
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సూపర్స్టార్ రజనీకాంత్ బుధవారం రాత్రి డీఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వెళ్ళిన ఆయనకు స్టాలిన్, కనిమెళి తదితర నేతలు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కరుణానిధి ఆరోగ్యంపై రజనీకాంత్ ఆరా తీశారు. రజనీకాంత్ వస్తున్నట్లు సమాచారంతో కరుణానిధి నివాసానికి డీఎంకే కార్యకర్తలు తండోపతండాలుగా చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా రజనీ అభిమానులు, డీఎంకే కార్యకర్తలతో కిటకిటలాడింది. కరుణానిధితో రజనీ కాంత్ 20 నిముషాలపాటు భేటీ అయ్యారు.
రాజకీయ ప్రకటన తర్వాత రజనీకాంత్ డీఎంకే అధినేతను కలవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తాను కరుణానిధిని మర్యాద పూర్వకంగానే కలిశానని రజనీకాంత్ ఈ సందర్బంగా మీడియాతో చెప్పారు. రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్న నేపథ్యంలో కరుణానిధి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానన్నారు. అలాగే కరుణానిధికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment