ముంబై: భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ సేవలందించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వీడ్కోలు చెప్పడానికి ముందే అతని ఉద్వాసనకు రంగం సిద్ధమైందట. 2012లో భారత వన్డే జట్టు నుంచి సచిన్ను తొలగించడానికి సిద్ధమైనట్లు మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ వెల్లడించాడు. ఓ మరాఠీ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో సచిన్ తొలగింపుపై సందీప్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '
2012, డిసెంబర్ 12 వ తేదీన సచిన్ భవిష్యత్తు కార్యచరణపై అడిగాం. అయితే రిటైర్మెంట్ ఆలోచన లేదని సచిన్ చెప్పాడు.ఆ సమయంలో సచిన్ నిర్ణయాన్ని గౌరవించిన సెలక్షన్ కమిటీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు ఆ తరువాత జరిగిన మరో సమావేశంలో సచిన్ తన రిటైర్మెంట్పై నిర్ణయాన్నిమాకు తెలిపాడు. అప్పుడు సచిన్ కనుక రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోనట్లయితే, అతన్ని కచ్చితంగా వన్డే జట్టు నుంచి తొలగించే వాళ్లం'అని పాటిల్ పేర్కొన్నాడు.
తన నాలుగేళ్ల పదవీ కాలంలో అతి పెద్ద సవాల్ ఎదైనా ఉందంటే అది సచిన్ రిటైర్మెంట్ నిర్ణయమేనని సందీప్ పాటిల్ తెలిపాడు. 2013 నవంబర్ నెలలో వెస్టిండీస్తో ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా సచిన్ తన అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే 2012 మార్చిలో ఢాకాలో పాకిస్తాన్తో సచిన్ చివరి వన్డే ఆడేశాడు.
సచిన్ ను తీసేయడానికి సిద్ధమయ్యాం!
Published Thu, Sep 22 2016 12:41 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- టెట్ వాయిదా
- సిమెంట్ కర్మాగారం ముట్టడి
- వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిపై టీడీపీ నేతల హత్యాయత్నం
- నిద్రమత్తు ముగ్గురిని బలిగొంది..
- IND W vs SA W : సమం కోసం చివరి పోరు
- పెద్దిరెడ్డికి భద్రత కల్పించండి
- గబ్బాడ యార్డులో రూ.5 కోట్ల ఇసుక మయం
- స్కిల్ వర్సిటీ ఏర్పాటుపై ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వండి
- సంక్షేమాభివృద్ధి సారథి వైఎస్సార్
- కాంగ్రెస్ నేతలకు వైఎస్ జయంతి కానుక
Advertisement