఆమె భర్త రమేశ్ లట్కే మృతితో ఈ ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా మున్సిపల్ కార్పోరేటర్ ముర్జి పటేల్ పోటీ చేస్తున్నారు. షిండే వర్గం ఈయనకు మద్దతు తెలుపుతోంది. మిహావికాస్ అఘాడీ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీలు రుతుజా లట్కేకే మద్దతుగా ఉంటున్నాయి. సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీతో చేతులు కలిపి ఏక్నాథ్ షిండే సీఎం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత థాక్రే వర్గంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా షిండే గూటికి చేరారు. పార్టీ ఎన్నికల గుర్తు అయిన విల్లు-బాణం కోసం ఈ రెండు వర్గాలు పోరాడుతున్నాయి. చదవండి: మోదీకి ఎందుకంత భయం.. ఒవైసీ సెటైర్లు -
కొడుకులు వారసులు కాలేరు! ఏక్నాథ్ షిండే సెటైర్లు
ముంబై: ముంబైలో శివసేన ప్రత్యర్థి వర్గాల మద్య దసరా ర్యాలీలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్ణణ జరగడానికి కొద్దిసేపటి ముందే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే.. ఉద్ధవ్ థాక్రేని లక్ష్యంగా చేసుకుని సెటైరికల్ ట్విట్లు పోస్ట్ చేశారు. ఈ మేరకు షిండే ట్విట్టర్లో...పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాక్రే వారసత్వంగా కొడుకులు రావాల్సిన అవసరం లేదంటూ ఉద్ధవ్ థాక్రేని ఉద్దేశిస్తూ సెటైర్లు విసిరారు. అలాగే ప్రముఖ కవి హరివంశరాయ్ బచ్చన్ గురించి ప్రస్తావిస్తూ... నా కొడుకు కావడం వల్ల అతను నా తర్వాత వారసుడు కాలేడు, నా తదనంతరం ఎవరైతే వస్తారో వారే తన కొడుకు అవుతాడని చమత్కరించారు. అంతేగాదు నిజమైన శివసేనకు నాయకత్వం వహించనప్పుడు థాక్రే వారసత్వం గురించి ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఉద్ధవ్ థాక్రే తన తండ్రి నిలబెట్టిన పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విసయమై థాక్రే, ఏక్నాథ్ షిండేల మధ్య న్యాయపోరాటం జరుగుతుంది. అలాగే ఇరువురి మధ్య సంప్రదాయ దసరా ర్యాలీ విషయమై కూడా న్యాయపోరాటం చేస్తున్నారు. ఐతే ఉద్ధవ్ థాక్రేకి ఈవిషయంలో బాంబే హైకోర్టు సంప్రదాయ వేదిక శివాజీ పార్క్ను మంజూరు చేయడంతో కాస్త ఊరట లభించినట్లయింది. (చదవండి: కశ్మీర్ను శాంతివనంగా మారుస్తాం! పాక్తో చర్చలపై హోం మంత్రి ఏమన్నారంటే..) -
శివసేనలో మరో ట్విస్ట్.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ!
మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శివసేనలో జంపింగ్ల పర్వం కారణంగా మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వర్గానికి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇన్ని రోజులు ఉద్దవ్ వెంట ఉన్న శివసేన కార్యకర్తలు ఒక్కొక్కరుగా సీఎం ఏక్నాథ్ షిండే వర్గంలోకి వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ముంబైలో ఉద్దవ్ థాక్రే, ఆదిత్యా థాక్రేకు ఊహించని షాక్ తగిలింది. ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన దాదాపు 3000 మంది శివసేన, ఉద్దవ్ థాక్రే మద్దతుదారులు ఆదివారం సీఎం షిండే వర్గంలో చేరారు. అయితే, ముంబైలో దసరా సందర్భంగా తన మద్దతుదారులతో ర్యాలీ చేసేందుకు థాక్రే.. ముంబై హైకోర్టు నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్దవ్ మద్దతుదారులు ఇలా హ్యాండిచ్చి.. షిండే వర్గంలో చేరడంతో ఊహించని విధంగా షాక్ తగిలినట్టు అయ్యింది. మరోవైపు.. ముంబైలోని వర్లీ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఆదిత్య థాక్రే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచే ఆదిత్య థాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కాగా, తాజా పరిణామం కారణంగా ఆదిత్య థాక్రేకు సైతం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక, ఇటీవలే శివసేన గుర్తు గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు వెలువడింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని, దానిని అడ్డుకునే అధికారం తమకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉద్దవ్ థాక్రే పిటిషన్ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. 3000 Shiv Sena members from Mumbai’s Worli join Eknath Shinde faction >> Watch Now https://t.co/7yfDzFmdS2 #3000 #Shiv #Sena #members #News #NewsUpdate #LatestNews #TodayNews #BreakingNews #Trending #TrendingNews #Headlines pic.twitter.com/kSJzDiPw0R — News7 India (@news7indialive) October 2, 2022 -
ఉద్దవ్ థాక్రేకు బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారంలో.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు వెలువడింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని సుప్రీం కోర్టును ఆశ్రయించింది షిండే వర్గం. అయితే.. గుర్తింపు అధికారం ఇవ్వకుండా ఈసీని అడ్డుకోవాలంటూ మరో పిటిషన్ వేసింది థాక్రే వర్గం. ఈ పిటిషన్ల విచారణకై సుప్రీం కోర్టు ప్రత్యేకంగా ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో.. ఇరు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ షిండే వర్గానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఎన్నిలక సంఘానికి ఉంటుందని, దానిని అడ్డుకునే అధికారం తమకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉద్దవ్ థాక్రే పిటిషన్ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఆగష్టు 23న.. ఉద్దవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్కు బదిలీ చేసింది. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల అనర్హత.. తదితర రాజ్యాంగ బద్ధమైన ప్రశ్నల నడుమ ఆ పని చేసింది. అంతేకాదు స్పీకర్,గవర్నర్, న్యాయ సమీక్షల విచక్షణ అధికారాన్ని ఆ పిటిషన్లు ప్రశ్నించాయి కూడా. ఏక్నాథ్ షిండేకు విధేయులైన ఎమ్మెల్యేలు మరో రాజకీయ పార్టీలో విలీనం చేయడం ద్వారానే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత వేటు పడకుండా ఉండవచ్చని థాకరే వర్గం కోర్టుకు తెలిపింది. సొంత పార్టీ విశ్వాసం కోల్పోయిన నాయకుడికి ఫిరాయింపుల నిరోధక చట్టం ఆయుధంగా మారదని షిండే టీమ్ వాదించింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరి నుంచి ఆయన తప్పుకోలేదు! -
Maharashtra: దసరా ర్యాలీ.. హైకోర్టులో ఉద్దవ్ ఠాక్రేకు భారీ ఊరట..
సాక్షి, ముంబై: గత కొన్ని రోజులుగా తార స్థాయికి చేరిన దసరా ర్యాలీ(సదస్సు) వివాదంపై ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. కోర్టుకు వరకు వెళ్లిన ఈ పంచాయతీలో ఉద్దవ్ ఠాక్రేకు అనుకూలంగా తీర్పు వెలువడింది. శీవాజీ పార్క్ మైదానంలో అక్టోబర్ 2 నుంచి 6 మధ్యన దసరా ర్యాలీ నిర్వహించేందుకు ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు అనుమతిస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా శివాజీ పార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహించేందుకు అనుమతివ్వాంటూ శివసేన హైకోర్టు దాఖలు చేసిన విషయం తెలిసిందే. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా దసరా ర్యాలీని నిర్వహించేందుకు కోర్టు ఉద్దవ్ ఠాక్రేకు అనుమతిని ఇచ్చింది. అయితే శాంతిభద్రతల నడుమ ర్యాలీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. కోర్టు ఆదేశాల అనంతరం శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. ‘ఒకే పార్టీ నాయకుడు, ఒక శివసేన, ఒకే శివతీర్థం. ఒకే దసరా సమావేశం. అక్టోబర్ 5న పులి గర్జన వినబడనుంది.’ అని ట్వీట్ చేశారు. కాగా లాక్డౌన్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత శివాజీ పార్క్లో ఈ ఏడాది దసరా ర్యాలీ నిర్వహించనున్నారు. చదవండి: అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే! వివాదం ఏంటి? అక్టోబర్ నెలలో దసరా ర్యాలీ కోసం శివాజీ పార్క్ మైదానం అద్దెకివ్వాలని గత నెలలోనే(ఆగస్టు 22) శివసేన దరఖాస్తు చేసుకుంది. ఆ తరువాత వారం రోజులకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం తరపున స్థానిక శివసేన ఎమ్మెల్యే సదా సర్వస్కర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకు మైదానం అద్దెకిచ్చే విషయాన్ని గుర్తు చేస్తూ ఉద్దవ్ వర్గం మరోసారి(ఆగస్టు26) దరఖాస్తు చేసుకున్నప్పటికీ బీఎంసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బీఎంసీ నియమ నిబంధనల ప్రకారం ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతివ్వాలి. కానీ శివసేన చీఫ్ ఉద్దవ్ వర్గానికి శివాజీ పార్క్ మైదానం అద్దెకివ్వకూడదని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. అయితే నెలరోజులులైనా బీఎంసీ అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్దవ్ ఠాక్రే వర్గం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నాలుగు సార్లు మినహా 55 ఏళ్లుగా.. దాదాపు 55 ఏళ్ల కిందట బాల్ ఠాక్రే శివసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ సుదీర్ఘ కాలంలో నాలుగు సార్లు మినహా ఏటా శివాజీ పార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తున్నారు. 2012లో బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత ఈ పరంపరాను ఆయన తనయుడు ఉద్దవ్ ఠాక్రే కొనసాగిస్తున్నారు. దీంతో శివాజీ పార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహించే హక్కు ప్రథమంగా తమకే ఉందని ఉద్దవ్ వర్గం వాదిస్తోంది. చదవండి: సిగరెట్ వేరు.. మద్యం వేరు.. అందుకు నో చెప్పిన సుప్రీంకోర్టు -
బీజేపీనే నెం.1.. థాక్రే ఖేల్ ఖతం: ఫడణవీస్
ముంబై: మహారాష్ట్రలో రెండు రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం తమదంటే తమదే అని అధికార బీజేపీ-శివసేన, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ప్రకటించుకున్నాయి. మొత్తం 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. తాము 259 చోట్ల గెలిచామని బీజేపీ చెబుతోంది. అలాగే తమ మిత్రపక్షం, సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన బలపర్చిన 40 అభ్యర్థులు గెలిచినట్లు పేర్కొంది. ఈ ఫలితాలపై స్పందిస్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీనే నెంబర్-1 పార్టీ అన్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పని అయిపోయిందన్నారు. బాలాసాబెహ్ థాక్రే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న షిండే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. ఈ సమయంలో షిండే పక్కనే ఉన్నారు. అయితే మహావికాస్ అఘాడీ మాత్రం బీజేపీ ప్రకటనను తోసిపుచ్చింది. 494 గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాలు మాత్రమే వచ్చాయని, అందులో తామే ఎక్కువ చోట్ల గెలిచినట్లు లెక్కలు చెప్పింది. వీటి ప్రకారం బీజేపీ 144 స్థానాల్లో, ఎన్సీపీ 126, కాంగ్రెస్ 62, షిండే-శివసేన 41, థాక్రే-శివసేన 37 సీట్లు గెలుపొందింది. దీంతో మొత్తంగా తాము 494కి 225 స్థానాలు గెలిచినట్లు ఎంవీఏ వివరించింది. అయితే గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగవు కాబట్టి వీటిని రాజకీయ పార్టీలు తమ విజయంగా చెప్పుకోవడం సరికాదని ఎన్పీపీ నేత అజిత్ పవార్ అన్నారు. ఒకవేళ గెలిచిన అభ్యర్థులు తాము ఈ పార్టీకే మద్దతిస్తామని చెబితే అప్పుడు లెక్కలోకి తీసుకోవచ్చన్నారు. 300 స్థానాల్లో గెలిచామని బీజేపీ-షిండే వర్గం చెబుతోందని ప్రశ్నించగా.. అలా అయితే నేను 400 స్థానాల్లో గెలిచామని చెబుతా అని బదులిచ్చారు. ఇవి పార్టీల గుర్తుపై జరిగే ఎన్నికలు కావు కాబట్టి లెక్కలు ఎంతైనా చెప్పుకోవచ్చని బీజేపీపై సెటైర్లు వేశారు. చదవండి: పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానయాన శాఖ దర్యాప్తు! -
Maharashtra: ‘గవర్నర్ కోటా’తో మళ్లీ ఎరవేస్తారా?
సాక్షి, ముంబై: మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం హయాంలో పంపించిన గవర్నర్ నామినేటెడ్ 12 మంది ఎమ్మెల్సీల జాబితాను మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ సోమవారం రద్దు చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే కార్యాలయానికి రాసిన లేఖలో గవర్నర్ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా మరో జాబితా గవర్నర్కు పంపించాల్సి ఉంటుంది. గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే 12 మంది ఎమ్మెల్సీల పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో గత మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం 2020 నవంబర్లో 12 మంది సభ్యుల పేర్లతో కూడిన జాబితాను ఆమోదం కోసం గవర్నర్కు పంపించింది. కాని గవర్నర్ ఈ జాబితాను ఆమోదించకుండా సంవత్సర కాలంపాటు పెండింగులో ఉంచారు. ఆ తరువాత శిందే 50 మంది మద్దతుదారులతో తిరుగుబాటుచేసి శివసేన నుంచి బయటపడ్డారు. అనంతరం బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. దీంతో ప్రభుత్వం మారిపోవడంతో గతంలో మహా వికాస్ ఆఘాడి పంపించిన జాబితా నిరుపయోగంగా మారింది. దీంతో ఈ జాబితాను రద్దు చేయాలంటూ ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు గవర్నర్కు లేఖ రాశాయి. దీనిపై స్పందించిన గవర్నర్ కార్యాలయం ఆఘాడి ప్రభుత్వం పంపించిన జాబితాను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా లేఖ రాసింది. దీంతో శిందే వర్గం నుంచి, ఫడ్నవీస్ వర్గం నుంచి ఎంతమందికి ఎమ్మెల్సీ పదవి వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇటీవల కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం తాజాగా మళ్లీ 12 మంది ఎమ్మెల్సీల పేర్లతో కూడిన జాబితా రూపొందించి గవర్నర్కు పంపించాల్సి ఉంటుంది. అప్పట్లో శిందేతోపాటు శివసేన పార్టీ నుంచి బయటపడిన మద్దతుదారులు ఎమ్మెల్సీ పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణలో చోటు లభించకపోవడంతో అనేక మంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి వారిని సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు. రెండో దశ మంత్రివర్గ విస్తరణకు ముందే గవర్నర్ నామినేటెడ్ 12 మంది ఎమ్మెల్సీల అంశం తెరమీదకు వచ్చింది. దీంతో కనీసం ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టి కొందరినైన సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తుండవచ్చని శిందే వర్గం ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. లేదంటే అసంతృప్తి హద్దులుదాటి శిందే వర్గం నుంచి బయటపడే ప్రమాదం లేకపోలేదు. దీంతో శిందే, ఫడ్నవీస్ వర్గం నుంచి 12 మంది ఎమ్మెల్సీలను నియమించాల్సి ఉంటుంది. ఇందులో శిందే వర్గం నుంచి, ఫడ్నవీస్ వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలకు అవకాశం లభిస్తుందనేది వేచిచూడాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ నుంచి నాగ్పూర్లో ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ సమావేశాలకు ముందే ఖాళీగా ఉన్న 12 మంది ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసే ప్రయత్నం శిందే, ఫడ్నవీస్ చేయనున్నారు. చదవండి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ ప్రభుత్వానివి కుట్ర రాజకీయాలు: ఎన్సీపీ ఎమ్మెల్సీలుగా 12 మంది పేర్లను ప్రతిపాదించాలని గతంలో మహా వికాస్ అఘాడి చేసిన సిఫార్సును ఉపసంహరించుకోవాలని ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్సీపీ సోమవారం తీవ్రంగా విమర్శించింది. గవర్నర్ కోటా కింద మరింత మంది నేతలను అధికార శిబిరంలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని గత ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఎమ్మెల్సీలుగా నామినేషన్ కోసం 12 మంది పేర్లను సిఫారసు చేసింది,అయితే ఫైల్ను గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఆమోదించలేదు. ఎంవీఏ సూచించిన 12 పేర్లలో ప్రముఖంగా కాంగ్రెస్ను వీడి శివసేనలో చేరిన నటి ఊర్మిళ మటోండ్కర్ కూడా ఉన్నారు. ఈ సిఫార్సును ఉపసంహరించుకున్నట్లుగా పరిగణించాలని శిందే ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసిందని, కొత్త ప్రభుత్వ నిర్ణయాన్ని కోశ్యారీ అంగీకరించారని ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. కాగా, తాజాగా నామినేషన్ల జాబితాను త్వరలో అందజేస్తామని శిందే ప్రభుత్వం గవర్నర్కు తెలిపింది. ఎన్సీపీ ప్రధాన అధికార ప్రతినిథి మహేష్ తపసే సోమవారం మాట్లాడుతూ, ‘శిందే ప్రభుత్వం యొక్క రాజ్యాంగ చెల్లుబాటు ప్రశ్నార్థకంగా ఉంది. దానిపై సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి ఉంది’ అని గత ఎంవీఏ ప్రభుత్వం సిఫార్సు చేసిన పేర్లను రద్దు చేయాలనే నిర్ణయం విపక్షాలకు చెందిన మరింత మందిని ఆకర్షించడానికి బీజేపీ–శిందే శిబిరంలోని నేతలు ‘క్యారెట్’ అని విమర్శించారు. ఎంవీఏ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలను అధిగమించాలనే ఏకైక ఎజెండాతో శిందే మంత్రివర్గం నడుస్తోంది’ అని తపసే ఆరోపించారు. ఈ చర్యద్వారా మహారాష్ట్రలో ఓటర్ల మనోభావాలు బీజేపీ–శిందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేగంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
మహారాష్ట్రలో మారుతున్న సమీకరణాలు.. కూటమిగా శివసేన–సంభాజీ బ్రిగేడ్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. రెండు పార్టీలు నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. స్ధానిక సంస్ధల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శివసేన, సంభాజీ బ్రిగేడ్ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇరు పార్టీల నేతలు వెల్లడించారు. సంభాజీ బ్రిగేడ్ పార్టీ అధ్యక్షుడు మనోజ్ ఆఖరే శుక్రవారం ఉదయం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. సుమారు గంటకుపైగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత ఇరువురు కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ ఇక నుంచి రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని, ప్రజాస్వామ్యాన్ని, బతికించేందుకు రెండు పార్టీలు ఒకటయ్యాయని అన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సంభాజీ బ్రిగేడ్, శివసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యాన్ని, రీజినల్ పార్టీల అస్థిత్వాన్ని కాపాడేందుకే ఇరువురం ఒక్కటయ్యామని, ఇలాంటి పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీచేసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల శివసేన నుంచి తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్నాథ్ శిందేపై, బీజేపీ, ఆరెస్సెస్పై ఉద్ధవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో మాదిరిగా ఇరు పార్టీలు పనిచేయడం లేదని, ఇరు పార్టీల ఆలోచన విధానాలు వేరయ్యాయని ఆరోపించారు. ఆరెస్సెస్ రెండుగా చీలిపోయిందని, క్రమంగా బలహీన పడుతోందని ఆయన చురకలంటించారు. శిందే తిరుగుబాటు సంచలనం.. ఒకప్పుడు రాష్ట్రంలో పటిష్టమైన, తిరుగులేని పార్టీగా ఎదిగిన శివసేనను ఏక్నాథ్ శిందే రెండుగా చీల్చారు. దీంతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. శివసేన నుంచి బయటపడిన శిందే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. శిందే తిరుగుబాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామ చేయాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి శివసేన అస్ధిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: (గణేశ్ విగ్రహాల ధరలు పెరిగాయ్... ఎందుకంటే..) గత్యంతరం లేక శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి అలాగే కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేనతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో శివసేన ఏకాకిగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి సందర్భంలో శివసేనతో జతకట్టేందుకు సంభాజీ బ్రిగేడ్ పార్టీ ముందుకు రావడంతో పరోక్షంగా మరింత బలాన్ని చేకూర్చినట్లైంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరాఠాలకు ఎన్నడూ న్యాయం జరగలేదని, స్వార్థం కోసం శివసేనను అంతర్గతంగా చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉద్ధవ్ ఆరోపించారు. ఇద్దరం కలిసి నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతామని ఆయన స్పష్టం చేశారు. మరాఠా సమాజంలో చీలికలు తెచ్చేవారిని భూస్ధాపితం చేద్దామని ఉద్ఘాటించారు. అయితే ఇరు పార్టీల మధ్య సమన్వయం చేకూర్చేందుకు ప్రత్యేకంగా ఒక సమన్వయ సమితి కూడా ఏర్పాటు చేయనున్నట్లు శివసేన సీనియర్ నేత సుభాష్ దేశాయ్ వెల్లడించారు. రెండు పార్టీల ఆలోచన విధానాలు, పనిచేసే పద్దతి ఒకే రకంగా ఉన్నాయని, అందుకే ఇరువురి చేతులు కలిశాయని దేశాయ్ వ్యాఖ్యానించారు. -
శివసేన కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: శివసేన అధికారిక గుర్తును ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాల్లో ఎవరికి కేటాయించాలనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారంపై మొత్తం 8 ప్రశ్నలను రూపొందించింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం దీనిపై విచారణ జరిపి తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో గురువారం వరకు శివసేన ఎన్నికల గుర్తు(విల్లు, బాణం)ను ఎవరికి కేటాయించాలనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు సూచించింది. శివసేన పార్టీ తమదే అని ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించి అసలైన శివసేన ఎవరిదో ఎన్నికల సంఘమే నిర్ణయించేందుకు అనుమతించాలని షిండే గతనెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శివసేన మెజార్టీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారని, పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవద్దని కోరారు. మరోవైపు థాక్రే వర్గం కూడా శివసేన తమదే అని వాదిస్తోంది. పార్టీ విప్ను ధిక్కరించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో పేర్కొంది. చదవండి: మునుగోడు కోసం తెలంగాణను తగలబెడతారా?: అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ -
సంజయ్ రౌత్ కస్టడీ 5 వరకు పొడిగింపు
ముంబై: శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్(60) జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు వచ్చే నెల 5 వరకు పొడిగించింది. ముంబై చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకలపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈనెల ఒకటిన ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియడంతో ప్రత్యేక జడ్జి ఎంజీ దేశ్పాండే ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీని పొడిగించాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న జడ్జి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆయన కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
Maharashtra: వాడీవేడిగానే అసెంబ్లీ సమావేశాలు.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం
సాక్షి, ముంబై: వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు (రెండో రోజు) గురువారం ఉదయం వాడివేడిగానే జరిగాయి. అయితే అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ వాతావరణాన్ని వేడెక్కించకుండా తగిన జాగ్రత్త తీసుకోవడంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగాయి. బుధవారం మొదటి రోజు ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం అసెంబ్లీలో ఎదురుపడడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తిరుగుబాటు చేసిన శిందే వర్గీయులు, ఉద్ధవ్ ఠాక్రే మద్దతుదారుల మధ్య నమ్మక ద్రోహంపై కొద్దిసేపు మాటల వాగ్యుద్ధం జరిగింది. దీంతో పరిస్ధితులు అదుపు తప్పకముందే అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ గత్యంతరం లేక సభా కార్యకలాపాలు ప్రారంభమైన కొద్ది సేపటికే గురువారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. గురువారం కూడా అదే పరిస్థితి నెలకొంటుందని అందరూ భావించారు. సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత అజిత్ పవార్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆరోగ్య శాఖ వైఫల్యాలను ఎండగడుతూ సంబంధింత మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సార్వజనిక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తానాజీ సావంత్కు తల తిరిగింది. సరైన సమాధానమివ్వడానికి తడబడ్డారు. పాల్ఘర్ జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన గజవ్యాధిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని పాల్ఘర్ ఎమ్మెల్యే లేవనెత్తిన ప్రశ్నకు తానాజీ ధీటుగా సమాదానమిచ్చారు. కాని అజీత్ పవార్ పాల్ఘర్ జిల్లా ఆరోగ్య శాఖలో మొత్తం ఎన్ని పదవులు ఖాళీగా ఉన్నాయి. అందులో పూరించినవి ఎన్ని..? నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారు...? వివరాలు వెల్లడించాలని పవార్ అడిగిన ప్రశ్నకు తానాజీ స్పష్టంగా సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే విపక్షనేత ప్రశ్నలకు గంట తరువాత సమాధానమిస్తానని అందుకు గడువివ్వాలని కోరడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే గంట తరువాత కూడా ఆయన సమాధానం ఇస్తారనే నమ్మకం లేదని, దీనిపై సోమవారం చర్చిద్దామని స్పీకర్ చెప్పడంతో అందరు శాంతించారు. నల్ల గడ్డం.. తెల్ల గడ్డంపై భుజబల్ వ్యంగ్యం... అనంతరం ఎన్సీపీ నేత ఛగన్ భుజబల్ వస్తు సేవా పన్ను (జీఎస్టీ)పై ప్రశ్నల వర్షం కురిపించారు. జీఎస్టీని అడ్డుపెట్టుకుని అనేక చోట్ల దోపిడీ జరుగుతోందని ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర చరిత్రలో మొదటిసారి గడ్డం ఉన్న వ్యక్తి (పరోక్షంగా ఏక్నాథ్ శిందేను ఉద్ధేశించి) ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రభావం రాష్ట్రం వరకే పరిమితం ఉంది. కాని తెల్లగడ్డం ఉన్న వ్యక్తి (ప్రధానినుద్ధేశించి) ప్రభావం యావత్ దేశంలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రతీ వస్తువుపై జీఎస్టీ విధిస్తున్నారు. అదృష్టవశాత్తు మాపై జీఎస్టీ విధించడం లేదని వ్యంగ్యంగా అన్నారు. ఎక్కడ చూసినా జీఎస్టీ పేరుతో దోపిడీ జరుగుతోందని భుజబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసే ప్రతిపాదనలు, ప్రకటనలు చేస్తున్నారు. త్వరలో నిజం బయటపడుతుందన్నారు. ధీటుగా స్పందించిన ప్రభుత్వం గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న వారే నేడు మంత్రి పదవిలో కూర్చున్నారని జయంత్ పాటిల్ ఆరోపించారు. కాని అధికార పార్టీ మంత్రులు ధీటుగా సమాధానమిచ్చారు. సభ ప్రారంభానికి ముందు శిందే తమ వర్గం మంత్రులందరికీ ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానమివ్వాలని ఆదేశించారు. దీంతో ఎలాంటి జంకు లేకుండా ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానమిస్తున్న దృశ్యాలు నేడు అసెంబ్లీలో కనిపించాయి. ఇరిగేషన్ డిపార్టుమెంట్ కుంభకోణంలో ఎన్సీపీకి చెందిన ఓ బడా నేత త్వరలో జైలుకు వెళతారని మోహితే కంబోజ్ చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై సభలో గందరగోళం నెలకొంది. కంబోజ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఆ తరువాత అందరు శాంతించడంతో సభా కార్యకలాపాలు తిరిగి ముందుకుసాగాయి. -
షిండే వర్గం కోసం శివసేన కొత్త భవనం?
ముంబై: రెబల్ ఎమ్మెల్యేల ద్వారా శివసేన పార్టీని విభజించిన ఆ పార్టీ కీలక నేత ఏక్నాథ్ షిండే.. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో మహారాష్ట్రలో సర్కార్ను ఏర్పాటు చేయడం, ఏకంగా సీఎం అయిపోవడం విదితమే. అయితే.. తమదే సిసలైన శివసేన అని ప్రకటించుకున్న షిండే వర్గం.. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమవుతోందా? బాలాసాహెబ్(బాల్థాక్రే) నేతృత్వంలో స్థాపించిన బడిన శివసేన ప్రధాన కార్యాలయం శివసేన భవన్.. దాదర్లో ఉంది. ఈ భవనంతో సంబంధం లేకుండా ఓ శివసేన భవనం ఏర్పాటు చేసే ఆలోచనలో షిండే వర్గం ఉన్నట్లు ఊహాగాన కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు దాదర్ ప్రాంతంలోనే కొత్త భవనం కోసం వేట ప్రారంభించినట్లు, ప్రధాన కార్యాలయంతో పాటు స్థానిక కార్యాలయాలను సైతం నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్లు ఆ కథనాల సమచారం. అయితే ఈ కథనాలపై షిండే వర్గం స్పందించింది. తాజాగా షిండే కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేసిన ఉదయ్ సామంత్ అదంతా ఊహాగానమే అని ప్రకటించారు. కొత్త ప్రధాన కార్యాలయం లాంటి ఆలోచనేం లేదు. బాలాసాహెబ్పై ఉన్న గౌరవంతో శివసేన భవనాన్నే మేం గౌరవిస్తాం. కానీ, సీఎం షిండే.. సామాన్యులతో భేటీ కోసం ఓ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మాత్రమే ఉన్నాం. బహుశా ఈ కథనాలు తెలిసి పొరపాటుగా అర్థం చేసుకుని మీడియా ఇలా ప్రచారం చేస్తుందేమో అని ఉయద్ సామంత్ వెల్లడించారు. ప్రస్తుతం శివ సేన పార్టీ ఎవరికి చెందాలనే వ్యవహారం సుప్రీం కోర్టులో నడుస్తోంది. తమదే అసలైన క్యాంప్ అంటూ మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే, ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే క్యాంప్లు పోటాపోటీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి. చదవండి: మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన -
అసలు సీఎం ఎవరో తెలియడం లేదు: ఆదిత్యా ఠాక్రే
ముంబై: మహారాష్ట్రలోని ఏక్నాథ్ శిండే–దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై శివసేన నేత, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే సోమవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఎవరో అర్థం కావడం లేదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సోమవారం మాతోశ్రీ వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఠాక్రే మాట్లాడుతూ, తిరుగుబాటు ఎమ్మెల్యేలపై శివసేన సుప్రీంకోర్టులో పోరాడుతోందని, సుప్రీం ఇచ్చే తీర్పు పార్టీపైనే కాకుండా మొత్తం దేశంపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం ఉందా లేదా అన్నది అసలు ప్రశ్న. ఇద్దరే ఇద్దరు వ్యక్తుల జంబో క్యాబినెట్లో, అసలు ముఖ్యమంత్రి ఎవరో అర్థం చేసుకావడం లేదు’ అని ఠాక్రే అన్నారు. యాదృచ్ఛికంగా, జూన్ 30న షిండే, ఫడ్నవీస్లు సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత మంగళవారం మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. శిండేతోపాటు 39 మంది సేన ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం జూన్ 29న పడిపోయిన విషయం తెలిసిందే. చదవండి: కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్.. 18 మంది మంత్రులు వీరే -
మంత్రుల అధికారాలు కార్యదర్శులకా?
సాక్షి, ముంబై: మంత్రాలయలో విధులు నిర్వహిస్తున్న ఆయా శాఖల కార్యదర్శులకు మంత్రుల అధికారాలు అప్పగించడంపై మహా వికాస్ అఘాడీకి చెందిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరి నెల మీద వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంవల్లే నేడు శిందే, ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఈ దుస్థితి ఎదురైందని మహా వికాస్ అఘాడీ నేతలు దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు సీఎం శిందే సమాధానమిస్తూ కార్యదర్శులకు మంత్రుల అధికారాలు కొన్ని మాత్రమే తాత్కాలికంగా కట్టబెట్టామే తప్ప, మిగతా అధికారాలు మంత్రిమండలి వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. మంత్రులు లేక వివిధ శాఖల్లో పనులు స్థంభించిపోతున్నాయన్నారు. దీంతో పనులు పారదర్శకంగా, వెంటనే పూర్తయ్యేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శిందే దృష్టి సారించారు. అందులో భాగంగా మంత్రాలయలో ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులకు శనివారం తాత్కాలికంగా మంత్రుల బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కానీ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మహావికాస్ అఘాడీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలంటే బీజేపీ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. శిందే, ఫడ్నవీస్ అసమర్థతవల్ల మంత్రివర్గ విస్తరణ తరుచూ వాయిదా పడుతోందని ఆరోపించారు. శిందే తరుచూ ఢిల్లీ పర్యటన చేస్తూ అక్కడ బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరుపుతూ కాలం వెల్లదీస్తున్నారు. రాష్ట్రంలో మంత్రులు లేకపోవడంవల్ల ప్రజల పనులు సకాలంలో జరగడం లేదు. దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద కూడా ఎలాంటి శాఖలు లేవు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన హోంశాఖ మంత్రి పదవి ఖాళీగానే ఉంది. ఫలితంగా ప్రభుత్వ పాలన కుంటుపడుతోంది. హోం, రెవెన్యూ, నగరాభివృద్ధి, ఆహార, పౌర, సరఫరాల శాఖ, ఫుడ్ అండ్ డ్రగ్స్ పరిపాలన విభాగం, గ్రామాభివృద్ధి, విద్య తదితర శాఖలతో సామాన్య ప్రజలకు చాలా దగ్గరి సంబంధాలుంటాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో ఇద్దరే ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న శిందే, ఫడ్నవీస్ తీసుకుంటున్నారు. చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ? మంత్రులు లేకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగానే ఉంటున్నాయని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక చోట్ల వరదలొచ్చాయి. బయట ప్రపంచంతో సబం«ధాలు తెగిపోయాయి. మంత్రులు లేక వరద బాధితులకు సాయం, పునరావాసం, పంటల నష్టంపై పంచనామా వంటి పనులు సకాలంలో పూర్తికాలేక పెండింగ్లో ఉన్నాయి. కానీ మంత్రుల అధికారాలు కార్యదర్శులకు అప్పగిస్తే తప్ప ఈ పనులు పారదర్శకంగా పూర్తికావని దుయ్యబట్టారు. ముఖ్యంగా జిల్లా ఇన్చార్జి మంత్రులు లేకపోవడంతో బాధితుల గోడు వినే నాథుడే కరువయ్యాడు. డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ చదివి పరీక్షలు రాసిన కార్యదర్శులకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయని నిలదీశారు. ప్రజలతో ఉంటూ, ప్రజల్లో మమేకమై తిరిగి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు అంటే మంత్రులకే ఎక్కువ తెలుస్తుందన్నారు. దీంతో త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
..చైనా మీద ఈడీ దాడులు చేయలేం కదా!
..చైనా మీద ఈడీ దాడులు చేయలేం కదా! -
థాక్రే శిబిరానికి ఎదురుదెబ్బ.. జోష్లో బీజేపీ
ముంబై: న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటూ షిండే-బీజేపీ కూటమికి తొలి నుంచి సవాల్ విసురుతున్నారు శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే. ఈ తరుణంలో.. తాజాగా థాక్రే శిబిరానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. అక్కడ జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోగా.. థాక్రే సారథ్యంలోని శివ సేన నాలుగో స్థానానికి పరిమితమైంది. మహారాష్ట్రంలో మొత్తం 28,813 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. తాజాగా గురువారం 62 మండలాల్లోని 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. అందులో పుణే, సతారా, ఔరంగాబాద్, నాసిక్ పరిధిలోని గ్రామాలు సైతం ఉన్నాయి. శుక్రవారం వాటికి కౌంటింగ్ జరగ్గా.. ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 82 స్థానాలు దక్కించుకోగా.. ఎన్సీపీ 53 స్థానాలు, శివ సేన(షిండే వర్గం) 40 స్థానాలు కైవం చేసుకుంది. ఇక శివ సేన(ఉద్దవ్ థాక్రే వర్గం) 27, కాంగ్రెస్ 22, ఇతరులు 47 చోట్ల విజయం సాధించారు. ఈ విజయంతో బీజేపీ సంబురాలు చేసుకుంది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లోనూ బీజేపీ నెంబర్ వన్ పార్టీ అని, బీజేపీతో పాటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివ సేన బాగా పని చేసిందని ట్వీట్ చేశారు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్. పనిలో పనిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ను, కార్యకర్తలను అభినందించారాయన. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్పాటిల్ సైతం స్పందిస్తూ.. ఇది ప్రజాతీర్పు అని, ప్రజావ్యతిరేక కూటమికి(మహా వికాస్ అగాఢిని ఉద్దేశించి) ఇది ప్రజలు ఇచ్చిన తిరస్కారం, మునుముందు ఇదే కొనసాగుతుంది అంటూ పరోక్షంగా థాక్రే వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: అనారోగ్యానికి గురైన షిండే.. ఆ బాధ్యతలు ఫడ్నవీస్కు! -
Shiv Sena Row: ఉద్దవ్ థాక్రేకు భారీ ఊరట
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టు ‘శివ సేన’ పంచాయితీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వర్గానికి అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఏక్నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఆయన వర్గానికి అసలైన శివ సేన గుర్తింపు ఇవ్వరాదని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంతేకాదు సోమవారం(ఆగస్టు 8వ తేదీన) ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు రాజ్యాంగబద్ధమైన బెంచ్కు సిఫార్సు చేయాలా? వద్దా? అనే విషయంపై సుప్రీం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపింది. గురువారం వాదనల సందర్భంగా సీజే ఎన్వీ రమణ.. షిండే వర్గాన్ని ఉద్దేశించి ముఖ్యమైన ప్రశ్నలు సంధించారు. ‘‘మీరు ఎన్నికైన తర్వాత రాజకీయ పార్టీలను పూర్తిగా విస్మరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా?’’ అని తెలుసుకోవాలని ఉందని షిండే తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వేను ఉద్దేశించి సీజే ఎన్వీ రమణ ప్రశ్నించారు. దీనికి ‘లేదు’ అనే సమాధానం వచ్చింది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం తేలేవరకు ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని ఉద్దవ్ థాక్రే వర్గం.. సుప్రీంను అభ్యర్థించింది. అయితే రాజ్యాంగబద్దమైన ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున తమనే అసలైన వర్గంగా గుర్తించాలని, ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని షిండే వర్గం సుప్రీంలో వాదన వినిపించింది. ఈ తరుణంలో షిండే గ్రూప్ పిటిషన్పై ప్రతికూలంగా స్పందించిన బెంచ్.. శివ సేన నియంత్రణను షిండే వర్గానికి అప్పగించ్చొద్దంటూ ఈసీకి సూచించింది. ఎవరిది అసలైన శివ సేన తేల్చేందుకు అగస్టు 8వ తేదీలోపు ఆధారాలు సమర్పించాలని ఎన్నికల సంఘం ఇది వరకే ఇరువర్గాలను ఆదేశించింది కూడా. ఇదీ చదవండి: ఇది మమత మార్క్ రాజకీయం! -
సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో?
సాక్షి ముంబై: శివసేన ఫైర్ బ్రాండ్ ఎంపీ సంజయ్ రౌత్ను ఈడీ అరెస్టు తర్వాత తరువాత టార్గెట్ ఎవరనే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు ఊతం వచ్చింది. ముఖ్యంగా సంజయ్ రౌత్ను ఈడీ అరెస్టు చేయడంతో ఒకరకంగా శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఓవైపు ఇప్పటికే ఏక్నాథ్ శిండే తిరుగుబాటుతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడటం ఉద్దవ్ ఠాక్రేకు చిక్కులను తెచ్చిపెట్టింది. మరోవైపు రోజురోజుకీ శిండే వర్గానికి పెరుగుతున్న మద్దతు, ఉద్దవ్ ఠాక్రే మద్దతుగా ఉన్న శివసేన నాయకులపై ఈడీ దర్యాప్తులు ఉద్దవ్ ఠాక్రేకు తలనొప్పిగా మారాయి. పార్టీని, పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఎన్నడూలేని విధంగా ఉద్దవ్ ఠాక్రేతోపాటు ఆదిత్య ఠాక్రే పలు ప్రాంతాల్లో పర్యటించి శివసేన పదాధికారులలో నూతన ఉత్తేజాన్ని నింపుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో సంజయ్ రావుత్ అరెస్టు కొంతమేర శివసేన కార్యకర్తలలో ఒకరకమైన ఆందోళనను రేకేత్తించేలా చేసిందని చెబుతున్నారు. అరెస్టు అయిన సంజయ్ రౌత్ తాను ఎలాంటి బెదిరింపులకు లొంగనని, తాను పార్టీ వీడనని ప్రకటించడం, దీనికి తీడు అన్ని రోజులు ఒకేలాగా ఉండవంటూ ఉద్దవ్ ఠాక్రే మాట్లాడటం శివసేన కార్యకర్తలలో ఒకరకమైన ఉత్తేజాన్ని నింపేలా చేస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో సంజయ్ రౌత్ తర్వాత ఈడీ టార్గెట్ ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడైన శివసేన నాయకుడు అనిల్ పరబ్ పేరు వినిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే బీజేపీ నాయకులు కిరీట్ సోమయ్య పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. కేసుల భయంతోనే శిండే గూటికి.. మరోవైపు శిండే వర్గంలో చేరిన శివసేన తిరుగుబాటు నాయకులు కూడా కావచ్చని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో శిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై కూడా ఈడీ దర్యాప్తులు జరిపి చర్యలు తీసుకుంటుందా అనే విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఏక్నాథ్ శిండే తిరుగుబాటుకు మందు ఆయన వర్గంలో చేరిన కొందరిపై ఈడీ దర్యాప్తులు చేసింది. వీరిలో ప్రతాప్ సర్నాయిక్, అర్జున ఖోత్కర్, యవ్వంత్ జాదవ్, భావనా గావ్లీ తదితరులున్నారు. వీరిని కూడా గతంలో ఈడీ విచారించింది. ముఖ్యంగా ప్రతాప్ సర్నాయక్కు చెందిన రూ. 11.35 కోట్లు విలువైన ఆస్తులను జప్తీ చేయగా యశ్వంత్ జాధవ్కు సంబంధించిన 40 ప్రాపర్టీలు జప్తీ చేశారు. వీటిలో ముంబై బైకలాలోని 26 ఫ్లాట్లున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గతంలో ఈడీ రాడార్పై ఉన్న నాయకులుగా ఉన్న వారిపై మళ్లీ చర్యలు ఉంటాయా లేదా క్లీన్ చీట్ ఇచ్చారా అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఔరంగాబాదులో ఎన్సీపీ యూత్ కార్యదర్శి అక్షయ్ పాటిల్ ఏర్పాటు చేసి బ్యానర్ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీజేపీ, బీజేపీలో చేరిన వారిపై కూడా ఈడీ, సీబీఐ చర్యలు కొనసాగుతాయా.? కొనసాగుతున్నాయని తెలిస్తే సమాచారం అందించి రూ. ఒక లక్ష బహుమతిని అందుకోవాలని బ్యానర్ ద్వారా ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారింది. -
Sanjay Raut: ఈడీ అరెస్ట్ మెమోలో ఏముందంటే..
ముంబై: శివ సేన ఎంపీ, ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంపై మహా రాజకీయాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగానూ చర్చ నడుస్తోంది. రౌత్కు గుండె సంబంధిత సమస్యలు ఉండడంతో వైద్య పరీక్షల అనంతరం చివరికి సోమవారం మధ్యాహ్నాం రిమాండ్ కోరుతూ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టింది ఈడీ. అయితే ఆయన అరెస్టుకు సంబంధించిన కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పలు జాతీయ మీడియా చానెల్స్ ఆయన అరెస్ట్ మెమో కాపీ వివరాలను సేకరించాయి. వాటిలో ఏముందంటే.. సంజయ్ రౌత్ ‘పాత్రా చావల్’ వెయ్యి కోట్ల రూపాయల భూకుంభ కోణంలో భాగం అయ్యారని, ఆయన మనీలాండరింగ్కు పాల్పడినట్లు తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నట్లు అరెస్ట్ మెమోలో స్పష్టం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. భార్య వర్ష రౌత్ ఆస్తులకు సంబంధించిన వివరాలతో పాటు వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్, స్వప్న పాట్కర్(ప్రవీణ్ రౌత్ భార్య)లతో సంబంధాలు, వ్యాపార లావాదేవీల గురించి సంజయ్ రౌత్పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘నా వద్ద ఉన్న మెటీరియల్ ఆధారంగా.. ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం శిక్షార్హమైన నేరానికి సంజయ్ రాజారామ్ రౌత్ పాల్పడినట్లు నమ్ముతున్నాం. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశాం’’ అని దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 సబ్ సెక్షన్ (1) ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ మెమోలో పేర్కొనబడింది. అంతేకాదు రౌత్ను అరెస్ట్ చేసే ముందు.. కారణాలను సైతం అధికారులు ఆయనకి వివరించారు. సంజయ్ రౌత్ విచారణ సమయంలో సహకరించలేదు. అలాగే.. లావాదేవీ వివరాల ఆధారంగా మనీల్యాండరింగ్తో లాభపడింది సంజయ్ రౌత్ అని, తద్వారా ఆయన ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించుకున్నాయి. అంతేకాదు.. సంజయ్ రౌత్, ఈ వ్యవహారంలో ప్రథమ నేరస్తుడిగా ఉన్న ప్రవీణ్ రౌత్కు సహకరించారు. ఇలా మూడు కారణాలతో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ మెమో వివరించింది. ఇక ఆదివారం సంజయ్ రౌత్ ఇంట్లో జరిగిన సోదాల్లో రూ.11.50 లక్షల లెక్కల్లోలేని సొమ్మును సీజ్ చేసింది. ఆపై ఆరుగంటలకు పైగా ఆయన్ని ప్రశ్నించి.. ఆపైనే అరెస్ట్చేసి ఈడీ కార్యాలయానికి తరలించింది. ఈడీ కార్యాలయానికి తన కారులోనే వెళ్లిన సంజయ్ రౌత్.. అంతుకు ముంద తన తల్లిని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహించి.. అనంతరం పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టింది ఈడీ. గతంలో.. ముంబైలోని ‘పాత్రా చావల్’ఏరియాలో పునరాభివృద్ధి ప్రాజెక్టులో అవకతవకలతో జరిగిన భూ కుంభకోణం విలువ రూ. 1,034 కోట్లుగా అంచనాకు వచ్చింది ఈడీ. గతంలో ఆరోపణల మేరకు దర్యాప్తు జరుగుతుండగా.. సంజయ్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఆపై ఈడీ ఎదుట విచారణకు సైతం హాజరయ్యారు సంజయ్ రౌత్. -
Sanjay Raut Arrest: బీజేపీ చర్య సిగ్గుచేటు..
ముంబై: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయడంపై తీవ్రంగా స్పందించారు ఆ పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపుతున్న బలమైన గళాన్ని అణగదొక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. విపక్ష నేతలను వేధించేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఇది సిగ్గుచేటని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంజయ్ రౌత్ అరెస్టును ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దీనిపై తామంతా ఐక్యంగా పోరాడుతామని చెప్పారు. The attempt to silence one of the most vocal opponent of the central/ state BJP and their wrongdoings — Sh @rautsanjay61 ji —is on. It is a shameful attempt to use central agencies to harass the opposition leaders. Condemn this harassment and we will all fight this out unitedly. — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 31, 2022 రూ.1000కోట్ల పత్రాచల్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్రౌత్ను ఈడీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ముంబైలోని ఆయన నివాసంలో గంటలపాటు సోదాలు నిర్వహించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. రూ.11.5లక్షల అక్రమ నగదును సీజ్ చేశారు. రౌత్ అరెస్టును శివసేన సహా విపక్ష పార్టీల నేతలు ఖండించారు. చదవండి: మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ను అరెస్టు చేసిన ఈడీ -
ఈడీ అదుపులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్
-
శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్ అరెస్టు
ముంబై: శివసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు. రూ.11.5లక్షల నగదును జప్తు చేశారు. సంజయ్ రౌత్తో పాటు, ఆయన కుటుంబసభ్యులపై రూ.1000కోట్ల భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. ED officials take Shiv Sena leader Sanjay Raut along with them after detaining him post conducting raids at his residential premises in Mumbai. Party workers present at the spot pic.twitter.com/6Jubs44s4k — ANI (@ANI) July 31, 2022 సంజయ్ రౌత్ అరెస్టు నేపథ్యంలో ఆయన ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు తనను తీసుకెళ్లే సమయంలో ఇంటికి వచ్చిన శివసేన కార్యకర్తల వైపు చూసి రౌత్ అభివాదం చేశారు. పత్రాచల్ భూ కుంభకోణంలో(మనీలాండరింగ్ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులే ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని రౌత్ ఇంటికి వెళ్లి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. సంజయ్ రౌత్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, ఈడీకి భయపడను అంటూ కామెంట్స్ చేశారు. ఏప్రిల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా మిస్టర్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు బిగ్ షాక్ -
శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు బిగ్ షాక్
Sanjay Raut.. మహారాష్ట్రలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఆదివారం ఉదయం ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. పత్రాచల్ భూ స్కాం కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే, సంజయ్ రౌత్కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. పత్రాచల్ భూ కుంభకోణంలో(మనీలాండరింగ్ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులే ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని రౌత్ ఇంటికి వచ్చి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. మరోవైపు.. సంజయ్ రౌత్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, ఈడీ భయపడను అంటూ కామెంట్స్ చేశారు. ఏప్రిల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా మిస్టర్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ED Arrives at Sanjay Raut’s Mumbai Home for Questioning After Earlier No-Show https://t.co/WmDw6CS7xk — HuntdailyNews (@HUNTDAILYNEWS1) July 31, 2022 ఇది కూడా చదవండి: హోంమంత్రి ఇంటిపై ఏబీవీపీ కార్యకర్తల దాడి! -
నేను నోరువిప్పితే భూకంపమే.. ఉద్ధవ్ థాక్రేకు సీఎం షిండే వార్నింగ్
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేకు పరోక్ష హెచ్చరికలు చేశారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. తాను మాట్లాడటం మొదలు పెడితే భూకంపం వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి, ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్తో ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నించారు. అంతేకాదు తన గురువు, శివసేన ఫైర్ బ్రాండ్ ఆనంద్ దిఘే విషయంలో ఏం జరిగిందో కూడా తనకు తెలుసునని, తానే ప్రత్యక్ష సాక్షినని షిండే అనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. 2002లో రోడ్డు ప్రమాదానికి గురై ఆనంద్ దిఘే మరణించారు. ఇప్పుడు ఆయన ప్రస్తావనను షిండే తీసుకురావడం చర్చనీయాంశమైంది. అంతేకాదు శివసేన రెబల్ ఎమ్మెల్యేలను థాక్రే ద్రోహులు అనడంపైనా షిండే పరోక్షంగా స్పందించారు. మరి సీఎం పదవి కోసం ఎన్సీపీ, కాంగ్రెస్తో చేతులు కలిపి శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ సిద్ధాంతాలను పక్కనపెట్టిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. బాలాసాహెబ్ థాక్రే అసలు వారసులం తామే అని పేర్కొన్నారు. ఇటీవలే తన వర్గంలో చేరిన బాలాసాహెబ్ కోడలు, మనవడు కూడా తనకే మద్దతుగా నిలిచారని షిండే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి పోటీ చేసి మరోసారి అధికారం చేపడతామని షిండే ధీమా వ్యక్తం చేశారు. 288 సీట్లకు గాను 200కుపైగా స్థానాలు కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. చదవండి: హిందువులను విభజించాలని చూస్తున్నారు: ఉద్ధవ్ థాక్రే -
మరాఠీ బిడ్డలను అవమానించారు.. గవర్నర్ వ్యాఖ్యలపై థాక్రే ఫైర్
ముంబై: మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముంబైలో డబ్బే ఉండదని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే స్పందించారు. భగత్ సింగ్ కోశ్యారి వ్యాఖ్యలు మరాఠీ బిడ్డలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. హిందువులను విభజించేలా గవర్నర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఆయనను ఇంటికి పంపుతారో లేక జైలుకు పంపుతారో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలన్నారు. భగత్ సింగ్ కోశ్యారి గౌరవ పదవిని చూసి ఇంకా ఎంతకాలం సైలెంట్గా ఉండాలో తనకు అర్థం కావడం లేదని థాక్రే అన్నారు. గవర్నర్ పదవిని చేపట్టేవారు కనీసం వారు కూర్చునే కుర్చీనైనా గౌరవించాలన్నారు. అంతేకాదు కరోనా సమయంలో ఆలయాలను త్వరగా తెరవాలని గవర్నర్ తొందరపెట్టారని థాక్రే ఆరోపించారు. గతంలో ఆయన సావిత్రిబాయ్ పూలేను కూడా అవమానించారని పేర్కొన్నారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపించి వేస్తే దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో డబ్బు ఉండదని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి అన్నారు. వాళ్ల వల్లే ముంబైకి పేరు వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. చదవండి: మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం.. రాజీనామాకు డిమాండ్!