రన్నరప్ హైదరాబాద్ నవాబ్స్ | hyderabad settles as runner up in imbl league | Sakshi
Sakshi News home page

రన్నరప్ హైదరాబాద్ నవాబ్స్

Published Sat, Sep 24 2016 12:05 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

hyderabad settles as runner up in imbl league

సాక్షి, హైదరాబాద్: ఇండియన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐఎంబీఎల్)లో హైదరాబాద్ నవాబ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. తమిళనాడులోని తిర్పూర్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఢిల్లీ డెవిల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి.

 

దాదాపు 60 మంది జాతీయ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ టోర్నీలో తలపడగా... మనోజ్‌కుమార్, నీలిమ చౌదరీ, కమలాకర్, రాజు సునీల్, కిషోర్ కుమార్, ఉదయ్ భాస్కర్, మూర్తిలతో కూడిన హైదరాబాద్ నవాబ్స్ జట్టు రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement