అందుకే ఓడిపోతున్నా : యోగీశ్వర | Bjp Leader Yogishwara Alleges Congress Offers Block Money To Win | Sakshi
Sakshi News home page

అందుకే ఓడిపోతున్నా : యోగీశ్వర

May 15 2018 9:08 AM | Updated on Mar 18 2019 7:55 PM

Bjp Leader Yogishwara Alleges Congress Offers Block Money To Win - Sakshi

చెన్నపట్టణ బీజేపీ అభ్యర్థి యోగీశ్వర (ఫైల్‌ ఫొటో)

సాక్షి, బెంగళూరు : దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం లోపు నాయకుల భవితవ్యం తేలనుంది. గెలుపే ధ్యేయంగా జోరుగా ప్రచారం చేసిన నేతలు ఫలితాల నేపథ్యంలో కూడా ఆరోపణల పర‍్వం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నపట్టణ బీజేపీ అభ్యర్థి యోగీశ్వర కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. జేడీఎస్‌ - కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని, బ్లాక్‌ మనీ వెదజల్లి తనను ఓడించేందుకు కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. జేడీఎస్‌ అభ్యర్థి కుమారస్వామిని కాంగ్రెస్‌ గెలిపిస్తోందని.. అందుకే తాను ఓడిపోతున్నాని అసహనం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం జేడీఎస్‌ అభ్యర్థి కుమారస్వామి చెన్నపట్టణ, రామనగర స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement