ముంబైతో జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 167 పరుగులు చేసింది.
రాయ్పూర్: ముంబైతో జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 167 పరుగులు చేసింది. తన్మయ్ (63 బ్యాటింగ్) క్రీజ్లో ఉండగా... కెప్టెన్ బద్రీనాథ్ (56) అర్ధ సెంచరీ చేశాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 294 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లు సీవీ మిలింద్ (5/80), సిరాజ్ (4/64) ఆకట్టుకున్నారు.
ఇతర క్వార్టర్ ఫైనల్స్ స్కోర్లు
హరియాణా తొలి ఇన్నింగ్స్: 258 ఆలౌట్; జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్: 228/3. lగుజరాత్ తొలి ఇన్నింగ్స్: 263 ఆలౌట్; ఒడిషా: 184/8.