జార్ఖండ్‌లో నేడే మూడో విడత పోలింగ్‌ | The Third Phase of Polling in Jharkhand Today | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో నేడే మూడో విడత పోలింగ్‌

Published Thu, Dec 12 2019 8:55 AM | Last Updated on Thu, Dec 12 2019 8:55 AM

The Third Phase of Polling in Jharkhand Today - Sakshi

రాంచీ : జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్‌ గురువారం జరుగుతోంది. మొత్తం 17 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతుండగా, అందులో రాజధాని నగరమైన రాంచీ కూడా ఉంది. రాంచీ, హతియా, కాంకె, బర్కత, రామ్‌గడ్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు. మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్ణయించారు. ఈ విడత పోలింగ్‌లో ముగ్గురు మంత్రుల  నియోజకవర్గాలున్నాయి. అంతేకాక, మాజీ ముఖ్యమంత్రి బాబులాల్‌ మరాండి, మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్‌ మాతోలు కూడా మూడో విడతలో పోటీ పడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement