త్వరలో ఎన్నికలు.. జమ్ము-కశ్మీర్‌ చట్టంలో సవరణలు | Home Ministry Amends J and K Reorganisation Act Boosts Powers Of LG | Sakshi
Sakshi News home page

త్వరలో ఎన్నికలు.. జమ్ము పునర్వవ్యస్థీకరణ చట్టంలో సవరణలు.. ఎల్జీకి అధికారాల పెంపు!

Published Sat, Jul 13 2024 2:53 PM | Last Updated on Sat, Jul 13 2024 3:06 PM

Home Ministry Amends J and K Reorganisation Act Boosts Powers Of LG

ఢిల్లీ: జమ్ము-కశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము-కశ్మీర్‌ లెఫ్ట్‌నెట్‌ గవర్నర్‌(ఎల్జీ) అధికారాలను పెంచే చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే జమ్ము-కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019లోని పలు నిబంధనలను తాజాగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ సవరించింది.

అయితే ఈ సవరణల వల్ల  జమ్ము  కశ్మీర్‌  ఎల్జీ అధికారాలు మరింత పెరుగనున్నాయి.  జమ్ము- కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో అధికారాలను అమలు చేసే సెక్షన్‌ 55 నిబంధనలో తీసుకువచ్చిన పలు సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. జమ్ము కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వానికి సంబంధిచిన వ్యాపార లావాదేవీలను సవరించడానికి రాష్ట్రపతి మరిన్ని నిబంధనలను రూపొందించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

తాజాగా సవరించిన చట్టం.. జమ్ము- కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రెండో సవరణ. ఈ సవరించిన నిబంధనల ద్వారా శాంతి భద్రతల చర్యలకు సంబంధించి పూర్తి అధికారాలు ఇక  నుంచి  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతుల్లోనే ఉండనున్నాయి.  అయితే  ఈ చట్టం అమలులోకి వచ్చిన మొదట్లో పోలీసు, పబ్లిక్‌ ఆర్డర్‌, ఆల్‌ ఇండియా సర్వీస్‌, అవినీతి నిరోధక బ్యూరోకు సంబంధించి అధికారాలను అమలు చేయడానికి ఆర్థిక శాఖ  ఆమోదం తీసుకోవాల్సి అవసరం ఉండేది. కానీ కొత్త సవరణ చట్ట నియమాల్లో పొందుపర్చిన సబ్‌ రూల్‌ (2ఎ) ప్రకారం.. ఇక  నుంచి ఆర్థికశాఖ అనుమంతి  తీసుకోవాల్సిన అవసరం లేదు.  

పోలీసు, యాంటీ కరప్షన్‌ బ్యూరో, ఆల్‌ ఇండియా సర్వీసులకు సంబంధించిన ప్రతిపానదలను  చీఫ్‌ సెక్రటరీ.. ఎల్జీ ముందు తీసుకెవెళ్లితే..  ఎల్జీ ప్రతిపాదనలను అంగీకరించే లేదా తిరస్కరించే అధికారం లభించింది.చట్టంలోని ప్రధాన నిబంధనల్లో కొత్తగా 42(ఎ)ను హోం మంత్రిత్వశాఖ చేర్చింది.

ఈ నిబంధన ప్రకారం.. సీఎంకు న్యాయ వ్యవహారాల్లో ఎలాంటి అధికారం ఉండదు. అడ్వకేట్‌ జనరల్‌తోపాటు ఇతర న్యాయ అధికారుల నియమకానికి  చీఫ్‌ సెక్రటరీతో పాటు సీఎం..  ఎల్జీ ఆమోదానికి  పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా 42 బీ  నిబంధనం ప్రకారం.. ప్రాసిక్యూషన్‌ మంజూరు లేదా అప్పీల్‌కు దాఖలకు సంబంధించిన ఏదైనా ప్రతిపాదనను న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ద్వారా  చీఫ్‌ సెక్రటరీ  ఎల్జీకి పంపిస్తారని హోం  గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement