యువ ఆటగాళ్లపై ప్రభావం పడుతుంది: ద్రవిడ్ | In Dravid, young Indian cricketers will discover the perfect storyteller | Sakshi
Sakshi News home page

యువ ఆటగాళ్లపై ప్రభావం పడుతుంది: ద్రవిడ్

Jul 18 2015 12:32 AM | Updated on Sep 3 2017 5:41 AM

స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో ఐపీఎల్ నుంచి చెన్నై, రాజస్తాన్ జట్లను రెండేళ్ల పాటు నిషేధించిన జస్టిస్ లోధా కమిటీ తీర్పును గౌరవిస్తున్నానని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు.

చెన్నై: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో ఐపీఎల్ నుంచి చెన్నై, రాజస్తాన్ జట్లను రెండేళ్ల పాటు నిషేధించిన జస్టిస్ లోధా కమిటీ తీర్పును గౌరవిస్తున్నానని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. అయితే ఆయా జట్లలోని యువ ఆటగాళ్లపై ఇది ప్రభావం చూపుతుందని అన్నాడు. ‘ఎవరో ఒకరిద్దరు చేసిన అవినీతి చాలా మందిపై ప్రభావం చూపడం నిజంగా శోచనీయం. రెండు జట్లు నిషేధానికి గురవ్వడంతో యువ ఆటగాళ్లు ఇబ్బంది ఎదుర్కొంటారు. మా జట్టులోని టాప్ ఆటగాళ్లకు ఇతర జట్లలో చోటు లభించడం పెద్ద సమస్య కాదు. కానీ యువ ఆటగాళ్ల పరిస్థితి ఏమిటి?’ అని రాజస్తాన్ రాయల్స్ మెంటార్ ద్రవిడ్ ప్రశ్నించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement