Assembly election
-
బిహార్లో బీజేపీ ఎన్నికల నగారా
గోపాల్గంజ్: హోం మంత్రి అమిత్ షా ఆదివారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకి తిరిగి అధికారం కట్టబెట్టడం ద్వారా ప్రధాని మోదీని బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష ఆర్జేడీకి గట్టిపట్టున్న గోపాల్ గంజ్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి అమిత్ షా ప్రసంగించారు. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల అనంతరం అమిత్ షా పాల్గొంటున్న మొదటిసారి సభ ఇదే కావడం గమనార్హం. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్డీదేవి అధికారం చెలాయించిన 15 దశాబ్దాల కాలంలో బిహార్లో జంగిల్ రాజ్ నడిచిందని, కిడ్నాప్లు, హత్యలు, దోపిడీలు ఒక పరిశ్రమగా మారాయని నిప్పులు చెరిగారు. ‘రాష్ట్రంలో రక్షణ కొరవడటంతో ముఖ్యమైన వ్యాపారవేత్తలంతా ఆ సమయంలో రాష్ట్రాన్ని వీడారు. దాణా కుంభకోణానికి పాల్పడిన లాలు ప్రసాద్ యాదవ్ పేరు ప్రపంచ దేశాల్లోనే మారుమోగింది, బిహార్కు ఆయన తీరని కళంకం తెచ్చారు’అని అమిత్ షా ఆరోపించారు. ‘కుటుంబ రాజకీయాలు చేసే లాలు.. భార్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. కుమార్తెను పార్లమెంట్కు పంపారు. ఆయన ఇద్దరు కుమారులు ఇప్పుడు సీఎం అవ్వాలనుకుంటున్నారు’అని ఎద్దేవా చేశారు. ‘అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా చెప్పుకునే లాలు.. దాణా కూడా బొక్కేశారు. అటువంటి వ్యక్తి రికార్డు స్థాయిలో స్కాములే తప్ప, పేదలకు చేసేదేమీ లేదు’అని మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో జేడీయూ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాకే పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వరదల సమస్యకు చెక్ పెట్టామని చెప్పారు. లాలు–రబ్డీల జంగిల్ రాజ్ కావాలో, మోదీ, నితీశ్ల అభివృద్ధి కావాలో తేల్చుకునే సమయం ఇప్పుడు వచ్చిందని షా అన్నారు. ‘మరికొద్ది నెలల్లో అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో కమలం గుర్తు బటన్నే మీరు నొక్కుతారని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకే ఓటేస్తారని నాకు తెలుసు. మోదీ అంటే బిహార్ ప్రజలు ఎప్పుడూ అభిమానం చూపుతూనే ఉన్నారు. ఆయన్ను మళ్లీ మీరు బలపరుస్తారని ఆశిస్తున్నా’అని అమిత్ షా తెలిపారు. బిహార్ అసెంబ్లీకి వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
‘అందుకే ఓడిపోయా’
సాక్షి,సంగారెడ్డి : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో సహా,ఏ నాయకుడైనా డబ్బులు తీసుకోండా పనిచేస్తున్నామని చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావే (harish rao) కారణం. సిద్దిపేటలో గెలవడానికి హరీష్ ఎంత కష్టపడ్డారో, నన్ను ఓడగొట్టడానికి అంతే కష్టపడ్డారు. నా ప్లానింగ్ అంత హరీష్ భగ్నం చేశారు. పోలింగ్కు మూడు రోజుల ముందు జరగాల్సిన మీటింగ్ చేసుకొనివ్వకుండా హరీష్ వ్యూహం పన్నారు. రివేంజ్ పాలిటిక్స్ ఎవరు చేసిన మంచిది కాదు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదు. కక్ష సాధింపు చర్యలకు నేను వ్యతిరేకం. కాంగ్రెస్ నాయకులు రివేంజ్ పాలిటిక్స్ చేసినా మంచిది కాదు. నేను రాజకీయ యుద్ధం చేస్తాను. రివేంజ్ పాలిటిక్స్ చేయను. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి రివేంజ్ పాలిటిక్స్ చేయలేదు. రివేంజ్ పాలిటిక్స్ చేసిన రాజకీయనాయకులు ఏదో ఒకరోజు బాధపడక తప్పదు.సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నే ఫస్ట్ ప్రోటోకాల్. నా భార్య కార్పోరేషన్ ఛైర్మన్. ఆమె ప్రోటోకాల్ సెకండ్ ఉండాల్సిందే. 60 శాతం, 40 శాతంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచిస్తా. నాతో సహా ఏ రాజకీయ నాయకుడైనా డబ్బు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నామని చెప్పగలరా’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, జగ్గారెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. -
ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే
-
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం... జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే
-
ఎన్డీఏ వైపే సర్వేలు.. మహారాష్ట్ర, జార్ఖండ్ లో NDA కూటమిదే పైచేయి
-
కొనసాగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
మహారాష్ట్రలో ఉత్కంఠ రేపుతోన్న రాజకీయాలు
-
మహారాష్ట్ర ఎన్నికలు: ఆర్ఎస్ఎస్ సర్వేలో ఏం తేలింది?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మహాయుతికి చెందిన పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ విజయావకాశాలను తెలుసుకునేందుకు ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే నిర్వహించింది. దీనిలో మహాయుతికి 160 సీట్లు వస్తాయని వెల్లడయ్యింది.ఆర్ఎస్ఎస్ సర్వే ప్రకారం లోక్సభ ఎన్నికల్లో కాషాయ కూటమికి వ్యతిరేకంగా వచ్చిన ట్రెండ్ అసెంబ్లీలో కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి పూర్తి మెజారిటీ రానుంది. సంఘ్ వర్గాలు రహస్యంగా అంతర్గత సర్వే నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నాయి. అక్టోబర్ రెండో వారంలో మొత్తం 288 సీట్లపై సంఘ్ సర్వే నిర్వహించింది. సంఘ్ సర్వేలో మహాయుతికి ఎన్నికల్లో 160కి పైగా సీట్లు వస్తాయని తేలింది.బీజేపీకి 90 నుంచి 95 సీట్లు, షిండే సేనకు 40-50 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 25-30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూపీ, రాజస్థాన్, బెంగాల్లలో ఆ పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. బీజేపీ వరుసగా సొంతంగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అయితే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. -
‘మహా’త్యాగం కాంగ్రెస్కు సాధ్యమా?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే సమూలంగా మార్చివేసిన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నిక కోసం ఎప్పుడో సన్నద్ధమైపోయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారానికి తెర పడ్డప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటిస్తూ రాజకీయ ప్రసంగం చేయడం ఇందుకు నిదర్శనం. మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్లో ఇప్పుడిప్పుడే కద లిక ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ సన్నద్ధతపై ఆ పార్టీ విజయమొక్కటే ఆధారపడి లేదు. బీజేపీకి, దాని నేతృత్వంలోని ఎన్డీఏకు సవాల్ విసురుతున్న ‘ఇండియా’ విపక్ష కూటమి బలం పుంజుకోవడం కూడా కాంగ్రెస్ మంచి చెడుల పైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రవర్తన మీద!మహారాష్ట్ర, రెండు కూటములకూ ఎంతో కీలకమైన రాష్ట్రం. ప్రతి కూటమిలోనూ కనీసం మూడేసి ముఖ్య మైన భాగస్వామ్య పక్షాలున్నాయి. బీజేపీతో శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)లు జట్టుకట్టి ఏర్పడ్డ ‘మహాయుతి’ కూటమి ఎన్డీఏ శిబిరంలో ఉంది.కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న శివసేన (ఉద్దవ్ థాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్)ల ‘మహా వికాస్ ఆఘాడి’ (ఎమ్వీఏ) ఇండియా శిబిరంలో ఉంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర సంక్లిష్ట రాజకీయాల్లో కూటమి విజయాలన్నవి భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తుల సాఫల్యతను బట్టి ఉంటాయి. 2019 ఎన్నికల తర్వాత ఎన్నో రాజకీయ పరిణా మాలు వేగంగా మారుతూ వచ్చాయి. కలిసి ఎన్నికల్లో పోరిన బీజేపీ– శివసేన పార్టీలు గెలిచి కూడా సర్కారు ఏర్పరిచే సఖ్యత కుదరక విడిపోయాయి. ఎన్సీపీ–కాంగ్రెస్ జోడీతో చేతులు కలిపి శివసేన ‘ఎమ్వీఏ’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త పొత్తులతో ఏర్పడ్డ ఎమ్వీఏ ప్రభుత్వం కొంత కాలానికే కుప్ప కూలింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ‘చొరవ’ తీసుకొని, శివసేన చీలికవర్గం (తమదే అసలు శివసేన అంటారు) నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొంత కాలం తర్వాత, ఎన్సీపీ నుంచి చీలి వచ్చిన (వీరిది అదే రాగం) అజిత్ పవార్ను ఉపముఖ్యమంత్రిని చేసి, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఈ చీలికలు మహా రాష్ట్ర ప్రజలకు నచ్చినట్టు లేదు, అందుకే 2024 లోక్సభ ఎన్నికల్లో పాలక కూటమికి చుక్కెదురైంది. 48 లోక్సభ స్థానాలకుగాను మహాయుతికి 17 స్థానాలు దక్కితే, ఎమ్వీఏ 30 స్థానాల్లో నెగ్గి సత్తా చాటింది.ఇదివరకటిలా కాకుండా, రాహుల్గాంధీ రాజకీయంగా కొంత రాటుదేలుతున్నాడనే భావన ప్రజాక్షేత్రంలో వ్యక్తమౌతోంది. పొత్తుల్లో కొన్ని సార్లే కాంగ్రెస్ లాభపడ్డా, ఆ సానుకూల వాతావరణం వల్ల మిత్రులకు మేలు కలిగిన సందర్భాలే ఎక్కువ. 2004 తర్వాత మళ్లీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. పొత్తుల్లో పట్టువిడుపులు లేకుండా కాంగ్రెస్మొండికేసిన చోట, వారి వల్ల మిత్రులు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు బట్టి ఎక్కువ సీట్లు తీసుకొని, తక్కువ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ కారణంగానే, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కోల్పోయారనే భావన అత్య ధికుల్లో ఉంది. 243 స్థానాల్లో మ్యాజిక్ నంబర్ 122 అయితే ‘మహా ఘట్ బందన్’ 110 వద్ద ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు 12 సీట్లు తగ్గాయి. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 19 చోట్ల మాత్రమే నెగ్గింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఇటీవల ముగిసిన జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఒమర్ ఫరూక్ పరిస్థితి అట్లానే ఉండేది! 90 సీట్లకు, పొత్తుల్లో 51 చోట్ల పోటీ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ 42 చోట్ల నెగ్గితే, 32 స్థానాలు తీసుకొని (మరో 5 చోట్ల స్నేహపూర్వక పోటీలో ఉండి) 6 చోట్ల మాత్రమే కాంగ్రెస్ నెగ్గింది. హరియాణాలో, ‘ఇండియా’ కూటమి పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పొత్తుల్లో పది స్థానాలు (90లో) ఇవ్వడానికి వెనుకాడిన కాంగ్రెస్, వారు దాదాపు అంతటా పోటీ చేయడానికి పురిగొల్పింది. సమాన ఓటు వాటా (సుమారు 40 శాతం) పొందిన బీజేపీ, కాంగ్రెస్ మధ్య సీట్ల తేడా 11 మాత్రమే! కానీ, ఆప్కు సుమారు 2 శాతం ఓటు వాటా లభించింది.క్షేత్రంలోని వాస్తవిక బలం తెలుసుకొని, పొత్తుల్లో కొంచెం తగ్గితే వచ్చే నష్టమేంటి? ఈ సంస్కృతి కాంగ్రెస్ మరచిపోతోంది. ఇటువంటి పరిస్థితే లోగడ తలెత్తినపుడు... సోనియాగాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెనుకంజకు సిద్ధపడింది. ‘బీజేపీని, దాని నేతృత్వపు ఎన్డీఏను గద్దె దించడానికి ప్రతి యుద్ధం ప్రకటించాలి. ప్రతి పోరూ సాగించాలి. ఏ త్యాగానికైనా సిద్ధ పడాలి’ అని బెంగళూర్ (2001)లో జరిగిన ప్లీనరీలో నిర్ణ యించారు. ఆ మేరకు రాజకీయ తీర్మానం ఆమోదించారు. 2002 మౌంట్ అబూలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య మంత్రుల కాంక్లేవ్లో, ఈ పంథాకు సోనియాగాంధీ మరింత స్పష్టత ఇచ్చారు. ‘ఛాందసవాదుల్ని గద్దె దించ డానికి లౌకిక శక్తుల్ని ఏకం చేయాలి... మన లక్ష్యం సొంతంగా ప్రభుత్వం ఏర్పరచడమే, కానీ, అవసరమైతే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకూ మనం సంసిద్ధంగా ఉండాలి’ అని ఆమె ఉద్బోధించారు. నేను స్వయంగా విని, రిపోర్ట్ చేసిన, 1997 కలకత్తా ప్లీనరీలో సీతారాం కేసరి అధ్యక్షోపన్యాసం... ‘ఇది సంకీర్ణాల శకం అనుకోన వసరం లేదు. కాంగ్రెసే ఓ విజయవంతమైన సంకీర్ణం. మనకు ఏ పార్టీలతో పనిలేదు. సొంతంగా సర్కారు ఏర్ప రిచే సత్తా మనకుంది...’ అన్న ఆలోచనాసరళి దిశనే సోనియాగాంధీ పూర్తిగా మార్చేశారు. దీనికి, 1999 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కొత్త పాఠాలు నేర్చు కోవడమే కారణం. వివిధ రాజకీయ పార్టీల్లో నెలకొన్న ‘కాంగ్రెస్ వ్యతిరేక ధోరణి’ తారస్థాయికి చేరి, అప్పుడు తేలిగ్గా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ‘పొత్తు లతో మాత్రమే కాంగ్రెస్ గెలువగలదు...’ అని ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ 2003 డిసెంబరులో ఇచ్చిన నివేదికతో సోనియా ఈ దిశలో మరింత క్రియా శీలమయ్యారు. 2004 ఎన్నికల్లో దాన్ని పక్కాగా అమలు పరచి, ఎన్నికలు గెలిచి, కాంగ్రెస్ నేతృత్వంలో విజయవంతంగా ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ (యూపీఏ) ప్రభు త్వాన్ని ఏర్పాటు చేశారు. ‘త్యాగాలు’ అనే మాట ఊరకే రాలేదు. రాజీవ్గాంధీ హత్యలో డీఎమ్కేకు భాగముందని కాంగ్రెస్ స్వయంగా విమర్శించినా... తమిళనాడులో ఆ పార్టీతోనే పొత్తుపెట్టుకున్నారామె. ఆమె జాతీయతనే ప్రశ్నించి కాంగ్రెస్ను చీల్చిన శరద్పవార్ నేతృత్వపు ఎన్సీపీతో మహారాష్ట్రలో ఆమె పొత్తులకు సిద్ధమయ్యారు. సఖ్యతకు తలుపులు తెరచిన కమ్యూనిస్టులతో జతకట్టి యూపీఏను విజయతీరాలకు చేర్చారు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్లో ఉద్యమపార్టీ టీఆర్ఎస్తో చేతులు కలిపి గెలి చారు. ఈ పంథాయే ఇప్పుడు కాంగ్రెస్కు శరణ్యం.2029 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే రాజకీయ పునరేకీకరణలకు కాంగ్రెస్ వ్యూహరచన చేయొచ్చు. బీజేపీతో ముఖాముఖి తలపడే రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హరియాణా, హిమా చల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు సరేసరి! మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,పంజాబ్, జార్ఖండ్, కేరళ వంటి రాష్ట్రాల్లో మరింత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ కూటములను బలోపేతం చేసుకోవచ్చు. ఇతర ‘ఇండియా’ పక్షాలు లేని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిషా వంటి రాష్ట్రాల్లో కొత్త మిత్రుల్ని వెతుక్కోవచ్చు. అయితే వారే పేర్కొన్నట్టు ‘త్యాగాల’కు సిద్ధమైతే తప్ప పొత్తు ధర్మం పొద్దు పొడ వదు, రాజకీయ ఫలం సిద్ధించదు!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,‘పీపుల్స్ పల్స్’ డైరెక్టర్ -
జులానాలో విజేత.. వినేశ్ ఫొగాట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో పతకం సాధించలేకపోయినా హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటారు రెజ్లర్ వినేశ్ ఫొగాట్(30). జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీకి దిగిన ఫొగాట్ దాదాపు 19 ఏళ్ల అనంతరం ఆ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు. రెజ్లింగ్లో విజయం సాధించలేకపోయిన ఫొగాట్ను జులానా ఓటర్లు ఆదరించారు. ఫొగాట్కు 65,080 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్కు 59,065 ఓట్లు పడ్డాయి. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఫొగాట్ మధ్యలో కాస్త వెనుకబడ్డారు. చివరకు 6,015 ఓట్ల తేడాతో గెలుపు తీరాలకు చేరారు. అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నారు. కాగా, 2019 ఎన్నికల్లో ఇక్కడ కేవలం 12,440 ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ను బరిలోకి దింపి జాట్ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసి, సఫలమైంది. మరోవైపు, బీజేపీ యోగేష్ కుమార్ను నిలిపి ఓబీసీ ఓట్లను ఆకర్షించేందుకు ప్రయతి్నంచి, విఫలమైంది. -
హర్యానాలో అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ ప్రారంభం..
-
అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం ఎవరికో.. కశ్మీర్లో కదం తొక్కిన ఓటర్లు (ఫొటోలు)
-
Haryana Election: తొమ్మిది మంది అభ్యర్థులతో ఆప్ రెండో జాబితా విడుదల
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థుల రెండో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. బీజేపీని వీడి ఆప్లో చేరిన ప్రొఫెసర్ ఛత్రపాల్ను బర్వాలా అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు 29 మంది అభ్యర్థులను ప్రకటించింది.తాజాగా ప్రకటించిన జాబితాలో సధైరా నుంచి రీటా బమ్నేయకు టిక్కెట్టు ఇచ్చారు. థానేసర్ నుంచి కృష్ణ బజాజ్, ఇంద్రి నుంచి హవా సింగ్లను అభ్యర్థులుగా ప్రకటించారు. ముక్త్యార్ సింగ్ బాజిగర్కు రాటియా నుంచి, అడ్వకేట్ భూపేంద్ర బెనివాల్కు అడంపూర్ నుంచి, జవహర్లాల్కు బవాల్ టిక్కెట్ ఇచ్చారు. ఫరీదాబాద్ నుంచి ప్రవేశ్ మెహతా, తిగావ్ నుంచి అబాష్ చండేలాలను అభ్యర్థులుగా ప్రకటించారు.మరోవైపు గత ఐదు రోజులుగా కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు విషయమై చర్చలు జరిగినప్పటికీ అవి ఫలవంతం కాలేదు. పొత్తులో భాగంగా ఆప్ 10 సీట్లకు పైగా డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఆ పార్టీకి మూడు సీట్లకు మించి ఇవ్వడానికి సిద్ధంగా లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆప్ కాంగ్రెస్ మధ్య పొత్తు లేనట్లేనని తేలింది. ఈ పరిణామాల అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సోమవారం విడుదల చేసింది. -
వినేశ్ రాజకీయం నాకిష్టం లేదు: మహవీర్ ఫోగట్
ఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో జరిగే హర్యానా ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారని సమాచారం. ఇక.. ఈ నేపథ్యంలో వినేశ్ రాజకీయ ప్రవేశంపై ఆమె పెద్దనాన్న మహవీర్ ఫోగట్ ప్రతికూలంగా స్పందించారు. వినేశ్ ఫోగట్ రాజకీయ రంగ ప్రవేశంపై తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అయితే..‘‘మరో ఒలింపిక్స్(2028)లో వినేశ్ పాల్గొనాలని కోరుకుంటున్నా. ఆ పోటీలో ఆమె బంగారు పతకం గెలవాలి. అందుకోసం ఆమె మళ్లీ రెజ్లింగ్పై దృష్టి సారించాలి. ఆమె రాజకీయాల్లో చేరటాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. యువకులైన పిల్లలు వాళ్లు సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వారిపైన ఆధారపడి ఉంటుంది. వారికి నచ్చజెప్పటమే నా బాధ్యత.ఈ వయస్సులో వినేశ్ మరో ఒలింపిక్స్లో పాల్గొనటమే సరియైంది. ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటున్నా. బ్రిజ్ భూషన్పై రెజ్లర్లు అంతా నిరసనలు చేశారు. దాని వల్ల ఏం న్యాయం జరగలేదు. హర్యానాలో ఎన్నికల ప్రకటన వెలువడి.. వినేశ్ ఫోగట్ కాంగ్రెస్లో చేరాక అన్ని చర్చలు మొదలయ్యాయి’’ అని అన్నారు. వినేశ్ రెజ్లింగ్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని మహవీర్ ఫోగట్ పునఃపరిశీలించాలని ఇటీవల కోరిన విషయం తెలిసిందే.మరోవైపు.. వినేశ్, భజరంగ్ పూనియాలో కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషన్ విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. తనపై లైంగిక ఆరోపణలు చేస్తూ.. రెజ్లర్లు చేపట్టిన ఆందోళన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. వినేశ్ ప్యారిస్ ఒలింపిక్స్లో నిబంధనలు ఉల్లంఘించినందుకే.. భగవంతుడు ఆమెకు పతకం చేజారేలా చేశాడని అన్నారు. -
‘ఆజాద్కు అంత సీన్ లేదు.. కశ్మీర్లో విజయం మాదే’
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల్లో గెలుపు మాది అంటే.. లేదు మాదే అంటున్నారు. ఇక, తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా ఆసక్తికర కామెంట్స్ చేశారు. జమ్ముకశ్మీర్లో గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగా..‘గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. అలాగే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ -ఎన్సీ కలిసి మ్యాజిక్ ఫిగర్ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.ఇదే సమయంలో.. ఈ ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటు గురించి మాత్రమే కాదన్న ఆయన.. రాష్ట్రహోదా, అసెంబ్లీ అధికారాల పునరుద్ధరణ కోసమేనని తెలిపారు. అలాగే, సీఎం పదవి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకే దక్కుతుందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఎన్నికల వేళ ఇలాంటి ఊహాగానాలు సరికాదన్నారు. అయితే, కశ్మీర్లో త్వరలో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
J&K: 30 ఏళ్లలో తొలిసారి.. అసెంబ్లీ బరిలో మహిళా కాశ్మీరీ పండిట్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో దాదాపు పదేళ్ల తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మరో పది రోజుల్లో మొదటి దశ పోలింగ్ జరగనున్న నేపత్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి మహిళా కాశ్మీరీ పండిట్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.జమ్మూకశ్మీర్లో సర్పంచ్గా పనిచేసిన డైసీ రైనా అనే మహిళా కాశ్మీరీ పండింట్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీయూ కూటమిలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే) తరుపున పుల్వామాలోని రాజ్పోరా అసెంబ్లీ నియోజకవర్గం ఆమె బరిలోకి దిగుతున్నారు.అయితే జమ్మూకశ్మీర్లో మొత్తం తొమ్మిది మంది మహిళలు పోటీ చేస్తుండగా అందులో రైనా ఒకరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక యువత తమ గొంతుకగా నిలవాలని కోరుకున్నందున తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.‘ఇక్కడి యువకులు నన్ను పోటీ చేయమని బలవంతం చేశారు. వారి వాయిస్ జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి చేరేలా చూడాలని నన్ను అడిగారు. నేను ఇక్కడ సర్పంచ్గా పని చేస్తున్నాను. ఇక్కడి యువకులను తరుచుగా కలుస్తుంటాను. వారి సమస్యలను విని అర్థం చేసుకున్నాను. ఇక్కడి యువత ఏం తప్పు చేయనప్పటికీ బాధ పడుతున్నారు. 1990వ కాలంలో జమ్మూ కాశ్మీర్లో జన్మించిన యువకులు కేవలం బుల్లెట్లను మాత్రమే చూశారు’ అని పేర్కొన్నారు.కాగా రైనా న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసి, 2020లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారని రైనాను ప్రశ్నించగా.. తాను అసలు ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా అనుకోలేదని చెప్పారు. అయితే పుల్వామాను చక్కదిద్దగలనని చెప్పి ఒక్కరోజు ముఖ్యమంత్రి కావాలని యువకులు తనను కోరినట్లు ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శ్రీనగర్లోని హబ్బా కడల్ అసెంబ్లీ నియోజకవర్గం కాశ్మీరీ పండింట్ల విషయంలో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. రెండో దశలో భాగంగా సెప్టెంబర్ 25న మరో 26 నియోజకవర్గాలతో పాటు హబ్బా కడల్కు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మొత్తం 14 మంది నామినేషన్ దాఖలు చేయగా.. వారిలో ఆరుగురు కాశ్మీరీ పండింట్లు ఉన్నారు.మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టనున్నాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా
-
ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నెన్నో ఆశలు చూపి ఇప్పుడు ప్రజలను యథేచ్ఛగా మోసం చేస్తున్నారన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
త్వరలో ఎన్నికలు.. జమ్ము-కశ్మీర్ చట్టంలో సవరణలు
ఢిల్లీ: జమ్ము-కశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము-కశ్మీర్ లెఫ్ట్నెట్ గవర్నర్(ఎల్జీ) అధికారాలను పెంచే చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే జమ్ము-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019లోని పలు నిబంధనలను తాజాగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ సవరించింది.అయితే ఈ సవరణల వల్ల జమ్ము కశ్మీర్ ఎల్జీ అధికారాలు మరింత పెరుగనున్నాయి. జమ్ము- కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో అధికారాలను అమలు చేసే సెక్షన్ 55 నిబంధనలో తీసుకువచ్చిన పలు సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వానికి సంబంధిచిన వ్యాపార లావాదేవీలను సవరించడానికి రాష్ట్రపతి మరిన్ని నిబంధనలను రూపొందించినట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.తాజాగా సవరించిన చట్టం.. జమ్ము- కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రెండో సవరణ. ఈ సవరించిన నిబంధనల ద్వారా శాంతి భద్రతల చర్యలకు సంబంధించి పూర్తి అధికారాలు ఇక నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉండనున్నాయి. అయితే ఈ చట్టం అమలులోకి వచ్చిన మొదట్లో పోలీసు, పబ్లిక్ ఆర్డర్, ఆల్ ఇండియా సర్వీస్, అవినీతి నిరోధక బ్యూరోకు సంబంధించి అధికారాలను అమలు చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాల్సి అవసరం ఉండేది. కానీ కొత్త సవరణ చట్ట నియమాల్లో పొందుపర్చిన సబ్ రూల్ (2ఎ) ప్రకారం.. ఇక నుంచి ఆర్థికశాఖ అనుమంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పోలీసు, యాంటీ కరప్షన్ బ్యూరో, ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించిన ప్రతిపానదలను చీఫ్ సెక్రటరీ.. ఎల్జీ ముందు తీసుకెవెళ్లితే.. ఎల్జీ ప్రతిపాదనలను అంగీకరించే లేదా తిరస్కరించే అధికారం లభించింది.చట్టంలోని ప్రధాన నిబంధనల్లో కొత్తగా 42(ఎ)ను హోం మంత్రిత్వశాఖ చేర్చింది.ఈ నిబంధన ప్రకారం.. సీఎంకు న్యాయ వ్యవహారాల్లో ఎలాంటి అధికారం ఉండదు. అడ్వకేట్ జనరల్తోపాటు ఇతర న్యాయ అధికారుల నియమకానికి చీఫ్ సెక్రటరీతో పాటు సీఎం.. ఎల్జీ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా 42 బీ నిబంధనం ప్రకారం.. ప్రాసిక్యూషన్ మంజూరు లేదా అప్పీల్కు దాఖలకు సంబంధించిన ఏదైనా ప్రతిపాదనను న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ద్వారా చీఫ్ సెక్రటరీ ఎల్జీకి పంపిస్తారని హోం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. -
దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే రహస్య మీట్.. వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా తొలిరోజైన గురువారం చిరకాల ప్రత్యర్థులు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అనుకోకుండా ప్రత్యేకంగా కలిశారు. మాజీ సీఎంలైన ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండగా ఇద్దరూ ఏదో విషయంపై మాట్లాడుకున్నారు.ఏ విషయంపై మాట్లాడుతకున్నారో తెలియలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రే మధ్య పొత్తు ఉండవచ్చన్న రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి.అనంతరం ఉద్ధవ్ ఠాక్రేను దీని గురించి మీడియా ప్రశ్నించింది. ఆయన, ఫడ్నవీస్ ఏం మాట్లాడుకున్నారని అని అడిగింది. ‘ఇక నుంచి రహస్య సమావేశాలన్నీ మేం లిఫ్ట్ లోనే చేస్తాం’ అని ఠక్రే సరదాగా అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, తాను లిఫ్ట్లో ఉన్నప్పుడు 1965లో విడుదలైన జబ్ జబ్ ఫూల్ ఖిలే సినిమాలోని ‘నువ్వు తిరస్కరించినా, నీ ప్రేమలో పడ్డా’ అన్న పాత పాట ప్రజలకు గుర్తుకు వచ్చి ఉంటుందని తెలిపారు. అయితే అలాంటిదేమీ లేదని, అనుఉకోకకుండా తామిద్దరం కలిసినట్లు చెప్పారు.#maharashtraassembly : Uddhav Thackarey and Devendra Fadnavis in same lift. pic.twitter.com/YzgcZAcoJi— Sonu Kanojia (@NNsonukanojia) June 27, 2024 మరోవైపు బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్, ఉద్ధవ్ ఠాక్రే మధ్య సరదాగా మరో సంభాషణ జరిగింది. ఠాక్రేకు చంద్రకాంత్ చాక్లెట్ బార్ ఇచ్చారు. దీనికి స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే ‘రేపు మీరు మహారాష్ట్ర ప్రజలకు చాక్లెట్ ఇస్తారు’ అని బదులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి బడ్జెట్లో తాయిలాలు ప్రకటించే విషయాన్ని ఇలా ప్రస్తావించారు.కాగా ఈ ప్రభుత్వంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్)ల అధికార కూటమి తక్కువ స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. 48 లోక్సభ స్థానాల్లో ఎంవీఏ 30, ఎన్డీఏ కూటమి 17 స్థానాలు గెలుచుకుంది. -
తేడా ఎక్కడ?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. మూడు పార్లమెంటు సెగ్మెంట్లలో విస్తరించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ తన రెండు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోగా, కొత్తగా కాంగ్రెస్ పెద్దపల్లి స్థానంలో పాగా వేసింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో కీలకమైన కరీంనగర్ సెగ్మెంట్లో ఓటమిపై ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ తీవ్ర అంతర్మథనంలో పడ్డాయి. ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డపై మూడోస్థానానికి పరిమితవడాన్ని బీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేక పోతుండగా, రాష్ట్రమంతా హస్తం హవా వీస్తున్న వేళ.. కరీంనగర్, నిజామాబాద్లలో ఆశించిన ఫలితాలు రానందుకు కాంగ్రెస్ పార్టీ మదనపడుతోంది. తేడా ఎక్కడ జరిగిందన్న విషయంపై ఉమ్మడి జిల్లా నేతలు లెక్కలు వేస్తున్నారు.బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ ఎదురుదాడి..ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కు ఉమ్మడి కరీంనగర్ పుట్టినిల్లు. అలాంటి కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్లలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అది కూడా మూడోస్థానం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీనపడిందని పార్లమెంట్ ఫలితాలే చెబుతున్నాయి.. మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగుచూడటం ఇరకాటంలో పడేసింది. ఈ అంశాలపై బీజేపీ, కాంగ్రెస్ చేసిన ఎదురుదా డిని బీఆర్ఎస్ తిప్పికొట్టలేదన్న విమర్శలున్నాయి.కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎంపీ బి.వినోద్కుమార్ స్థానికేతరుడంటూ బీజేపీ, కాంగ్రెస్ అటాక్ చేశాయి. ఫలితంగా ఒకప్పుడు 2.05 లక్షల మెజారిటీతో గెలిచిన ఆయన ఇప్పుడు కేవలం 2.80 లక్షల ఓట్లకు పరిమితమయ్యారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కొప్పుల ఈశ్వర్ను పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలిపిన కారు పార్టీకి ఇక్కడా పరాభవం తప్పలేదు. ఇక్కడ కాంగ్రెస్ పాగా వేసింది. పార్లమెంట్ పరిధిలో ఎక్కడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది.ఇక, నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఓడిపోయారు. కోరుట్ల, జగిత్యాలలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.ఆలస్యమే కారణమా?కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచారు. తన అభ్యర్థిత్వాన్ని ఆలస్యంగా ప్రకటించినా ప్రచారంలో దూసుకెళ్లారు. గత ఎన్నికలతో పోల్చినపుడు 1.80 లక్షల ఓట్లు అదనంగా సాధించడమే ఇందుకు నిదర్శనం. ఆయన అభ్యర్థిత్వాన్ని మరికాస్త ముందు ప్రకటిస్తే మరింత మెరుగ్గా రాణించి ఉండేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ 4.75 లక్షల ఓట్లతో సత్తా చాటారు. తాత, తండ్రి తర్వాత మూడో తరం కూడా అదే స్థానం నుంచి గెలిచి, రికార్డు దక్కించుకున్నారు.నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఓటమిపై పార్టీ శ్రేణులు నిరాశ చెందాయి. 4,83,077 ఓట్లు సాధించినా ఆయన విజయానికి లక్షకు పైగా ఓట్ల దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది.బీజేపీలో జోష్..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ జోష్ కనిపించింది. సిట్టింగ్ స్థానాలైన కరీంనగర్, నిజామాబాద్లను తిరిగి కైవసం చేసుకుంది. అదే సమయంలో పెద్దపల్లి స్థానంలో గెలిచినంత పని చేసింది. ఈ మూడు స్థానాల్లో బీజేపీ ప్రదర్శనకు కారణం ఎన్నికల సమయంలో మోదీ జగిత్యాల, వేములవాడ సభలే. కేడర్లో జోష్ నింపడంలో బీజేపీ అధిష్టానం సక్సెస్ అయ్యింది.జీవన్రెడ్డి పోటీకి దిగడంతో ఆరంభంలో నిజామాబాద్లో ఆందోళన కనిపించినా.. క్రమంగా సెగ్మెంట్ను బీజేపీ తన చేతుల్లోకి తీసుకుంది. ఫలితంగా సిట్టింగ్ ఎంపీ అర్వింద్ రెండోసారి విజయం సాధించారు.ఇక, పెద్దపల్లిలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. గోమాసె శ్రీనివాస్ 3.44 లక్షల ఓట్లు సాధించి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక దశలో గెలుస్తారన్న ప్రచారం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్కు ప్రతీ రౌండ్లో గట్టి పోటీ ఇచ్చారు.కరీంనగర్లో బండి సంజయ్ 2.25 లక్షల ఓట్ల మెజారిటీలో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రత్యర్థులిద్దరూ ఓసీలవడం, బీసీల ఓటు బ్యాంకు కలిసి వచ్చిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.బీఆర్ఎస్ ఓట్లు ఎటు పడ్డట్టు?ఉమ్మడి జిల్లాలోని పార్లమెంట్ సెగ్మెంట్లలో రెండు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత ఫలితాలతో పోల్చినప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఓట్లు పెరిగి, బీఆర్ఎస్ ఓట్లు అదే స్థాయిలో పడిపోయాయి.బీఆర్ఎస్కు గత ఎన్నికల్లో ఓటేసిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈసారి కాంగ్రెస్ పక్షం వహించారని, బీసీలు, అగ్రవర్ణాలు బీజేపీ వైపు మళ్లారని జిల్లా రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల ఓట్లను పరిశీలించినపుడు బీజేపీ, కాంగ్రెస్లకు ఓట్లు అనూహ్యంగా పెరిగిన విషయం తేటతెల్లమవుతుంది. కారు పార్టీ ఓట్లను ఈ రెండు పార్టీలు పంచుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇవి చదవండి: హేమను ఒక్కరోజు విచారించండి చాలు: కోర్టు -
పాత మిత్రులపై కూటమిలో చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: పాత మిత్రపక్షాలతో జట్టుకట్టే అంశంపై విపక్షాల ‘ఇండియా’ కూటమి నేతలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. మిత్రపక్షాలతో చర్చించకుండా జేడీ(యూ), తెలుగుదేశం పార్టీ వంటి పాత మిత్రులను చేర్చుకునే అంశంపై సొంత నిర్ణయం తీసుకోబోమని తేలి్చచెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాం«దీ, సోనియా గాం«దీలు మంగళవారం పార్టీ కారాల్యయంలో మీడియాతో మాట్లాడారు. సాయంత్ర ఆరు గంటలకు ఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నివాసంలో ‘ఇండియా’ కూటమి భేటీకానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోనియా, రాహుల్, శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, చంపయి సోరెన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, డి.రాజా ఈ భేటీలో పాల్గొననున్నారు. నేడు ఇండియా కూటమి సమావేశం: రాహుల్ ‘‘ విపక్షాల ‘ఇండియా’ కూటమి సమావేశం బుధవారం నిర్వహిస్తాం. మా కూటమి నేతల అభిప్రాయం అడగకుండా మేం ఎలాంటి నిర్ణయాలు ప్రకటించలేం. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా వ్యూహరచన, తీసుకోవాల్సిన నిర్ణయాలపై బుధవారం మా కూటమి పక్షాలు ప్రధానంగా చర్చిస్తాయి. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా కలిసి నడుస్తారని ముందే అనుకున్నా. రాజ్యాంగాన్ని కాపాడేందుకు పడిన తొలి అడుగు ఇది.ఈసారి ఎన్నికల్లో పేదలతోపాటు అణగారిన వర్గాలు మాకు అండగా నిలబడ్డాయి. పేదల అభ్యున్నతికి పాటుపడే కొత్త మార్గదర్శకత్వాన్ని కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి అందించనున్నాయి. ఈ ఎన్నికలు, దేశం ఒక్కటే విషయాన్ని చెప్పదల్చుకున్నాయి. మోదీ, అమిత్షా పాలనలో దేశం మగ్గిపోవాల్సిన పనిలేదని చాటాయి. కూటమి పారీ్టలన్నీ ఐక్యమత్యంతో పోరాడాయి. కాంగ్రెస్కు మద్దతు పలికిన ఉత్తరప్రదేశ్కు ప్రత్యేక ధన్యవాదాలు. నేను వయనాడ్, రాయ్బరేలీ రెండు స్థానాల్లో గెలిచినా ఏ స్థానాన్ని వదులుకోవాలో ప్రజలతో మాట్లాడి నిర్ణయిస్తా. ప్రజలకు ఇచి్చన హామీలను నెరవేర్చుతాం’ అని రాహుల్ అన్నారు. మోదీ వ్యతిరేక ప్రజాతీర్పు ఇది: ఖర్గే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజాతీర్పు ఇది అని ఫలితాలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ ఒకే వ్యక్తి పేరుతో బీజేపీ ఓట్లు అడిగింది. ఇది మోదీ రాజకీయ, నైతిక పరాజయం. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ అసత్య ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలకు ప్రజల మద్దతు లభించింది. మోదీకి మరో అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని ప్రజలు గ్రహించారు. పార్టీని గెలిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు. విజయం కోసం ఐక్యంగా పనిచేసిన ఇండియా కూటమి నేతలకు ధన్యవాదాలు’’ అని ఖర్గే అన్నారు. -
పడిలేచిన కాంగ్రెస్!
కేంద్రంలో ముచ్చటగా మూడోసారీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న బీజేపీ కలలను కాంగ్రెస్ చిత్తు చేసింది. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ నినాదంతో బరిలో దిగిన బీజేపీని అటు సొంత బలంతో, ఇటు కూటమి పక్షాల సహకారంతో తుత్తునియలు చేసింది. అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ ఆమడదూరంలో ఆగినా పడిలేచిన కెరటంలా సత్తా చాటింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ చేసిన ప్రచారం ఓ వైపు.. ప్రాంతీయ పారీ్టల ఓట్లు చీలకుండా తీసుకున్న జాగ్రత్తలు ఇంకోవైపు.. పార్టీ గుప్పించిన హామీలు మరోవైపు... కలిపి బీజేపీని కలవరపాటుకు గురిచేయడంలో విజయవంతమయ్యాయి... ⇒ లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 328 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 99 సీట్లు సాధించింది. 2019 నాటి కంటే 47 సీట్లు అధికంగా గెలుచుకుంది. ⇒కూటమి పక్షాల భాగస్వామ్యంతో ఈసారి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ గట్టిగా కృషిచేసింది. విపక్షాల మధ్య ఓట్ల చీలికను నివారించేందుకు తాను పోటీ చేసే స్థానాల సంఖ్యను తగ్గించుకుంది. ⇒ రాజస్తాన్, కర్ణాటక, హరియాణా, పంజాబ్ల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. ⇒రాజస్తాన్లో బీజేపీపై రైతుల్లో ఆగ్రహాన్ని, రాజ్పుత్ల్లో ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ సొమ్ము చేసుకుంది. 2019లో 25 స్థానాలనూ బీజేపీ క్లీన్స్వీప్ చేయగా ఈసారి కాంగ్రెస్ 8 గెలిచింది. హరియాణాలోనూ గత ఎన్నికల్లో బీజేపీ 10కి 10 గెలవగా ఈసారి కాంగ్రెస్ 5 గెలిచింది. ⇒80 స్థానాలున్న కీలకమైన యూపీలో ఓట్ల చీలికకు ఆస్కారమివ్వకుండా సమాజ్వాదీ పారీ్టకి 63 సీట్లిచి్చంది. ఇది ముస్లిం ఓట్లను ఏకీకృతం చేయడంతోపాటు ఓట్ల చీలికను నివారించింది. ఫలితంగా ఎస్పీ ఏకంగా 37 సీట్లు సాధించి బీజేపీని తేరుకోలేని దెబ్బ కొట్టింది. ⇒తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్పవార్), కేరళ, బిహార్, యూపీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో సీపీఐ(ఎం), ఐయూఎంఎల్, సమాజ్వాదీ, ఆర్జేడీ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్, ఆర్సీపీలతో ముందస్తు పొత్తులు కూడా కాంగ్రెస్కు లాభించాయి. ⇒బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వే షన్లు రద్దవుతాయంటూ కాంగ్రెస్ సహా విపక్షా లన్నీ ప్రచారం చేసిన ప్రచారం బాగానే ఫలించింది. ఆ ఉద్దేశమే లేదని మోదీ, బీజేపీ ఎంత చెప్పినా దేశంలో 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఓస్టీ, ఓబీసీల్లో అనుమానాలు తొలగలేదు. ⇒ఎన్డీఏకు 400 కన్నా ఎక్కువ సీట్లొస్తే రాజ్యాంగాన్ని, పలు చట్టాలను మార్చేస్తారన్న కాంగ్రెస్ ప్రచారమూ ఓటర్లను ప్రభావితం చేసింది. ⇒ఎన్నికల ముంగిట జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు కక్ష సాధింపేనంటూ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విపక్షాలు సఫలీకృతమయ్యాయి. ⇒ బీజేపీ ఓటమే లక్ష్యంగా సీట్ల పంపకంలో పట్టు విడుపులతో వ్యవహరించిన కాంగ్రెస్, ప్రచారం, సమన్వయం, వ్యూహ రచనలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. ⇒రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టేలా చేసింది. మిత్రులెవరో, శత్రువులెవరో తేలిపోయింది. ⇒రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో ఆకట్టుకుంది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచడమే తమ తొలి ప్రాధాన్య మని ప్రకటించింది. రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. ⇒యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్కు అప్రెంటీస్íÙప్ శిక్షణ కోసం రూ. లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువకుల స్టార్టప్ల కు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల తో కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం వంటి హామీలు ఇచ్చింది. ⇒నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా రూ.లక్ష సాయం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ వంటి అంశాలు కాంగ్రెస్కు సీట్ల సంఖ్యను పెంచుకొనేందుకు దోహదం చేశాయి. ⇒కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ అనారోగ్యంతో ఇంటికే పరిమితమైనా విపక్షాలను ఒక్కతాటిపైకి తేవడంలో, ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. – సాక్షి, న్యూఢిల్లీ నేటి భేటీలో ప్రధాని అభ్యర్థి ఖరారు: ఉద్ధవ్ ఠాక్రేముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని శివసేన (యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. బుధవారం ఢిల్లీలో సమావేశమై, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఠాక్రే అన్నారు. ప్రస్తుత ఎన్ని కల ఫలితాల సరళిని బట్టి చూస్తే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ 272 మార్కును బీజేపీ పొందే అవకాశాలు కనిపించడం లేదన్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో కూటమిలోని కాంగ్రెస్, ఇతర పక్షాలు టచ్లో ఉన్నాయని వివరించారు. వీరిని కూటమిలో చేర్చుకునేందుకు గల అవకాశాలను చర్చిస్తున్నామని చెప్పారు. గతంలో, బీజేపీ కారణంగా ఇబ్బందులు పడిన వీరిద్దరే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారని ఠాక్రే వివరించారు. -
నవీన్ చరిష్మాకు తెర!
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నియక్ 24 ఏళ్ల పాలనకు తెర పడింది. ఆయన సారథ్యంలోని బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అధికారం కోల్పోయింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఒడిశా అస్మిత (ఆత్మగౌరవం) నినాదానికి తోడు బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాల ప్రచారం బీజేపీని విజయతీరాలకు చేర్చింది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 23 చోట్ల గెలిచింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన కమలం పార్టీ తొలిసారి అధికారపీఠాన్ని కైవసం చేసుకుంది. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 113 చోట్ల గెలిచిన బీజేడీ ఈసారి 51 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, సీపీఐఎం ఒకచోట గెలిచాయి. సుదీర్ఘ సీఎం రికార్డ్ మిస్ 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పటా్నయక్ పార్టీ గెలిచి సీఎం పదవి చేపడితే దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకునేవారు. అయితే బీజేడీ విజయయాత్రకు బీజేపీ బ్రేకులు వేసింది. హింజిలి నియోజకవర్గంలో కేవలం 4,636 ఓట్ల తేడాతో నవీన్ ఎలాగోలా గెలిచారు.పనిచేసిన ఒడిశా అస్మిత నినాదం ఈ ఎన్నికల్లో సమస్యల కంటే బీజేపీ ‘ఒడిశా అస్మిత’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. నవీన్ పట్నియక్ అనారోగ్య కారణాలను ఆసరాగా చేసుకుని తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయ పాండియన్ బీజేడీ పారీ్టపై ఆధిపత్యాన్ని చలాయించారు. ఈ అంశాన్ని బీజేపీ విజయవంతంగా ప్రచార అస్త్రంగా మలిచింది. ఒడిశా భవిష్యత్తును స్థానికేతరుల చేతిలో పెట్టి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేడీ తాకట్టు పెట్టిందని పాండ్యన్ లక్ష్యంగా అస్మిత నినాదాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా పటా్నయక్ అవినీతి మరకలు లేని నేత. కానీ బీజేడీ సర్కార్లో మంత్రులఅవినీతినే ప్రధాన ప్రచారా్రస్తాలుగా మలచి బీజేపీ విజయబావుటా ఎగరేసింది. -
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
-
వాయిస్ కాల్స్తో ఎలక్షన్ క్యాంపెయిన్..!
హనమకొండ: మొబైల్.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి మళ్లీ నిద్రించే వరకు చేతిలో అతుక్కుపోవాల్సిందే. టీ తాగుతున్నా.. భోజనం చేస్తున్నా.. ఇతర ఏ పని చేస్తున్న ఫోన్ చూడకుండా క్షణ కాలం ఉండలేని పరిస్థితి ఉంది. మానవ జీవితంలో ఇంతలా ఇమిడిపోయిన ఫోన్ అవసరాన్ని రాజకీయ నేతలు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు.ఒకవైపు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం పరుగులెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులు గతంలోకంటే ఈసారి ప్రచారానికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించుకుంటున్నారు. వాయిస్ మెయిల్ కాల్స్ ద్వారానే కాకుండా, సోషల్ సైట్స్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ (ఎక్స్)ను ఉపయోగించుకుంటున్నారు.‘తాము ఫలానా పార్టీ తరఫున పోటీచేస్తున్నాం.. మమ్మల్ని గెలిపిస్తే మన ప్రాంతంలో నెలకొన్న స మస్యలు పరిష్కరిస్తాం. అందుకోసం మమ్మల్నే గెలి పించాలంటూ’ కోరుతున్నారు. మరికొందరు ఓ అ డుగు ముందుకేసి తమ అభ్యర్థిని గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాడని తెలుపుతున్నారు.వాయిస్ మెయిల్ కాల్స్తో ప్రచారంరెండు రోజుల నుంచి వాయిస్ మెయిల్ కాల్స్, ఫోన్ కాల్స్ ద్వారా అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం కావడంతో వారిని ఆకట్టుకోవడానికి ఫేస్బు క్, ట్విట్టర్ను వినియోగించుకుంటుండడం గమనార్హం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్ల ద్వారా యువకులు అధికశాతం తమ అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు.దీనికి తోడు అభ్యర్థులు ఫేస్బుక్, ట్వి ట్టర్ ద్వారా చాటింగ్ చేస్తున్నారు. యువత కూడా వీటి ద్వారా తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెలిబుచ్చుతున్నారు. పత్రికలు, టెలివిజన్ తరువాత ఇంటర్నెట్పైనే దృష్టి సారిస్తుండడంతో యువతను ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు తమపార్టీల ద్వారా చేపట్టే కార్యక్రమాలు, ప్రజల కోసం చేసే కార్యక్రమాల సందేశాలను ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు.లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్తేదీ సమీపిస్తుండడంతో ఫేస్ బుక్, ట్విట్టర్లో రాజకీయ పార్టీల చిత్రాలే అధికంగా కనిపిస్తున్నాయి. వరంగల్ లోక్సభ.. రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గమైనప్పటికీ మెజార్టీ ఓటర్లు సంప్రదాయ ఓటర్లే ఉంటారు. అయితే ఎన్నికల సంఘం నూతన ఓటర్ల నమో దుపై విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ మధ్య కాలంలో దాదాపు 24 వేల మంది కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.దీంతో ఈసారి జరుగనున్న ఎన్నికల్లో యువత పాత్ర కీలకంగా కావడంతో లోక్సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల అనుచరులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వాయిస్మెయిల్స్, ఫోన్కాల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ను ఉపయోగించుకుంటున్నారని చెప్పొచ్చు. కాగా, ఈవాయిస్ కాల్స్తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
టంగుటూరు చేరుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ మూడు మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తొలుత ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని కొండేపి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇప్పటికే టంగుటూరు చేరుకున్నారాయన.టంగుటూరు బొమ్మల సెంటర్లో YSRCP నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారాయన. ఇక సీఎం జగన్ రాక సందర్భంగా ఆప్రాంతంలో సందడి నెలకొంది. కొండేపి, సింగరాయకొండ, టంగుటూరు, జరుగునల్లి, పొన్నలూరు మండలాల నుంచి భారీగా జనం చేరుకున్నారు.టంగుటూరు సభ అనంతరం వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజక వర్గం పరిధిలోని మైదుకూరు జంక్షన్లో, ఆ తర్వాత సాయంత్రం రాజంపేట పరిధిలోని పీలేరు నియోజకవర్గం కలికిరి ప్రచార సభల్లో ప్రజల్ని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
దక్షిణకొరియాలో నేడే ఎన్నికలు
సియోల్: దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఎన్నికలు జరుగబోతున్నాయి. మొత్తం 300 స్థానాలున్న పార్లమెంట్లో 254 స్థానాలను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీచేస్తారు. మిగిలిన 46 స్థానాలను చిన్నాచితక పారీ్టలకు వాటికి లభించిన ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పీపుల్ పవర్ పార్టీ, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ పోటీ పడుతున్నాయి. దేశంలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈసారి రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలు పీపుల్ పవర్ పార్టీ నేత, అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రిఫరెండమ్ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆయన 2022లో అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చారు. మరో మూడేళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో పీపుల్ పవర్ పార్టీకి తక్కువ స్థానాలు వస్తే యూన్ సుక్ ఇయోల్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆయనను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకోవచ్చు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ నాయకుడు లీ జే–మ్యూంగ్ ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. సర్వే కూడా అదే అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిక్యం పెరిగితే పరిపాలన పరంగా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్కు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. -
మే 13 న ఏపీ ఎన్నికలు
-
ఏడు విడతల్లో పోలింగ్.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్!
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాల పర్యటన చివరి దశకు చేరుకుంది. మార్చి 12, 13న జమ్మూ కశ్మీర్ పర్యటన అనంతరం ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. #WATCH | Chennai : Chief Election Commissioner of India along with his team begins review of poll preparedness for Lok Sabha elections in Tamil Nadu pic.twitter.com/fVwaVx99te — ANI (@ANI) February 23, 2024 ఎన్నికల సంఘం.. అన్ని డివిజన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏర్పాటు చేయనుంది. ఇక, దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. -
మంగళగిరిలో కూడా గెలుపు మాదే..
-
రామోజీది గోబెల్స్ అంశ
-
పాకిస్థాన్ హంగ్ అసెంబ్లీ..?
-
జనసేన-టీడీపీ మధ్య కొలిక్కిరాని సీట్ల పంచాయితీ
-
హర్యాణలో ఒంటరిగా పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్
రాబోయే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్ల సొంతంగా బరిలోకి దిగుతామని ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో భాగస్వామ్య పార్టీగా కాకుండా తాము సొంతంగా పోటీ చేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వెల్లడించిన సంగతి విదితమే. ఇక.. తాజాగా హర్యాణ రాష్ట్రంలో ఆప్ మరో నిర్ణయం తీసుకుంది. హర్యాణ అసెంబ్లీలో తాము ఎవరితో పొత్తు పెట్టుకొమని.. అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తెలిపారు. జింద్ పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. హర్యాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 కాగా... పార్లమెంట్ ఎన్నికల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికలో మాత్రం హర్యాణలో ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో భాగస్వామ్య పక్షంగా పోటీ చేస్తామని చెప్పారు. ‘ప్రస్తుతం ప్రజలంతా ఒకే పార్టీపై నమ్మకం పెట్టుకున్నారు.. అదే ఆమ్ ఆద్మీ పార్టీ. ఒకవైపు పంజాబ్.. మరోవైపు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉంది. ఢిల్లీ, పంజాబ్ ప్రజలు పాలనలో మార్పు కోరి చాలా సంతోషంగా ఉన్నారు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. హర్యాణలో కూడా ఆప్ పార్టీ గెలిస్తే.. ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆప్ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. చదవండి: బిహార్లో ఇప్పుడే అసలైన ఆట మొదలైంది: తేజస్వీ యాదవ్ -
2024లో భారీ మెజార్టీతో గెలుస్తాం: ఉషాశ్రీ చరణ్
-
దుమ్ములేపుతున్న జగనన్న కొత్త సాంగ్..ఎలక్షన్ 2024
-
తిరుపతి అసెంబ్లీ YSRCP అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి
-
ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు!
కర్నూలు: సార్వత్రిక ఎన్నికలు మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే అవకాశం ఉండటంతో ఏర్పాట్లపై జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. వీటితోపాటు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ , కౌంటింగ్ కేంద్రాల్లో పని చేసేందుకు అవసరమైన ఉద్యోగుల వివరాల సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇందుకోసం ట్రేజరీస్ డీడీ, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో మ్యాన్ పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో నివేదికకు సిద్ధం ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండడానికి సమాయత్తం అవుతోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను నియమించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల వివరాలు సేకరణ కోసం ఏర్పాటు చేసిన మ్యాన్పవర్ కమిటీ తన విధులను ప్రారంభించింది. అన్ని శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. విద్యాశాఖలో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్, జూనియర్ , సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు, వివిధ శాఖల ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేసే ఏఈలు, డీఈలు, ఈఈలు, ఎస్ఈలు డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, జేసీలు, కలెక్టర్ వరకు ఇలా అన్ని స్థాయిలా అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఒకటి, రెండు రోజుల్లో దాదాపు 33 శాఖల్లో పనిచేసే అధికారుల వివరాలను నివేదించేందుకు మ్యాన్ పవర్ కమిటీ సిద్ధమవుతోంది. 18 వేల మంది సిబ్బంది అవసరం.. ఎన్నికల విధుల్లో ప్రధానంగా పోలింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలతోపాటు ఇతర విధుల్లో పాల్గొనేందుకు జిల్లాకు 18 వేల మంది సిబ్బంది అవసరం అవుతారు. జిల్లాలో 2,186 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రైసెడింగ్ ఆఫీసర్, ఒక అడిషినల్ ప్రైసెడింగ్ ఆఫీసర్, నలుగురు అదర్ ప్రైసెడింగ్ ఆఫీసర్లు ఉంటారు. ఈ లెక్కన దాదాపు 13,116 మంది సిబ్బంది అవసరం అవుతారు. అంతేగాక మరో 2 వేల మంది వరకు రిజర్వ్లో ఉండేందుకు అవసరం. వీరితోపాటు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ తోపాటు ఇతర విధులకోసం మరో 3 వేల వరకు సిబ్బంది అవసరం అవుతారు. పోలీసులు కాకుండానే జిల్లాలో మొత్తంగా దాదాపు 18 వేల మంది వరకు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల విధుల్లో సెక్టోరల్, నోడల్ ఆఫీసర్లు ఇప్పటికే 20 మందిని నోడల్ అధికారులుగా నియమించగా.. వారు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో 234 మంది సెక్టోరల్ ఆఫీసర్లను నియమించారు. వీరంతా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు. పోలీసులకు సంబంధించి 234 మంది పోలీసు సెక్టోరల్ అధికారులను నియమించారు. వీరు పోలింగ్ కేంద్రాల భద్రత అంశాలపై పరిశీలన చేస్తున్నారు. వీరంతా కూడా ఒకటి, రెండురోజుల్లో కలెక్టర్కు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఎంపికై న ఉద్యోగులకు శిక్షణ ఇస్తాం సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాం. సిబ్బంది ఎంపిక కోసం మ్యాన్ పవర్ కమిటీని నియమించాం. ఒకటి, రెండు రోజుల్లో నివేదికలు వస్తాయి. ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుని శిక్షణ ఇస్తాం. – డాక్టర్ జి.సృజన, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికార ఇవి చదవండి: ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ -
నా ఆత్మహత్యకు ఆ ముగ్గురే కారణం!
కరీంనగర్: ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇందుకు ఆ ముగ్గురే కారణం..’ అంటూ ఓ యువకుడి సూసైడ్నోట్ సిరిసిల్లలో సోమవారం కలకలం సృష్టించింది. బాధితుడు మీడియా ప్రతినిధులకు నేరుగా వాట్సాప్లో పంపించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్లకు చెందిన ఓ ప్రముఖుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేశాడు. ఎన్నికల్లో అతని విజయం కోసం ఆ యువకుడితోపాటు అతని స్నేహితులు పనిచేసేందుకు రూ.లక్ష పారితోషికం మాట్లాడుకున్నట్లు తెలిపారు. అయితే ఎన్నికల్లో అతను.. లేదంటే ఓ జాతీయ పార్టీ ప్రతినిధి గెలుస్తారని.. మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పుకొచ్చాడని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపైనే కేసు పెడతామని బెదిరించినట్లు వాపోయాడు. చేసిన పనికి డబ్బులు రాక తనతోపాటు స్నేహితులు కూడా ఇబ్బందుల పడుతున్నారని పేర్కొన్నాడు. ఎమ్మెల్యేగా పోటీచేసిన సదరు అభ్యర్థి, అతని సడ్డకుడు, పద్మశాలి వర్గానికి చెందిన మరో నాయకుడు కలిసి మోసం చేశారని, తన ఆత్మహత్యకు వారే కారణం అంటూ ఆ నోట్ రాసుకొచ్చాడు. ఈ విషయంపై సిరిసిల్ల పోలీసులు విచారణ చేపడుతున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం! -
ఐప్యాక్ కీలక ప్రకటన..
-
ఫ్యాన్ దే ప్రభంజనం
-
వచ్చే ఎన్నికల్లో జగన్ వన్స్ మోర్...టీడీపీ-జనసేన నో మోర్
-
175 స్థానాల్లో YSRCPని గెలిపించుకోవాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం
-
..కుంగిపోతూ కూర్చుంటే కుదరదు సార్! వచ్చే ఏడాది ఎలక్షన్లో ఇంకా కుంగిపోవాల్సి వస్తుందేమో!
..కుంగిపోతూ కూర్చుంటే కుదరదు సార్! వచ్చే ఏడాది ఎలక్షన్లో ఇంకా కుంగిపోవాల్సి వస్తుందేమో! -
చెల్లని నాణేలు..చిల్లర రాజకీయాలు...
-
శాసనసభ రద్దు...తెలంగాణలో మూడో శాసన సభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్
-
KishanReddy : మేం అనుకున్న ఫలితాలు రాలేదు
-
తెలంగాణ భవన్ లో గెలిచిన ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం
-
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
-
కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్ మితిమీరిన ఆత్మవిశ్వాసం
-
అసెంబ్లీలో 3 నుంచి 8కి పెరిగిన బీజేపీ బలం
-
ఓవర్ కాన్ఫిడెన్స్ వలెనే బీఆర్ఎస్ ఓటమికి కారణం
-
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అప్డేట్స్ 2023
-
రెండు రాష్ట్రాల్లో బీజేపీ ముందంజ, ఒకచోట లీడ్లో కాంగ్రెస్
జైపూర్/రాయ్పూర్/భోపాల్: నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక, ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఒకచోట బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ ముందంజలో దూసుకువెళ్తున్నాయి. ఇటు, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో కొనసాగుతోంది. చత్తీస్గఢ్లో ఇలా.. 90 స్థానాలకు గాను.. కాంగ్రెస్.. 52 బీజేపీ.. 33 లీడింగ్లో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్లో ఇలా.. 230 స్థానాలకు గాను.. బీజేపీ.. 118 కాంగ్రెస్.. 93 రాజస్థాన్లో ఇలా.. 199 స్థానాలకు గాను.. బీజేపీ.. 105 కాంగ్రెస్.. 83 Rajasthan Congress MLA candidate Amin Kagzi from Kishan Pole constituency leading in early trends, as per ECI. pic.twitter.com/zeNbmOSwWV — ANI (@ANI) December 3, 2023 -
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ అప్ డేట్స్
-
తెలంగాణలో కౌంటింగ్ కు కౌంట్ డౌన్ షురూ
-
తెలంగాణలో కౌంటింగ్ కు కౌంట్ డౌన్ షురూ
-
మినీ కురుక్షేత్రంలో విజేతగా నిలిచేదెవరు ?
-
చాలా రోజుల తర్వాత హాయిగా పడుకున్న
-
ఎగ్జిట్ పోల్స్ తర్వాత పవన్ కళ్యాణ్ రియాక్షన్
-
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
-
70 సీట్లు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం
-
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ దే హవా
-
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోయారు: భట్టి విక్రమార్క
-
తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతం
-
పోలింగ్ ట్రెండ్స్ తారుమారు అవుతాయి: బీజేపీ నేత బండి సంజయ్
-
70 స్థానాల్లో గెలుపు..బీఆర్ఎస్ వార్ రూం సంచలన నివేదిక..!
-
బీఆర్ఎస్, కాంగ్రెస్ కు గుబులు పుట్టించిన బీజేపీ
-
స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పటిష్ట బందోబస్త్
-
తెలంగాణలో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని నేతల ధీమా
-
కేసీఆర్ ను కామారెడ్డిలో ఓడగొడుతున్నాం: రేవంత్
-
మళ్లీ అధికారం మాదే..హ్యాట్రిక్ కొడతాం
-
తెలంగాణలో 70.66 శాతం పోలింగ్ నమోదు
-
తెలంగాణ ఎన్నికలు ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే
-
ఎన్నికల నిబంధనలను కాంగ్రెస్,బీఆర్ఎస్ ఉల్లంఘించారు: కిషన్ రెడ్డి
-
పోలింగ్ ముగిసింది.. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్
-
నడుస్తున్న ప్రగతికి ఓటెయ్యండి..
-
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
-
గ్రేటర్ హైదరాబాద్ లో 20 శాతం కూడా నమోదు కాని పోలింగ్
-
మధిరలో ఓటు హక్కును వినియోగించుకున్న భట్టి విక్రమార్క
-
హైదరాబాద్ లో ఇళ్లకే పరిమితమైన ఓటర్లు
-
అంకాపూర్ జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు
-
హైదరాబాద్ లో ప్రశాంతంగా పోలింగ్
-
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ షర్మిల
-
రేవంత్ రెడ్డి సోదరుడి మీద కంప్లైంట్ రిసీవ్
-
కామారెడ్డిలో రేవంత్ రెడ్డి తమ్ముడు హల్ చల్
-
ఓటు వేసిన సీఎం కేసీఆర్
-
జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్ కు సినీ తారలు
-
పోలింగ్ బూత్ లో సందడి చేసిన అక్కినేని ఫ్యామిలీ
-
ఆసిఫాబాద్ లో అత్యధికంగా 16శాంతం పోలింగ్
-
పోలింగ్ లో రచ్చ రచ్చ..కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య ఫైట్
-
ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉద్రిక్తత
-
కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన కామెంట్స్..
-
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టెన్షన్
-
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: కేటీఆర్
-
ఓటు వేయడానికి ఉర్లకు వెళ్తున్న ప్రజల తిప్పలు
-
EVMలను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసిన అధికారులు
-
అసెంబ్లీ ఎన్నికలకు నల్గొండలో అన్ని ఏర్పాట్లు పూర్తి
-
ఓటుకు వేళాయె
-
తెలంగాణలో రేపు జరగనున్న పోలింగ్ కు సర్వం సిద్ధం
-
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దేశం దృష్టి
-
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నోట్ల కట్టలు
-
సూర్యాపేట నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డితో టుడేస్ లీడర్
-
5 గంటల్లోపు అంతా ఆపేయండి..ఎన్నికల సంఘం ఆదేశాలు
-
తెలంగాణలో ముగిసిన బీజేపీ అగ్రనేతల ప్రచారం
-
తాండూరు నియోజకవర్గం BRS అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డితో టుడేస్ లీడర్
-
రాజస్థాన్ లో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
బీఆర్ఎస్ పార్టీ డబ్బుల డంపుపై ఈసీకి ఫిర్యాదు చేశాం: మల్లు రవి
-
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం..కాసేపట్లో ప్రారంభంకానున్న పోలింగ్
-
ఓపెన్ డిబేట్ విత్ కిషన్ రెడ్డి
-
కూకట్ పల్లిలో కృష్ణారావును ఓడించాలంటే బండి రమేష్ ను గెలిపించాలి: రేవంత్ రెడ్డి
-
ఎన్నికల్లో గెలిచి శాసన సభలో అడుగుపెడతా: బర్రెలక్క
-
తెలంగాణలో అభివృద్ధి సున్నా..కేసీఆర్ ని మూడోసారి నమ్మరు..
-
అర్బన్ ఓట్లే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ చర్యలు
-
ఎన్నికల వేళ ఆన్ లైన్ బ్యాంకు లావాదేవీలపై ఈసీ నిఘా
-
తెలంగాణలో పోలింగ్, కౌంటింగ్ కు సిద్ధం అవుతున్న ఎలక్షన్ కమిషన్
-
ధరణి బదులు ‘మీ భూమి’ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తామని, సమర్థవంతమైన పాలనపై దృష్టిపెడతామని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. భూముల రికార్డులకు సంబంధించి ధరణి స్థానంలో పారదర్శంగా ఉండేలా ‘మీ భూమి’ వ్యవస్థను తీసుకువస్తామని ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణ వేగవంతం చేస్తామని, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం అందరికీ చట్టం ఎదుట సమాన గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకుంటామని పే ర్కొంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరిట దీనిని విడుదల చేశారు. అందులో తెలంగాణను ప్రగతిపథంలో నడిపేందుకు రెండు విభాగాలుగా పది ప్రధాన లక్ష్యాలను, 25 అంశాల కార్యాచరణను బీజేపీ ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 48 ప్రకారం తెలంగాణలో గోహత్యపై సంపూర్ణ నిషేధం అమలుచేస్తామని పేర్కొంది. గోహత్య విషయంలో...నేరం రుజువైతే నేరస్థులకు మూడేళ్ల కు తక్కువ కాకుండా ఏడేళ్ల వరకు జైలుశిక్ష, ఒక పశువుకు రూ.50 వేల చొప్పున రూ.5 లక్షల దాకా జరిమానా లేదా రెండూ విధిస్తామని తెలిపింది. ప్రధాన కార్యాచరణ అంశాలివీ.. ► ఏటా సెప్టెంబర్ 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహణ. పరకాల, బైరాన్పల్లిలలో అమరులైన వారిని స్మరించుకుంటూ ఆగస్టు 27ను ‘రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ’ దినంగా నిర్వహణ. ► రజాకార్లు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి గుర్తుచేసుకునేలా హైదరాబాద్లో ఓ స్మారకం, మ్యూజియం ఏర్పాటు. ► అవినీతిపై ఉక్కుపాదం. బీఆర్ఎస్ సర్కారు హయాంలో కాళేశ్వరం, ధరణి, ఇతర అంశాల్లో అవినీతి, కుంభకోణాల ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు ► ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా.. ‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ – సబ్ కా ప్రయాస్’ నినాదంతో అవినీతి రహిత సుపరిపాలన ► రాష్ట్రంలోని 52% వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ, అందరికీ సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి బాటలు. రాష్ట్రానికి బీసీ సీఎం. ► ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేలా ఎస్సీ వర్గీకరణను వేగవంతం చేయడానికి చర్యలు. ► రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా, మత ప్రతిపాదికన ఇచ్ఛిన రిజర్వేషన్లను తొలగించి వాటిని వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు (జనాభాకు అనుగుణంగా) అందజేస్తాం. ► ద్రవ్యోల్బణం తగ్గించడంతోపాటు సాధారణ ప్రజలకు ఊరట కల్గించేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్టుగా పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గింపు ► రాష్ట్ర రైతులకు ఎరువుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని.. కేంద్రం ఇస్తున్న ఎరువుల సబ్సిడీ (ఎకరానికి రూ.18వేలు) అమలు. చిన్న, సన్నకారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రూ.2,500 ఇన్పుట్ అసిస్టెన్స్. ► ప్రధాని మోదీ ప్రకటించిన జాతీయ పసుపు బోర్డు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు బాటలు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు. ► వరి ధాన్యానికి రూ.3,100 మద్దతు ధర. తెలంగాణలో ఉత్పత్తయ్యే మొత్తం బియ్యం కొనుగోలుకు చర్యలు ► ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు ఉచిత పంటల బీమా సదుపాయం. ► ఉజ్వల లబి్ధదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం. ► ఆడబిడ్డ భరోసా పథకంతో నవజాత బాలికల పేరిట బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్. వారికి 21 ఏళ్లు వచ్చాక రూ.2లక్షలు పొందవచ్చు. ► డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్టాప్స్ ► స్వయం సహాయక బృందాలకు నామమాత్రపు వడ్డీకే రుణాలు ► యూపీఎస్సీ తరహాలో.. గ్రూప్–1, గ్రూప్–2 సహా టీఎస్పీఎస్సీ పరీక్షలు ఆర్నెల్లకోసారి పారదర్శకంగా నిర్వహణ ► ఆసక్తి గల రైతులకు ఆరోగ్యకరమైన ఆవును ఉచితంగా అందిస్తాం ► అర్హత కలిగిన కుటుంబాలకు.. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఏడాదికి రూ.10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీ. పేద కుటుంబాలకు ఏడాదికోసారి ఉచిత వైద్య పరీక్షలు ►కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా హక్కును పొందేందుకు కేడబ్ల్యూడీ– ఐఐ ముందు రాష్ట్ర వాదనలు సమర్థవంతంగా వినిపిస్తాం ► ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు, పింఛన్లు అందేలా చర్యలు ► వివిధ చట్టాలను ఏకీకృతం, సమన్వయం చేసి ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాను రూపొందించేందుకు కమిటీ ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వనరులను సమన్వయం చేసుకుంటూ.. పేదలందరికీ ఇళ్ల మంజూరు. గ్రామాల్లో అర్హులైన పేదలకు ఇంటి పట్టాలను అందిస్తాం. ► వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్రలు ► తెలంగాణకు చెందిన ఎన్నారైలు, గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం/మంత్రిత్వ శాఖ ఏర్పాటు. పది ప్రధాన లక్ష్యాలు ఇవీ.. ► ప్రజలందరికీ సుపరిపాలన.. సమర్థవంతమైన పాలనపై దృష్టి. ధరణి స్థానంలో పారదర్శకమైన ‘మీ భూమి’ వ్యవస్థ ► రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకోసం నోడల్ మంత్రిత్వ శాఖ ► వెనుకబడిన వర్గాల సాధికారత.. అందరికీ చట్టం ఎదుట సమాన గుర్తింపు. అందరికీ సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి బాటలు. ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేలా ఎస్సీ వర్గీకరణ వేగవంతం ► కూడు–గూడు: ఆహార, నివాస భద్రత. పేదలకు ఇళ్ల పట్టాలు అందజేత. అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్కార్డులు ► రైతే రాజు– అన్నదాతకు అందలం ► నారీశక్తి– మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ప్రోత్సాహం ► యువశక్తి–ఉపాధి: అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు 6 నెలల్లోనే భర్తీ ►వైద్యశ్రీ– నాణ్యమైన వైద్య సంరక్షణ చర్యలు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల కల్పన ► నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు ► ప్రభుత్వ ప్రాజెక్టుల ముసుగులో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడే వారిపై, అక్రమ తవ్వకాలకు సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు. నదీ గర్భాల కోత నిరోధానికి కొత్త ఇసుక మైనింగ్ విధానం -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం
-
గెలిచేది మేమే..ఎర్రబెల్లి దయాకర్ రావుకి సవాల్
-
మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
నాకెవ్వరు పోటీ కాదు..
-
నిజామాబాద్ లో సాక్షి ఎలక్షన్ ట్రాక్
-
రైతులు, మహిళలకే పెద్దపీట
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన ప్రత్యర్థులు బీజేపీ, కాంగ్రెస్ రెండూ రైతులు, మహిళలకే ప్రాధాన్యమిచ్చాయి. కాంగ్రెస్ అక్టోబర్ 17న, బీజేపీ తాజాగా 10వ తేదీన మేనిఫెస్టో విడుదల చేశాయి. రెండింట్లోనూ పలు అంశాలు ఒకేలా ఉండటం విశేషం... రైతులకు అలా బీజేపీ: ► మద్దతు ధరను క్వింటాలుకు గోధు మకు రూ.2, 700, వరికి రూ.3,100 కు పెంచుతామని ప్రకటించింది. ► అంతేగాక ఒక్కో రై తుకు రూ.12,000 ఆర్థికసాయంకూడా అందిస్తామంది. కాంగ్రెస్: ► గోధుమకు రూ.2,600, వరికి రూ.2,500 మద్దతు ధర ప్రకటించింది. ► పంట రుణాలు మాఫీ చేస్తామని పేర్కొంది. మహిళలకు ఇలా... బీజేపీ: డ మహిళా సాధికారతపై బాగా దృష్టి పెట్టింది. లాడ్లీ బెహనా యోజన కింద ప్రతి పేద మహిళకు నెలకు రూ.1,250 ఇస్తోంది. ► వారికి రూ.450కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. పేద కుటుంబాల బాలికలకు పీజీ దాకా ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచి్చంది. ► లాడ్లీ లక్ష్మి పథకం కింద ప్రయోజనాలను లక్షన్నర నుంచి 2 లక్షల రూపాయలకు పెంచుతామంది. కాంగ్రెస్: ► నారీ శక్తి సమ్మాన్ పేరిట ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించింది. ► రూ.500కు వంట గ్యాస్ అందిస్తామని పేర్కొంది. ► లాడ్లీ లక్ష్మి పథకానికి పోటీగా మేరీ బేటీ లాడ్లీ పథకం కింద రూ.2.51 లక్షల మేరకు అందేలా చూస్తామని ప్రకటించింది. -
దుబ్బాక అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం: రఘునందన్
-
కాంగ్రెస్ తప్పుల మీద తప్పులు చేస్తోంది
-
తెలంగాణలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
-
అంతా జనంలోనే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుండటంతో పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంపై ఫోకస్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. వచ్చే 20రోజుల పాటు పార్టీ యంత్రాంగం మొత్తాన్ని ప్రజాక్షేత్రంలోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావులతో రోడ్షోలు, సభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ప్రచార గడువు ముగిసేవరకు కూడా పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులు, ఇతర ముఖ్య నేతలెవరూ తమకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించిన చోటి నుంచి కదలవద్దని పార్టీ అధినేత ఆదేశించారు. పార్టీ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సెగ్మెంట్లతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థులు బలహీనంగా ఉన్నచోట ఇప్పటికే సుమారు 60కి మందికిపైగా నాయకులకు ఇన్చార్జులుగా సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కీలక నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీ యంత్రాంగాన్ని కదిలించి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మండల స్థాయిలోనూ ఇన్చార్జులను నియమిస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో సొంత నియోజకవర్గం వదిలి ఇతర నియోజకవర్గాలకు వెళ్లేందుకు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థులపై అసంతృప్తి ఉన్న నేతలను గుర్తించి వారికి ఇతర నియోజకవర్గాల్లో మండల స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనితో ఇటు ఆయా సెగ్మెంట్లలో పారీ్టకి నష్టం జరగకుండా చూసుకోవడంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో బాధ్యతల అప్పగింత ద్వారా వారిని విశ్వాసంలోకి తీసుకుంటున్నామనే భరోసా ఇవ్వొచ్చని భావిస్తున్నారు. దీపావళి తర్వాత మళ్లీ కేసీఆర్ సభలు అభ్యర్థుల ఎంపిక, బీఫారాల జారీతోపాటు బహిరంగ సభల నిర్వహణలోనూ బీఆర్ఎస్ విపక్షాలతో పోలిస్తే దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 15న బీఫారాల జారీని ప్రారంభించడంతోపాటు హుస్నాబాద్లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గత నెల 15 నుంచి ఈ నెల 9 వరకు 17 రోజుల వ్యవధిలో 43 చోట్ల కేసీఆర్ సభలు నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి 97 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పోటీచేస్తున్న జనగామలో ఇప్పటికే ఒక బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ఆ నియోజకవర్గంలోని చేర్యాలలో ఈ నెల 18న రోడ్షో నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రచారంలో ఇదొక్కటి మాత్రమే రోడ్షో. మిగతావన్నీ సభలే. ఈ నెల 28న గజ్వేల్లో ప్రచారంతో కేసీఆర్ పర్యటనలు ముగుస్తాయి. ఇక తొలి విడతలో సీఎం కేసీఆర్ సభలు జరిగిన నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీశ్రావుల రోడ్షోలు, బహిరంగ సభలు ఉండే అవకాశముంది. మరోవైపు 38 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను బీఆర్ఎస్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచినట్టు తెలిసింది. అఫిడవిట్లను జల్లెడ పడుతున్న లీగల్ సెల్ నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం ముగుస్తుండగా పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను బీఆర్ఎస్ లీగల్ సెల్ జల్లెడ పడుతోంది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లపై న్యాయపరమైన చిక్కులు తలెత్తిన నేపథ్యంలో.. వీలైనంత మేర నామినేషన్ల పత్రాల్లో లోపాలు దొర్లకుండా లోతుగా పరిశీలించి గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. వార్రూమ్లతో సమన్వయం నియోజకవర్గాల స్థాయిలో వార్రూమ్లను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. వాటిని హైదరాబాద్లోని సెంట్రల్ వార్రూమ్తో అనుసంధానం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీశ్రావుల దిశానిర్దేశం మేరకు సెంట్రల్ వార్ రూమ్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వార్రూమ్లతో సమన్వయం చేసుకుంటోంది. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచార తీరుతెన్నులు తదితరాలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు పంపుతోంది. వాట్సాప్, ఎక్స్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికగా కూడా పార్టీ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వే నివేదికలు, ఫీడ్బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థులు, ప్రచార తీరుతెన్నులను బీఆర్ఎస్ పెద్దలు మదింపు చేస్తూ.. వ్యూహాలకు పదును పెడుతున్నారు. -
మిజోరంలో 77 శాతానికి పైగా పోలింగ్
ఐజ్వాల్: అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), విపక్ష జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం), కాంగ్రెస్ మధ్య తీవ్రపోటీకి వేదికగా నిలిచిన మిజోరం శాసనసభ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 40 స్థానాలకూ ఒకే దఫాలో పోలింగ్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు అందిన సమాచారం మేరకు 77.39 శాతం పోలింగ్ నమోదైందని అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్.లియాంజెలా చెప్పారు. సవరించిన తుది ఫలితాలు బుధవారం వచ్చేసరికి పోలింగ్ శాతం 80 శాతాన్ని తాకొచ్చు. 18 మంది మహిళలు సహా మొత్తంగా 174 మంది అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 8.57 లక్షల ఓటర్లు ఉన్నారు. సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 84.49 శాతం, ఐజ్వాల్ జిల్లాలో అత్యల్పంగా 73.09 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు 7,200 భద్రతా సిబ్బందిని నియోగించారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్కేంద్రాలను ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ఓటేయబోతే మొరాయించింది ఐజ్వాల్లోని ఒక ఈవీఎం ఏకంగా ముఖ్యమంత్రినే రెండోసారి పోలింగ్కేంద్రానికి రప్పించింది. మొదటిసారి మొరాయించడమే ఇందుకు కారణం. ర్యామ్హ్యూన్ వెంగ్లాయ్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు ఉదయాన్ని ముఖ్యమంత్రి జోరామ్థంగా విచ్చేశారు. అప్పుడే ఈవీఎం మొరాయించింది. చేసేదేం లేక ఇంటికి వెనుతిరిగారు. మళ్లీ 9.40 గంటలకు వచ్చి ఓటేశారు. ‘ ఈసారి కనీసం 25 చోట్ల గెలుస్తాం’ అని సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లాల్సావ్తా ఐజ్వాల్ వెస్ట్–3 నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 96 ఏళ్ల అంధుడు పూ జదావ్లా పోస్టల్ బ్యాలెట్ను కాదని స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. పోలింగ్ నేపథ్యంలో మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసేశారు. రాకపోకలను ఆపేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఏకంగా 81.61 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. డిసెంబర్ మూడో తేదీన ఓట్లలెక్కింపు ఉంటుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 చోట్ల గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఉపఎన్నికల్లో మరో రెండు చోట్ల గెలిచింది. విపక్ష జెడ్పీఎం ఎనిమిది చోట్ల గెలిచింది. బీజేపీ కేవలం ఒక్క స్థానంలో, కాంగ్రెస్ ఐదు చోట్ల విజయబావుటా ఎగరేశాయి. ‘ఈసారి పట్టణప్రాంతాల్లో జెడ్పీఎం, గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎన్ఎఫ్ ఎక్కువ సీట్లు గెలవొచ్చు’ అన్న విశ్లేషణలు వినిపించాయి. -
7న కరీంనగర్లో సంజయ్ ప్రచారం షురూ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 6న ఉదయం 11 గంటలకు కరీంనగర్లోని కోర్టు చౌరస్తా వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి ఆయన నామినేషన్ వేయనున్నారు. అలాగే 7న కరీంనగర్లోని 24వ డివిజన్లో పాదయాత్ర ద్వారా ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన పోటీ చేస్తున్న కరీంనగర్ నియోజకవర్గంలో ప్రతీరోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, ఆ తరువాత సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారంలో పాల్గొంటారు. ఇక ప్రతీరోజు ఉదయం 11 గంటల తర్వాత ఇతర నియోజకవర్గాలకు హెలికాప్టర్లో వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ తరఫున ప్రచారం చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో సంజయ్ ప్రచారానికి రావాలంటూ నాయకత్వంపై ఒత్తిడి తేవడంతో ఆయనకు పార్టీ ప్రత్యేకంగా హెలికాప్టర్ కేటాయించింది. రోజూ రెండేసి నియోజకవర్గాల్లో ఆయన ప్రచారానికి షెడ్యూల్ను సిద్ధం చేసుకున్నారు. తొలుత 8వ తేదీన సిరిసిల్ల, నారాయణపేట, 9న ఖానాపూర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారం సందర్భంగా సంజయ్ భద్రతను దృష్టిలో ఉంచుకుని బుల్లెట్ ప్రూఫ్ కారు వినియోగానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. -
మనకు ఓటు హక్కు ఉంటే కృతజ్ఞతగా గెలిపించుకునే వాళ్లం!!
మనకు ఓటు హక్కు ఉంటే కృతజ్ఞతగా గెలిపించుకునే వాళ్లం!! -
బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పేలుతున్న విమర్శల పంచ్ లు
-
ప్రతిపక్ష ఎంపీల ఐఫోన్ల హ్యాకింగ్!
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరిన వేళ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ వార్తలు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనానికి దారితీశాయి. కాంగ్రెస్ మొదలుకుని పలు విపక్షాల ఎంపీలు తదితరుల ఐఫోన్లకు దాని తయారీ సంస్థ యాపిల్ నుంచి మంగళవారం వచ్చిన హ్యాకింగ్ అలర్టులు తీవ్ర కలకలం రేపాయి. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న హ్యాకర్లు మీ ఐఫోన్లను నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ వచ్చిన హెచ్చరిక నోటిఫికేషన్లు సంచలనం సృష్టించాయి. ఇది కచ్చితంగా కేంద్రంలోని మోదీ సర్కారు పనేనంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు. గతంలో పెగసెస్ సాఫ్ట్వేర్తో తమపై గూఢచర్యం చేసిన బీజేపీ, ఎన్నికల వేళ మరోసారి ఇలాంటి చౌకబారు చర్యలకు దిగిందంటూ దుయ్యబట్టారు. ఈ ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి వాస్తవాలు వెలుగులోకి తెస్తామని ప్రకటించింది. మరోవైపు ఈ కలకలం నేపథ్యంలో, తమ నోటిఫికేషన్లలో కొన్ని ఫేక్ అలర్టులు కూడా ఉండొచ్చంటూ యాపిల్ స్పందించింది. భారత్లోనేగాక 150 దేశాల్లో పలువురు యూజర్లకు ఇలాంటి అలర్టులు వచ్చాయని పేర్కొంది. అయితే ఈ అలర్టులకు దారితీసిన కారణాలను బయట పెట్టేందుకు నిరాకరించింది. దుయ్యబట్టిన విపక్ష నేతలు ఈ ఉదంతంలో కేంద్రప్రభుత్వ పాత్ర కచ్చితంగా ఉందంటూ విపక్ష నేతలు ఆరోపించారు. తమ ఫోన్లలో అభ్యంతరకర సమాచారాన్ని చొప్పించి అందుకు తమను బాధ్యులను చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ అంశాన్ని తక్షణం లోక్సభ హక్కుల కమిటీకి నివేదించాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యతలపై ఇలాంటి దాడి దారుణమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితర విపక్ష నేతలను విచారణ పేరుతో వేధించడం, తాజాగా వారి ఫోన్ల హ్యాకింగ్కు ప్రయత్నించడం మోదీ సర్కారు అభద్రతా భావానికి సూచనలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. లోతుగా దర్యాప్తు: ఐటీ మంత్రి వైష్ణవ్ విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొట్టిపారేశారు. మోదీ నాయకత్వంలో దేశ ప్రగతిని చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ ఉదంతంపై కూలంకషంగా దర్యాప్తు జరిపించి నోటిఫికేషన్ల వ్యవహారాన్ని నిగ్గుదేలుస్తామని ప్రకటించారు. ‘పూర్తి పారదర్శకంగా సరైన సమాచారాన్ని అందజేయడం ద్వారా విచారణలో మాతో కలిసి రావాల్సిందిగా యాపిల్ను కోరాం. ముఖ్యంగా ప్రభుత్వ దన్నుతో హ్యాకింగ్ జరగవచ్చని ఏ ఆధారంతో చెప్పారో వివరించాలని సూచించాం. ఇది పూర్తిగా సాంకేతికపరమైన దర్యాప్తు. కనుక కంప్యూటర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలకు బాధ్యత వహించే జాతీయ నోడల్ ఏజెన్సీ సెర్ట్–ఇన్ దీన్ని చేపడుతుంది.’ అని మంత్రి ప్రకటించారు. ఇలాంటి నోటిఫికేషన్లు 150కి పైగా దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు వచ్చాయని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. నా ఫోన్ తీసుకోండి: రాహుల్ ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. విపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్ కచ్చితంగా మోదీ సర్కారు పనేననంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘మేం భయపడేది లేదు. మా ఫోన్లను ఎంతగా హాకింగ్ చేసుకుంటారో చేసుకోండి. మీకు కావాలంటే చెప్పండి, నా ఫోన్ కూడా ఇస్తా’ అంటూ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీయే ప్రస్తుతం దేశాన్ని రిమోట్ కంట్రోల్తో నడుపుతున్నారని ఆరోపించారు. ‘ఇప్పుడు దేశంలో అదానీయే నంబర్ వన్. తర్వాతి స్థానాల్లో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ఆత్మ అదానీ దగ్గరుంది. అందుకే అదానీని ఎవరైనా ఒక్క మాటన్నా వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగుతున్నాయి. అలర్టులు అందుకున్న నేతలు.. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, పవన్ ఖేరా, కె.సి.వేణుగోపాల్, సుప్రియా శ్రీనేత్, టి.ఎస్.సింగ్దేవ్, భూపీందర్ సింగ్ హుడా, రాహుల్గాంధీ సహాయకులు, మహువా మొయిత్రా (టీఎంసీ), సీతారాం ఏచూరి (సీపీఎం), ప్రియాంకా చతుర్వేది (శివసేన–యూబీటీ), రాఘవ్ ఛద్దా (ఆప్), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), సమీర్ సరణ్ (ఓఆర్ఎఫ్ అధ్యక్షుడు), సిద్ధార్థ్ వరదరాజన్ (ద వైర్ వ్యవస్థాపక ఎడిటర్), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓఎస్డీ తదితరులు యాపిల్ అలర్టులో ఏముందంటే... ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే హాకర్లు మీ ఐఫోన్ను టార్గెట్ చేసుకుని ఉండొచ్చని యాపిల్ అనుమానిస్తోంది. బహుశా మీ హోదా, మీరు చేస్తున్న పనుల వల్ల మీరు వ్యక్తిగతంగా వారి లక్ష్యంగా మారి ఉండొచ్చు. ఇలాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని హాకర్లు మీ ఫోన్ను హాక్ చేసి తమ అ«దీనంలోకి తీసుకుంటే అందులోని సున్నితమైన డేటా, సమాచారంతో పాటు కెమెరా, మైక్రోఫోన్ వారి చేతిలోకి వెళ్లిపోతాయి. ఇది ఫేక్ హెచ్చరికే అయ్యుండే ఆస్కారమూ లేకపోలేదు. కానీ దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి’ -
నేడు ఉమ్మడి నల్లగొండకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఆయన ప్రచారం చేయనున్నారు. ముందుగా హుజూర్నగర్ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే ప్రజా ఆశీర్వాదసభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మిర్యాలగూడ, సాయంత్రం 4 గంటలకు దేవరకొండలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అభ్యర్థులు, ఆయా నియోజకవర్గ బాధ్యులు, నాయకులు సభల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. -
నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడుచోట్ల సీఎం సభలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సీఎం కె.చంద్రశేఖర్రావు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1.40 గంటలకు కోదాడ చేరుకుంటారు. 1.50 గంటలకు అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. 2.30 గంటలకు కోదాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 3.50 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు ఆలేరుకు చేరుకుంటారు. అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు. కాగా, ఈ నెల 31వ తేదీన సీఎం మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. -
ఐడీ కార్డు తప్పనిసరి
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటరు స్లిప్పు ఉంటే సరిపోతుందనుకోవద్దని, ఐడీ కార్డు తప్పనిసరిగా ఉండాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ స్పష్టం చేశారు. ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) ఉన్నవారు ఐడీ ప్రూఫ్గా దాన్ని వెంట తీసుకువెళ్లాలని, ఎపిక్ లేకపోయినా ప్రత్యామ్నాయంగా ఫొటోతో కూడిన ఐడీ కార్డు చూపిస్తే ఓటు వేయవచ్చునని, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. కొత్తగా ఓటరుగా జాబితాలో పేరు నమోదు చేసుకున్నవారికి ఎపిక్ కార్డులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎపిక్ లేనివారు తమ గుర్తింపు కోసం దిగువ తెలిపిన ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని పోలింగ్ కేంద్రంలో చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 1.ఆధార్ కార్డు 2.ఎంఎన్ఆర్ఈఏ జాబ్కార్డు 3.పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ జారీచేసిన ఫోటోతో కూడిన పాస్ బుక్ 4. కార్మిక మంత్రిత్వ శాఖ జారీచేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు 5. డ్రైవింగ్ లైసెన్స్ 6. పాన్ కార్డు 7. ఆర్జీఐ ద్వారా జారీ చేసిన స్మార్ట్ కార్డు 8. ఇడియన్ పాస్ పోర్టు 9. ఫొటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్ 10. ఫొటోతో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం/పీఎస్యూ/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ఉద్యోగ గుర్తింపు కార్డు 11.ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల అధికార గుర్తింపు పత్రం. 12. దివ్యాంగుల గుర్తింపు కార్డు. పై వాటిల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తమ వెంట తీసుకువెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. స్పష్టం చేసిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ -
రైతుబంధు నిలిపేయాలనడం కాంగ్రెస్ వైఖరికి నిదర్శనం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలంటూ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారీ మనస్తత్వంతో నడిచే కాంగ్రెస్ పార్టీ ఈ లేఖ ద్వారా తన కర్కశ, రైతు, పేదల వ్యతిరేక వైఖరిని నిస్సిగ్గుగా బయట పెట్టుకుందని విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ‘ఎక్స్’(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రారంభించిన రైతుబంధు దేశవ్యాప్తంగా స్ఫూర్తినిస్తోందని, రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్ల కోసమే చూస్తోందని దాసోజు విమర్శించారు. ఎన్నికలు వస్తూ పోతుండటం సహజమని, వాటి కోసం రైతులు వ్యవసాయాన్ని ఆపలేరని పేర్కొన్నారు. చిల్లర రాజకీయాల కోసం సమాజం కోసం నిస్వార్ధంగా కష్టపడే రైతుల జీవనోపాధిపై దెబ్బకొట్టడం అత్యంత దుర్మార్గమని అన్నారు. రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, భవిష్యత్తు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బలి కాకూడదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉంటూ గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులను వేధించకూడదనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు అర్ధం చేసుకోవాలన్నారు. ఎలాంటి జాలి, దయ లేకుండా ఈసీకి రాసిన క్రూరమైన లేఖను కాంగ్రెస్ వెంటనే ఉపసంహరించుకోవాలని దాసోజు డిమాండ్ చేశారు. -
అభ్యర్థుల్లో అఫిడవిట్ భయం..!
-
కేసీఆర్ సభల షెడ్యూల్లో స్వల్ప మార్పు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్వల్పవిరామం తర్వాత తిరిగి గురువారం నుంచి బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభల్లో పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖరరావు పాల్గొంటారు. అయితే గతంలో ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేస్తూ బహిరంగ సభల ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఈ నెల 26న నాగర్కర్నూలు, 27న స్టేషన్ ఘన్ పూర్లో నిర్వహించ తలపెట్టిన సభలను వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ తాజాగా ప్రకటించింది. రద్దయిన సభల స్థానంలో 26న వనపర్తి, 27న మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. 26న వనపర్తితోపాటు అచ్చంపేట, మునుగోడులో, 27న మహబూబాబాద్, వర్ధన్న పేటతోపాటు పాలేరులో జరిగే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 28న విరామం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భా గంగా ఈ నెల 15 నుంచి నవంబర్ 9 వరకు 17 రోజుల్లో 41 అసెంబ్లీ నియోజ కవర్గాల్లో కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్ను గతంలో బీఆర్ఎస్ ప్రకటించింది. ఈనెల 15 మొదలుకుని 18 వరకు కేసీఆర్ హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్లో జరిగిన సభల్లో ప్రసంగించారు. సద్దుల బతుకమ్మ, దసరా నేప థ్యంలో ఈనెల 19 నుంచి 25 వరకు కేసీఆర్ పాల్గొనే సభలకు విరామం ప్రకటించారు. 26 నుంచి తిరిగి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు ప్రారంభమై వచ్చే నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ నెల 28న ప్రచారానికి విరా మం ఇచ్చి 29న కోదాడ, తుంగతు ర్తి, ఆలేరు 30న జుక్కల్, బాన్సువాడ, నారాయ ణ్ఖేడ్లలో, 31న హుజూర్నగర్, మిర్యాలగూ డ, దేవరకొండ సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. తిరిగి నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లెందు, 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి 3న భైంసా (ముధోల్), ఆర్మూర్, కోరుట్ల, 5న కొత్తగూడెం, ఖమ్మం, 6న గద్వాల్, మఖ్తల్, నారాయణపేట, 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, 9న కామారెడ్డి సభల్లో ప్రసంగిస్తారు. 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. -
అప్పుడేం చేశారు..? ఇప్పుడేం చేస్తారు? గల్లీ ప్రశ్నిస్తోంది..!
సాక్షి హైదరాబాద్: నగరంలో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు సమరభేరి మోగించి కదన రంగంలో ప్రచారస్త్రలను సంధిస్తున్నాయి. సభలు, సమావేశాలు, భారీ ప్రదర్శనలు సమరోత్సాహంతో ఉన్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏళ్లకు ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి, సంక్షేమానికి నోచుకోని ఓటర్లు కూడా తమ వద్ద ఉన్న ఏకైక పాశుపతాస్త్రాన్ని సంధించేందుకు సన్నద్ధమవుతున్నారు. మౌలిక సమస్యలపై నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు బస్తీ సంక్షేమ సంఘాలు సరికొత్త ప్రశ్నావళితో ముందుకొస్తున్నాయి. బస్తీలు, మురికివాడల్లో నివసించే ప్రజలను కేవలం ఓటు బ్యాంకులుగా భావించే పార్టీల ధోరణి మారాలంటున్నాయి. స్థానిక నాయకులు మొదలుకొని బరిలోకి దిగిన అభ్యర్థుల వరకు బస్తీల్లోకొచ్చే వారిపై ఈ ప్రశ్నిస్త్రాలను సంధించనున్నారు. బస్తీలపై వివక్ష ఎందుకు? బస్తీలు అంటే వెంటనే గుర్తుకొచ్చేది కంకర తేలిన సిమెంట్ రోడ్లు, ఇరుకు గల్లీలు. ఒకదానికొకటి అతికించినట్లుగా ఉండే అగ్గిపెట్టెల్టాంటి ఇళ్లు. వాటిని ఆనుకొని నురగలు కక్కుతూ ప్రవహించే నాలాలు. ముక్కుపుటాలదిరే దుర్గంధం గుర్తుకొస్తుంది. దోమల స్వైరవిహారం కళ్ల మందు కనిపిస్తుంది. ఫుట్పాత్లు, పేవ్మెంట్లను ఆశ్రయించుకొని జీవనం సాగించే చిరువ్యాపారులు కనిపిస్తారు. దశాబ్దాలుగా అనేకసార్లు ఎన్నికలొచ్చాయి. కానీ బస్తీ ముఖచిత్రం మారలేదు. మరోసారి ఎన్నికలు వచ్చాయి. అన్ని గల్లీల్లో ఇప్పుడు పార్టీల జెండాలు ఎగురుతున్నాయి. మైకుల్లో ప్రచారం హోరెత్తుతోంది. నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. ఈ హామీలు అప్పుడు, ఇప్పుడు, భవిష్యత్లోనూ ఉంటాయని బస్తీవాసులకు తెలుసు. అందుకే ‘గత ఎన్నికల్లో ఓటేస్తే ఏం చేశారు. ఇప్పుడు ఓటెందుకు వేయాలి’ అనే మౌలికమైన ప్రశ్నతో వివిధ పార్టీల నాయకులను నిలదీసేందుకు బస్తీ సంఘాలు, కాలనీ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. గ్రేటర్లో సుమారు 1,500కు పైగా మురికి వాడలు, బస్తీలు ఉన్నాయి. లక్షలాది మంది నివసించే ఈ మురికివాడలే అన్ని రాకీయ పార్టీలకు ప్రధాన ఓటుబ్యాంకులు. బాధ్యతగా ఓటు వేసేది కూడా వాళ్లే. ఈ నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా బస్తీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి నివాస హక్కుల కోసం పోరాడుతున్న హైదరాబాద్ బస్తీ ప్రజల సమాఖ్య వివిధ పార్టీల అభ్యర్థులపై ఈ అ్రస్తాలను సంధిస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ఎమ్మెల్యే కావాలి? అని హైదరాబాద్ బస్తీ ప్రజల సమాఖ్య ప్రతినిధి బ్రదర్ వర్గీస్ అన్నారు. ఇప్పటి వరకు ఏం చేశారు? స్థానిక సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బస్తీసంఘాలు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కరపత్రాలను పంపిణీ చేస్తున్నాయి. ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు బస్తీల్లో పర్యటించారు. ఏయే సమస్యలను పరిష్కరించారు. పెండింగ్లో ఉన్న సమస్యలేంటి అనే అంశాలపై చర్చిస్తున్నారు. బస్తీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యేలకు ఏ మేరకు అవగాహన ఉందనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని బస్తీ సంఘాలు భావిస్తున్నాయి. డబుల్బెడ్రూం ఇళ్ల మంజూరుపైనా ప్రశ్నించనున్నారు. ఈ ప్రశ్నలకు బదులేదీ? బస్తీల్లో ప్రచారానికి వచ్చే నాయకులను, పార్టీలను నిలదీసేందుకు బస్తీ సంఘాలు సిద్ధం చేస్తున్న ప్రశ్నావళి ఇలా ఉంది. బస్తీ ప్రజల ఉపాధి కోసం ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు. ఎప్పటి వరకు ఇళ్లు కట్టించి ఇస్తారు. బ్యాంకుల నుంచి రుణసదుపాయం కల్పిస్తారా? వర్షాకాలంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మీ వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి. బస్తీలు నీటమునగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? నగరంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పేదప్రజలకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు మీరు సిద్ధమేనా? బస్తీల్లోని యువతను నిర్విర్యం చేసేందుకు మోహరించి ఉన్న మాదకద్రవ్యాల అమ్మకాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నాలాలను కబ్జా చేసిన వాళ్లను, బస్తీల్లో ప్రజలపై దౌర్జన్యం చేసే వారిని కట్టడి చేయగలరా? వరదల నివారణకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తారు? వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేసే నిధులను పారదర్శకంగా ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? గత ఎన్నికల్లో మీ పార్టీ ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? ఇప్పుడు కొత్తగా ఎలాంటి హామీలు ఇస్తున్నారు? హామీలను నిలబెట్టుకోలేని పార్టీలకు ఓటెందుకు వేయాలి? -
తటస్థులు, మేధావులకూ బీజేపీ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వినూత్న వ్యూహంతో కమలదళం ముందుకు వెళ్లనుంది. ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీ పిస్తున్నా టికెట్లు ఖరారు కాలేదంటూ, మేనిఫెస్టో, ప్రచార వ్యూహమే ఖరారు కాలేదంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. ఒక్కసారిగా అన్ని వైపుల నుంచీ దూకుడు పెంచేలా కార్యా చరణ ప్రణాళిక అమలు చేయనున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ లోని పాత, కొత్త నేతలతోపాటు తటస్థులు, మేధావులు, ప్రముఖులకు ఈసారి పోటీ అవకాశం కల్పించాలని జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్టు వివరిస్తున్నాయి. మొత్తం 119 స్థానాల్లో ఎస్సీ 19, ఎస్టీ 12 సీట్లుపోగా మిగతా 88 సీట్లలో యాభై శాతానికిపైగా బీసీలు, ఇంతవరకు శాసనసభలో అడుగుపెట్టని ఎంబీసీ కులాల వారికి టికెట్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం జరిగిందని పేర్కొంటున్నాయి. మొత్తంగా అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పించి ఎన్నికల గోదాలోకి దిగాలనే ఆలోచనతో ఉన్నట్టు వివరిస్తున్నాయి. దూకుడుగా ప్రచారం చేపట్టేలా.. అన్ని ప్రసార, ప్రచార సాధనాలు, మీడియా, సోషల్, డిజిటల్ మీడియాలలో ఒకేసారి దూకుడుగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రాధాన్యతా అంశాల వారీగా.. ముఖ్యంగా అందులో బీసీలు, ఎంబీసీలు, మహిళలకు సంబంధించిన సమస్యలు, అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వివరిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గం, ప్రాంతానికి అన్నట్టుగా కాకుండా మొత్తంగా 119 సీట్లకు వర్తించేలా కామన్ ఎజెండాతో ముందుకెళ్లాలనే యోచనలో పార్టీ నేతలు ఉన్నట్టు తెలిసింది. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ సర్కారు పాలన లోపాలు, వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి, సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు, అవినీతి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. అంతా కలసి ముందుకు.. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలోని పాత, కొత్త, జూనియర్, సీనియర్ నేతలు అంతా కలసి ముందుకు సాగుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ బీజేపీ సిద్ధాంతాలను నమ్ముకుని పనిచేస్తున్నవాళ్లు, ఇతర పార్టీల నుంచి చేరి ప్రధానమైన బాధ్యతల్లోని వారూ ఉన్నారని అంటున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్రావు, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్రావు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్రెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి, గరికపాటి మోహన్రావు, విజయశాంతి, సీనియర్ నేతలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎన్.రామచంద్రరావు తదితరులు కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నాయి. -
60 శాతం దేశానికి ‘ఇండియా’ ప్రాతినిధ్యం
ఐజ్వాల్: బీజేపీ కంటే ఎక్కువగా, ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి 60 శాతం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మిజోరం, తెలంగాణల్లో తమ పార్టీయే విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పారు. సోమవారం నుంచి మిజోరంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మిజోరం రాజధాని ఐజ్వాల్లో మంగళవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. అనంతరం ‘ఎక్స్’లో కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరించారు. ‘ప్రతిపక్ష ఇండియా కూటమి రాజ్యాంగాన్ని, విలువలను పరిరక్షిస్తూ, మతం, సంస్కృతులతో సంబంధం లేకుండా ప్రజలకు భావ వ్యక్తీకరణ స్వేచ్చను, సామరస్యంగా జీవించే హక్కును పరిరక్షిస్తుంది. బీజేపీ కంటే కూడా ఎక్కువగా ఇండియా కూటమి దేశంలోని 60 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది’అని బీజేపీయేతర పాలిత రాష్ట్రాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మన దేశం పట్ల ఇండియా కూటమి ఆలోచనలు బీజేపీ, ఆర్ఎ స్ఎస్లతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి. మేం వికేంద్రీకరణపై దృష్టి పెడితే బీజేపీ మాత్రం ఢిల్లీ నుంచే అన్ని నిర్ణయాలూ జరిగిపోవాలని అంటోంది. మేం అధికారంలో ఉన్న రాజస్తాన్లో అత్యుత్తమమైన ఆరోగ్య విధానం, కర్ణాటకలో సామాజిక భద్రత కార్యక్రమాలు, ఛత్తీస్గఢ్లో వ్యాపార సానుకూల విధానాలు అమలవుతున్నాయి’అని రాహుల్ తెలిపారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఇటువంటి విజయవంతమవుతున్న విధానాలనే దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. స్కూటరెక్కిన రాహుల్ గాంధీ మిజోరంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ ఐజ్వాల్లో స్కూటర్పై ప్రయాణించారు. మంగళవారం ఆయన సీనియర్ కాంగ్రెస్ నేత లాల్ తన్హావ్లాను ఇంటికెళ్లి కలుసుకున్నారు. తిరుగు ప్రయాణంలో స్కూటర్ ట్యాక్సీపై ప్రయాణించారు. నగరంలో ట్రాఫిక్ క్రమశిక్షణ ఎంతో బాగా ఉందని ప్రశంసలు కురిపించారు. ట్రాఫిక్ క్రమశిక్షణతో ఐజ్వాల్ ‘సైలెంట్ సిటీ’గా పేరు తెచ్చుకుంది. -
ఇంకా పెరగాలి ఓటు ధర!
ఓ జర్నలిస్టు... ఓ (అ)సామాన్య ఓటరును ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓటును నోటుకూ, ఓ రేటుకూ అమ్ముకుంటున్నారనీ, ఈ పద్ధతి తప్పు అని తెలియజెప్పాలని సదరు జర్నలిస్టు ఉద్దేశం. అదే విషయాన్ని అతణ్ణి అడిగాడు. ‘‘సార్... పేపర్లలో టీవీల్లో... మీరే దాన్ని ‘విలువైన ఓటు’, ‘విలువైన ఓటు’ అంటుంటారా, లేదా? మరి అంత విలువైనదాన్ని ఫిరీగా ఇచ్చేయడమేంటి?... నాన్చెంచ్’’ ‘‘ఓటు ధర ఇలా పెరిగిపోవడం ఓ చెడు సంకేతం కాదా?’’ ‘‘ఎంతమాత్రమూ కాదు. నిజానికి నా ఒపీనియనింగు పెకారం ఓటింగు ప్రైసింగు వింకా పెరగాలి. ఒకప్పటి రేట్లూ..ఇప్పటి ధరలూ, ఇప్పటికి తరిగిపోయిన రూపాయి విలువా.. వీటన్నింటినీ కూలంకచంగా పరిచీలింపచేసి, ఏ ఆడమ్ చ్మిత్తుతోనో, అమర్తచేనుతోనో లెక్కలు కట్టించారనుకోండి, పెరిగిన ద్రవ్యోల్బణం పెకారం.. ప్చ్..ఇప్పటి మన ఓటు ధర చాలా తక్కువని తెలుతుంది. ఇంకో విషయం.. ఓటు ధర బాగా పెరిగిందనుకోండి.. ‘అమ్మో.. మా చీటు ఇంతటి వ్యాల్యుయేషనబుల్ కదా’ అంటూ, దాన్ని నిలబెట్టుకోవడం కోసం మమ్మల్ని మరింత చంతృప్తిపరచేలా పాలిస్తుంటారు సార్ నేతలు’’ ‘‘అదేంటీ... ఇలా చెబుతున్నారు?’’ ‘‘సార్... మీకు మీ ఆఫీసువాళ్లు ఏడాదికోసారి బోనచు ఇస్తుంటారా, లేదా? దాన్ని మీరు తీసుకుంటారా లేక ‘అబ్బే..అప్పనంగా వచ్చింది మాకెందుకండీ’ అని వదిలేస్తారా?’’ ‘‘తీసుకుంటాం’’ ‘‘మాకు నెలనెలా వచ్చే మా పింఛనే జీతమనుకుందాం. జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఎప్పుడో... ఐదేళ్లకోసారి బోనచుగా ఏ ఐదువేలో, ఆరువేలో ఇస్తారు. మీరు ఏడాదికోసారి బోనచు రాకపోతేనే ఎంతో అల్లల్లాడిపోతారు కదా. మాకేమో ఏదో ఓ రెణ్ణెల్ల పింఛన్ను..అది కూడా ఐదేళ్లకు..మచ్చుకు కొద్దిగా బోనచులాగా పడేస్తే..మీరీమాత్రానికే ఇంతగా విదైపోతుంటారెందుకో నాకు అర్థంకావడం లేదు’’ ‘‘ఇలా ఓటుకు ధర పెరుగుతూ పోవడం ప్రజాస్వామ్యానికి అనర్థం కాదా?’’ ‘‘ఓటును అమ్మడం, అమ్ముకోవడం అని మాటిమాటికీ అనకండి సిరాగ్గా! అమ్ముతున్నాడంటూ బదనాం చేయడానికి ఓటరే దొరికాడా మీకు తేరగా? అసలుఓటును అమ్ముకోడం అనడమేంటి? బార్బేరియన్’’ అన్నాడు చిరాగ్గా. ‘‘మరి ఏమనాలి?’’ ‘‘సార్.. నిజానికి ఇదొక వెకనమిక్ యాక్టివిటీ. అనగా... ఓ ఆర్థిక కార్యెకలాపం. ఉదాహరణకు..ఓ విలువైన పనికి టెండర్లు పిలుస్తారు. బిడ్డింగు వేస్తారు. ఎవరు ఎక్కువ లాభదాయకంగా కోటింగు చేస్తే, వాళ్లకు ఇస్తారు. ఓటు విషయంలోనూ అదే జరుగుతోందని ఎందుకనుకోరు? ‘అరె ఓ విలువైన పనికి బిడ్డింగు జరిగింది, ఎవరు ఎక్కువగా ఇస్తే, వాళ్లకు ఓటిచ్చారు’ అని మీరెందుకనుకోరు?’’ ‘‘బిడ్డింగులో ఎవరు లాభదాయకంగా కోట్ చేస్తే వారికే పని అప్పగిస్తారు. కానీ ఓటు విషయంలో అభ్యర్థులందరినుంచీ డబ్బులు తీసుకుంటారు కదా ఓటర్లు?’’ ‘‘నేను ముందే చెప్పాను కదా... ఇదొక ఆర్థిక కార్యెకలాపం అని. ‘ఓట్లు అమ్ముకుంటుంటారూ, అమ్ముకుంటున్నారం’టూ అదేపనిగా ఓటరును బ్లేమింగు చేస్తుంటారుగానీ..వాస్తవానికి ఏ ముగ్గురో, నలుగురో పోటీపడి ఆక్షనింగులో మానుంచి ఎమ్మెల్లే పదవిని కొనుక్కుంటున్నారననే ‘ఓ–కామర్స్’లా దీన్ని మీరెందుకు చూడరు? అరె... మార్కెట్ అన్నాక వొడిదొడుకులుంటాయ్. డిమాండును బట్టి ‘ఎలక్షన్ ఓటు రేటు సూచీ’ విండెక్చు ప్రకారం.. ఒక్కోసారి ఓటు ధర అమాంతం పెరుగుతుంది. ఒక్కోసారి పడిపోతుంది. కొన్నిసార్లు కొందరు ఓడిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బులు తిరిగి వసూలు చేసుకున్న దాఖలాలు లేవా? మిగతా కామర్చు విషయాల్లోలాగే..చెరతులు వర్తిస్తాయనీ లేదా ‘ద వోటు ప్రైసెస్ ఆర్ సజ్జెట్టు టు మార్కెట్ రిచుకు’ అని పేపర్లలో మీరే రాస్తుంటారు కదా. ఇక్కడా అంతే. చేమ్ టు చేమ్. దీనికి మీరెందుకంతగా ఆశ్చర్యపోతుంటారెందుకో నాకర్థం కావడం లేదు’’ ‘‘మీరు పేపర్లు బాగా చదువుతూ, టీవీ ఎక్కువగా చూస్తుంటారు కదా? అందునా బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రాములు’’ ‘‘అవును... మీకెలా తెలుసు?’’ కాస్త సిగ్గు నటిస్తూ, కాంప్లిమెంటులా తీసుకున్నాడా ఎక్్చపర్టు!! -
నేడు సిరిసిల్ల, సిద్దిపేటల్లో కేసీఆర్ సభలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లలో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుంది. ఇది సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభ కోసం మొదటి బైపాస్రోడ్డులో స్థలాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సిరిసిల్లకు చేరుకుని సభలో పాల్గొంటారు. తర్వాత సిద్దిపేటలో జరిగే సభకు వెళతారు. -
రాజస్తాన్లో కాంగ్రెస్కు..వ్యతిరేక పవనాలు
‘రాజస్తాన్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటాపోటీగా ఉండనుంది’ : ఈ మాటలన్నది ఏ ఎన్నికల విశ్లేషకుడో కాదు. స్వయానా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాందీ! ఇది కేవలం నెల రోజుల క్రితం సంగతి!. తమ పాలనలోని ఈ రాష్ట్రంపై ఈసారి ఆ పార్టీ ఏ మేరకు ఆశలు పెట్టుకుందో చెప్పేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాలతో, ముఖ్యంగా మధ్యప్రదేశ్తో పోలిస్తే రాజస్తాన్లో కాంగ్రెస్ పరిస్థితి అంత ఆశావహంగా ఏమీ లేదని ఆ పార్టీ స్థానిక నేతలే చెబుతున్నారు. ఇందుకు కారణాలూ అనేకం. రాజస్తాన్లో 1990లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచీ అక్కడ దానికి, కాంగ్రెస్కు ద్విముఖ పోరే సాగుతూ వస్తోంది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాంశంగానే ఉంటుంది. అలా చూసుకున్నా ఈసారి అధికారం తమదేనని బీజేపీ ధీమాగా ఉంది. గహ్లోత్ సర్కారు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతోందని, అసమర్థ పాలన సాగుతోందని సర్వత్రా అభిప్రాయం నెలకొందని చెబుతోంది. దీనికి తోడు రాష్ట్ర కాంగ్రెస్ నేతల అంతర్గత పోరు తమ పనిని మరింత తేలిక చేస్తుందని భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, ప్రధాని మోదీ ఛరిష్మా వంటివి మరింతగా కలిసొస్తాయని కాషాయ నేతలంటున్నారు. తమ డబుల్ ఇంజన్ నినాదానికే ఈసారి రాజస్తానీలు ఓటేస్తారని బీజేపీ ఆశతో ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు యువ నేత సచిన్ పైలట్ అసమ్మతి రాగాలను ఎదుర్కొంటూనే, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతకూ అడ్డుకట్ట వేసేందుకు సీఎం అశోక్ గహ్లోత్ చెమటోడుస్తున్నారు. పథకాలే పథకాలు... ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు కొద్ది నెలల ముందునుంచే పలు ప్రజాకర్షక పథకాలకు గహ్లోత్ తెర తీశారు. ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు రాష్ట్రంలో కులాలవారీగా జన గణన రూ.25 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ పట్టణ ఉపాధి హామీ పథకం సామాజిక భద్రత కింద ఒక్కొక్కరికి నెలకు రూ.1,000 ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ కులగణన ప్రకటన ఓబీసీలు తదితర ప్రాబల్య వర్గాల్లో బాగా పని చేస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. తూర్పు రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టుతో ఆ ప్రాంతమంతటికీ తాగు, సాగునీరు అందిస్తామని చెబుతోంది. పథకాల్లో లబ్ధిదారులుగా చేరేందుకు ఇన్ఫ్లేషన్ రిలీఫ్ క్యాంపుల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా గహ్లోత్ స్వయంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు! బీజేపీది అదే వ్యూహం... రాష్ట్రంలో తమకనువైన పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ విశ్వసిస్తోంది. వాటినుంచి గరిష్టంగా ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తోంది. అయితే రాష్ట్ర బీజేపీలోనూ గ్రూపు తగాదాలకు కొదవ లేదు! మాజీ సీఎం వసుంధర రాజే వర్గం ఈసారి ఆమే ముఖ్యమంత్రి రేస్లో ముందున్నారని ఇప్పట్నుంచే ప్రచారం చేస్తున్నారు. ఇతర సీనియర్లకు ఇది నచ్చడం లేదు. దాంతో ఎందుకైనా మంచిదని మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాదిరిగా రాజస్తాన్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ముందస్తుగా ఎవరినీ ప్రకటించలేదు. తద్వారా ఎన్నికల వేళ సీనియర్లలో అసంతృప్తులు చెలరేగి సహాయ నిరాకరణ తదితరాలకు దారి తీయకుండా జాగ్రత్త పడుతోంది. ఎప్పట్లాగే మోదీ మేనియానే తారకమంత్రంగా బీజేపీ రంగంలోకి దిగింది. ఆయన ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. హిందూత్వ కార్డును ప్రబలంగా బీజేపీ ప్రయోగిస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన మత కల్లోలాలను మోదీ స్వయంగా గహ్లోత్ సొంత అసెంబ్లీ స్థానమైన సర్దార్పురా ఎన్నికల సభలో ప్రస్తావించారు! ఇంటిపోరు ఏం చేసేనో...! పథకాలు, ప్రచారాల మాటెలా ఉన్నా, నానాటికీ తీవ్రమవుతున్న ఇంటి పోరుతో గహ్లోత్ సతమతమవుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచీ పార్టీ యువ నేత సచిన్ పైలట్ ఆయనకు కంట్లో నలుసుగా మారారు. 2020లో పైలట్ బహిరంగంగా గహ్లోత్పై తిరుగుబావుటా ఎగరేశారు. అధిష్టానం జోక్యంతో అప్పటికి తగ్గినా అడుగడుగునా గహ్లోత్ను ఆయన ముప్పుతిప్పలు పెడుతున్నారు. అంతటితో ఆగకుండా తీవ్రమైన అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. అసమర్థ పాలన సాగుతోందంటూ విమర్శలు సంధిస్తూ బీజేపీ పని తేలిక చేస్తున్నారు. అటు బీజేపీని, ఇటు అమస్మతిని, తిరుగుబాటును ఎదుర్కోలేక గహ్లోత్ సతమతమవుతున్నారు! -
Chhattisgarh elections 2023: సంక్షేమం X మౌలికం
ఛత్తీస్గఢ్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను పాలక కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు, బీజేపీ మౌలిక సదుపాయాల వాగ్దానాలకు మధ్య పోరుగా భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా స్వీప్ చేసిన కాంగ్రెస్, మళ్లీ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో ఇటీవలే బీజేపీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోవడం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్గడ్తో పాటు రాజస్తాన్లో కూడా ఆ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కాస్త కష్టమేనన్న అంచనాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ను ఎలాగైనా నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకే ఇప్పటికే అమల్లో ఉన్నవాటికి తోడుగా మరెన్నో సంక్షేమ పథకాలను సీఎం భూపేశ్ భగేల్ ప్రకటిస్తున్నారు. మరోవైపు చిరకాలం పాటు తమ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్కు కోల్పోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలంగా తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పుంఖానుపుంఖాలుగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. వాటితో రాష్ట్ర భాగ్యరేఖలే మారతాయని, యువతకు భారీగా ఉపాధి దొరుకుతుందని చెబుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పారీ్టల ప్రచారంలో ఓటరు దేనికి జై కొడతాడో చూడాలి... బీజేపీ బలాలు... ► ఇతర అంశాలు ఎన్నున్నా అన్నింటి కంటే ప్రధానమైనది ఎప్పట్లాగే హిందుత్వ కార్డే. కాకుంటే ఈ విషయంలో గ్రామీణ ఓట్లను ఈ మేరకు సంఘటితం చేస్తుందన్నది ఈసారి కీలకం కానుంది. ► 15 ఏళ్ల వరుస పాలనలో చేసిన అభివృద్ధిని కూడా కమలదళం బాగానే ప్రచారం చేస్తోంది. ► కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో అవినీతిలో కూరుకుపోయిందని గట్టిగా ప్రచారం చేస్తోంది. ► అయితే గతంలో రమణ్సింగ్లా ఈసారి బీజేపీ సీఎం అభ్యరి్థగా ఎవరినీ ప్రచారం చేయడం లేదు. ఇది కాస్త ప్రభావం చూపే అంశమేనని అంటున్నారు. అభివృద్ధే కాంగ్రెస్ మంత్రం ► బీజేపీ హిందూత్వ వాదానికి కౌంటర్గా రాష్ట్ర కాంగ్రెస్ కొంతకాలంగా ఉదారవాద హిందూత్వ గళం వినిపిస్తోంది. ఇది కొంతవరకు కలిసొస్తుందని భావిస్తోంది. ► సీఎం భగేల్ ఓబీసీ నేత కావడం ఆ సామాజికవర్గంలో తమ ఓట్లను మరింత సంఘటితపరుస్తుందని ఆశిస్తోంది. ► పేదలకు, రైతులకు అనుకూలంగా అమలు చేస్తున్న పలు పథకాలు ఈసారి కచి్చతంగా గట్టెక్కిస్తాయని భగేల్ నమ్ముతున్నారు. ► వీటికి తోడు ఛత్తీస్గఢ్ ఆత్మగౌరవాన్ని ఇటీవలి కాలంలో పదేపదే తెరపైకి తెస్తున్నారు. తద్వారా ఓటర్లను ఆకట్టుకోజూస్తున్నారు. ► అయితే అవినీతి ప్రచారం, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కాంగ్రెస్కు ప్రతికూలంగా మారేలా కనిపిస్తున్నాయి. బరిలోకి గిరిజన పార్టీ ఛత్తీస్గఢ్లో ఆదివాసీ సంఘాల సమాహారమైన సర్వ ఆదివాసీ సమాజ్ ఇటీవలే హమార్ రాజ్ పేరుతో రాజకీయ పారీ్టగా మారింది. ఒకనాటి కాంగ్రెస్ నేత అరవింద్ నేతం సారథ్యంలో ఎన్నికల బరిలో దిగుతోంది. ఫక్తు గిరిజన ఆచార వ్యవహారాలకు కట్టుబడి పని చేస్తామనే హామీతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో సంఖ్యాధికులైన గిరిజనుల్లో ఇది గట్టిగా ప్రభావం చూపితే అది బీజేపీ, కాంగ్రెస్ల్లో దేన్ని దెబ్బ తీస్తుందన్నది ఆసక్తికరం. కీలకాంశాలు ► వరికి సరైన మద్దతు ధర కావాలని రైతులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. క్వింటాలుకు రూ.2,500 మద్దతు ధర చెల్లిస్తామన్న 2018 నాటి హామీని భగేల్ సర్కారు నెరవేర్చలేదని ఆగ్రహంగా ఉన్నారు. ► కాంగ్రెస్ తరఫున సీఎం భగేల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. అయితే పారీ్టలో అసమ్మతులు ఆయనకు తలనొప్పిగా మారారు. ► డిప్యూటీ సీఎం కేపీ సింగ్దేవ్ రూపంలో భగేల్కు సొంత పారీ్టలోనే గట్టి ప్రత్యర్థి పొంచి ఉన్నారు. ► ఇక బీజేపీకి ఇప్పటికీ మాజీ సీఎం రమణ్ సింగే రాష్ట్రంలో ఏకైక పెద్ద దిక్కు. 15 ఏళ్లు పాలించిన నేతగా ఈసారి తన అనుభవాన్నంతా రంగరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గత ఎన్నికల్లో పార్టీ ఓటమి.. అక్కడి నుంచే పోటీలోకి బిహార్ సీఎం
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పూరీ నుంచి పోటీ చేస్తారని పలు వర్గాల నుంచి ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈసారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలపై పలు వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో పూరీ శాసనసభ స్థానం బీజేడీ చేజార్చుకుంది. ఈ వ్యవధిలో ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఉనికిని బలపరచుకుంది. ఈ పరిస్థితుల్లో బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పూరీ నియోజకవర్గం నుంచి సత్తా చాటుకోవాలనే సవాళ్లు తలెత్తాయి. ఈ చర్చ రాజకీయ శిబిరాల్లో వాడివేడిగా సాగుతోంది. పూరీ నుంచి నవీన్ రంగంలోకి దిగితే బీజేపీ, బీజేడీ మధ్య హోరాహోరీ పోటీ శాసనసభ ఎన్నికల ఘట్టాన్ని రక్తి కట్టిస్తుంది. ఆయనదే తుది నిర్ణయం ఏ స్థానం నుంచి పోటీ చేయాలనేది బీజేడీ అధ్యక్షుడిగా నవీన్ పట్నాయక్దే తుది నిర్ణయం. అయితే చిట్ట చివరి క్షణం వరకు కీలక నిర్ణయాలను బయటకు పొక్కనీయకుండా ఆయన అత్యంత జాగ్రత్త ప్రదర్శిస్తారు. ఈసారి ముందస్తుగా ఆయన వార్తల్లోకి ఎక్కడం విశేషం. సాధారణంగా బహిరంగ చర్చలు, వ్యాఖ్యలు వగైరా వ్యవహారాల్లో నవీన్ ప్రస్తావన శూన్యం. ఆయనకు అత్యంత సన్నిహితంగా మెసలుతున్న 5టీ కార్యదర్శి వి.కె.పాండియన్ విహంగ పర్యటనల దుమారంతో ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యక్షంగా హాజరై సభలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటూ హుందాతనానికి మారుపేరుగా సుపరిచిత నవీన్ పట్నాయక్ ఇలా సభలో వివరణ ఇవ్వడం ప్రముఖుల దృష్టిని ఆకట్టుకుంది. వ్యూహాత్మక శైలి ముందస్తు ఎన్నికలపై చెలరేగిన దుమారం మీద పెదవి కదపని ముఖ్యమంత్రి పలు ప్రజాకర్షిత పథకాలను శరవేగంగా ప్రవేశపెట్టి విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే దిశలో పలు పథకాలను చకచకా ప్రవేశ పెడుతున్నారు. మిషన్ శక్తి ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలు–2024 మిషన్ విజయ బాటలో దూసుకుపోవడం తథ్యమనే సంకేతాలు బలపడుతున్నాయి. పూరీ ప్రాంతంలో ఇటీవల బీజేడీ వ్యతిరేక పవనాలు బలం పుంజుకుంటున్నాయి. ఈ పరిస్థితి విపత్తుగా పరిణమించక ముందే జాగ్రత్త వహించే దిశలో నవీన్ పట్నాయక్ అభ్యర్థిత్వాన్ని తెరపైకి తేవడం రాజకీయ వ్యూహంగా స్పష్టం అవుతుంది. పూరీ శ్రీజగన్నాథ మందిరం ప్రాకార ప్రాజెక్టు మొదలుకొని పలు పథకాలు, ప్రాజెక్టుల కార్యాచరణ తీవ్ర కలకలం రేపాయి. ఈ వివాదాలు నేటికీ చాప కింద నీరులా మరుగున పొంచి ఉన్నాయి. పూరీ నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రికి పలు వర్గాలు అభ్యర్థిస్తున్నాయి. ప్రజారణతో శ్రీజగన్నాథుని ఆశీస్సులు తమ నాయకునికి అండగా నిలిపి ప్రతిష్టాత్మకంగా గెలిపిస్తాయని బీజేడీ శిబిరాల్లో చర్చ నడుస్తోంది. పూరీ నుంచి పోటీ ఊహాగానాలు వాస్తవ రూపం దాల్చితే సొంత పార్టీ శ్రేణులకు అతీతంగా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బలమైన మద్దతుతో భారీ ఆధిక్యతతో గెలిపిస్తారని శ్రీజగన్నాథుని సీనియర్ సేవాయత్ రామకృష్ణ దాస్ మహాపాత్రో ఇటీవల ఒక సందర్భంలో పేర్కొన్నారు. ఈ ప్రకటన నవీన్ పట్నాయక్ పూరీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తథ్యం అనే సంకేతాలు పంపిస్తోంది. విజయం తథ్యం ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయం తథ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు శశి భూషణ్ బెహరా శుక్రవారం అన్నారు. నవీన్ నాయకత్వంపై రాష్ట్ర ప్రజల్లో మక్కువ బలపడింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలు ఆయనను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేసినా ప్రజలు విజయ కిరీటంతో పట్టం గడతారని పేర్కొన్నారు. రాష్ట్ర బహుముఖ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు విశేష గుర్తింపు సాధించాయన్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పాలన విశేష ప్రజాదరణ చూరగొంది. నవీన్ సుదీర్ఘ సుస్థిర పాలన ప్రజల్లో చెక్కు చెదరని నమ్మకానికి పీఠం వేసింది. ఏటా ఆయన ప్రజాదరణ బలపడుతునే ఉందని బీజేడీ వర్గాలు ధీమా వ్యక్తం చేయడం విశేషం. -
85 సీట్లతో అధికారం మాదే
సాక్షి, హైదరాబాద్: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 85 సీట్ల దాకా గెలుపొంది బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ మెజారిటీ సీట్లు గెలుచుకుని బీజేపీ సంచలనం సృష్టించబోతోందన్నారు. రాబోయే 50, 55 రోజుల్లో ఇది వాస్తవరూపం దాల్చడాన్ని అందరూ చూస్తారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, త్యాగాలను కేసీఆర్ సర్కార్ విస్మరించి విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని మండిపడ్డారు. సకల జనులు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అవినీతి మయం చేయడంతో పాటు, పూర్తిగా కుటుంబ స్వామ్యంగా మార్చివేయడాన్ని ఇక్కడి ప్రజలు అస్సలు ఊహించలేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ సరిగా లేదని, తెలంగాణ ఏర్పడ్డాక మండలి చైర్మన్తో సహా ఎమ్మెల్సీలందరూ టీఆర్ఎస్లో విలీనం కావడం, 2014లో ఆరుగురు ఎమ్మెల్యేలు, 2018లో 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం ద్వారా ఆ రెండు పార్టీలూ ఒక్కటే అన్న విషయం స్పష్టమైందని చెప్పారు. దీనికి పూర్తి భిన్నంగా బీజేపీ ఎమ్మెల్యేలెవరూ బీఆర్ఎస్లోకి వెళ్లలేదని, ఇతర పార్టీల్లోంచే బీజేపీలోకి వస్తున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్వహించకపోవడం గర్హనీయమన్నారు. ఈ విషయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే తమకు న్యాయం జరుగుతుందని వారు నమ్ముతున్నారని చెప్పారు. జవదేకర్ గురువారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. వైఎస్ విజయం సాధిస్తారని ముందే చెప్పా 2004 ఎన్నికలకు ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన పాదయాత్రను, దానికి వచ్చిన స్పందనను నేను స్వయంగా గమనించా. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పా. నేను చెప్పినట్టే ఆయన అధికారంలోకి వచ్చారు. అదే విధంగా ఇప్పుడు కూడా వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వస్తుందనే నా జోస్యం నిజం అవుతుంది. అది పూర్తిగా అబద్ధం బీఎల్ సంతోష్ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని అ న్నారన్నది పూర్తిగా అబద్ధం. ఈ వార్త మీడియాలో వచ్చాక కూడా దానిని ఖండిం చకపోవడంపై నేను పార్టీ అధికార ప్రతినిధులను మందలించా. తెలంగాణలో బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమని ఆ అంతర్గత సమావేశంలో సంతోష్ చెప్పారు. అయితే హంగ్ అని అన్నట్టుగా వార్త వచ్చినందుకు నేను జర్నలిస్టులను కూడా తప్పుబట్టను. ఎందుకంటే ఇందుకు సంబంధించి ఎలాంటి వీడియో, ఆడియో రికార్డ్ లేదు. ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్లో ప్రస్తుతం అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో సాగుతోంది. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల అది అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కర్ణాటకలో గెలుపు ఇక్కడ ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశముంది. అయితే కాంగ్రెస్ తమను మోసం చేసిందనే భావనలో ఉన్న తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ వేరు, రాహుల్గాంధీ కాంగ్రెస్ వేరు. కాంగ్రెస్ నేత రాహుల్ జేఎన్యూ గాంధీ. ఆయన లెఫ్టిస్ట్ల భాష మాట్లాడుతున్నారు. అందువల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయింది. మోదీ మ్యాజిక్ పనిచేస్తుంది తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ పాపులారిటీ అత్యు న్నత స్థాయికి చేరుకుంది. ఒక్క అవినీతి మర కలేదు. పదేళ్ల యూపీఏ పాలనలో లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగు చూడగా, తొమ్మిదేళ్ల ఎన్డీఏ ఆధ్వర్యంలోని మోదీ పాలనలో ప్రధాని మోదీ లేదా మంత్రులపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం ముఖ్య మైన సానుకూల అంశం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాజకీయాలు, కులం, మతం, వర్గాలకు అతీతంగా ప్రజలకు చేరవేయడంతో ..మోదీని వారు పూర్తి స్థాయిలో విశ్వసించే పరిస్థితి ఏర్పడింది. ఆ మ్యాజిక్ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్పష్టంగా పనిచేయబోతోంది. బీజేపీని గెలిపించబోతోంది. బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల్లో బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ప్రభుత్వంపై విశ్వసనీయత అనేది అత్యంత అధమ స్థాయిలో ఉంది. ఓటమిపై భయంతోనే కొన్ని మినహా అన్ని సీట్లకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. అయితే నామినేషన్ల చివరినాటికి ఆ అభ్యర్థుల్లో కనీసం 20 మందిని మార్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరే కతను మాకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికే ప్రజల వద్దకు వెళుతున్నాం. మా వద్ద ఉన్న ఏకైక మార్గం ప్రజలను కలుసుకోవడం, బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు తెలియజేసి వారి మద్దతు సాధించడం. మేం ప్రజల వద్దకు వెళ్లినప్పుడు కేసీఆర్ సర్కార్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలుస్తోంది. మరోవైపు ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాకే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం.