ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్కు హైదరాబాద్ 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
హైదరాబాద్: సొంతగడ్డపై హైదరాబాద్ సన్రైజర్స్ బ్యాట్స్మెన్ ఫర్వాలేదనిపించారు. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్కు హైదరాబాద్ 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 142 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ 19, నమన్ ఓజా 22, డేవిడ్ వార్నర్ 34, ఇర్ఫాన్ పఠాన్ 23 (నాటౌట్) పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లు ఉమేష్, షకీబల్ రెండేసి వికెట్లు తీశాడు.