rahul dravid
-
IPL 2025: రాయల్స్ మునుపటి వైభవం సాధిస్తుందా?
మొట్ట మొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ గెలుచుకున్న జట్టు రాజస్థాన్ రాయల్స్. ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రేలియా స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ (Shane Warne) నాయకత్వంలో 2008లో టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ 2022లో రన్నర్ అప్ గా నిలవడంతో పాటు.. మొత్తంగా ఆరుసార్లు ప్లేఆఫ్లకు చేరుకుంది. రాయల్స్ కెప్టెన్గా టీమిండియా వికెట్ కీపర్ సంజూ సామ్సన్ (Sanju Samson) కొనసాగుతున్నాడు. 2025 మెగా వేలానికి ముందు రాయల్స్ అతడిని రూ.18 కోట్ల భారీ ధరకు రెటైన్ చేసుకుంది.భారత్ క్రికెట్ లో అపార నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల లో ఒకడిగా 30 ఏళ్ళ ఈ కేరళ వికెట్ కీపర్ ఖ్యాతి వహించాడు. సామ్సన్ నాయకత్వం, సామర్థ్యాలపై ఉన్న అపార విశ్వాసాన్ని రాయల్స్ పునరుద్ఘాటించింది. సీజన్లోని మొదటి మ్యాచ్ నుంచే అతను పూర్తిగా ఫిట్గా, అందుబాటులో ఉండాలని ఫ్రాంచైజీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐపీల్ రెండో రోజున (మార్చి 23న) హైదరాబాద్ వేదిక గా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ తో రాయల్స్ ఈ సీజన్ లో తన టైటిల్ వేట ప్రారంభిస్తుంది.గాయం నుంచి కోలుకున్న సామ్సన్ ఇంగ్లండ్తో జరిగిన ఐదో టి20 మ్యాచ్ సందర్భంగా సామ్సన్ కుడి చూపుడు వేలు కి గాయమైంది. కొన్ని రోజుల తర్వాత అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది, రెండు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్న సామ్సన్ మళ్ళీ కోలుకున్నట్టు తెలుస్తోంది. అయితే అతను ఇంకా జట్టు శిక్షణ శిబిరంలో చేరలేదు. సంజు సామ్సన్ పునరాగమనం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే సామ్సన్ బ్యాటింగ్ ఫిట్నెస్ పరీక్షలో విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, వికెట్ కీపింగ్ విధులను తిరిగి ప్రారంభించడానికి ఇంకా అనుమతి రాలేదని తెలుస్తోంది. అయితే రాయల్స్ జట్టులో ధ్రువ్ జురెల్ ఉన్నందున వికెట్ కీపింగ్ బాధ్యతలు అతనికి అప్పగించే అవకాశముంది. బౌలింగ్ లో ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పునరాగమనం తో రాయల్స్ కొత్త ఉత్సాహం తో ఉంది. గత సంవత్సరం చివరి దశలో తడబడిన తర్వాత, మెగా వేలంలో రాయల్స్ తమ జట్టును స్మార్ట్ కొనుగోళ్ల ద్వారా పునర్నిర్మించింది.ప్రధాన కోచ్ గా చేరిన రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంతో రాయల్స్ విధానంలో మార్పు కనిపిస్తోంది. మానసిక దృఢత్వం, వ్యూహాత్మక ఖచ్చితత్వాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టింది. సామ్సన్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మైర్, రియాన్ పరాగ్, మరియు ధ్రువ్ జురెల్ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నందున బ్యాటింగ్, బౌలింగ్ రెండింటినీ బలోపేతం చేయడానికి రాయల్స్ జోఫ్రా ఆర్చర్, నితీష్ రాణాతో సహా వేలంలో కీలకమైన చేర్పులను చేసింది.రాయల్స్ జట్టులో వ్యూహాత్మక మార్పులు రాయల్స్ 2025 సీజన్ కోసం జట్టులో వ్యూహాత్మక మార్పులు చేసింది. అనుభవజ్ఞులైన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్లను వదులుకోవడం వారి జట్టు యొక్క ప్రధాన వ్యూహంలో మార్పును సూచిస్తుంది. జోఫ్రా ఆర్చర్ను కొనుగోలు చేయడంతో బౌలింగ్ కి గణనీయమైన పదును లభించింది. ఇంకా ఫజల్హాక్ ఫరూఖీ , తుషార్ దేశ్పాండే లతో పాటు స్పిన్ విభాగంలో వానిందు హసరంగా, మహేష్ తీక్షణ ఉన్నందున మిడిల్ ఓవర్ల లలో వైవిధ్యం, పొదుపుగా బౌలింగ్ చేసే అవకాశముంది. నితీష్ రాణా చేరికతో బ్యాటింగ్ యూనిట్ బలోపేతమయ్యింది. కోల్కతా నైట్ రైడర్స్ తరపున నిలకడగా రాణించిన రాణా బ్యాటింగ్ ని బలోపేతం చేస్తాడనడంలో సందేహం లేదు. ఇంకా 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కొనుగోలు ఫ్రాంఛైజీ దీర్ఘకాలిక దృక్పథాన్ని నొక్కి చెబుతుంది.రాయల్స్ ప్రధాన ఆటగాళ్లు:సంజు సామ్సన్కెప్టెన్గా, అత్యంత నమ్మకమైన బ్యాటర్గా, సామ్సన్ ముందు నుండి నాయకత్వం వహించే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఈ సీజన్లో జోస్ బట్లర్ లేనందున సామ్సన్ పై బాధ్యత మరింత పెరిగే అవకాశముంది. జట్టుకి స్థిరత్వాన్నివ్వడం, క్లిష్టమైన సమయాల్లో ఆదుకోవడం ఇప్పుడు సామ్సన్ పైనే ఉంటుంది.యశస్వి జైస్వాల్అపార నైపుణ్యం ఉన్న యువ బ్యాటర్ జైస్వాల్ ఇటీవలి ఫామ్ అంత నిలకడగా లేనందున, భారత పరిమిత ఓవర్ల జట్టులోకి మళ్ళీ రావడానికి ఐపీఎల్ అతనికి మరో అవకాశం కల్పిస్తోంది.నితీష్ రాణాకోల్కతా నైట్ రైడర్స్ నుండి రాయల్స్ కి మారడం రాణా ఐపీఎల్ కెరీర్లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ అతని బహుముఖ ప్రజ్ఞ రాజస్థాన్కు గట్టి బలాన్నిస్తోంది.జోఫ్రా ఆర్చర్గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్ తిరిగి రావడంతో రాజస్థాన్ బౌలింగ్ కు మళ్ళీ పదును చేకూరింది. వ్యక్తిగతంగా సంవత్సరాల గాయాల వైఫల్యాల తర్వాత, ఐపీఎల్ 2025 ఇంగ్లాండ్ పేసర్కు తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు అవకాశాన్ని కల్పిస్తుండంలో సందేహం లేదు.రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టుసంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, వనిందు హసరంగా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, నితీష్ రాణా, తుషార్ దేశ్పాండే, శుభమ్ దూబే, ఎఫ్ యుధ్వీర్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, క్వేనా మఫాకా, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.చదవండి: టీ20, వన్డేలు చాలు.. టెస్టుల్లో ఆడలేను.. కారణం ఇదే: వరుణ్ చక్రవర్తి -
దటీజ్.. ద్రవిడ్
జైపూర్: నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమైన భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్... మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రవిడ్... చేతి కర్రల సాయంతో జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఇటీవల ఓ స్థానిక లీగ్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ద్రవిడ్ గాయపడ్డాడు. దీంతో కాలికి పట్టి, చేతి కర్రల సాయంతోనే మైదానానికి వచ్చిన ద్రవిడ్... ఆటగాళ్ల శిక్షణను పర్యవేక్షించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ తమ అధికారిక ఖాతాలో పోస్ట్ చేయగా... అది కాస్తా వైరల్గా మారింది. గోల్ఫ్ కార్ట్లో మైదానంలోకి వచ్చిన ద్రవిడ్... ప్లేయర్ల ఆటతీరును పరిశీలించాడు. ఒక్కో ఆటగాడి దగ్గరికి వెళ్లేందుకు చేతి కర్రల సాయం తీసుకున్న ద్రవిడ్... చాలాసేపు వారి ఆటతీరును పరిశీలించాడు. కాలికి మెడికల్ వాకింగ్ బూట్ ధరించిన ద్రవిడ్... యువ ఆటగాళ్లు రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్తో సుదీర్ఘంగా చర్చిస్తూ కనిపించాడు. 2022 నుంచి 2024 వరకు భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్... గతేడాది టీమిండియా టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో తిరిగి రాజస్తాన్ జట్టుకు హెడ్ కోచ్గా ఎంపికయ్యాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్గా కొనసాగుతుండగా... సంజూ సామ్సన్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 💗➡️🏡 pic.twitter.com/kdmckJn4bz— Rajasthan Royals (@rajasthanroyals) March 13, 2025 -
హెడ్ కోచ్కు గాయం.. రాజస్తాన్ రాయల్స్ పోస్ట్ వైరల్
తమ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) గాయంపై రాజస్తాన్ రాయల్స్ అప్డేట్ అందించింది. ‘ది వాల్’ కోలుకుంటున్నాడని.. త్వరలోనే పూర్తిస్థాయిలో టీమ్తో చేరతాడని తెలిపింది. కాగా ఇటీవల ద్రవిడ్ క్లబ్ క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే.తన చిన్న కుమారుడు అన్వయ్తో కలిసి నసుర్ మెమొరియల్ షీల్డ్ టోర్నీలో ద్రవిడ్ పాల్గొన్నాడు. యంగ్ లయన్స్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో ఆడిన ద్రవిడ్ 10 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగానే రాహుల్ ద్రవిడ్ గాయపడినట్లు సమాచారం. దీంతో రాజస్తాన్ రాయల్స్ ముందస్తు శిక్షణా శిబిరంలో పాల్గొనలేకపోయాడు.కాలికి కట్టు అలాగే ఉండటంతోఅయితే, తాజాగా అతడు జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ బుధవారం వెల్లడించింది. ‘‘బెంగళూరులో క్రికెట్ ఆడుతున్న సమయంలో గాయపడిన మా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోలుకుంటున్నారు. ఈరోజే జైపూర్లో ఆయన మాతో చేరతారు’’ అని ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రాయల్స్ జెర్సీలో థమ్సస్ సింబల్ చూపిస్తున్న ద్రవిడ్ ఫొటోను పంచుకుంది. అయితే, అతడి ఎడమకాలికి ఇంకా కట్టు ఉండటం గమనార్హం.ఇక ఈ ఫొటో వైరల్గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు చదివాం గానీ.. ఇలా హెడ్ కోచ్కు ఇంజూరీ కావడం ఇదే తొలిసారి కావొచ్చు అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘వాల్’ కాస్త పెద్దవాడైపోయాడని.. క్రికెట్ ఆడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ హితవుపలుకుతున్నారు.కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్గా నిలిచిన తర్వాత భారత జట్టు హెడ్కోచ్గా ద్రవిడ్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్తో జట్టుకట్టాడు. ఈ ఏడాది నుంచి రాజస్తాన్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు. గతంలోనూ ద్రవిడ్ ఈ ఫ్రాంఛైజీతో పనిచేశాడు.ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ జట్టుసంజూ శాంసన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, శుభం దూబే, వైభవ్ సూర్యవంశీ, కునాల్ రాథోడ్, షిమ్రన్ హెట్మెయిర్, నితీశ్ రాణా, యుధ్వీర్ సింగ్, జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, వనిందు హసరంగ, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ సింగ్, తుషార్ దేశ్పాండే, ఫజల్హక్ ఫారూకీ, క్వెనా మఫాకా, అశోక్ శర్మ, సందీప్ శర్మ.రాజస్తాన్ రాయల్స్ కోచింగ్ సిబ్బందిహెడ్కోచ్- రాహుల్ ద్రవిడ్డైరెక్టర్ ఆఫ్ క్రికెట్- కుమార్ సంగక్కరఫాస్ట్ బౌలింగ్ కోచ్- షేన్ బాండ్బ్యాటింగ్ కోచ్- విక్రమ్ రాథోడ్ఫీల్డింగ్ కోచ్- దిశాంత్ యాగ్నిక్.చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా..Head Coach Rahul Dravid, who picked up an injury while playing Cricket in Bangalore, is recovering well and will join us today in Jaipur 💗 pic.twitter.com/TW37tV5Isj— Rajasthan Royals (@rajasthanroyals) March 12, 2025 -
కొడుకుతో కలిసి బరిలోకి దిగిన రాహుల్ ద్రవిడ్.. తండ్రి విఫలం.. కొడుకు హాఫ్ సెంచరీ
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 12 ఏళ్ల తర్వాత క్లబ్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. చిన్న కొడుకు అన్వయ్తో కలిసి నసుర్ మెమొరియల్ షీల్డ్ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో ద్రవిడ్ విజయా క్రికెట్ క్లబ్కు (మాలుర్) ప్రాతినిథ్యం వహించాడు. యంగ్ లయన్స్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ద్రవిడ్ 8 బంతుల్లో బౌండరీ సాయంతో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్ విఫలమైనా కొడుకు అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వికెట్కీపర్ బ్యాటర్ అయిన అన్వయ్.. 58 బంతుల్లో 8 బౌండరీల సాయంతో 60 పరుగులు చేశాడు. రాహుల్-అన్వయ్ కొద్ది సేపు కలిసి బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు 17 బంతుల్లో 15 పరుగులు జోడించారు. క్రికెట్ చరిత్రలో తండ్రి కొడుకులు కలిసి ఆడటం చాలా అరుదుగా జరిగింది.కలిసి క్రికెట్ ఆడిన కొంతమంది తండ్రి కొడుకులు..డబ్ల్యూజీ గ్రేస్-గ్రేస్ జూనియర్లాలా అమర్నాథ్-సురిందర్ అమర్నాథ్డెన్నిస్ లిల్లీ-ఆడమ్ లిల్లీడెనిస్ స్ట్రీక్- హీథ్ స్ట్రీక్శివ్నరైన్ చంద్రపాల్-తేజ్ నరైన్ చంద్రపాల్ఇయాన్ బోథమ్-లియామ్ బోథమ్ఇలా చేయడం ద్రవిడ్కు కొత్తేమీ కాదు..!రిటైర్మెంట్ తర్వాత క్లబ్ క్రికెట్ ఆడటం ద్రవిడ్కు ఇది కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు తన చిన్ననాటి క్లబ్ అయిన బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్కు ఆడాడు. ఈ జట్టుకు ఆడుతూ ద్రవిడ్ ఓ సెంచరీ కూడా చేశాడు.ద్రవిడ్ పెద్ద కొడుకు కూడా క్రికెటరే..!ద్రవిడ్ చిన్న పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటరే. గతేడాది ఆగస్ట్లో సమిత్ భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. గతేడాది మహారాజా టీ20 టోర్నీలోనే సమిత్ పాల్గొన్నాడు.ఇటీవలే బెంగళూరుకు వచ్చిన ద్రవిడ్రాహుల్ ద్రవిడ్ ఇటీవలే తన హో సిటీ బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరుకు రాక ముందు ద్రవిడ్ గౌహతిలో జరిగిన రాజస్థాన్ రాయల్స్ ప్రీ సీజన్ క్యాంప్లో పాల్గొన్నాడు. ద్రవిడ్ రాయల్స్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సమిత్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో స్వప్నిల్ అనే ఆటగాడు సుడిగాలి శతంకంతో విజృంభించడంతో విజయ క్రికెట్ క్లబ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. స్వప్నిల్ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. యంగ్ లయన్స్ బౌలర్లలో ఆధిత్య నాలుగు వికెట్లు పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. డబుల్ సెంచరీ.. తొలి ఆస్ట్రేలియన్గా రికార్డు
ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ల్లో 200 క్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి ఆస్ట్రేలియన్గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో స్మిత్ మొత్తం ఐదు క్యాచ్లు పట్టుకున్నాడు. స్మిత్ క్యాచ్ల్లో డబుల్ సెంచరీ సాధించే క్రమంలో రికీ పాంటింగ్ (Ricky Ponting) రికార్డును అధిగమించాడు. 🚨 HISTORY BY STEVEN SMITH. 🚨- Smith becomes the first ever Australian fielder to complete 200 catches in Tests. 🙇♂️pic.twitter.com/3T2v9jgcid— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2025పాంటింగ్ 287 ఇన్నింగ్స్ల్లో 196 క్యాచ్లు అందుకోగా.. స్మిత్ 205 ఇన్నింగ్స్ల్లోనే 200 క్యాచ్లు పూర్తి చేశాడు. ఆసీస్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టుకున్న నాన్ వికెట్కీపర్ల జాబితాలో స్మిత్, పాంటింగ్ తర్వాతి స్థానంలో మార్క్ వా ఉన్నాడు. మార్క్ వా 209 ఇన్నింగ్స్ల్లో 181 క్యాచ్లు పట్టుకున్నాడు.ఓవరాల్గా ఐదో క్రికెటర్టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే 200 క్యాచ్లు పూర్తి చేశారు. వీరిలో టీమిండియా గ్రేట్ రాహుల్ ద్రవిడ్ (Rahu Dravid) 210 క్యాచ్లతో (164 టెస్ట్ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. జో రూట్ (152 టెస్ట్ల్లో 207), మహేళ జయవర్దనే (149 టెస్ట్ల్లో 205), జాక్ కల్లిస్ (166 టెస్ట్ల్లో 200) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రీలంకతో మ్యాచ్లో స్మిత్ కల్లిస్ సరసన చేరడంతో పాటు 200 క్యాచ్ల క్లబ్లో చేరిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అలాగే టెస్ట్ల్లో అత్యంత వేగవంతంగా 200 క్యాచ్లు పూర్తి చేసిన ఆటగాడిగానూ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. స్మిత్ కేవలం 116 టెస్ట్ల్లోనే 200 క్యాచ్లు పూర్తి చేశాడు. స్మిత్ మరో 11 క్యాచ్లు పడితే టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొడతాడు.లంకతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఐదు క్యాచ్లు పట్టిన స్మిత్.. బ్యాటింగ్లోనూ చెలరేగి టెస్ట్ల్లో 36వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ టెప్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం స్మిత్, జో రూట్ తలో 36 సెంచరీలతో సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు. టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది.అంతకుముందు స్మిత్ లంకతో జరిగిన తొలి టెస్ట్లోనూ సెంచరీ సాధించాడు. ఇదే మ్యాచ్లో స్మిత్ టెస్ట్ల్లో 10000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్కు దూరం కాగా.. అతని గైర్హాజరీలో స్మిత్ ఆసీస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించాడు. తొలి టెస్ట్లోనూ ఘన విజయం సాధించిన ఆసీస్.. రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో ఊడ్చేసింది. ఫిబ్రవరి 12, 14 తేదీల్లో ఆసీస్.. శ్రీలంకతో రెండు వన్డేలు ఆడనుంది. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తిరుగులేని హిట్మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను అధిగమించాడు. ఇంగ్లండ్తో రెండో వన్డే(India vs England) సందర్భంగా ఈ ఘనత సాధించాడు. అదే విధంగా.. ఈ మ్యాచ్లో శతక్కొట్టడం ద్వారా మరిన్ని రికార్డులను హిట్మ్యాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.అద్భుత ఇన్నింగ్స్కాగా రోహిత్ శర్మ గత కొంతకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో కెప్టెన్గా, బ్యాటర్గా దారుణంగా విఫలమైన అతడు రిటైర్ అయిపోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఇంగ్లండ్తో కటక్ వన్డేలో తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడి.. విమర్శించినవాళ్లే ప్రశంసించేలా రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీబరాబతి స్టేడియంలో లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు రోహిత్ శర్మ. ఫ్లడ్లైట్ల సమస్య కారణంగా కాసేపు అవాంతరాలు ఎదురైనా.. అతడి ఏకాగ్రత చెదరలేదు. ఒంటిమీదకు బాణాల్లా దూసుకువస్తున్న ఇంగ్లండ్ ఫాస్ట్బౌలర్ల బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ తన వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.డెబ్బై ఆరు బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో ఏకంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అయితే, లియామ్ లివింగ్స్టోన్ బౌలింగ్లో ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇవ్వడంతో హిట్మ్యాన్ ధనాధన్ ఇన్నింగ్స్కు తెరపడింది.ఇక ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్గా రోహిత్ శర్మ ఇప్పటి వరకు 15404 పరుగులు చేశాడు. తద్వారా సచిన్ టెండుల్కర్ను అధిగమించాడు.కాగా ఓపెనర్గా సచిన్ టెండుల్కర్ 15335 పరుగులు చేశాడు. మరోవైపు.. ఈ జాబితాలో విధ్వంసకర మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15758 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలోకి ఇప్పుడు రోహిత్ దూసుకువచ్చాడు. కాగా 2007లో అరంగేట్రం చేసిన రోహిత్.. 2013లో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాడు.ద్రవిడ్ను అధిగమించివన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ (267 వన్డేల్లో 10,987 పరుగులు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ (344 వన్డేల్లో 10,889 పరుగులు) ఐదో స్థానానికి చేరాడు. టాప్–3లో సచిన్ టెండూల్కర్ (463 వన్డేల్లో 18,246 పరుగులు), విరాట్ కోహ్లి (296 వన్డేల్లో 13,911 పరుగులు), సౌరవ్ గంగూలీ (311 వన్డేల్లో 11,363 పరుగులు) ఉన్నారు.32వ శతకంవన్డేల్లో రోహిత్ శర్మ సెంచరీలు 32. తద్వారా అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. టాప్–2లో విరాట్ కోహ్లి (50), సచిన్ టెండూల్కర్ (49) ఉన్నారు.ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. కటక్లో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు బట్లర్ బృందం ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రోహిత్ సేన 44.3 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన భారత్.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్- ఇంగ్లండ్ మధ్య నామమాత్రపు మూడో వన్డే అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరుగుతుంది.చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ ప్లేయర్
ఐపీఎల్ 2025 (IPL) సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కీలక ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్సీఏలో (National Cricket Academy) ఉన్న టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను (Sairaj Bahutule) స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించుకున్నట్లు సమాచారం. బహుతులే ఎన్సీఏలో జాయిన్ కాకముందు 2018-21 మధ్యలో రాజస్థాన్ రాయల్స్కు స్పిన్ బౌలింగ్ కోచ్గా పని చేశాడు. బహుతులేతో ఆర్ఆర్ యాజమాన్యం తుది సంప్రదింపులు జరుపుతుందని తెలుస్తుంది. అన్నీ కుదిరితే బహుతులే ఆర్ఆర్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్, ఆ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. 52 ఏళ్ల బహుతులే.. గతంలో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్గా ఉండగా అతని అండర్లో పని చేశాడు. రాయల్స్తో చర్చలు జరుగుతున్న విషయాన్ని బహుతులే స్వయంగా క్రిక్బజ్కు తెలిపాడు. రాయల్స్తో మళ్లీ కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించాడు. 2023 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో స్పిన్-బౌలింగ్ కోచ్గా పనిచేసినప్పుడు ద్రవిడే తనను భారత జట్టుకు పరిచయం చేడని గుర్తు చేసుకున్నాడు. గతంలో శ్రీలంకలో జరిగిన సిరీస్లో ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్లో తాను పని చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. పాత పరిచయాల నేపథ్యంలో ద్రవిడ్తో పునఃకలయిక కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. బహుతులే 1997-2003 మధ్యలో టీమిండియా తరఫున 2 టెస్ట్లు, 8 వన్డేలు ఆడాడు.ట్రెంట్ రాకెట్స్పై ఆసక్తి చూపుతున్న రాయల్స్ యాజమానిరాజస్థాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదాలే హండ్రెడ్ లీగ్లో (ఇంగ్లండ్లో జరిగే హండ్రెడ్ బాల్ టోర్నీ) ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. నాటింగ్హమ్ కౌంటీకి చెందిన రాకెట్స్ ఈ సోమవారం వేలానికి రానుంది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి ఐపీఎల్తో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (బార్బడోస్ రాయల్స్), సౌతాఫ్రికా టీ20 లీగ్ల్లో (పార్ల్ రాయల్స్) ఫ్రాంచైజీలు ఉన్నాయి. హండ్రెడ్ లీగ్ విషయానికొస్తే.. ఈ లీగ్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలైన ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇదివరకే పెట్టుబడులు పెట్టాయి. సదరు ఫ్రాంచైజీల యాజమాన్యాలు హండ్రెడ్ లీగ్లోని నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, ఓవల్ ఇన్విన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి.ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు..సంజూ శాంసన్ (కెప్టెన్), ద్రువ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మైర్, శుభమ్ దూబే, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, వనిందు హసరంగ, ఆకాశ్ మధ్వాల్, ఆశోక్ శర్మ, ఫజల్ హక్ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికేయ, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, యుద్ద్వీర్సింగ్ -
రాహుల్ ద్రవిడ్కు తృటిలో తప్పిన ప్రమాదం
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు (Rahul Dravid) తృటిలో ప్రమాదం తప్పింది. నిన్న (ఫిబ్రవరి 4) బెంగళూరులో రాహుల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రాహుల్కు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని ఓ బిజీ రోడ్డులో (కన్నింగ్హమ్ రోడ్) రాహుల్ ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ద్రవిడ్ ఆటో డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.In #Bengaluru: A video of former India cricket captain and coach Rahul Dravid getting into an argument with an autodriver on Cunningham Road after a minor collision surfaced on Tuesday evening. No one was injured. pic.twitter.com/0tAtoqQk96— TOI Bengaluru (@TOIBengaluru) February 4, 2025ఈ ప్రమాదంలో రాహుల్ కారుకు స్వల్ప డ్యామేజీ అయ్యింది. ఇందుకే ద్రవిడ్ ఆటో డ్రైవర్తో వాదనకు దిగాడు. ద్రవిడ్.. తన మాతృభాష కన్నడలో ఆటో డ్రైవర్పై అసహనాన్ని ప్రదర్శించాడు. ఘటన స్ధలం నుంచి బయల్దేరేముందు ద్రవిడ్ సదరు ఆటో డ్రైవర్ వివరాలు తీసుకున్నాడు. అయితే అతనిపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు. ఎప్పుడూ కూల్గా కనిపించే ద్రవిడ్ నడి రోడ్డుపై ఓ ఆటో డ్రైవర్తో వాదనకు దిగడం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.52 ఏళ్ల రాహుల్ ద్రవిడ్.. తన 16 ఏళ్ల కెరీర్లో మైదానంలో గొడవలు పడిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ప్రత్యర్థులు రెచ్చిగొడితే రాహుల్ తన బ్యాట్తో సమాధానం చెప్పేవాడు కానీ ఎప్పుడూ గొడవకు దిగేవాడు కాదు. అలాంటి ద్రవిడ్ ఓ ఆటో డ్రైవర్తో వాగ్వాదానికి దిగడంపై ప్రస్తుతం నెట్టింట చర్చ నడుస్తుంది.ఇదిలా ఉంటే, ద్రవిడ్ హెడ్ కోచ్గా ఉండగా భారత్ 2024 టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్గా ద్రవిడ్కు అదే చివరి టోర్నమెంట్. టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాక ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా రీ జాయిన్ అయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాహుల్ తనదైన మార్కును చూపించాడు. ఆ వేలంలో ద్రవిడ్ సూచనలతో రాయల్స్ 13 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని దక్కించుకుంది. వైభవ్ లీగ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. -
ఆసీస్తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు..
టీమిండియా వరుస వైఫల్యాలపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్కోచ్గా ఉన్నంతకాలం అంతా బాగానే ఉందని.. కానీ గత ఆరునెలల కాలంలో జట్టు ఇంతగా దిగజారిపోవడం ఏమిటని ప్రశ్నించాడు. మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణిస్తూ జట్టుకు భారమైనా కొంతమందిని ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు.ట్రోఫీ గెలిచిన తర్వాత ద్రవిడ్ గుడ్బైఇప్పటికైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలని భజ్జీ సూచించాడు. సూపర్స్టార్ ఆటిట్యూడ్ ఉన్నవారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టాలని సలహా ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత.. ద్రవిడ్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ హెడ్కోచ్ పదవిని చేపట్టాడు.ఘోర పరాభవాలుఅయితే, గౌతీ మార్గదర్శనంలో టీమిండియా ఇప్పటి వరకు చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించకపోగా.. ఘోర పరాభవాలు చవిచూసింది. శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ను ఆతిథ్య జట్టుకు కోల్పోవడంతో పాటు.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది.కంగారూల చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ఆసీస్కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంటా.. బయటా వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ‘స్టార్ల’ కోసం అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Easwaran) వంటి వాళ్లను బలిచేయవద్దని హితవు పలికాడు.ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేదిఈ మేరకు.. ‘‘గత ఆరు నెలల్లో.. టీమిండియా శ్రీలంక చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై 3-1తో సిరీస్ ఓటమిని చవిచూసింది. రాహుల్ ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేది.అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. కానీ... ఆ తర్వాత అకస్మాత్తుగా ఏమైంది? ప్రతి ఒక్క ఆటగాడికి తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఒకవేళ కొంతమందిని మ్యాచ్ విన్నర్లుగా భావిస్తూ తప్పక ఆడించాలనుకుంటే.. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలను కూడా జట్టులోకి తీసుకోండి. ఎందుకంటే.. భారత క్రికెట్లో వాళ్ల కంటే పెద్ద మ్యాచ్ విన్నర్లు ఎవరూ లేరు.అభిమన్యు ఈశ్వరన్ను ఆడించాల్సిందిఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు కఠిన వైఖరి అవలంభించాలి. సూపర్స్టార్ ఆటిట్యూడ్ను పక్కనపెట్టండి. అభిమన్యు ఈశ్వరన్ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లారు. కానీ.. ఒక్క మ్యాచ్లోనూ ఆడించలేదు. ఒకవేళ అతడికి అవకాశం ఇచ్చి ఉంటే.. కచ్చితంగా సత్తా చాటేవాడు.సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. తదుపరి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడాల్సి ఉంది. అప్పుడు మాత్రం ప్రదర్శన బాగున్న ఆటగాళ్లనే ఎంపిక చేయండి. కీర్తిప్రతిష్టల ఆధారంగా సెలక్షన్ వద్దు’’ అంటూ హర్భజన్ సింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా ఆసీస్తో సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టులో ఓడిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. తదుపరి 2025-27 సీజన్లో తొలుత ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో తలపడనుంది.చదవండి: CT 2025: శుబ్మన్ గిల్పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్? -
శతక్కొట్టిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం
మూలపాడు (ఆంధ్రప్రదేశ్): భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ (153 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ శతకంతో మెరిశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్తో జరిగిన ఈ మ్యాచ్లో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకున్నాడు.మూడు రోజుల మ్యాచ్లో ఆఖరి రోజు కర్ణాటక తొలిఇన్నింగ్స్లో 123.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 441 పరుగుల భారీస్కోరు చేయగా, మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. జట్టు తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అన్వయ్ మొదట శమంతక్ అనిరుధ్ (76)తో కలిసి మూడో వికెట్కు 167 పరుగులు జతచేశాడు.387 పరుగులకు ఆలౌట్అనిరుధ్ అవుటయ్యాక వచ్చిన సుకుర్థ్ (33)తో నాలుగో వికెట్కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 128.4 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌటైంది. 54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా, జార్ఖండ్ ఒక్క పాయింట్తో సరిపెట్టుకుంది.జోనల్ టోర్నమెంట్లో డబుల్ సెంచరీఅన్వయ్ ద్రవిడ్ గతేడాది కర్ణాటక అండర్–14 జట్టుకు సారథ్యం వహించాడు. విజయ్ మర్చంట్ టోర్నీకి ముందు జరిగిన కేఎస్సీఏ (కర్ణాటక క్రికెట్ సంఘం) అండర్–16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో బెంగళూరు జోన్కు ప్రాతినిధ్యం వహించిన అన్వయ్... తుంకూర్ జోన్పై చెలరేగి ఆడాడు. డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో అజేయంగా నిలిచాడు.ఇక అన్వయ్ అన్నయ్య 19 ఏళ్ల సమిత్ కూడా ఇదివరకే జూనియర్ క్రికెట్లో ఆల్రౌండర్గా నిరూపించుకున్నాడు. సొంతగడ్డపై ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన పరిమిత ఓవర్ల, ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో సమిత్ ద్రవిడ్ రాణించాడు. చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
జో రూట్ సూపర్ సెంచరీ.. ద్రవిడ్ ఆల్టైమ్ రికార్డు సమం
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా విఫలమైన జో రూట్.. రెండో టెస్టులో మాత్రం తన మార్క్ను చూపించాడు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన సెకెండ్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.130 బంతులు ఎదుర్కొన్న రూట్.. 11 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. రూట్కు ఇది 36వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఓ అరుదైన ఘనతను రూట్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్గా భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును ఈ ఇంగ్లండ్ లెజెండ్ సమం చేశాడు. ద్రవిడ్ తన అంతర్జాతీయ టెస్టు కెరీర్లో 36 సెంచరీలు చేశాడు. రూట్ మరో సెంచరీ సాధిస్తే ద్రవిడ్ను అధిగమిస్తాడు. కాగా రూట్ 2021 నుంచి ఇప్పటి వరకు రూట్ అత్యధికంగా 19 టెస్టు సెంచరీలు చేయడం విశేషం.ఇక టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. జాక్వెస్ కలిస్(45), రికీ పాంటింగ్(41), కుమార సంగక్కర(38), ద్రవిడ్(36), రూట్(36) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.కాగా రెండో టెస్టులో న్యూజిలాండ్పై 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.చదవండి: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే? -
కోహ్లి అద్భుతం.. జైస్వాల్ దూసుకుపోతున్నాడు.. ఇంకా: ద్రవిడ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్, మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి తిరిగి ఫామ్లోకి రావడం శుభసూచకమని.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనే సెంచరీ చేయడం అద్భుతమని కొనియాడాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కోహ్లి మరింత చెలరేగడం ఖాయమని ద్రవిడ్ పేర్కొన్నాడు.కోహ్లి శతకాలు@81 కాగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోహ్లి టెస్టుల్లో శతకం బాదిన విషయం తెలిసిందే. దాదాపు 491 రోజుల తర్వాత అతడు ఓ ఇన్నింగ్స్లో వంద పరుగులు సాధించాడు. తద్వారా తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 81కి పెంచుకున్నాడు. ఆసీస్తో పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భాగంగా కోహ్లి ఈ ఘనత సాధించాడు.కోహ్లి అద్భుతంకఠిన పరిస్థితుల్లో తన అనుభవాన్ని రంగరించి జట్టు భారీ విజయం సాధించడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. తద్వారా విమర్శకులకు బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆరు నెలల క్రితం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.సఫారీ గడ్డపై కఠినమైన పిచ్లపై కూడా బ్యాట్తో అదరగొట్టాడు. తను మళ్లీ టచ్లోకి రావడం సంతోషంగా ఉంది. సిరీస్ ఆరంభంలోనే శతకం బాదడం శుభసూచకం. ఈ సిరీస్లో మరోసారి కోహ్లి తనదైన మార్కు వేయబోతున్నాడని అనిపిస్తోంది’’ అని కోహ్లిని ప్రశంసించాడు.అందరికీ సాధ్యం కాదుఇక ఇదే మ్యాచ్లో 161 పరుగులతో దుమ్ములేపిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్పై కూడా ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోజురోజుకూ అతడు ఊహించనిరీతిలో ఆటను మెరుగుపరచుకుంటున్నాడని కొనియాడాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలి ప్రయత్నంలోనే సెంచరీ చేయడం అందరికీ సాధ్యం కాదని.. జైస్వాల్ మాత్రం పక్కా ప్రణాళికతో తన వ్యూహాలను అమలు చేసిన తీరు ఆకట్టుకుందని ద్రవిడ్ కితాబులిచ్చాడు.బుమ్రా ఆటగాడిగా, సారథిగా సూపర్ హిట్అదే విధంగా.. పెర్త్ టెస్టులో కెప్టెన్గా వ్యవహరించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ద్రవిడ్ ఈ సందర్భంగా అభినందించాడు. తన అసాధారణ బౌలింగ్ నైపుణ్యాలతో జట్టును ఎన్నోసార్లు ఒంటిచేత్తో గెలిపించాడని కొనియాడాడు. కెప్టెన్గానూ విజయవంతంగా జట్టును ముందుకు నడిపించాడంటూ హ్యాట్సాఫ్ చెప్పాడు.భారీ విజయంతో మొదలుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఎడిషన్లో ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో పెర్త్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ గైర్హాజరు కాగా.. బుమ్రా టీమిండియాకు సారథ్యం వహించాడు.ఈ మ్యాచ్లో జైస్వాల్, కోహ్లి సెంచరీలతో రాణించగా.. బుమ్రా ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో టీమిండియా ఆసీస్ను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య కాన్బెర్రా వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: అప్పుడు రూ. 20 లక్షలు.. ఇప్పుడు రూ. 11 కోట్లు.. టీమిండియా రైజింగ్ స్టార్ ‘భారీ’ రికార్డు -
Ind vs Aus 1st Test: రాహుల్ ద్రవిడ్ మనసంతా ఇక్కడే..!
టీమిండియా హెడ్కోచ్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రధాన కోచ్గా వచ్చిన ఈ కర్ణాటక దిగ్గజం.. తన హయాంలో భారత జట్టును అన్ని ఫార్మాట్లలోనూ అగ్రపథంలో నిలిపాడు. ద్రవిడ్ మార్గదర్శనంలో టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23లో ఫైనల్ చేరడంతో పాటు.. వన్డే వరల్డ్కప్-2023లోనూ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లో తుదిమెట్టుపై బోల్తా పడి విజయానికి ఒక అడుగుదూరంలోనే నిలిచిపోయింది.అద్భుత విజయంతో ముగింపుఅలాంటి సమయంలో ద్రవిడ్పై విమర్శలు రాగా.. టీ20 ప్రపంచకప్-2024 రూపంలో గట్టి సమాధానమిచ్చే అవకాశం అతడికి దొరికింది. ఆటగాళ్ల ప్రాక్టీస్, క్రమశిక్షణ విషయంలో నిక్కచ్చిగా ఉండే ద్రవిడ్.. ఈసారి ఆఖరి గండాన్ని దాటేసి.. కోచ్గా అద్భుత విజయంతో తన ప్రయాణం ముగించాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్ సేన టైటిల్ సాధించడంతో కోచ్గా తన జర్నీని సంపూర్ణం చేసుకున్నాడు.ఇక గంభీర్ వంతుఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా నియమితుడయ్యాడు. అతడి నేతృత్వంలో టీమిండియా మిశ్రమ ఫలితాలు పొందుతోంది. అయితే, ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టుల్లో 3-0తో టీమిండియా వైట్వాష్ కావడంతో గంభీర్పై విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు ప్రదర్శనపైనే గౌతీ భవిష్యత్తు ఆధారపడి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మెగా సిరీస్లో భాగంగా భారత్ ఆసీస్ టూర్లో ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే ఈసారి భారత్ పరపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరుతుంది.పెర్త్ టెస్టుపై ద్రవిడ్ ఆసక్తిఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ పెర్త్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు. పెర్త్లో టాస్ గెలిచిన అతడు... తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌట్ అయింది.అయితే, బ్యాటింగ్లో కుప్పకూలినా.. బౌలింగ్లో మాత్రం భళా అనిపించింది. తొలి రోజు ఆటలో ఆసీస్ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. భారత పేసర్ల దెబ్బకు శుక్రవారం ఆసీస్ కేవలం 67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.ఇక ఈ మ్యాచ్ సాధారణ అభిమానులతో పాటు ద్రవిడ్లోనూ ఆసక్తి రేపింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఎన్ని వికెట్లు పడ్డాయి? ఎవరు అవుటయ్యారంటూ ద్రవిడ్ ఆరా తీసిన వీడియో వైరల్గా మారింది. కాగా ద్రవిడ్ ప్రస్తుతం ఐపీఎల్-2025 మెగా వేలంతో బిజీగా ఉన్నాడు.అవుటైంది ఎవరు? ఎవరి బౌలింగ్లో?అయినప్పటికీ అతడి మనసు టీమిండియా- ఆసీస్ మ్యాచ్పై ఉండటం విశేషం. ఆసీస్ 47 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్ సభ్యుడు ఒకరు స్కోరు చెప్తుండగా.. ద్రవిడ్ ఎవరు అవుటయ్యారంటూ ఉత్సాహంగా అడిగాడు. రాజస్తాన్ ఫ్రాంఛైజీ ఇందుకు సంబంధించిన వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా భారత్ ఆసీస్ను కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేసింది. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. హర్షిత్ రాణా మూడు, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.కాగా ద్రవిడ్ ఇటీవలే రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్గా నియమితుడైన విషయం తెలిసిందే. ఇక మెగా వేలం కోసం అతడు ఇప్పటికే సౌదీ అరేబియాలోని జెద్దా నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట జరుగనుంది.చదవండి: ఇది నా డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు.. అతడే నా ఆరాధ్య దైవం: నితీశ్ రెడ్డి Difficult to not keep up with scores when it’s Day 1 of the Border-Gavaskar Trophy 🇮🇳😂🔥 pic.twitter.com/d9qUdkZDoh— Rajasthan Royals (@rajasthanroyals) November 22, 2024 -
సంజూ శాంసన్ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే!
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ తండ్రి భారత క్రికెట్ దిగ్గజాలపై ఇష్టారీతిన కామెంట్లు చేయడం తగదని.. ఆయన క్షమాపణ చెబితే బాగుంటుందని హితవు పలికాడు. లేదంటే.. ఆ ప్రభావం సంజూ ఆటపై కచ్చితంగా పడుతుందని పేర్కొన్నాడు.కాగా కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన అతడు.. ఆరేళ్ల తర్వాత వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక టెస్టుల్లో ఇంత వరకు సంజూ స్థానం దక్కించుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అతడికి అరకొర అవకాశాలే వచ్చేవి. అయితే, ఆ సమయంలోనూ నిలకడలేమి ఆటతో చోటు కోల్పోయేవాడు.సఫారీ గడ్డపై శతకాలు బాదిఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత.. సంజూకు టీ20 జట్టులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్తో, సౌతాఫ్రికా గడ్డపై సంజూ బ్యాట్తో సత్తా చాటాడు. సఫారీలతో టీ20 సిరీస్లో రెండు శతకాలు బాది.. జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.ఆ నలుగురి కారణంగానేఇలాంటి తరుణంలో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ ఓ మలయాళ చానెల్తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ వల్లే తన కుమారుడి పదేళ్ల కెరీర్ నాశనమైనందని ఆయన ఆరోపించాడు. విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆసీస్ లెజెండ్ బ్రాడ్ హాగ్ తాజాగా స్పందించాడు.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదుఈ మేరకు.. ‘‘సంజూ శాంసన్ తండ్రి బహిరంగంగా ధోని, కోహ్లి, రోహిత్, ద్రవిడ్ పేర్లు చెబుతూ.. తన కొడుకు కెరీర్లో పదేళ్లు వెనకబడటానికి కారణం వాళ్లే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. భారత క్రికెట్లో ముఖ్యమైన, కీలకమైన నాలుగు పేర్లను ఆయన ప్రస్తావించారు.వాళ్లంతా తమ హయాంలో టీమిండియాను అగ్రస్థానంలో నిలిపిన వ్యక్తులు. నిజానికి సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. ఇప్పుడిప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్నాడు. రెండు సెంచరీలతో సత్తా చాటి.. తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో ఉన్నాడు.సంజూ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే అతడిపై ఒత్తిడి పెరుగుతుందిఇలాంటి సమయంలో సంజూ కుటుంబం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం.. అతడిపై ఒత్తిడిని పెంచుతుంది. నా అభిప్రాయం ప్రకారం.. సంజూ కెరీర్ సాఫీగా, ప్రశాంతంగా సాగాలంటే.. అతడి తండ్రి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే.. తండ్రి వ్యాఖ్యల వల్ల ఒత్తిడికి లోనైతే.. సంజూ ఆట తీరు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.నోళ్లను అదుపులో పెట్టుకునిఐపీఎల్లో ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు అతడు కెప్టెన్గా ఉన్నాడు. సంజూతో పాటు భారత్లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదు. కాబట్టి ఎవరైనా సరే.. నోళ్లను అదుపులో పెట్టుకుని.. బ్యాట్తోనే విమర్శకులకు సమాధానం ఇస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అంటూ బ్రాడ్ హాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్రౌండర్ అవసరం: టీమిండియా కోచ్ -
ద్రవిడ్ చిన్న కొడుకు వచ్చేస్తున్నాడు.. ఆ టోర్నమెంట్కు ఎంపిక
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయులు క్రికెట్ ప్రపంచంలోకి దూసుకొస్తున్నారు. పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ అండర్-19 స్ధాయిలో అదరగొడుతుండగా.. ఇప్పుడు చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ విజయ్ మర్చంట్ ట్రోఫీలో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీకి కర్ణాటక క్రికెట్ ఆసోషియేషన్కు ప్రకటించిన 35 మంది ప్రాబబుల్స్ జాబితాలో అన్వయ్కు చోటుదక్కింది. కాగా అన్వయ్ ద్రవిడ్ గతేడాది ఇంటర్-జోన్ స్థాయిలో కర్ణాటక అండర్-14 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అదేవిధంగా ఇటీవల కేఎస్సీఏ అండర్-16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో అన్వయ్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో భాగంగా తుమకూరు జోన్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జోన్ తరపున 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి జయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ప్రాబబుల్స్లో చోటు కల్పించారు. ఇక ఈ టోర్నీ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు ద్రవిడ్ పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ కూచ్ బెహర్ ట్రోఫీలో కర్ణాటక తరపున ఆడుతున్నాడు.చదవండి: BGT 2024: టీమిండియా టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్లకు చోటు -
‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అని ద్రవిడ్ డైరెక్ట్గానే చెప్పేశాడు!
‘సంతోషకరమైన నా క్రికెట్ ప్రయాణంలో ఇది నా చివరి సీజన్. రిటైర్మెంట్లోగా రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడతాను. బెంగాల్కు చివరిసారి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నా. ఈ సీజన్ను మర్చిపోలేనిదిగా మార్చుకుంటాం’ అంటూ టీమిండియా వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు. భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా చెప్పుకోదగ్గ సాహాకు రావాల్సినన్ని అవకాశాలు రాలేదనే చెప్పవచ్చు.ధోని నీడలో..నిజానికి వికెట్ కీపర్గా సాహా అద్భుత ప్రతిభావంతుడు. గత కాలపు భారత కీపర్లు సయ్యద్ కిర్మాణీ, కిరణ్ మోరె, నయన్ మోంగియా తరహాలో అత్యుత్తమ కీపింగ్ నైపుణ్యంతో పాటు అవసరమైతే కొంత బ్యాటింగ్ చేయగల సమర్థుడిగానే ఎక్కువగా గుర్తింపు పొందాడు. దేశవాళీ క్రికెట్లో బెస్ట్ కీపర్గా పేరు వచ్చినా... టీమిండియాను శాసిస్తున్న ధోని ఉండటంతో అతను తన చాన్స్ కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది.2010లో నాగపూర్ టెస్టుకు ముందు రోహిత్ శర్మ అనూహ్యంగా గాయపడటంతో సాహాకు బ్యాటర్గా తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది. మరో రెండేళ్ల తర్వాత స్లో ఓవర్రేట్ కారణంగా ధోనిపై నిషేధం పడటంతో రెండో టెస్టు దక్కింది. ఎట్టకేలకు 2014–15 ఆసీస్ పర్యటనలో తొలి టెస్టు తర్వాత ధోని అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో సాహా అసలు కెరీర్ మొదలైంది. అక్కడి నుంచి దాదాపు ఐదేళ్ల పాటు ప్రధాన కీపర్గా సాహా తన సత్తాను ప్రదర్శిస్తూ ప్రపంచ అత్యుత్తమ కీపర్లలో ఒకడిగా నిలిచాడు.పంత్ రాకతో పాత కథ మళ్లీ మొదలుస్వదేశంలో గిర్రున తిరిగే అతి కష్టమైన స్పిన్ బంతులనైనా, విదేశీ గడ్డపై సీమ్ బంతులనైనా స్టంప్ల వెనక చురుగ్గా, సమర్థంగా అందుకోవడంలో అతనికి అతనే సాటిగా నిలిచాడు. బ్యాటింగ్లో కూడా కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అయితే రిషభ్ పంత్ దూసుకొచ్చిన తర్వాత సాహా వెనుకబడిపోయాడు. పంత్ ఉన్నప్పుడు కూడా కొంత కాలం రెండో కీపర్గా జట్టులో అవకాశం దక్కినా అది ఎంతో కాలం సాగలేదు. కోచ్ ద్రవిడ్ ‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అంటూ సాహాకు నేరుగా చెప్పేయడంతో అతని టెస్టు కెరీర్ ముగిసింది. ఐపీఎల్లో అదే హైలైట్2008 నుంచి 2024 వరకు ఐపీఎల్ ఆడిన కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో సాహా కూడా ఉన్నాడు. కోల్కతా, చెన్నై, పంజాబ్, హైదరాబాద్, గుజరాత్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతను 170 మ్యాచ్లలో 127.57 స్ట్రయిక్రేట్తో 2934 పరుగులు సాధించాడు.ఇక 2014లో ఫైనల్లో పంజాబ్ తరఫున 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్లతో అజేయంగా 115 పరుగులు సాధించిన ప్రదర్శన అతని ఐపీఎల్ కెరీర్లో హైలైట్. 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు.అతడిని తన వారసుడిగా తీర్చిదిద్దిబెంగాల్ యువ కీపర్ అభిషేక్ పొరేల్కు మెంటార్గా వ్యవహరించి తన వారసుడిగా అతడిని సాహా తీర్చిదిద్దాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)తో విభేదాల కారణంగా రెండేళ్లు త్రిపుర తరఫున ఆడిన సాహా ఈ సీజన్లో మళ్లీ తిరిగొచ్చాడు.అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బెంగాల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహా... ఈ టోర్నీనే తనకు చివరిదని వెల్లడించాడు. మూడేళ్ల క్రితమే చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన 40 ఏళ్ల సాహా రంజీ తర్వాత దేశవాళీ క్రికెట్లోనూ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కానున్నట్లు స్పష్టం చేశాడు. ఇక ఈ సీజన్ రంజీలో బెంగాల్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడగా...లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆడిన ఒకే ఒక ఇన్నింగ్స్లో అతను డకౌటయ్యాడు.కాగా టీమిండియా తరఫున 40 టెస్టులు ఆడిన సాహా 29.41 సగటుతో సాహా 1353 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. కీపర్గా 92 క్యాచ్లు అందుకున్న అతను 12 స్టంపింగ్లు చేశాడు. టీమిండియా తరఫున 9 వన్డేలు కూడా ఆడిన సాహాకు అంతర్జాతీయ టీ20లు ఆడే అవకాశం మాత్రం రాలేదు. 17 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను 138 మ్యాచ్లు ఆడటం విశేషం.చదవండి: Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్వాడినే.. కానీ -
Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్
ఇరానీ కప్ 2024లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీతో మెరిశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో సర్ఫరాజ్ ఈ మార్కును తాకాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి సర్ఫరాజ్ 218 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా శార్దూల్ ఠాకూర్ (25) క్రీజ్లో ఉన్నాడు. 133.4 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్ 522/8గా ఉంది. ముంబై ఇన్నింగ్స్లో కెప్టెన్ అజింక్య రహానే (97), శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు వికెట్లు తీశారు.సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్రెస్ట్ ఆఫ్ ఇండియాపై సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరాడు. సర్ఫరాజ్కు ఇరానీ కప్లో ఇది రెండో సెంచరీ కాగా.. సచిన్, ద్రవిడ్ కూడా ఇరానీ కప్లో తలో రెండు సెంచరీలు చేశారు. ఇరానీ కప్లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత దిలీప్ వెంగ్సర్కార్, గుండప్ప విశ్వనాథ్కు దక్కుతుంది. ఈ ఇద్దరు ఇరానీ కప్లో తలో నాలుగు సెంచరీలు చేశారు. వెంగ్సర్కార్, విశ్వనాథ్ తర్వాత ఇరానీ కప్లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత హనుమ విహారి, అభినవ్ ముకుంద్, సునీల్ గవాస్కర్, వసీం జాఫర్లకు దక్కుతుంది. వీరంతా ఈ టోర్నీలో తలో మూడు సెంచరీలు చేశారు.చదవండి: డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్ -
సమిత్ ద్రవిడ్ బ్యాడ్లక్.. ఇక ఆ జట్టుకు ఆడలేడు!
భారత యువ క్రికెట్ జట్టు తరఫున అరంగేట్రం చేయాలన్న సమిత్ ద్రవిడ్కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. గాయం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో యూత్ వన్డేలు మిస్సయిన ఈ కర్ణాటక ప్లేయర్.. రెడ్బాల్ మ్యాచ్లకు కూడా దూరం కానున్నట్లు తాజా సమాచారం. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడే సమిత్ ద్రవిడ్.వన్డేల్లో బెంచ్కు పరిమితంకాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల ఫోర్ డే సిరీస్లు ఆడేందుకు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్కు వచ్చింది. ఈ క్రమంలో తొలుత పుదుచ్చేరి వేదికగా సెప్టెంబరు 21, 23, 26 తేదీల్లో వన్డేలు ఆడింది. ఇందులో యువ భారత్ ఆసీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అయితే, మోకాలి గాయం కారణంగా సమిత్ ద్రవిడ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. బెంచ్కే పరిమితమయ్యాడు.రెడ్బాల్ మ్యాచ్లకూ దూరంప్రస్తుతం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబరు 30- అక్టోబరు 7 వరకు చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగనున్న ఫోర్-డే మ్యాచ్లకు కూడా దూరం కానున్నాడు. ఈ విషయం గురించి భారత యువ జట్టు హెడ్కోచ్ హృషికేశ్ కనిత్కర్ ఈఎస్పీఎన్క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం అతడు ఇంకా ఎన్సీఏలోనే ఉన్నాడు.ఇకపై ఆ జట్టుకు ఆడలేడుమోకాలి గాయం పూర్తిగా నయం కాలేదు. కాబట్టి అతడు ఆసీస్తో మ్యాచ్లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు’’ అని తెలిపాడు. కాగా సమిత్ ద్రవిడ్కు ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ ఏడాది అక్టోబరు 11న 19వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. దీనర్థం ఇక అతడికి అండర్-19 జట్టుకు, ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 ఆడే భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ ఉండదు. ఇదిలా ఉంటే.. ద్రవిడ్ చిన్న కుమారుడు, సమిత్ తమ్ముడు అన్వయ్ కూడా కర్ణాటక తరఫున జూనియర్ లెవల్లో క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే.చదవండి: WTC Updated Points Table: మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక.. టాప్లోనే భారత్ -
‘చెత్తగా ఆడండి.. అప్పుడు అసలైన గంభీర్ను చూస్తారు’
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ గురించి బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టును విజయపథంలో నడపగల సత్తా గౌతీకి ఉందని.. అయితే, అతడి కోచింగ్ స్టైల్ గురించి ఇప్పుడే అంచనాకు రాలేమన్నాడు. టీమిండియా చెత్తగా ఆడినపుడు గంభీర్ ‘నిజ స్వరూపం’ బయటపడుతుందని వ్యాఖ్యానించాడు.ద్రవిడ్ తర్వాతటీ20 ప్రపంచకప్-2024లో రోహిత్ సేన చాంపియన్గా నిలిచిన అనంతరం రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ను టీమిండియా హెడ్కోచ్గా నియమించింది బీసీసీఐ. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో లక్నో సూపర్ జెయింట్స్(రెండుసార్లు ప్లే ఆఫ్స్) జట్టుకు మార్గదర్శనం చేయడంతో పాటు.. కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపిన మెంటార్గా ఘనత వహించిన అతడికి భారత జట్టు బాధ్యతలు అప్పగించింది.తన దూకుడు వైఖరికి విరుద్ధంగాశ్రీలంక పర్యటన సందర్భంగా జూలైలో కోచ్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన గంభీర్కు శుభారంభం దక్కింది. సూర్యకుమార్ సేన ఆతిథ్య జట్టు టీ20 సిరీస్లో 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అయితే, వన్డే సిరీస్లో మాత్రం రోహిత్ సేనకు ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీలంక చేతిలో సిరీస్ ఓడిపోయింది. రెండో ప్రయత్నంలోనే గంభీర్కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనా.. తన దూకుడు వైఖరికి విరుద్ధంగా ప్రశాంతంగానే కనిపించాడు. ఈ క్రమంలో స్వదేశంలో తాజాగా బంగ్లాదేశ్తో సిరీస్తో టెస్టుల ప్రయణాన్ని మొదలుపెట్టిన గంభీర్కు.. రోహిత్ సేన ఘన విజయంతో స్వాగతం పలికింది. చెన్నై టెస్టులో బంగ్లాను 280 పరుగుల తేడాతో చిత్తు చేసి క్లీన్స్వీప్పై కన్నేసింది. గంభీర్ విశ్వరూపం చూస్తారుఈ నేపథ్యంలో భారత్- బంగ్లా సిరీస్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న తమీమ్ ఇక్బాల్ జియో సినిమా షోలో మాట్లాడుతూ గంభీర్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘మీరు(టీమిండియా) వరుసగా గెలుస్తూ ఉంటే.. అతడి మనసులో నిజంగా ఏం దాగుందో బయటకు రాదు. మీరు ఎప్పుడైతే ఓ సిరీస్ కోల్పోతారో.. ఆ వెంటనే మరొకటి ఓడిపోతారో.. అప్పుడు తన నిజ స్వరూపం బయటపడుతుంది. జట్టును విజయవంతంగా ముందుకు నడిపించగల సామర్థం అతడికి ఉంది. అయితే, ఇప్పుడే తన కోచింగ్ స్టైల్పై నిశ్చితాభిప్రాయానికి రాకూడదు. టీమిండియా ఒక్క చెత్త మ్యాచ్ ఆడనివ్వండి.. అప్పుడు తెలుస్తుంది’’ అని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. గంభీర్ మరీ అంత కూల్ కాదని.. జట్టు ఓటములపాలైతే ఆటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడడని అభిప్రాయపడ్డాడు.గంభీర్ ముందున్న సవాళ్లువరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరడం సహా చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026, వన్డే వరల్డ్కప్-2027 రూపంలో గంభీర్కు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
ద్రవిడ్ రీ ఎంట్రీ.. ప్రకటించిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పునరాగమనం చేయనున్నాడు. వచ్చే సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించనునున్నాడు. రాయల్స్ యాజమాన్యం ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘టీమిండియా లెజండరీ, ప్రపంచకప్ గెలిపించిన కోచ్ రాజస్తాన్ రాయల్స్లోకి సంచలన రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు’’ అంటూ రాయల్స్ సీఈవో జేక్ లష్ మెక్రమ్తో ద్రవిడ్ దిగిన ఫొటోను షేర్ చేసింది.సరికొత్త సవాళ్లకు సిద్ధంఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత.. సరికొత్త సవాళ్లకు సిద్ధం కావాలని భావించాను. అందుకు రాయల్స్తో జతకట్టడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా.. ‘‘ద్రవిడ్తో సంప్రదింపులు ఫలప్రదంగా ముగిశాయి. త్వరలోనే అతను కోచ్ బాధ్యతలు చేపట్టడం ఖాయం’’ అని ఇటీవల రాయల్స్ ఫ్రాంఛైజీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ద్రవిడ్తో పాటు టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్ను కూడా కోచింగ్ సిబ్బందిలోకి తీసుకోవాలని రాయల్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో సారథిగాకాగా ద్రవిడ్ ఐపీఎల్లో రాజస్తాన్కు సేవలందించడం ఇదే తొలిసారి కాదు. 2012, 2013 ఎడిషన్లలో రాయల్స్ కెప్టెన్గా వ్యహరించిన ద్రవిడ్ రిటైర్మెంట్ అనంతరం.. ఆ జట్టు మెంటార్గా రెండేళ్లు పని చేశాడు. అనంతరం 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్గా బాధ్యతలు చేపట్టాడు.ఆ తర్వాత.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ‘హెడ్’గా నియమితుడైన ద్రవిడ్.. ఐపీఎల్కు దూరమయ్యాడు. అనంతరం టీమిండియా ప్రధాన కోచ్గా ఎంపికైన ఈ కర్ణాటక ప్లేయర్ రెండున్నరేళ్లపాటు ఆ విధులు నిర్వర్తించాడు. అతడి హయాంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-2023 ఫైనల్, వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ చేరింది.వరల్డ్ కప్ విన్నర్అయితే, టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న అతడి కల నెరవేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ల కాంబినేషన్లో టీమిండియా కరీబియన్ గడ్డపై ఈ ఏడాది పొట్టి ఫార్మాట్ కప్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ద్రవిడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. నిజానికి ద్రవిడ్ పదవీ కాలం కూడా గత ఏడాది వన్డే ప్రపంచకప్తోనే ముగిసింది. అయినా.. ఈ మెగా టోర్నీ ముగిసే వరకు కోచ్గా సేవలు అందించి.. ఐసీసీ టైటిల్తో తన ప్రయాణం ముగించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇప్పటి వరకు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ డైరెక్టర్గా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజస్తాన్కు సంబంధించిన బార్బడోస్ రాయల్స్... కరీబియన్ ప్రీమియర్ లీగ్లో, పార్ల్ రాయల్స్... సౌతాఫ్రికా20 టోర్నీల్లో పాల్గొంటున్నాయి. ఆయా లీగ్లలో విజయాలే లక్ష్యంగా సహాయ సిబ్బందిలో దిగ్గజాలను నియమించుకుంటోంది రాయల్స్.చదవండి: బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్.. ఎట్టకేలకు.. -
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ నూతన హెడ్ కోచ్ను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ శనివారం ఆర్ఆర్ మేనేజ్మెంట్ తమ నూతన హెడ్ కోచ్గా టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. రాయల్స్ 2024 ఎడిషన్లో డెడికేటెడ్ హెడ్ కోచ్ లేకుండానే బరిలో నిలిచింది. కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా.. ట్రెవర్ పెన్నీ, షేన్ బాండ్లు అసిస్టెంట్ కోచ్లుగా వ్యవహరించారు. రాయల్స్ గత సీజన్ ప్లే ఆఫ్స్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడింది.కాగా, ద్రవిడ్ 2011-2013 మధ్యలో రాయల్స్ హెడ్ కోచ్గా పని చేశాడు. 2014 ఎడిషన్లో మెంటార్గా వ్యవహరించాడు. అనంతరం అతను భారత అండర్-19, ఇండియా-ఏ, ఎన్సీఏలో హెడ్ ఆఫ్ క్రికెట్, టీమిండియా హెడ్ కోచ్ వంటి హోదాల్లో పని చేశాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలోనే టీమిండియా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్ను చేజిక్కించుకుంది. అలాగే ద్రవిడ్ హయాంలో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు.. వన్డే వరల్డ్కప్ ఫైనల్స్కు కూడా చేరింది. తాజా సమాచారం మేరకు ద్రవిడ్ రాయల్స్ హెడ్ కోచ్గా నియమితుడైతే అసిస్టెంట్ కోచ్గా విక్రమ్ రాథోడ్ ఎంపికవుతాడని తెలుస్తుంది. కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా కొనసాగే అవకాశం ఉంది. -
మెంటలోడు అనుకుంటారని భయపడ్డా: ద్రవిడ్
ఎన్నో కఠిన సవాళ్లు దాటిన తర్వాతే తాము ప్రపంచకప్ను కైవసం చేసుకోగలిగామని టీమిండియా మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. భారత్ టీ20 వరల్డ్కప్-2024 చాంపియన్గా అవతరించగానే తమ సంబరాలు అంబరాన్నంటాయని.. తాను సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యానని పేర్కొన్నాడు. ఆ సమయంలో భావోద్వేగాలు నియంత్రించుకోలేక ఆటగాళ్లతో కలిసి తాను చిన్నపిల్లాడిలా గంతులు వేశానని తెలిపాడు.అయితే, ఇందుకు సంబంధించిన దృశ్యాలు తన కుమారుల కంటపడకుండా ఉండేందుకు విఫలయత్నం చేశానంటూ ద్రవిడ్ నవ్వులు చిందించాడు. కాగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2024లో మరోసారి ప్రపంచకప్ను ముద్దాడింది టీమిండియా. అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచి.. పదకొండేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి..ఫలితంగా కెప్టెన్గా రోహిత్ ఖాతాలో తొలి టైటిల్ చేరగా... హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణానికి విజయవంతమైన ముగింపు లభించింది. దీంతో... 2022లో జట్టు వైఫల్యానికి కారణమని వీళ్లిద్దరిని విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో.. జట్టు కప్ అందుకోగానే ద్రవిడ్ కూడా ఎన్నడూ లేని విధంగా ఉద్వేగానికి లోనవుతూ.. ఆటగాళ్లతో కలిసి సందడి చేశాడు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఈ మాజీ కెప్టెన్ను అలా చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. నాకు పిచ్చిపట్టిందని సందేహ పడతారనుకున్నాఈ విషయం గురించి తాజాగా ప్రస్తావనకు రాగా రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ.. ‘‘మేమంతా ఎంతో కష్టపడిన తర్వాత దక్కిన ఫలితం అది. అలాంటపుడు మా సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకు నిదర్శనమే నాటి సెలబ్రేషన్స్. ఎంతో గొప్పగా సంబరాలు చేసుకున్నాం. అయితే, ఈ వీడియోను నా కుమారులు చూడకూడదని జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే.. నన్ను వాళ్లిలా చూశారంటే నాకు పిచ్చి పట్టిందేమోనని వాళ్లు సందేహపడతారేమోనన్న భయం వెంటాడింది(నవ్వుతూ). నిజానికి నేనెప్పుడూ మా వాళ్లకు కూల్గా ఉండాలని చెబుతాను.గెలుపైనా.. ఓటమైనా తొణకకుండా ఉంటూ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని వాళ్లకు హితబోధ చేస్తూ ఉంటాను. అలాంటిది నేనే అంతగా సెలబ్రేట్ చేసుకున్నానంటే ఆ విజయానికి ఉన్న విలువ అటువంటిది. కోచ్గా నా చివరి మ్యాచ్ అలా ముగిసిందుకు సంతోషంగా ఉన్నాను. అదే ఆఖరి మ్యాచ్ కావడం కూడా నయమైంది. లేదంటే.. మీరు చెప్పేదొకటి.. చేసేదొకటి(సెలబ్రేషన్స్ విషయంలో) అని మా జట్టు సభ్యులు నన్ను ఆటపట్టించేవారు’’ అంటూ చిరు నవ్వులు చిందించాడు. సియట్ అవార్డు వేడుక సందర్భంగా హిందుస్తాన్ టైమ్స్తో రాహుల్ ద్రవిడ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ద్రవిడ్ కుమారులు కూడా క్రికెటర్లేనన్న విషయం తెలిసిందే. పెద్ద కొడుకు సమిత్ ఇటీవలే అండర్-19 భారత జట్టుకు ఎంపికయ్యాడు. చిన్న కొడుకు అన్వయ్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక ద్రవిడ్ స్థానంలో ప్రస్తుతం గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: పతనం దిశగా పాక్.. అసలు ఈ జట్టుకు ఏమైంది?.. బంగ్లా రికార్డులివీ -
భారత జట్టులో జూనియర్ ద్రవిడ్ ఎంట్రీ!
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్వైపు తొలి అడుగువేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనున్న అండర్-19 భారత జట్టుకు ఎంపికయ్యాడు. కంగారూ జట్టుతో స్వదేశంలో జరుగనున్న వన్డే, ఫోర్-డే సిరీస్కు సమిత్ను ఎంపిక చేశారు సెలక్టర్లు.కాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల రెడ్బాల్ సిరీస్ల కోసం ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్కు రానుంది. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబరు 21, 23, 26 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబరు 30- అక్టోబరు 7 వరకు చెన్నై వేదికగా ఫోర్-డే మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ సిరీస్లలో భారత అండర్ 19 వన్డే జట్టుకు మహ్మద్ అమాన్, ఫోర్-డే జట్టుకు సోహం పట్వర్ధన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్కర్ణాటకకు చెందిన సమిత్ ద్రవిడ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. ప్రస్తుతం అతడు కేఎస్సీఏ మహరాజా టీ20 ట్రోఫీ టోర్నీలో మైసూర్ వారియర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ టోర్నమెంట్లో సమిత్ ఇప్పటి వరకు తన మార్కు చూపించలేకపోయాడు. ఏడు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 82 పరుగులే చేయడంతో పాటు.. ఇంతవరకు ఒక్కసారి కూడా బౌలింగ్ చేసే అవకాశం దక్కించుకోలేకపోయాడు.ఆ టోర్నీలో అదరగొట్టిన సమిత్ అయితే, అంతకుముందు కూచ్ బెహర్ ట్రోఫీలో మాత్రం కర్ణాటక టైటిల్ గెలవడంలో సమిత్ ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెడ్బాల్ టోర్నీలో ఎనిమిది మ్యాచ్లు ఆడిన 18 ఏళ్ల సమిత్.. 362 పరుగులు సాధించాడు. జమ్మూ కశ్మీర్పై చేసిన 98 పరుగులు అతడి అత్యధిక స్కోరు. ఇక ఈ టోర్నీలో సమిత్ 16 వికెట్లు కూడా పడగొట్టడం విశేషం. ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో పాటు.. ముంబైతో జరిగిన ఫైనల్లో రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకుని సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు సమిత్ ద్రవిడ్. కాగా అండర్-19 స్థాయిలో సత్తా చాటితే టీమిండియాలో ఎంట్రీకి మార్గం సుగమమవుతుందన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో అండర్ 19 జట్టుతో వన్డే సిరీస్కు భారత అండర్-19 జట్టు:రుద్ర పటేల్ (వైస్ కెప్టెన్- గుజరాత్), సాహిల్ పరాఖ్ (మహారాష్ట్ర), కార్తికేయ కేపీ (కర్ణాటక), మహ్మద్ అమాన్ (కెప్టెన్) (ఉత్తరప్రదేశ్), కిరణ్ చోర్మాలే (మహారాష్ట్ర), అభిజ్ఞాన్ కుందు (ముంబై), హర్వంశ్ సింగ్ పంగలియా (వికెట్ కీపర్, సౌరాష్ట్ర), సమిత్ ద్రవిడ్ ( కర్ణాటక), యుధాజిత్ గుహ (బెంగాల్ ), సమర్థ్ ఎన్ (కర్ణాటక), నిఖిల్ కుమార్ (చండీగఢ్), చేతన్ శర్మ (రాజస్తాన్), హార్దిక్ రాజ్ (కర్ణాటక), రోహిత్ రజావత్(మధ్యప్రదేశ్), మహ్మద్ ఖాన్(కేరళ).ఆస్ట్రేలియాతో అండర్ 19 జట్టుతో వన్డే సిరీస్కు భారత అండర్-19 జట్టు:వైభవ్ సూర్యవంశీ (బీహార్), నిత్యా పాండ్యా (బీహార్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్- సంజాబ్), సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్) (మధ్యప్రదేశ్), కార్తికేయ కేపీ (కర్ణాటక), సమిత్ ద్రవిడ్ (కర్ణాటక), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్- ముంబై), హర్వంశ్ సింగ్ పంగలియా (వికెట్ కీపర్- సౌరాష్ట్ర), చేతన్ శర్మ(రాజస్తాన్), సమర్థ్ ఎన్(కర్ణాటక), ఆదిత్య రావత్(ఉత్తరాఖండ్), అన్మోల్జీత్ సింగ్(పంజాబ్), ఆదిత్య సింగ్(ఉత్తరప్రదేశ్), మహ్మద్ ఎనాన్(కేరళ).చదవండి: సూర్యకుమార్ ఆశలపై నీళ్లు.. ఊహించని షాక్! -
రిటైర్మెంట్ కాదు!.. కేఎల్ రాహుల్ ముఖ్యమైన ప్రకటన ఇదే
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ‘ముఖ్యమైన ప్రకటన’కు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. దివ్యాంగులైన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేలా.. తాము తలపెట్టిన సత్కార్యం విజయవంతమైందని తెలిపాడు. తమకు సహకరించిన తోటి క్రికెటర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. అసలు విషయమేమిటంటే..‘నేనొక ప్రకటన చేయబోతున్నా.. ’ అంటూ కేఎల్ రాహుల్ ఇన్స్టా పోస్ట్ పెట్టగానే.. అతడు క్రికెట్కు వీడ్కోలు పలకబోతున్నాడంటూ వదంతులు వ్యాపించాయి. జాతీయ జట్టులో తగినన్ని అవకాశాలు రాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్స్టా స్టోరీ ద్వారా ఇవన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేశాడు కేఎల్ రాహుల్.తన భార్య అతియా శెట్టితో కలిసి ఒక మంచి పని చేసినట్లు వెల్లడించాడు. దివ్యాంగులైన పిల్లల బాగు కోసం.. క్రికెటర్ల వస్తువులు వేలం వేయడం ద్వారా నిధులు సమకూర్చినట్లు తెలిపాడు. ఈ సత్కార్యంలో తమకు సహకరించిన తన సహచర, మాజీ క్రికెటర్ల జట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. వేలాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, విరాళాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపాడు.కోహ్లి జెర్సీకి అత్యధిక ధరకేఎల్ రాహుల్- అతియా శెట్టి దంపతులు నిర్వహించిన ఈ వేలంలో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి జెర్సీ అత్యధిక ధర పలికినట్లు సమాచారం. రూ. 40 లక్షలకు కింగ్ జెర్సీ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అదే విధంగా... ఈ జాబితాలో రెండో స్థానంలో కూడా కోహ్లినే ఉండటం విశేషం. అతడి గ్లోవ్స్ రూ. 28 లక్షల ధర పలికింది.ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ రూ. 24 లక్షలు, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ రూ. 13 లక్షలు, మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ బ్యాట్ రూ. 11 లక్షలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వేలం ద్వారా రాహుల్- అతియా మొత్తంగా రూ. 1.93 కోట్లు సేకరించినట్లు సమాచారం.కాగా ఐపీఎల్-2024లో స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కలేదు. టీమిండియా తరఫున 2022లో చివరి టీ20 ఆడిన రాహుల్.. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్లో పాల్గొన్నాడు. ఇదే ఏడాది జనవరిలో ఆఖరిగా టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఈ కర్ణాటక బ్యాటర్ తదుపరి దులిప్ ట్రోఫీలో పాల్గొననున్నాడు.చదవండి: BAN vs PAK: తండ్రైన స్టార్ క్రికెటర్.. టెస్టు సిరీస్ నుంచి ఔట్? -
అదృష్టం కలిసొస్తేనే...
ముంబై: మెగా ఈవెంట్లలో జరిగే ఫైనల్ మ్యాచ్లకు కొన్నిసార్లు ప్రదర్శనతో పాటు కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలని భారత మాజీ కెపె్టన్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ‘సియెట్’ సంస్థ అందించే వార్షిక క్రికెట్ అవార్డుల్లో ద్రవిడ్కు ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్’ పురస్కారం లభించింది. ఈ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ద్రవిడ్ తన అనుభవాలను వివరించాడు. ద్రవిడ్ ఏమన్నాడంటే‘గతేడాది భారత్ వన్డే ప్రపంచకప్లో అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వరుసగా పది మ్యాచ్ల్లో గెలిచిన టీమిండియాకు అనూహ్యంగా టైటిల్ పోరులో ఆ్రస్టేలియా చేతిలో పరాజయం ఎదురైంది. ఓ ఆరు నెలల తిరిగేసరికి... ఈ ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ డెత్ ఓవర్లలో కనబరిచిన అద్భుత పోరాటంతో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి టి20 వరల్డ్కప్ను సొంతం చేసుకుంది. ఈ రెండు సందర్బాల్లోనూ కెపె్టన్గా రోహిత్, కోచ్గా నేను ఉన్నాను. మాకు టి20 ప్రపంచకప్ టైటిల్కు మధ్య దక్షిణాఫ్రికా అడ్డుగా ఉంది. అయితే ఆటతోపాటు కొంచెం అదృష్టం కలసిరావడంతో కప్తో ఆనందం మా వశమైంది. ఎంత చేసినా ఆ రోజు మనది కావాలంటే రవ్వంత అదృష్టం కూడా మనతో ఉండాలి.దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 30 బంతుల్లో 30 పరుగుల సమీకరణం ప్రత్యరి్థకే అనుకూలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత చిత్తంతో అనుకున్న ప్రణాళికను కెపె్టన్ రోహిత్ అమలు చేయాలి. ఎవరో ఒకరు మా ప్రయత్నాలకు కలిసి రావాలి. చివరకు సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ రూపంలో అదృష్టం మా పక్షాన నిలిచింది. ఈ క్యాచ్ తుది ఫలితాన్ని మావైపునకు తిప్పింది. కానీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరిగిన నవంబర్ 19న మాత్రం ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ శతకం శతకోటికిపైగా భారతీయుల కలల్ని కల్లలు చేసింది.టి20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు రిటైర్మెంట్ ఇచి్చనప్పటికీ యువ బ్యాటర్లు వారి స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇకముందు కూడా భారత క్రికెట్ వెలిగిపోతుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యమైన అకాడమీలు, మెరుగైన మౌలిక వసతులు, లీగ్లతో అపార అవకాశాలు యువ క్రికెటర్ల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తున్నాయి’ అని ద్రవిడ్ వివరించారు. -
సియెట్ అవార్డుల ప్రధానోత్సవం.. సందడి చేసిన క్రికెట్ స్టార్స్ (ఫొటోలు)
-
ఆ ముగ్గురి సహకారంతోనే టీ20 వరల్డ్కప్ గెలిచాం: రోహిత్
నిన్న (ఆగస్ట్ 21) జరిగిన సియెట్ రేటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్కప్ గెలవడానికి జై షా, అజిత్ అగార్కర్, రాహుల్ ద్రవిడ్ చాలా తోడ్పడ్డారని అన్నాడు. ఈ ముగ్గురిని మూల స్తంభాలతో పోల్చాడు. జట్టు మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి సత్ఫలితాలు సాధించేందుకు ఈ మూడు స్తంభాలు తోడ్పడ్డాయని తెలిపాడు. నేను నా టీమ్ వరల్డ్కప్ సాధించడానికి ఈ ముగ్గురే కీలకమని ఆకాశానికెత్తాడు. జట్టుగా మేం రాణించడానికి ఆ ముగ్గురు ఇచ్చిన స్వేచ్ఛనే కారణమని తెలిపాడు.తన కెప్టెన్సీ గురించి హిట్మ్యాన్ మాట్లాడుతూ.. తాను ఆషామాషీగా ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలవలేదని, కెప్టెన్గా ఇంతటితో ఆగేది లేదని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ టైటిళ్లు సాధించడమే తన లక్ష్యమని చెప్పకనే చెప్పాడు. కాగా, నిన్న జరిగిన ఫంక్షన్లో రోహిత్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు లభించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మెన్స్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, యశస్వి జైస్వాల్ మెన్స్ టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ మెన్స్ టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. మహ్మద్ షమీ మెన్స్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ మెన్స్ టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, టీమ్ సౌథీ మెన్స్ టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు. -
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్లకు అత్యున్నత అవార్డులు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్లకు క్రికెట్కు సంబంధించిన అత్యున్నత అవార్డులు లభించాయి. సియెట్ రేటింగ్ అవార్డ్స్ 2023-24లో రోహిత్కు మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు.. రాహుల్ ద్రవిడ్కు లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డులు లభించాయి. నిన్న జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో వీరిద్దరు ఈ అవార్డులు అందుకున్నారు. Rohit Sharma receiving the CEAT Cricketer of the year award from Jay Shah. 💥 pic.twitter.com/5FdU2CIWi6— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2024రాహుల్, రోహిత్తో పాటు మరికొందరు సియెట్ రేటింగ్ అవార్డులు అందుకున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మెన్స్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, యశస్వి జైస్వాల్ మెన్స్ టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ మెన్స్ టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు.CEAT Best ODI batter of the year - Virat Kohli. 🐐 pic.twitter.com/efYQ9GP5gc— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2024బౌలర్ల విషయానికొస్తే.. మహ్మద్ షమీ మెన్స్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ మెన్స్ టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ మెన్స్ టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు.Jay Shah, Rohit, Dravid, Gavaskar, Shami, Shreyas, Hayden, Salt Deepti, Harmanpreet at the CEAT awards. 👌❤️ pic.twitter.com/tJ2mmlYeKb— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2024ఐపీఎల్ 2024లో కేకేఆర్ను విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ప్రత్యేక మెమెంటోను అందుకుగా.. దేశవాలీ క్రికెట్కు సంబంధించి తమిళనాడు కెప్టెన్ ఆర్ సాయి కిషోర్కు డొమెస్టిక్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు.Unyielding at the crease, a champion beyond compare. Congratulations @ybj_19 on being CEAT Test Batter of the Year!#CCR26 #CEATCricketRatingAwards #CEAT #Cricket #CEATCricketAwards #ThisIsRPG pic.twitter.com/x0jcLPPROS— CEAT TYRES (@CEATtyres) August 21, 2024మహిళల క్రికెట్లో టీమిండియాను అత్యధిక టీ20ల్లో ముందుండి నడిపించినందుకు కెప్టెన్ హర్మన్ప్రీత్కు ప్రత్యేక మెమెంటోను బహుకరించారు. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన వుమెన్స్ ఇండియన్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకోగా.. దీప్తి శర్మ వుమెన్స్ ఇండియన్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకుంది. ఇటీవల టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు నమోదు చేసిన షెఫాలీ వర్మను ప్రత్యేక మెమెంటోతో సత్కరించారు.A hearty Congratulations to @JayShah , for bringing unparelleled leadership and direction to the most loved sport of our country!#CCR26 #CEATCricketRatingAwards #CEAT #Cricket #CEATCricketAwards #ThisIsRPG pic.twitter.com/BWGGyUqoQ1— CEAT TYRES (@CEATtyres) August 21, 2024క్రికెట్ ఉన్నతికి అనునిత్యం పరితపించే బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్సెలెన్స్ ఇన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు అందుకున్నాడు. Celebrating the pinnacle of T20 leadership! Join us in honouring the standout leader of the league.#CCR26 #CEATCricketRatingAwards #CEAT #Cricket #CEATCricketAwards #ThisIsRPG @ShreyasIyer15 pic.twitter.com/j0vqvx1ZAI— CEAT TYRES (@CEATtyres) August 21, 2024 -
కరుణ్ నాయర్ మెరుపు అర్ద సెంచరీ.. రాణించిన ద్రవిడ్ కొడుకు
మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20 టోర్నీలో ఇవాళ (ఆగస్ట్ 18) జరుగుతున్న మ్యాచ్లో మైసూర్ వారియర్స్, గుల్బర్గా మిస్టిక్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ మెరుపు అర్ద సెంచరీతో (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా.. టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ ఓ మోస్తరు స్కోర్తో (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన జగదీశ్ సుచిత్ సుడిగాలి ఇన్నింగ్స్తో (12 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకోగా.. వారియర్స్ ఇన్నింగ్స్లో కార్తీక్ 5, అజిత్ కార్తీక్ 9, సుమిత్ కుమార్ 19, మనోజ్ భంగడే 0, కృష్ణప్ప గౌతమ్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. మిస్టిక్ బౌలర్లలో మోనిశ్ రెడ్డి, పృథ్వీ రాజ్ షెకావత్, యశోవర్దన్ తలో రెండు వికెట్లు.. విజయ్కుమార్, శరణ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు. -
భారీ సిక్సర్ బాదిన ద్రవిడ్ కొడుకు.. వీడియో వైరల్
మహారాజా ట్రోఫీ-2024లో భారత మాజీ హెడ్కోచ్ తనయుడు సమిత్ మరోసారి నిరాశపరిచాడు. ఈ లీగ్లో మైసూరు వారియర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సమిత్.. శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో మాత్రం సుమిత్ అద్బుతమైన సిక్స్తో మెరిశాడు. అతడు కొట్టిన షాట్కు అందరూ ఫిదా అయిపోయారు. మైసూర్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన జ్ఞానేశ్వర్ నవీన్.. నాలుగో బంతిని సమిత్కు ఔట్సైడ్ హాఫ్ స్టంప్ దిశగా షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో సమిత్ మిడాన్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే సమిత్ ఔటయ్యాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడిన సమిత్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మైసూరు వారియర్స్పై బెంగళూరు బ్లాస్టర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మహారాజా ట్రోఫీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ದ್ರಾವಿಡ್ ಸರ್ ಮಗ ಗುರು ಇವ್ರು..🤯🔥ಈ ಸಿಕ್ಸ್ ಗೆ ಒಂದು ಚಪ್ಪಾಳೆ ಬರ್ಲೇಬೇಕು..👏👌📺 ನೋಡಿರಿ Maharaja Trophy KSCA T20 | ಬೆಂಗಳೂರು vs ಮೈಸೂರು | LIVE NOW #StarSportsKannada ದಲ್ಲಿ#MaharajaTrophyOnStar@maharaja_t20 pic.twitter.com/ROsXMQhtwO— Star Sports Kannada (@StarSportsKan) August 16, 2024 -
గంభీర్కు చెప్పడానికి నేనెవరిని?: జై షా
ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కోచ్ ఉండాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. టీమిండియాలోని ఆటగాళ్లలో ఎక్కువ మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారని.. అలాంటపుడు ఒకే కోచ్ ఉంటే ఇంకాస్త మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నాడు. ఒక్కసారి ప్రధాన శిక్షకుడిగా ఓ వ్యక్తిని నియమించిన తర్వాత అతడి నిర్ణయానుసారమే అంతా జరుగుతుందని తెలిపాడు.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ను నియమించింది బీసీసీఐ. అయితే, ఇందుకు సంబంధించిన ప్రకటనకు ముందు.. టీమిండియాకు ముగ్గురు కోచ్లు ఉండబోతున్నారనే వార్తలు వచ్చాయి. టెస్టు, వన్డే, టీ20లకు వేర్వేరు వ్యక్తులు శిక్షణ ఇవ్వనున్నట్లు వదంతులు వ్యాపించాయి.గంభీర్కు చెప్పడానికి నేనెవరిని?ఈ విషయంపై జై షా తాజాగా స్పందించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘కోచ్ను నియమించుకున్న తర్వాత.. అతడి అభిప్రాయాన్ని మేము గౌరవించాల్సి ఉంటుంది. అతడు చెప్పిందే వినాలి కూడా!.. గౌతం గంభీర్ను హెడ్కోచ్గా సెలక్ట్ చేసుకున్న తర్వాత.. అతడి దగ్గరికి వెళ్లి.. ‘నువ్వు ఈ ఫార్మాట్కు సరిగ్గా కోచింగ్ ఇవ్వలేవు’ అని చెప్పడానికి నేనెవరిని?ఒకవేళ తను మూడు ఫార్మాట్లకు కోచ్గా ఉండాలని భావిస్తే.. మేమెందుకు అడ్డుచెప్తాం? అయినా భారత జట్టులో 70 శాతం మంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూనే ఉన్నారు. కాబట్టి వేర్వేరు కోచ్లు అవసరం లేదనే భావిస్తున్నాం.ఎన్సీఏ కోచ్లు ఉన్నారు కదా!అంతేకాదు.. ఒకవేళ హెడ్కోచ్ విరామం తీసుకున్నా మాకు బ్యాకప్ కోచ్లు ఉండనే ఉన్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ కోచ్(ఎన్సీఏ)లు మాకు సేవలు అందిస్తారు. ఉదాహరణకు.. రాహుల్ ద్రవిడ్ బ్రేక్ తీసుకున్నపుడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా వ్యవహరించాడు కదా! ఇప్పుడు కూడా అంతే!’’ అని జై షా చెప్పుకొచ్చాడు.కాగా శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్కోచ్గా ప్రస్థానం మొదలుపెట్టిన గౌతం గంభీర్.. టీ20 సిరీస్ 3-0తో క్లీన్స్వీప్ విజయం అందుకున్నాడు. అయితే, వన్డే సిరీస్లో మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. ఇరవై ఏడేళ్ల తర్వాత టీమిండియా లంకు వన్డే సిరీస్(0-2)ను కోల్పోయింది. తదుపరి రోహిత్ సేన బంగ్లాదేశ్ స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: ’టీ20 ఫార్మాట్ క్రికెట్ను నాశనం చేస్తోంది.. ఇండియా మాత్రం లక్కీ’ -
రోహిత్ శర్మతో కలిసి పనిచేయడం నా అదృష్టం: ద్రవిడ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవమని ద్రవిడ్ కొనియాడాడు. కాగా ద్రవిడ్- రోహిత్ శర్మ ఆధ్వర్యంలోనే టీ20 వరల్డ్కప్-2024ను భారత జట్టు సొంతం చేసుకుంది.గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్కప్ ట్రోఫీని వీరిద్దరి కలిసి టీమిండియాకు అందించారు. అంతేకాకుండా వీరిద్దరి కాంబనేషన్లో భారత జట్టు ఎన్నో అద్భుతాలు విజయాలు సాధించింది. టీ20 వరల్డ్కప్ విజయంతో భారత హెడ్కోచ్గా ద్రవిడ్ ప్రస్ధానం ముగిసింది. భారత హెడ్కోచ్గా తప్పుకున్న అనంతరం ద్రవిడ్ వరుస ఇంటర్వ్యూలతో బీజీబీజీగా ఉన్నాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్రవిడ్ మాట్లాడుతూ.. "రోహిత్ శర్మతో కలిసి పనిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. రోహిత్ ఒక అద్భుతమైన కెప్టెన్. అతడు తన కెప్టెన్సీతో టీమిండియాను అభిమానులకు మరింత చేరువ చేశాడు. అంతేకాకుండా కెప్టెన్సీ స్కిల్స్తో అందరని ఆకట్టుకున్నాడు. జట్టులో అందరని ఒకేలా చూస్తాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతవారణం ప్రశాంతంగా ఉందంటే అందుకు కారణం రోహిత్ శర్మనే. భారత జట్టులో విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్ లాంటి చాలా మంది సీనియర్ క్రికెటర్లు ఉన్నారు. వారందరూ సూపర్ స్టార్లు. కానీ వీరిందరూ ఎటువంటి ఈగోలు లేకుండా కెప్టెన్ అడుగుజాడల్లానే నడుస్తున్నారు. రోహిత్తో పాటు ఈ సీనియర్ ఆటగాళ్ల గ్రూప్ జట్టును ముందుకు నడిపిస్తుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా స్టార్ ప్లేయర్స్కు ఇగో ఎక్కువగా ఉంటుందనుకుంటారు. వారితో కలసి పని చేయడం కష్టమని చాలా భావిస్తారు. కానీ భారత జట్టులో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లు ఎంత గొప్ప క్రికెటర్లైనా చాలా వినయంగా ఉంటారని" పేర్కొన్నాడు. -
రాహుల్ ద్రవిడ్ గల్లీ క్రికెట్..
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టు ప్రధాన కోచ్గా ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. అయితే భారత హెడ్కోచ్గా తప్పుకున్న తర్వా ద్రవిడ్ తన ఫ్రీ టైమ్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మిస్టర్ డిఫెండ్బుల్ తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీని సందర్శించాడు. ఈ క్రమంలో అక్కడ గ్రౌండ్ స్టాఫ్తో కలిసి ద్రవిడ్ సరదాగా క్రికెట్ ఆడాడు. టెన్నిస్ బాల్తో బౌలింగ్ కూడా ద్రవిడ్ చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా గతంలో ద్రవిడ్ ఎన్సీఏ హెడ్గా కూడా పని చేశాడు. ఇక టీ20 వరల్డ్కప్-2024 విజయం తర్వాత టీమిండియా హెడ్కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకున్నాడు. 2021 నుంచి 2024 వరకు ద్రవిడ్ భారత ప్రధాన కోచ్గా పనిచేశాడు. Rahul Dravid playing cricket with the Ground Staffs of NCA. 🌟 pic.twitter.com/y2tXJKGNbW— Johns. (@CricCrazyJohns) August 11, 2024 -
నా కోచింగ్ కెరీర్లో చేదు అనుభవం అదే: ద్రవిడ్
టీమిండియా విజయవంతమైన కోచ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి స్థానంలో హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన ఈ కర్ణాటక లెజెండ్ మార్గదర్శనంలో.. టీమిండియా అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్గా ఎదిగింది. ద్వైపాక్షిక సిరీస్లలో వరుస విజయాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.ఘనంగా వీడ్కోలుఅయితే, టీ20 ప్రపంచకప్-2022(సెమీస్), ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్- 2021-23, వన్డే వరల్డ్కప్-2023(ఫైనల్) టోర్నీలో మాత్రం టైటిల్ గెలవలేకపోయింది. ఈ క్రమంలో ఒక సందర్భంలో ద్రవిడ్ను వెంటనే కోచ్గా తొలగించాలనే డిమాండ్లూ వచ్చాయి. అయితే, బీసీసీఐ మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. వరల్డ్కప్-2023 తర్వాత అతడి పదవీకాలం ముగిసినా.. టీ20 ప్రపంచకప్-2024 వరకు కోచ్గా కొనసాగాలని కోరింది.ఇందుకు అంగీకరించిన ద్రవిడ్కు ఘనమైన వీడ్కోలు లభించింది. ప్రపంచకప్-2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు చాంపియన్గా అవతరించింది. తద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి భారత్కు ఐసీసీ టైటిల్ దక్కింది. అయితే, సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్ ఓడిపోవడం మాత్రం ద్రవిడ్ కెరీర్లోని చేదు అనుభవం అని చెప్పవచ్చు.ఆ ఓటమే బాధించిందిఅయితే, రాహుల్ ద్రవిడ్ మాత్రం అన్నింటికంటే సౌతాఫ్రికా గడ్డ మీద ఓటమే.. తన కోచింగ్ కెరీర్లో ఎదురైన ఘోర పరాభవం అంటున్నాడు. ప్రొటిస్ జట్టును తమ సొంతదేశంలో ఓడించే అవకాశం చేజారడం ఎన్నటికీ మర్చిపోలేనన్నాడు. చిరస్మరణీయ విజయం సాధించే క్రమంలో జరిగిన పొరపాట్ల వల్ల భారీ మూల్యమే చెల్లించామని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘నా క్రికెట్ కోచింగ్ కోరీర్లో అన్నింటికంటే ఘోర పరాభవం.. సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడం. సెంచూరియన్లో జరిగిన తొలి మ్యాచ్లో మేము విజయం సాధించాం. అదే జోరులో రెండో టెస్టును ఘనంగా ఆరంభించాం. కానీ సౌతాఫ్రికా అనూహ్య రీతిలో తిరిగి పుంజుకుని గెలుపును లాగేసుకుంది.మూడో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేసింది. మా జట్టులోని కొందరు సీనియర్లు అప్పుడు అందుబాటులో లేరు. రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు. అయినా.. రెండు, మూడో టెస్టుల్లో విజయానికి చేరువగా వచ్చాం. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. అయితే, ఈ సిరీస్ ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. కోచ్గా ఎలా నన్ను నేను సంభాళించుకోవాలో తెలుసుకున్నా.ఓటమీ మంచికేఅన్ని మ్యాచ్లు మనమే గెలవలేం. ఒక్కోసారి ఓటమే మనకు ఎంతో నేర్పిస్తుంది’’ అని రాహుల్ ద్రవిడ్ 2021-22 సిరీస్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక గౌతీ హయాంలో తొలిసారిగా శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అయితే, వన్డే సిరీస్లో మాత్రం 0-2తో ఆతిథ్య లంక జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. 27 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంకకు వన్డే సిరీస్ను సమర్పించుకుంది.చదవండి: IPL 2025: ఈ ముగ్గురు కెప్టెన్లను రిలీజ్ చేయనున్న ఫ్రాంఛైజీలు! -
రాజస్థాన్ రాయల్స్ కోచ్గా రాహుల్ ద్రవిడ్.. ఇంగ్లండ్కు సంగక్కర..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రాయల్స్ యాజమాన్యం ద్రవిడ్తో బేరసారాలన్ని పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుత హెడ్ కోచ్ కుమార సంగక్కర ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు హెడ్ కోచ్గా వెళ్లనున్న నేపథ్యంలో ద్రవిడ్ ఎంపికకు వేగంగా పావులు కదులుతున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ మాట్ పాట్స్ గత నెలలో తన పదవికి రాజీనామా చేయగా.. ఆ స్థానాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంగక్కరతో భర్తీ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఈసీబీ నుంచి కానీ సంగక్కర నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ తెర వెనుక పావులు వేగంగా కదులుతున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ సంగక్కరతో సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ పరిమిత ఓవర్ల జట్లకు తాత్కాలిక హెడ్ కోచ్గా మార్కస్ ట్రెస్కోధిక్ను నియమించింది. సెప్టెంబర్ 11 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లకు ట్రెస్కోథిక్ ఇంగ్లండ్ జట్టు కోచ్గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్లు ముగిసిన అనంతరం పర్మెనెంట్ కోచ్గా సంగక్కర నియమితుడయ్యే అవకాశం ఉంది. ఈసీబీతో లైన్ క్లియెర్ కాగానే సంగక్కర రాయల్స్తో తెగదెంపులు చేసుకోవచ్చు. సంగక్కర రాయల్స్తో నాలుగేళ్ల పాటు కొనసాగాడు. మరోవైపు ద్రవిడ్కు సైతం రాయల్స్ పాత బంధం ఉంది. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో అతను రాయల్స్ కెప్టెన్గా, కోచ్గా వ్యవహరించాడు. ఈ అనుబంధం కారణంగా రాయల్స్ యాజమాన్యం ద్రవిడ్వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
టీమిండియా సూపర్స్టార్లలో అతడే బెస్ట్: ద్రవిడ్
టీమిండియా సీనియర్ క్రికెటర్ల గురించి మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టును ఐకమత్యంగా ఉంచడంలో వారు పెద్దన్న పాత్ర పోషిస్తారని కొనియాడాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకు కలుపుగోలుతనం ఎక్కువని.. డ్రెస్సింగ్ రూం వాతావరణం ప్రశాంతంగా ఉండటానికి తనే ప్రధాన కారణం అని పేర్కొన్నాడు.ఇక రోహిత్ శర్మ మాదిరే మిగతా టీమిండియా సూపర్ స్టార్లు సైతం ఎంతో నిరాడంబరంగా ఉంటారని ద్రవిడ్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్, కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వీరిద్దరి హయాంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్-2022(సెమీస్), ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 ఫైనల్, వన్డే వరల్డ్కప్-2023(ఫైనల్) ఆడింది.అయితే, ఈ ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవలేకపోయింది. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలన్న ద్రవిడ్-రోహిత్ కల నెరవేరింది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచింది. ఫలితంగా కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిశాయి.ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్గా తన పని సులువు కావడానికి జట్టులోని సీనియర్లే కారణమని పేర్కొన్నాడు. ‘‘ఈ విజయానికి క్రెడిట్ నేనొక్కడినే తీసుకోలేను. ఈ జట్టును తీర్చిదిద్దిన కోచ్లు, సీనియర్లు, కెప్టెన్లు అందరికీ చెందుతుంది. రోహిత్తో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవం.ఈ రెండున్నరేళ్లకాలంలో అతడిని దగ్గరిగా గమనించారు. అద్భుతమైన నాయకుడు. జట్టులోని ఆటగాళ్లంతా ఎల్లప్పుడూ అతడి వైపే ఉంటారు. అంతలా వారి అభిమానం చూరగొన్నాడు. చాలా మంది.. భారత క్రికెట్ సూపర్స్టార్లు ఇగో కలిగి ఉంటారని అనుకుంటారు. వారిని మేనేజ్ చేయడం కోచ్లకు కష్టం అనుకుంటారు.అయితే, ఇక్కడ అంతా రివర్స్ ఉంటుంది. సూపర్స్టార్లు అయినప్పటికీ వాళ్లెంతో నిరాడంబరంగా ఉంటారు. పూర్తిస్థాయిలో మ్యాచ్లకు సన్నద్ధమవుతారు. అందుకే వాళ్లు ఈరోజు సూపర్స్టార్లుగా క్రేజ్ సంపాదించారు. జట్టును ఒక్కటిగా ఉంచడంలో వారిదే కీలక పాత్ర. విరాట్ కోహ్లి, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్.. వీళ్లంతా డ్రెసింగ్ రూంలో సానుకూల వాతావరణం ఉండేలా చూస్తారు’’ అని రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు. -
అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ.. 2 పరుగుల దూరంలో
కొలంబో వేదికగా ఆదివారం శ్రీలంకతో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో రోహిత్ మరో 2 పరుగులు సాధిస్తే వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో రోహిత్ 10,767 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఈ రికార్డు ప్రస్తుతం టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్(10,768) పేరిట ఉంది. ఇప్పుడు కొలంబో వన్డేలో హిట్మ్యాన్ కేవలం రెండు పరుగులు చేస్తే ద్రవిడ్ను అధిగమిస్తాడు.ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(18,426) అగ్రస్ధానంలో ఉండగా.. ఆ తర్వాతి స్ధానాల్లో విరాట్ కోహ్లి(13,872), సౌరవ్ గంగూలీ(11, 221) ఉన్నారు. ఇక తొలి వన్డేను టైగా ముగించిన భారత్.. రెండో వన్డేలో ఎలాగైనా గెలిచి కమ్బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.చదవండి: IPL 2025: హార్దిక్ పాండ్యాకు షాక్!.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా సూర్యకుమార్? -
‘రోహిత్ ఎవరినో తిడుతున్నాడు.. ఆరోజు ద్రవిడ్కు నిద్ర పట్టలేదు’
2015, 2016, 2017, 2019, 2022.. 2023.. ఐసీసీ వరల్డ్కప్ టోర్నీల్లో భారత్కు ఎదురైన చేదు అనుభవాలను మరిపిస్తూ.. నెల రోజుల క్రితం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచింది. ఫలితంగా దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.ఈ టైటిల్ సాధించిన తర్వాత హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ తన ప్రస్థానం ముగించగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. విండీస్లోని బార్బడోస్లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో కోహ్లి- రోహిత్ అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అయితే, యావత్ భారతావని మాత్రం వరల్డ్కప్ హీరోలు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే, బార్బడోస్లో హారికేన్ బీభత్సం వల్ల టీమిండియా రాక రెండు రోజులు ఆలస్యమైంది. ఉధృతమైన వర్షాల కారణంగా విమాన సర్వీసులు రద్దు కాగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి తక్షణ చర్యలు చేపట్టింది. వాతావరణం కాస్త తేలికపడగానే AIC24WC చార్టెడ్ ఫ్లైట్ను బార్బడోస్కు పంపింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు కవరేజ్కు వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా ఇదే విమానంలో భారత్కు తీసుకువచ్చారు.ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ ప్రొడ్యూసర్ ఒకరు నాటి విమాన ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకాలను తాజాగా గుర్తుచేసుకున్నారు. ‘‘ఆరోజు బార్బడోస్ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణం. పదహారు గంటల జర్నీ. అయితే, ఆరోజు ఎవరూ కూడా ఆరు గంటలకు మించి నిద్రపోలేదు. అంతా సందడి సందడిగా సాగింది.ఆటగాళ్లలో చాలా మంది ప్రెస్ వాళ్లను కలవడానికి వచ్చారు. వారితో ముచ్చట్లు పెట్టారు. అందరి కంటే రోహిత్ శర్మ ఎక్కువసార్లు బయటకు వచ్చాడు. బిజినెస్ క్లాస్ అంతా విజయ సంబరంతో అల్లరి అల్లరిగా ఉండటంతో రాహుల్ ద్రవిడ్ ఒకానొక సమయంలో ఎకానమీ క్లాస్కు వచ్చేశాడు. బిజినెస్ క్లాస్లో నిద్రపట్టడం లేదని..ఎకానమీ క్లాస్లో నిద్రపోయాడు.నేను నిద్రపోతున్న సమయంలో రోహిత్ శర్మ ఎవరినో తిడుతున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. లేచి చూస్తే నిజంగానే రోహిత్ అక్కడ ఎవరినో ఏదో అంటున్నాడు. అయితే, తనదైన స్టైల్లో సరదాగానే వారికి చివాట్లు పెడుతూ ఆటపట్టిస్తున్నాడు. ఆ తర్వాత రిషభ్ పంత్, హార్దిక్పాండ్యా అందరూ బయటకు వచ్చారు. మీడియా వాళ్లతో ముచ్చటించారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు’’ అని పేర్కొన్నారు. -
‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ శుభారంభం చేశాడు. శ్రీలంకపై సిరీస్ విజయంతో తన ప్రస్థానాన్ని ఘనంగా మొదలుపెట్టాడు. గతంలో కోచ్గా పనిచేసిన అనుభవం లేకున్నా తొలి ప్రయత్నంలోనే విజయవంతమయ్యాడు. టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ జట్టుతో అనుకున్న ఫలితం రాబట్టాడు.‘సూపర్స్టార్ల’తో అంత వీజీ కాదుఅయితే.. ఇప్పటిదాకా అంతా బాగానే ఉన్నా వన్డే సిరీస్ రూపంలో గంభీర్కు గట్టి సవాల్ ఎదురుకానుంది. ప్రత్యర్థి శ్రీలంక బలాబలాలను పక్కనపెడితే.. ‘సూపర్స్టార్ల’ను అతడు ఏ మేరకు డీల్ చేయగలడన్నది ఆసక్తికరంగా మారింది. వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా అందుబాటులోకి వచ్చాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీ నేపథ్యంలో లంకతో సిరీస్కు ప్రాధాన్యం ఏర్పడగా.. సెలవులు ముగించుకుని జట్టుతో చేరారు. అసలే దూకుడు స్వభావం ఉన్న గంభీర్.. వీరిద్దరిని ఎలా కలుపుకొనిపోతాడన్నది క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సన్నిహిత వర్గాలు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.‘‘ఇది అంత సులువేమీ కాదు. ఫ్రాంఛైజీ క్రికెట్లో లాగా నేను బాస్ను... నువ్విది చేయాల్సిందే అంటే కుదరదు. ఇక్కడి వాతావరణం వేరుగా ఉంటుంది. ఇండియన్ డ్రెస్సింగ్రూం విషయానికొస్తే.. ప్రతి ఒక్క ప్లేయర్తో ఓపికగా మాట్లాడాల్సి ఉంటుంది. అవసరమైతే స్వయంగా ఫోన్ చేయాల్సి ఉంటుంది. అందరూ లక్షాధికారులేద్రవిడ్ కూడా అలాగే చేసేవాడు. హెడ్కోచ్గా వచ్చిన కొత్తలో అతడు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటికి.. ఇప్పటికి భారత క్రికెట్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడ ఉన్న ఆటగాళ్లలో అందరూ లక్షాధికారులే. అంతేకాదు ఐపీఎల్లో కెప్టెన్లుగా పనిచేస్తున్న వారూ ఉన్నారు. వాళ్లందరినీ సాఫీగా డీల్ చేయడం గంభీర్ ముందున్న అతిపెద్ద సవాలు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.ఐపీఎల్లో సత్తా చాటికాగా టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011 గెలిచిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన గంభీర్.. రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్గా కొనసాగాడు. కోల్కతా నైట్ రైడర్స్ను రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్గా నిలిపిన ఈ ఢిల్లీ బ్యాటర్.. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది కోల్కతా ఫ్రాంఛైజీ మెంటార్గా బాధ్యతలు స్వీకరించి.. జట్టు మూడోసారి ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆగష్టు 2 నుంచి మొదలుఈ నేపథ్యంలోనే టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. కోచ్గా శ్రీలంక పర్యటనతో కెరీర్ మొదలుపెట్టిన గౌతం గంభీర్.. 2-0తో టీ20 సిరీస్ గెలిచాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం నామమాత్రపు మూడో టీ20 జరుగనుండగా.. ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. కాగా రోహిత్, కోహ్లిలు వరల్డ్క్లాస్ క్రికెటర్లు అంటూ ప్రశంసించిన గంభీర్.. వారితో కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్న విషయం తెలిసిందే.చదవండి: గిల్ కంటే ఆ విషయంలో అతడే బెటర్.. ఇద్దరినీ ఆడిస్తే తప్పేంటి? -
నువ్వు తేలిగ్గా తలొగ్గే రకం కాదు: గంభీర్కు ద్రవిడ్ సందేశం
‘‘హలో గౌతం.. భారత క్రికెట్ ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన విధుల నిర్వహణకు సమాయత్తమైన నీకు స్వాగతం పలుకుతున్నా. మూడు వారాల క్రితం.. టీమిండియా హెడ్కోచ్గా నేను కన్న కలలు బార్బడోస్లో నెరవేరాయి. ఇక ముంబైలో అందుకు సంబంధించిన సంబరాల సాయంత్రాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.అయితే, జట్టుతో నా స్నేహం, నేను పోగు చేసుకున్న మధుర జ్ఞాపకాలు మరెన్నో ఉన్నాయి. భారత జట్టు ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించబోతున్న నీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు లభించాలని కోరుకుంటున్నాను. నీ హయాంలోప్రతి జట్టులోనూ నువ్వు కోరుకున్న ఆటగాళ్లు పూర్తి ఫిట్గా ఉండి.. నీ ప్రణాళికలకు అనుగుణంగా అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తున్నా.నువ్వు తేలికగా తలొగ్గేరకం కాదునిజానికి కోచ్ అంటే.. మనం సాధారణంగా ఆలోచించే దానికంటే కూడా మరింత తెలివిగా.. ఇంకాస్త స్మార్ట్గా ఉండాలి. నీకు ఇవన్నీ తెలుసుననుకో. నీ సహచర ఆటగాడిగా మైదానంలో నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు. నీ బ్యాటింగ్ పార్ట్నర్గా.. తోటి ఫీల్డర్గా నీ నైపుణ్యాలు దగ్గరగా చూశాను. ప్రత్యర్థి ముందు నువ్వు తేలికగా తలొగ్గేరకం కాదు.ఐపీఎల్లోనూ నీలో ఇలాంటి ఆటతీరునే చూశాను. గెలుపు కోసం నువ్వు ఎంత పరితపిస్తావో నాకు తెలుసు. యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపి వారిలో విజయకాంక్ష రగిల్చే తీరు అద్భుతం. టీమిండియా కోచ్గానూ నువ్విలాగే ఉండాలి. భారీ అంచనాల నడుమ కీలక బాధ్యత తీసుకోబోతున్నావు.జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు, సహాయక సిబ్బంది.. గెలిచినా.. ఓడినా నీ వెన్నంటే ఉంటారు. విజయాల్లోనే కాదు.. చేదు అనుభవాలను సమంగా పంచుకుంటారు. కొన్నిసార్లు మనం వెనకడుగు వేయాల్సి వస్తుంది. నీ స్వభావానికి ఇది విరుద్ధమని నాకు తెలుసు. అయితే, చిరునవ్వుతో అన్నింటినీ జయించగలవు.ఇక్కడ ఏ చిన్న సంఘటన అయినా అభిమానులకు ఆసక్తికరమే. కాబట్టి నీ కదలికలన్నీ గమనిస్తూనే ఉంటారు. ఏదేమైనా భారత క్రికెట్ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చగల సత్తా నీకు ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ గౌతం’’ అంటూ టీమిండియా మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ గౌతం గంభీర్కు ప్రత్యేక సందేశం పంపించాడు.గంభీర్ భావోద్వేగంశ్రీలంక పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టు నూతన ప్రధాన కోచ్గా గంభీర్ ప్రస్థానం మొదలుకానున్న వేళ.. తన వారసుడిని ప్రత్యేకంగా విష్ చేశాడు. ఇందుకు స్పందించిన గౌతీ.. ద్రవిడ్కు ధన్యవాదాలు తెలిపాడు. తాను ఇంత వరకు చూసిన నిస్వార్థమైన క్రికెటర్లలో ఒకడైన రాహుల్ భాయ్ నుంచి మెసేజ్ అందుకోవడం సంతోషంగా ఉందన్నాడు. సాధారణంగా తాను ఎమోషనల్కానని.. అయితే, రాహుల్ భాయ్ మాటలు విని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యానని తెలిపాడు.నిజాయితీ, పారదర్శకతతో వ్యవహరిస్తూ ద్రవిడ్ విడిచి వెళ్లిన వారసత్వాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. దేశంతో పాటు రాహుల్ భాయ్ను కూడా సగర్వంగా తలెత్తుకునేలా చేస్తానని గంభీర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య శనివారం నాటి తొలి టీ20తో ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానుంది. 𝗣𝗮𝘀𝘀𝗶𝗻𝗴 𝗼𝗻 𝘁𝗵𝗲 𝗯𝗮𝘁𝗼𝗻 𝘄𝗶𝘁𝗵 𝗰𝗹𝗮𝘀𝘀 & 𝗴𝗿𝗮𝗰𝗲! 📝To,Gautam Gambhir ✉From,Rahul Dravid 🔊#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/k33X5GKHm0— BCCI (@BCCI) July 27, 2024 -
ద్రవిడ్ కొడుకుకు సూపర్ ఆఫర్
టీమిండియా తాజా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్కు బంపరాఫర్ లభించింది. కర్ణాటక టీ20 లీగ్ (కేఎస్సీఏ టీ20 టోర్నీ) వేలంలో సుమిత్ను గత సీజన్ రన్నరప్ మైసూరు వారియర్స్ సొంతం చేసుకుంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన సమిత్ను రూ. 50000 సొంతం చేసుకున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది.18 ఏళ్ల సమిత్ ఇప్పటివరకు సీనియర్ స్థాయి క్రికెట్ ఆడలేదు. సీనియర్లతో కలిసి ఆడేందుకు సమిత్కు ఇది మంచి అవకాశం. సమిత్ను కొనుగోలు చేసిన మైసూరు జట్టుకు టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్ కరుణ్ నాయర్ సారథ్యం వహించనున్నాడు. ఇదే జట్టులో టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ ఉన్నాడు. వీరి సహవాసంలో సమిత్ మరింత రాటుదేలే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్ కూచ్ బెహర్ ట్రోఫీ గెలిచిన కర్ణాటక అండర్-19 జట్టులో సమిత్ సభ్యుడిగా ఉన్నాడు. మిడిలార్డర్లో ఉపయోకరమైన బ్యాటర్గా పేరున్న సమిత్ ఇటీవలి కాలంలో అద్బుతంగా ఆడుతూ తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ కౌంటీ జట్టు లాంకాషైర్తో జరిగిన మ్యాచ్లోనూ సమిత్ పర్వాలేదనిపించాడు.ఇదిలా ఉంటే, సమిత్ తండ్రి రాహుల్ ద్రవిడ్ ఇటీవలే టీమిండియాను టీ20 వరల్డ్కప్ గెలిపించి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ద్రవిడ్ సుమారు రెండున్నర సంవత్సరాల పాటు భారత హెడ్ కోచ్గా వ్యవహరించాడు. ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. గంభీర్ ఆథ్వర్యంలో టీమిండియా రేపటి నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది.మైసూర్ వారియర్స్ జట్టు:కరుణ్ నాయర్, కార్తీక్ సీఏ, మనోజ్ భండగే, కార్తీక్ ఎస్యూ, సుచిత్ జే, గౌతమ్ కే, విద్యాధర్ పాటిల్, వెంకటేష్ ఎం, హర్షిల్ ధర్మాని, గౌతమ్ మిశ్రా, ధనుష్ గౌడ, సమిత్ ద్రవిడ్, దీపక్ దేవాడిగ, సుమిత్ కుమార్, స్మయన్ శ్రీవాస్తవ, జాస్పర్ ఈజే, ప్రసిద్ధ్ కృష్ణ , మహమ్మద్ సర్ఫరాజ్ అష్రఫ్. -
'అతడెప్పుడూ క్రెడిట్ కోసం పనిచేయలేదు'.. ద్రవిడ్పై ప్రశంసల వర్షం
టీ20 వరల్డ్కప్-2024 కప్ విజయనంతరం టీమిండియా హెడ్కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్కప్ను భారత్కు అందించి హెడ్కోచ్గా తన ప్రస్ధానాన్ని ద్రవిడ్ ముగించాడు.ద్రవిడ్ కెప్టెన్గా ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నాడో అదే కరేబియన్ దీవుల్లో కోచ్గా అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. ద్రవిడ్తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పదవీకాలం కూడా టీ20 వరల్డ్కప్తో ముగిసింది. అయితే ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ను మాత్రం బీసీసీఐ కొనసాగించింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్పై భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ప్రశంసల వర్షం కురిపించాడు. ద్రవిడ్ ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి అని మాంబ్రే కొనియాడాడు. కాగా ద్రవిడ్ స్ధానంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు."రాహుల్ ద్రవిడ్తో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇండియా-ఏ, అండర్-19 జట్లు, ఎన్సీఎ, ఆపై భారత సీనియర్ జట్లకు అతడితో కలిసి పనిచేశాను. దాదాపు 8-9 నుంచి ద్రవిడ్తో కలిసి ప్రయాణం చేస్తున్నాను. కోచ్గా ద్రవిడ్ ఎప్పుడూ ఆధికారం చెలాయించలేదు.ఆటగాళ్ల వెనకే ఉండి ప్రోత్సహించేవాడు. ఇదొక్కటి చాలు రాహుల్ అంటే ఏంటో తెలియడానికి. అతడు ఆటగాళ్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టేవాడు. ఎప్పుడూ ప్లేయర్లు కోసమే ఆలోచించేవాడు. ద్రవిడ్ ఎప్పుడూ క్రెడిట్ కోసం పనిచేయలేదు.ఏ క్రెడటైనా జట్టుకు, కెప్టెన్కే దక్కాలని ద్రవిడ్ ఆశించేవాడు. ద్రవిడ్, రోహిత్ ఇద్దరూ కలిసి సమన్వయంతో పనిచేసి భారత్కు వరల్డ్కప్ను అందించారు" అని హిందూస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాస్ పేర్కొన్నాడు. -
'T20 వరల్డ్కప్లో అదే నా ఫేవరేట్ మూమెంట్.. నా కళ్లలో నీళ్లు తిరిగాయి'
టీ20 వరల్డ్కప్-2024 విజేతగా నిలిచి భారత్ తమ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సగర్వంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికారు. వీరిముగ్గురు మాత్రమే కాకుండా రాహుల్ ద్రవిడ్ సైతం భారత హెడ్కోచ్గా తన ప్రస్ధానాన్ని ముగించాడు. గతేడాది వన్డే వరల్డ్కప్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన టీమిండియాకు.. 7 నెలల తిరిగకముందే పొట్టి ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్ను ది గ్రేట్ వాల్ అందించాడు. విజయనంతరం భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొంతమంది ఆటగాళ్లు అయితే కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భావోద్వేగ క్షణాలను యావత్తు ప్రపంచం వీక్షించింది. ఇక తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20 వరల్డ్కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్లో తన ఫేవరేట్ మూమెంట్ను ఎంచుకున్నాడు. సెలబ్రేషన్స్ సమయంలో విరాట్ కోహ్లి ట్రోఫీని రాహుల్ ద్రవిడ్కు అందజేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగినట్లు అశ్విన్ చెప్పుకొచ్చాడు."నిజంగా ఇది యావత్తు భారత్ గర్వించదగ్గ విజయం. మా 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అయితే ఈ టోర్నీలో విజయం సాధించిన తర్వాత ఓ మూమెంట్ నా మనసును హత్తుకుంది. విరాట్ కోహ్లి.. రాహుల్ ద్రవిడ్కు పిలిచి ట్రోఫీని అందిండచడం నన్ను ఎంతగానే ఆకట్టుకుంది.ఇదే నా ఫేవరేట్ మూమెంట్. ద్రవిడ్ వెంటనే కప్ను అందుకుని గట్టిగా కేకలు వేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణం నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ద్రవిడ్ నుంచి ఇటువంటి సెలబ్రేషన్స్ ఇప్పటివరకు నేను చూడలేదు. అయితే అందుకు ఓ కారణముంది.2007లో కరేబియన్ దీవుల వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత ద్రవిడ్ తన కెప్టెన్సీ నుంచి వైదొలగాడు. అప్పటి నుంచి జట్టులో కేవలం ఆటగాడిగా కొనసాగాడు. కెప్టెన్సీ నుంచి తప్పకున్నప్పటకి ద్రవిడ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒకవేళ భారత జట్టు మ్యాచ్ ఓడిపోయినా అందరూ ద్రవిడ్నే టార్గెట్ చేసేవారు. అప్పుడు తను కెప్టెన్గా సాధించలేకపోయింది.. ఇప్పుడు కోచ్గా సాధించి చూపించాడని" తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. -
రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్..!?
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. హెడ్కోచ్గా భారత్కు టీ20 వరల్డ్కప్ అందించిన రాహుల్ ద్రవిడ్పై రాజస్తాన్ రాయల్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 సీజన్కు ముందు అతడిని తమ జట్టు హెడ్కోచ్గా నియమించాలని రాయల్స్ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే రాజస్తాన్ యాజమాన్యం ద్రవిడ్తో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవిడ్ కూడా రాజస్తాన్ ఆఫర్పై సముఖంగా ఉన్నట్లు వినికిడి. కాగా ఈ మిస్టర్ డిఫెండ్బుల్కు రాజస్తాన్తో మంచి అనుబంధం ఉంది. గతంలో రాజస్తాన్కు కెప్టెన్గా, మెంటార్గా ద్రవిడ్ పనిచేశాడు. 2012, 2013 సీజన్లలో రాజస్తాన్ సారథిగా ద్రవిడ్ వ్యవహరించాడు.అనంతరం 2014. 2015 సీజన్లలో రాజస్తాన్ మెంటార్గా తన సేవలు అందించాడు. ఇప్పుడు మరోసారి మరోసారి రాయల్స్తో జత కట్టేందుకు మిస్టర్ వాల్ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. .కాగా ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్కు కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్తో పాటు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సంగ్కర నుంచి కోచింగ్ బాధ్యతలు ద్రవిడ్ తీసుకునే అవకాశముంది. కాగా కోచ్గా కూడా ద్రవిడ్కు అపారమైన అనుభవం ఉంది. 2016, 2017 సీజన్లలో ఢిల్లీ డేర్డెవిల్స్( ఢిల్లీ క్యాపిటల్స్)కు హెడ్కోచ్గా ద్రవిడ్ పనిచేశాడు. ఆ తర్వాత 2019 వరకు భారత అండర్-19 జట్టు హెడ్కోచ్గా ద్రవిడ్ కొనసాగాడు. ఆ తర్వాత 2021-2024 వరకు టీమిండియా హెడ్ కోచ్గా ద్రవిడ్ బాధ్యతలు నిర్వర్తించాడు. -
రోహిత్, విరాట్ వల్లే ద్రవిడ్ అలా..: వీవీఎస్ లక్ష్మణ్
వన్డే వరల్డ్కప్-2003 టోర్నీలో టీమిండియా సభ్యుడు.. నాడు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో చేజారిన ట్రోఫీ.. ఆ మరుసటి ఎడిషన్ అంటే 2007 నాటికి అతడు కెప్టెన్ అయ్యాడు.అయితే, ఈసారి మరీ ఘోరంగా భారత జట్టు తొలి రౌండ్లోనే ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఓ దిగ్గజ ఆటగాడికి తీవ్ర నిరాశే మిగిలింది.అయితే, టీ20 ప్రపంచకప్-2024 రూపంలో తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడే అవకాశం వచ్చింది. అయితే, ఈసారి ఆటగాడిగా కాకుండా కోచ్గా ఉన్నాడు ఆ వ్యక్తి.ఇంకేముంది ఎప్పుడూ గంభీరంగా ఉండే అతడు కూడా చిన్నపిల్లాడిలా మారిపోయాడు. ఎన్నడూ లేని విధంగా ఈ ఆనంద సమయంలో తన భావోద్వేగాలను వ్యక్తపరిచాడు. ట్రోఫీని ముద్దాడుతూ మురిసిపోయాడు. అవును మీరు ఊహించిన పేరే.. రాహుల్ ద్రవిడ్.రోహిత్ సేన వరల్డ్కప్ టైటిల్ గెలిచిన సమయంలో కనిపించిన ఈ దృశ్యాలు అభిమానులనే కాదు తమనూ ఆకట్టుకున్నాయంటున్నాడు టీమిండియా సొగసరి బ్యాటర్, ద్రవిడ్ సహచర ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్. ఈ మాజీ క్రికెటర్ ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు.రోహిత్, విరాట్ వల్లే ద్రవిడ్ అలా..ఈ నేపథ్యంలో వీడియో సందేశం ద్వారా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ద్రవిడ్ను అలా ట్రోఫీతో చూడటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ‘‘రాహుల్తో చాలా ఏళ్లపాటు కలిసి క్రికెట్ ఆడాను.మామూలుగా అతడు తన భావోద్వేగాలను వ్యక్తపరచడు. అయితే, ఈసారి ట్రోఫీ గెలిచినపుడు మాత్రం భిన్నంగా కనిపించాడు. రోహిత్, విరాట్ కోహ్లి ద్రవిడ్ చేతికి ట్రోఫీని ఇవ్వడం చూడముచ్చటగా అనిపించింది.ఇక ద్రవిడ్ సెలబ్రేట్ చేసుకున్న విధానం చూస్తే.. ఈ విజయం మనకెంత ప్రత్యేకమో అందరికీ అర్థమయ్యే ఉంటుంది’’ అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. తద్వారా భారత్ ఖాతాలో ఐదో ఐసీసీ ట్రోఫీ చేరింది. ఇక ఈ టోర్నీ తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్గా తప్పుకోగా.. గౌతం గంభీర్తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది బీసీసీఐ.చదవండి: మిస్టరీ గర్ల్తో హార్దిక్ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
KKR: ద్రవిడ్ కాదు.. కోల్కతా కొత్త మెంటార్గా దిగ్గజ బ్యాటర్?
కోల్కతా నైట్ రైడర్స్.. ఐపీఎల్లోని విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరొందింది. ముంబై ఇండియన్స్(5), చెన్నై సూపర్ కింగ్స్(5) తర్వాత అత్యధిక టైటిల్స్ సాధించిన రెండో జట్టుగా నిలిచింది.టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014 సీజన్లలో ట్రోఫీ గెలిచిన కోల్కతా(కేకేఆర్).. ఈ ఏడాది చాంపియన్గా నిలిచింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐపీఎల్-2024 విజేతగా అవతరించింది.ఈ విజయంలో కోచ్ చంద్రకాంత్ పండిట్తో పాటు మెంటార్గా వ్యవహరించిన గంభీర్ పాత్ర కూడా కీలకం. ఈ నేపథ్యంలోనే అతడు టీమిండియా ప్రధాన కోచ్గా ఎంపిక కావడం విశేషం.అందుకే రాహుల్ ద్రవిడ్ స్థానంలోఇంతవరకు శిక్షకుడిగా పనిచేసిన అనుభవం లేకపోయినా కేకేఆర్ విజయం సాధించిన తీరుతో బీసీసీఐ గౌతీపై నమ్మకం ఉంచింది. అందుకే రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని అతడితో భర్తీ చేసింది. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గౌతీ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టు కొత్త మెంటార్ ఎవరా అని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గంభీర్ స్థానంలో ద్రవిడ్ ఈ బాధ్యతలు స్వీకరిస్తాడని ఇన్నాళ్లుగా ప్రచారం జరగగా.. తాజాగా కొత్త పేరు తెరమీదకు వచ్చింది.కేకేఆర్ మెంటార్గా సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ జాక్వెస్ కలిస్ కేకేఆర్ మెంటార్గా రానున్నాడని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఐపీఎల్లోనూ సత్తా చాటిన విషయం తెలిసిందే.కేకేఆర్ 2012, 2014లో టైటిల్ గెలిచిన జట్టులో కలిస్ సభ్యుడు. గంభీర్ కెప్టెన్సీలో కోల్కతాకు ఆడిన ఈ కేప్టౌన్ స్టార్.. 2015లో బ్యాటింగ్ కన్సల్టెంట్గా కొత్త అవతారం ఎత్తాడు.అనంతరం నాలుగు సీజన్ల పాటు కేకేఆర్ హెడ్ కోచ్గానూ వ్యహరించాడు. ఈ పదవి నుంచి వైదొలిగన తర్వాత సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్గా కలిస్ నియమితుడయ్యాడు.ఈ నేపథ్యంలో తమతో సుదీర్ఘ అనుబంధం ఉన్న జాక్వెస్ కలిస్తో తిరిగి జట్టు కట్టేందుకు కేకేఆర్ యాజమాన్యం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గంభీర్ స్థానంలో కలిస్ను తమ మెంటార్గా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: హెడ్ కోచ్ గంభీర్కు షాకిచ్చిన బీసీసీఐ!.. ఏమిజరిగిందంటే? -
దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు..! వాళ్లతో పాటే నేనూ..!
-
హెడ్ కోచ్గా గంభీర్ జీతం అన్ని కోట్లా?.. ద్రవిడ్ కంటే రెట్టింపు?!
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. భారత జట్టు హెడ్ కోచ్గా సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. కాగా రెండుసార్లు ప్రపంచకప్(2007, 2011) గెలిచిన భారత జట్టులో భాగమైన గౌతీ రాజకీయాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు.రెండు పడవల మీద ప్రయాణం చేయలేననిబీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన ఈ ఢిల్లీ బ్యాటర్.. కామెంటేటర్గానూ కొనసాగాడు. అయితే, రెండు పడవల మీద ప్రయాణం చేయలేనని చెబుతూ రాజకీయాలకు స్వస్తి పలికిన గంభీర్.. పూర్తి స్థాయిలో క్రికెట్కే అంకితమయ్యాడు.ఐపీఎల్ జట్లు లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా వ్యవహరించి జట్లను విజయాల బాట పట్టించాడు. లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరడంలో గౌతీ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది కేకేఆర్ చాంపియన్గా నిలవడంలోనూ ఈ మాజీ కెప్టెన్ సేవలు మరువలేనివి.ఈ క్రమంలోనే గౌతం గంభీర్ భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో గౌతీ జీతం ఎంత ఉంటుందన్న అంశం క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది.టీ20 ప్రపంచకప్-2024 అందించికాగా 2021 నుంచి ఇప్పటి దాకా రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వెళ్తూ వెళ్తూ భారత్కు టీ20 ప్రపంచకప్-2024 అందించిన కోచ్గా ద్రవిడ్ పేరు సంపాదించాడు.ఇక హెడ్ కోచ్గా అతడికి బీసీసీఐ ఏడాదికి రూ. 12 కోట్ల మేర వేతనం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే గంభీర్ మాత్రం ఇంతకు రెట్టింపు జీతం పొందనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.కేకేఆర్ మెంటార్గా గంభీర్కు రూ. 25 కోట్లు?కాగా కేకేఆర్ మెంటార్గా గంభీర్కు రూ. 25 కోట్లు ఆ జట్టు యాజమాన్యం పారితోషికంగా అందించిందని అప్పట్లో వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో.. హెడ్ కోచ్గా వచ్చినందున ఆ పదవికి రాజీనామా చేయాలి కాబట్టి.. బోర్డు ఈ మొత్తం తనకు జీతంగా చెల్లించాలని గౌతీ కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.జీతంతో పాటు అన్ని సదుపాయాలువార్తా సంస్థ IANS వివరాల ప్రకారం.. 2019 వరకు ప్రధాన కోచ్కు రోజూవారీ వేతనం కింద రూ. 21 వేలు(విదేశీ పర్యటనలో రూ. 42 వేలు), బిజినెస్ క్లాస్లో ప్రయాణం, హోటళ్లలో బస, అందుకు సంబంధించిన ప్రతీ ఖర్చు బీసీసీఐ చెల్లించేదని తెలుస్తోంది.అయితే, హెడ్ కోచ్ వేతనం విషయంలో బేరసారాలకు ఆస్కారం ఉందనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంభీర్ నియామకానికి సంబంధించిన ప్రకటన కూడా ఆలస్యం జరిగిందని నెట్టింట ప్రచారం సాగింది.ఎట్టకేలకు గంభీర్ ఆశించిన మొత్తానికి బీసీసీఐ సరేనన్న తర్వాతే అతడు పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అయితే, ఇంత వరకు టీమిండియా హెడ్ కోచ్ జీతం గురించి ఎక్కడా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం.అదే నా లక్ష్యం: గంభీర్‘‘నా చిరునామా భారతదేశం. దేశానికి సేవ చేయగలడం నా జీవితంలో కలిగిన అతి పెద్ద అదృష్టం. ఇప్పుడు మరో రూపంలో పునరాగమనం చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఎప్పటిలాగే ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేయడమే నా లక్ష్యం.140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను టీమిండియా మోస్తుంది. వారి కలలు నిజంచేసేందుకు నా స్థాయిలో ఏదైనా చేసేందుకు నేను సిద్ధం’’ అని భారత జట్టు కొత్త హెడ్ కోచ్గా నియమితుడైన తర్వాత గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా గంభీర్ మూడున్నరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు.చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లూ, నేనూ సమానమే!
ఆటలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ ‘జెంటిల్మేన్’నే అని మరోసారి నిరూపించుకున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన క్యాష్ రివార్డులో తనకు దక్కాల్సిన మొత్తాన్ని సగానికి తగ్గించుకుని గొప్పతనాన్ని చాటుకున్నాడు.సహాయక సిబ్బందితో పాటే తానూ అంటూ హుందాగా వ్యవహరించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్గా నియమితుడైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ‘వాల్’ మార్గదర్శనంలో టీమిండియా టీ20 వరల్డ్కప్-2022లో సెమీస్, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23లో ఫైనల్, వన్డే వరల్డ్కప్-2023లో ఫైనల్ చేరింది. కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది.అయితే, తాజా పొట్టి ప్రపంచకప్ ఎడిషన్ ద్వారా ద్రవిడ్ కల నెరవేరింది. అతడి గైడెన్స్లో రోహిత్ సేన వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా భారత్ ఖాతాలో ఐదో ఐసీసీ టైటిల్ చేరింది.దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా ఇలా మేజర్ టోర్నీలో చాంపియన్గా నిలవడంతో బీసీసీఐ ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది. ఇందులో.. కప్ గెలిచిన ప్రధాన జట్టులోని పదిహేను మంది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ ద్రవిడ్కు రూ. 5 కోట్ల మేర కానుకగా ఇవ్వాలని భావించింది.అదే విధంగా... బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్లకు ఒక్కొక్కరికి రూ. 2.5 కోట్ల మేర ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ద్రవిడ్ మాత్రం తనకు దక్కిన మొత్తాన్ని సగానికి తగ్గించమని బోర్డును కోరినట్లు తెలుస్తోంది.సహాయక కోచ్ల మాదిరే తనకు కూడా రెండున్నర కోట్ల రూపాయలు చాలంటూ.. మిగిలిన సగాన్ని తిరిగి తీసుకోమని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.‘‘మిగతా సహాయక సిబ్బంది మాదిరే రాహుల్ కూడా తనకు బోనస్గా కేవలం రెండున్నర కోట్లు చాలని చెప్పాడు. మేము అతడి సెంటిమెంట్ను గౌరవిస్తాం’’ అని పేర్కొన్నాయి.దటీజ్ ద్రవిడ్.. అప్పుడు కూడా ఇలాగే..రాహుల్ ద్రవిడ్ గతంలో అండర్-19 జట్టుకు కోచ్గా వ్యవహరించాడు. 2018లో అతడి మార్గదర్శనంలో యువ భారత్ ప్రపంచకప్ గెలిచింది.ఈ నేపథ్యంలో నాడు బీసీసీఐ ద్రవిడ్కు రూ. 50 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. ఆటగాళ్లకు రూ. 30 లక్షలు ఇచ్చింది.ఈ క్రమంలో ద్రవిడ్ తనకు ఎక్కువ మొత్తం వద్దని.. కోచింగ్ స్టాఫ్ అందరికీ సమానంగా రివార్డును పంచాలని కోరాడు. ఫలితంగా బోర్డు ద్రవిడ్తో పాటు మిగతా సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేశారు.చదవండి: శుభవార్త చెప్పిన పేసర్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే! -
నా వర్క్ వైఫ్: ద్రవిడ్ను ఉద్దేశించి రోహిత్ భావోద్వేగ పోస్ట్.. వైరల్
‘‘ప్రియమైన రాహుల్ భాయ్.. నా మనసులోని భావాలను వెల్లడించేందుకు సరైన పదాల కోసం వెతుక్కొంటున్నాను. అయితే, ఈ నా ప్రయత్నం వృథా అవుతుందేమో!ఏదేమైనా చెప్పాలనుకున్నది చెప్పి తీరుతా..! కోట్లాది మంది అభిమానుల్లాగే నేను కూడా చిన్ననాటి నుంచి నిన్ను చూస్తూ పెరిగా.అయితే, వారెవరికీ రాని అవకాశం నాకు వచ్చింది. నిన్న దగ్గరగా చూడటమే కాదు.. నీతో కలిసి పనిచేసే భాగ్యం దక్కింది.క్రికెట్లో నువ్వొక శిఖరానివి. కఠిన శ్రమకు ఓర్చే ఆటగాడివి. అందుకు ప్రతిఫలంగా ఎన్నెన్నో ఘనతలు సాధించావు.అయితే, మా దగ్గరికి వచ్చే సమయంలో ఆటగాడిగా నీ ఘనతలన్నీ పక్కన పెట్టి.. కేవలం కోచ్గా మాత్రమే వ్యవహరిస్తావు.నీలాంటి గొప్ప ఆటగాడితో మమేకమయ్యే క్రమంలో మాకు ఎలాంటి సందేహాలు, సంశయాలు లేకుండా చేస్తూ మేము సౌకర్యంగా ఫీలయ్యేలా చేస్తావు.ఆటకు, మాకు నువ్విచ్చిన గొప్ప బహుమతి అది. ఆట పట్ల నీకున్న ప్రేమ నీ హుందాతనానికి కారణం. నీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.ఎన్నో మధుర జ్ఞాపకాలు పోగు చేసుకున్నాను. పనిలో ఉన్నపుడు తనను కూడా పట్టించుకోకుండా నేను నీతోనే ఉంటానని నా భార్య ఎల్లప్పుడూ అంటూ ఉంటుంది.రాహుల్ భాయ్ ‘నీ వర్క్ వైఫ్’(పనిలో సహచరులు, పరస్పర గౌరవం, మద్దతు, విశ్వసనీయత కలిగి ఉండేవారు) అంటూ నన్ను ఆటపట్టిస్తుంది. ఇలా అనిపించుకోవడం కూడా నా అదృష్టమే అని భావిస్తా. నిన్ను చాలా మిస్సవుతాను. అయితే, కలిసి కట్టుగా మనం సాధించిన విజయం పట్ల సంతోషంగా ఉన్నాను.రాహుల్ భాయ్ నా నమ్మకం, నా కోచ్, నా స్నేహితుడు అని అనుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా?! సెల్యూట్’’ అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు.భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకొంటున్న రాహుల్ ద్రవిడ్ను ఉద్దేశించి భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. రాహుల్ భాయ్తో తన అనుబంధం చిరస్మరణీయంగా నిలిచిపోతుందంటూ కోచ్ పట్ల ప్రేమను చాటుకున్నాడు.ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీతో ద్రవిడ్, తాను, తన కుటుంబం దిగిన ఫొటోలను రోహిత్ శర్మ షేర్ చేశాడు. కాగా విరాట్ కోహ్లి తర్వాత భారత జట్టు సారథిగా రోహిత్ పగ్గాలు చేపట్టగా.. హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించాడు.కల నెరవేరిందివీరిద్దరి హయాంలో టీమిండియా ఆసియా వన్డే కప్ గెలవడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్, వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ చేరింది. అయితే, తాజాగా ముగిసిన టీ20 వరల్డ్కప్తో ఈ దిగ్గజాల కల నెరవేరింది.అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ మెగా టోర్నీలో ద్రవిడ్ మార్గదర్శనంలోని రోహిత్ సేన ట్రోఫీ గెలిచింది. సౌతాఫ్రికాను ఓడించి ఐసీసీ టైటిల్ను కైవసం చేసుకుంది.ఇక ఈవెంట్ తర్వాత తాను బాధ్యతల నుంచి వైదొలుగుతానని ఇప్పటికే ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి గురయ్యాడు.మీరిద్దరూ అరుదైన వజ్రాలుఇందుకు స్పందిస్తూ.. ‘‘మీరిద్దరూ అరుదైన వజ్రాలు’’ అంటూ టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కామెంట్ చేశాడు. కాగా వరల్డ్కప్-2024 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్ ముగిసే వరకూ కెప్టెన్గా తనే కొనసాగనున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సైతం ఇంటర్నేషనల్ టీ20 కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించారు. చదవండి: శుభవార్త చెప్పిన పేసర్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే! -
IPL: కేకేఆర్ మెంటార్గా రాహుల్ ద్రవిడ్..?
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్రైడర్స్ కొత్త మెంటార్ అన్వేషణలో పడింది. తమ జట్టుకు మెంటార్గా వ్యవహరించాలని కేకేఆర్ టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ను కోరినట్లు తెలుస్తుంది. ఇందుకు ద్రవిడ్ సైతం సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. ఒకవేళ ఈ డీల్ కుదిరితే ద్రవిడ్ వచ్చే సీజన్ (2025) నుంచి కేకేఆర్ మెంటార్గా వ్యవహరిస్తాడు.మరోవైపు టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు అధికారికంగా ప్రకటించడమే తరువాయి. హెడ్ కోచ్ పదవి విషయంలో గంభీర్-బీసీసీఐ మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. గంభీర్ తన సహాయ సిబ్బందిని ఎంచుకునే విషయంలోనూ బీసీసీఐ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తుంది. గంభీర్ సక్సెస్ఫుల్ బ్యాటర్ కావడంతో తనే బ్యాటింగ్ కోచ్గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. గంభీర్ తనకు ఇష్టం వచ్చిన వారికి బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లుగా ఎంచుకోవచ్చు.టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బౌలింగ్ కోచ్గా ఎవరుంటారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపడితే కేకేఆర్ మెంటార్షిప్ను వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ద్రవిడ్ కేకేఆర్ మెంటార్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కాగా, టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్కప్ 2024తో ముగిసిన విషయం తెలిసిందే. -
BCCI: గంభీర్ మనసులో ఏముంది?.. ఆలస్యానికి కారణం ఇదే
టీమిండియా కొత్త ప్రధాన కోచ్ ప్రకటనపై సస్పెన్స్ వీడటం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ అంశంపై ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.కాగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసినా.. టీ20 ప్రపంచకప్-2024 వరకు అతడినే కొనసాగించింది బీసీసీఐ. ఈ క్రమంలో టైటిల్ గెలిచి సగర్వంగా తన బాధ్యతల నుంచి వైదొలిగాడు ద్రవిడ్.ఇక ఇప్పటికే ద్రవిడ్ స్థానంలో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కోచ్గా వస్తాడనే ప్రచారం జరుగుతున్నా బీసీసీఐ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.అయితే, శ్రీలంకతో సిరీస్ నాటికి మాత్రం పూర్తిస్థాయి కోచ్ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే వెల్లడించారు. అయినప్పటికీ హెడ్కోచ్ ప్రకటన విషయంలో ఆలస్యం జరుగుతోంది.బ్యాటింగ్ కోచ్గానూ గంభీర్?అయితే, జీతం విషయంలో గంభీర్- బోర్డు మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని.. ఆలస్యానికి కారణం ఇదేనంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. హెడ్ కోచ్గా ఉండటంతో పాటు బ్యాటింగ్ కోచ్గానూ గంభీర్ వ్యవహరించే అవకాశం ఉందని.. అయితే, ఈ విషయమై చర్చలు కొలిక్కి రాలేదని తెలిపింది.కాగా రాహుల్ ద్రవిడ్తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ పదవీ కాలం కూడా ముగియనున్నది. ఈ నేపథ్యంలో సహాయక సిబ్బంది నియామకంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని గంభీర్ బీసీసీఐకి షరతు విధించినట్లు సమాచారం.అదే విధంగా వరల్డ్క్లాస్ బ్యాటర్ అయిన తాను ఉండగా.. ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ అవసరం లేదనే యోచనలో అతడు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. గంభీర్తో పాటు డబ్ల్యూవీ రామన్ కూడా హెడ్ కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ ఎవరన్న అంశంలో అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే క్లారిటీ రానుంది.చదవండి: BCCI: రోహిత్కు రూ. 5 కోట్లు.. మూడు టైటిళ్ల ధోనికి ఎంత? కపిల్ డెవిల్స్ పాపం! -
నాన్సెన్స్.. నేనెందుకు రంజీల్లో ఆడాలి: ఇషాన్ కిషన్
చేతులారా తన కెరీర్ను తానే నాశనం చేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్. భారత జట్టు ఓపెనర్గా తనదైన శైలిలో రాణిస్తూ ప్రతిభ నిరూపించుకున్న ఈ జార్ఖండ్ వికెట్ కీపర్.. కొంత కాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.గతేడాది నవంబరులో సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే వ్యక్తిగత కారణాలు చెప్పి స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్ పట్ల బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని జట్టు నుంచి నిష్క్రమించిన ఈ యంగ్ ఓపెనర్.. కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో.. తుదిజట్టులో ఆడే అవకాశం రానందు వల్లే ఇషాన్ ఇంటిబాట పట్టాడని.. ఈ క్రమంలో బోర్డుతో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం.. ఇషాన్ దేశవాళీ క్రికెట్(రంజీ)లో ఆడితేనే మళ్లీ జాతీయ జట్టులో అడుగుపెట్టగలడని స్పష్టం చేశాడు.అయితే, ఇషాన్ కిషన్ మాత్రం ఈ ఆదేశాలను బేఖాతరు చేశాడు. జార్ఖండ్ తరఫున అతడు రంజీ బరిలో దిగుతాడని స్థానిక బోర్డు ఆశించినా.. అతడి నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీసీసీఐ.. ఇషాన్ కిషన్ను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది.ఈ విషయంపై తాజాగా ఇషాన్ కిషన్ స్పందించాడు. తాను రంజీలు ఆడకపోవడానికి గల కారణం వెల్లడించాడు. ‘‘ఒక ఆటగాడు చాలా కాలం తర్వాత పునరాగమనం చేయాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధన ఉంది.అయితే, నన్ను కూడా ఇలా ఆడమనడంలో అర్థం లేదనిపించించింది. ఎందుకంటే నేను కాస్త విరామం తీసుకున్నా. అది సాధారణ సెలవు మాత్రమే.అలాంటపుడు నేనెందుకు రంజీలు ఆడాలి. ఆడే ఓపిక లేదనే కదా అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నా. అయినా.. జాతీయ జట్టుకు ఆడకుండా విరామం తీసుకుంటే.. రంజీలు ఆడమంటూ ఆదేశించడం ఏమిటో అర్థం కాలేదు.నేను బాగుంటే గనుక ఇంటర్నేషనల్ క్రికెట్ కంటిన్యూ చేసేవాడిని కదా. అప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను. ఈ రోజు కూడా అంతా బాగుందని చెప్పే పరిస్థితిలో లేను.క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా. అయినా నా విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోందనే ప్రశ్న పదే పదే నా మదిని తొలుస్తోంది.నేను బాగా ఆడుతున్నా.. కేవలం బ్రేక్ తీసుకున్నాననే కారణంగా ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు’’ అని ఇషాన్ కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ ఈ మేరకు తన మనసులోని భావాలు పంచుకున్నాడు.కాగా రంజీలు ఆడకుండా ఎగ్గొట్టిన ఇషాన్ కిషన్.. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగడం గమనార్హం. ఈ సీజన్లో అతడు 14 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 320 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ అతడిని పరిగణనలోకి కూడా తీసుకోలేదు.ఇక వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నారు. ఇక ఈ మెగా టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. -
BCCI: ద్రవిడ్కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లిలకు ఎంతంటే?
టీ20 ప్రపంచకప్-2024 విజేతగా నిలిచిన టీమిండియాపై ప్రశంసలతో పాటు కనక వర్షం కూడా కురిసింది. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.దాదాపు పదకొండేళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 125 కోట్ల రివార్డును బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఈ మొత్తం పంచుకునే క్రమంలో ఎవరెవరికి ఎంత దక్కనుందనే విషయం గురించి ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.ఒక్కొక్కరికి రూ. 5 కోట్లు!ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వరల్డ్కప్ ప్రధాన జట్టులో భాగమైన ఆటగాళ్లతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్లకు ఒక్కొక్కరికి రూ. 5 కోట్ల మేర ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రికెటర్లకు కూడా ఈ మేర భారీ మొత్తం దక్కనుంది.వారికి 2.5 కోట్లు? అదే విధంగా ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. ఇక కోచింగ్ సిబ్బందిలో ప్రధానమైన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్లకు రూ. 2.5 కోట్ల మేర రివార్డు దక్కనుంది.మిగిలిన వాళ్లలో ముగ్గురు ఫిజియోథెరపిస్టులు కమలేశ్ జైన్, యోగేష్ పర్మార్, తులసీ రామ్ యువరాజ్.. ఇద్దరు మసాజర్లు రాజీవ్ కుమార్, అరుణ్ కనాడే.. అదే విధంగా కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయిలకు ఒక్కొక్కరికి రూ. 2 కోట్ల మేర బీసీసీఐ నజరానా ఇవ్వనుంది.చీఫ్ సెలక్టర్కు ఎంతంటే?వీరి సంగతి ఇలా ఉంటే.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా సెలక్షన్ కమిటీలోని మిగిలిన నలుగురు సభ్యులకు రూ. కోటి చొప్పున ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.అదే విధంగా.. వీడియో అనలిస్టులు, మీడియా ఆఫీసర్లు, టీమిండియా లాజిస్టిక్ మేనేజర్ సహా ఈ మెగా టోర్నీలో భాగమైన 42 మంది సభ్యులకు వారి బాధ్యతలకు అనుగుణంగా రివార్డులోని కొంత మొత్తాన్ని అందించనున్నట్లు సమాచారం.సౌతాఫ్రికాను ఓడించికాగా రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్-2024 చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.ఈ ఐసీసీ ఈవెంట్లో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలవగా.. ఫైనల్లో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్.ట్రావెలింగ్ రిజర్వ్స్: రింకూ సింగ్, శుబ్మన్ గిల్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.చదవండి: IND vs SL: భారత్తో టీ20 సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్గా సనత్ జయసూర్య -
రాహుల్ ద్రవిడ్కు భారతరత్న ఇవ్వాలి: సునీల్ గవాస్కర్
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్కప్-2024తో భారత హెడ్ కోచ్గా ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. టీ20 వరల్డ్కప్ విజయంతో తమ కోచ్కు భారత ఆటగాళ్లు ఘనంగా విడ్కోలు పలికారు. భారత్ వరల్డ్కప్ గెలవడంలో ద్రవిడ్ది కూడా కీలక పాత్ర. తన అనుభవంతో జట్టును అద్బుతంగా నడిపించాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ద్రవిడ్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని గవాస్కర్ కోరాడు."రాహుల్ ద్రవిడ్ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరిస్తే బాగుంటుంది. అందుకు ద్రవిడ్ నిజంగా అర్హుడు. వెస్టిండీస్ వంటి కఠిన పరిస్ధితుల్లో ద్రవిడ్ ఒక ఆటగాడిగా, కెప్టెన్గా అన్నో అద్బుత విజయాలను అందుకున్నాడు. విండీస్లో మాత్రమే కాదు. ఇంగ్లండ్ వంటి విదేశీ పరిస్థితుల్లో కూడా కెప్టెన్గా ద్రవిడ్ భారత్కు చారిత్రత్మక విజయాలను అందించాడు. ఇంగ్లండ్లో టెస్ట్ మ్యాచ్ సిరీస్ను గెలుచుకున్న ముగ్గురు భారత కెప్టెన్లలో ద్రవిడ్ ఒకడిగా ఉన్నాడు. అంతేకాకుండా జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్గా పనిచేసి ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత అతడిది. భారత పురుషల సీనియర్ జట్టు కోచ్గా కూడా అతడు అద్భుతాలు సృష్టించాడు. ద్రవిడ్ నేతృత్వంలోనే 17 ఏళ్ల తర్వాత భారత్ పొట్టి వరల్డ్కప్ను సొంతం చేసుకుంది.ఆటగాడిగా, కెప్టెన్గా, కోచ్గా ద్రవిడ్ సాధించిన విజయాలు ప్రతీ భారతీయుడుకు ఆనందనిచ్చాయి. ద్రవిడ్ వరల్డ్కప్ విజయంతో యావత్తు దేశం గర్వించేలా చేశాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి కచ్చితంగా దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించాలి. ఈ విషయంపై ప్రతీ ఒక్కరూ నాతో గొంతు కలపాలి. ప్రభుత్వం కచ్చితంగా అతడు సేవలను గుర్తించాలి. భారతరత్న రాహుల్ శరద్ ద్రవిడ్ అని వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది కాదా? అని గవాస్కర్ తన కాలమ్ మిడ్ డేలో రాసుకొచ్చాడు. -
న్యాయం చేయలేకపోతున్నా.. కోహ్లి ఆవేదన! ద్రవిడ్ రిప్లై ఇదే..
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. లీగ్ దశలో పూర్తిగా విఫలమైన ఈ ‘రన్మెషీన్’.. సెమీస్ వరకు అదే పేలవ ప్రదర్శన కనబరిచాడు.అయితే, అసలైన మ్యాచ్లో మాత్రం దుమ్ములేపాడీ కుడిచేతి వాటం బ్యాటర్. సౌతాఫ్రికాతో ఫైనల్లో అద్భుత అర్ధ శతకంతో రాణించి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా ‘ఫామ్ తాత్కాలికం.. క్లాస్ మాత్రమే శాశ్వతం’ అని నిరూపించి.. తన విలువ చాటుకున్నాడు. అయితే, ఫైనల్ మ్యాచ్కు ముందు తనను ఆత్మవిశ్వాసంతో లేనని.. డీలా పడిపోయానని కోహ్లి పేర్కొన్నాడు.భారంగా తయారయ్యానని కుమిలిపోయాజట్టుకు ఏమాత్రం ఉపయోగపడకుండా భారంగా తయారయ్యానని కుమిలిపోయానని తెలిపాడు. అలాంటి సమయంలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలిచి.. తాను కోలుకునేలా ఉత్సాహాన్ని నింపారని కోహ్లి వెల్లడించాడు.వెస్టిండీస్ నుంచి ట్రోఫీతో తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సమయంలో కోహ్లి సంభాషిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు నేను, నా జట్టుకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నానని రాహుల్ భాయ్కు చెప్పాను.అందుకు బదులుగా.. ‘కీలక సమయంలో నువ్వు తప్పకుండా ఫామ్లోకి వస్తావు’ అని భాయ్ చెప్పాడు. ఆ తర్వాత మ్యాచ్ ఆడే సమయంలో రోహిత్తో కూడా ఇదే మాట చెప్పాను. నేను కాన్ఫిడెంట్గా లేనని చెప్పాను.పట్టుదలగా నిలబడ్డానుఒక్క పరుగు కూడా చేయకపోతే పరిస్థితి ఏమిటని సతమతమయ్యాను. అయితే, ఫైనల్లో మేము వికెట్లు కోల్పోతున్న క్రమంలో పరిస్థితి తగ్గట్లుగా నన్ను నేను మలచుకోవాలని నిర్ణయించుకున్నాను.జట్టు కోసం నా వంతు ప్రయత్నం చేయాలని పట్టుదలగా నిలబడ్డాను. అందుకు తగ్గట్లుగానే ఫలితం కూడా వచ్చింది’’ అని విరాట్ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. కాగా వరల్డ్కప్-2024లో ఫైనల్కు ముందు కోహ్లి చేసిన పరుగులు 75 మాత్రమే.. సౌతాఫ్రికాతో ఫైనల్లో 59 బంతుల్లోనే 76 రన్స్ సాధించాడు. కాగా సమష్టిగా రాణించి టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.చదవండి: Ind vs Zim: వికెట్ కీపర్గా అతడే.. భారత తుది జట్టు ఇదే! -
17 ఏళ్ల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో తొలి జట్టుగా టీమిండియా
నిన్న (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి పొట్టి ప్రపంచకప్ను సాధించింది. 17 ఏళ్ల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో భారత్తో (2007, 2024) పాటు వెస్టిండీస్ (2012, 2016), ఇంగ్లండ్ (2010, 2022) మాత్రమే రెండేసి సార్లు టైటిల్స్ సాధించాయి. ఈ వరల్డ్కప్ విజయంతో భారత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. ఈ ప్రపంచకప్లో అజేయ జట్టుగా నిలిచిన టీమిండియా.. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా (సింగిల్ ఎడిషన్) టైటిల్ సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఏ జట్టు అజేయంగా టీ20 ప్రపంచకప్ గెలవలేదు.కాగా, టీ20 వరల్డ్కప్ 2024 విజయానంతరం భారత ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. తొలుత భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఆనంద బాష్పాలు కార్చిన టీమిండియా క్రికెటర్లు.. ఆతర్వాత తేరుకుని సంబురాలు చేసుకున్నారు.11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ, 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్, 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ గెలవడంతో యావత్ భారతావణి పులకించిపొయింది. ఊరు వాడా విజయోత్సవ సంబురాలు జరిగాయి. టీమిండియా కృష్ణార్జునులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ప్రపంచకప్ టైటిల్ గెలిచి టీ20 ఫార్మాట్కు ఘనంగా వీడ్కోలు పలకగా.. భారత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వరల్డ్కప్ విక్టరీతో ముగిసింది. భారత క్రికెట్ అభిమానులు ఓ పక్క టీమిండియా విజయాన్ని ఆస్వాధిస్తూనే.. మరోపక్క దిగ్గజాల రిటైర్మెంట్ ప్రకటనను తలచుకుంటూ కుమిలిపోయారు. మొత్తంగా నిన్నటి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. -
'ది గ్రేట్ వాల్'.. కప్పు కొట్టించాడు! తన ప్రస్ధానాన్ని ముగించాడు
టీ20 వరల్డ్కప్-2024 ఘనంగా ముగిసింది. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ను టీమిండియా ఎగురేసుకోపోయింది. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కీలకమైన ఫైనల్లోనూ సత్తాచాటింది. శనివారం బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత జట్టు.. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్కప్ను తమ ఖాతాలో వేసుకుంది.భారత జట్టుకు సారథిగా వరల్డ్కప్ ట్రోఫీని అందించాలన్న రోహిత్ శర్మ కల ఎట్టకేలకు నేరవేరింది. అదే విధంగా భారత్కు వరల్డ్కప్ను అందించి తన ప్రస్ధానాన్ని ముగించాలన్న రాహుల్ ద్రవిడ్ కోరిక కూడా ఈ విజయంతో తీరింది. వీరిద్దరితో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం తన కెప్టెన్ సాధించలేకపోయిన ట్రోఫీని.. కనీసం ఆటగాడిగానైనా దక్కించుకున్నందుకు ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్కు విరాట్ కోహ్లి, రోహిత్ గుడ్ బై చెప్పగా.. రాహుల్ ద్రవిడ్ కోచ్గా భారత జట్టుతో తన ప్రయాణాన్ని ముగించాడు.ముగిసిన రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం..భారత పురుషల జట్టు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం ముగిసింది. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నద్రవిడ్.. తన మార్క్ను కోచింగ్లోనూ చూపించాలనుకున్నాడు.ఈ క్రమంలోనే 2021 నవంబరులో రవి శాస్త్రి నుంచి భారత హెడ్కోచ్గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించాడు. అయితే హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. 2013 నుంచి భారత్ను ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని సాధించడమే లక్ష్యంగా ద్రవిడ్ పెట్టుకున్నాడు.ఇది అతడి లక్ష్యం మాత్రమే కాదు అతడి ముందు ఉన్న సవాలు కూడా. ఎందుకంటే ద్వైఫాక్షిక సిరీస్లలో మాత్రమే అదరగొడుతుందని, ఐసీసీ టోర్నీల్లో మాత్రం తేలిపోతుందన్న ఆపఖ్యాతి అప్పటికే భారత్ మూటకట్టుకుంది. ద్రవిడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి.2022 ఆసియాకప్, టీ20 ప్రపంచకప్-2022లోద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ చేరినప్పటకి.. అక్కడ కూడా మళ్లీ నిరాశే. ఆసీస్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఎంతమంది కోచ్లు మారిన ఐసీసీ టోర్నీల్లో భారత్ తల రాత మారలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ద్రవిడ్ ఎక్కడా కుంగిపోలేదు. ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ జట్టును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్కప్-2023లో సత్తాచాటిన టీమిండియా ఫైనల్కు చేరింది. ఆ మెగా టోర్నీలో భారత్ ప్రదర్శన చూసి అంతా కప్ మనదే అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఆసీస్ చేతిలో తుది మెట్టుపై భారత్ బోల్తా పడింది. మళ్లీ ద్రవిడ్కు నిరాశే మొదలైంది. గతేడాది వన్డే వరల్డ్కప్తో తన పదవీ కాలం ముగిసినప్పటికి మరో ఏడాది తన కాంట్రాక్ట్ను పొడిగించాడు. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టే తన ప్రస్ధానాన్ని ముగించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మిషన్ టీ20 వరల్డ్కప్ 2024ను ద్రవిడ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకప్పుడు మైదానంలో బౌలర్ల ఓపికను పరీక్షించిన ద్రవిడ్కు.. ఈ నిరీక్షణ పెద్ద లెక్కేమి కాదు. గతం గతహా అన్నట్లు ఆటగాళ్లను పొట్టి ప్రపంచకప్ కోసం అన్ని విధాలగా సన్నద్దం చేశాడు. సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్తో కలిసి గొప్ప సమన్వయంతో వ్యవహరించిన ద్రవిడ్ 24 మంది ఆటగాళ్లతో కూడిన ఒక పూల్న్ని సిద్దం చేశాడు. ప్రపంచకప్కు కొన్ని నెలల ముందు భారత జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లంతా ఈ పూల్లోని వాళ్లే. ఇందులో నుంచి 15 మంది అత్యుత్తమ ఆటగాళ్లను టీ20 వరల్డ్కప్-2024కు ఎంపిక చేశారు. ఈ 15 మంది సభ్యుల బృందం వరల్డ్కప్లో తలపడేందుకు అమెరికా గడ్డపై అడుగుపెట్టింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్ నుంచే ద్రవిడ్ తెర వెనుకుండి జట్టును నడిపించాడు. రోహిత్కు విలువైన సూచనలు ఇస్తూ ఫైనల్కు చేర్చాడు.ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలోనూ ఆటగాళ్లకు సపోర్ట్గా ఉంటూ కప్పు కొట్టేలా చేశాడు. ఆఖరికి పట్టువదలని విక్రమార్కుడిలా వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడి హెడ్ కోచ్గా తన ప్రయాణాన్ని ముగించాడు. ఆఖరిగా తన కెరీర్లో ఆటగాడిగా, కెప్టెన్గా సాధించని వరల్డ్కప్ టైటిల్ను కోచ్గా సాధించి ద్రవిడ్ చరిత్ర సృష్టించాడు. అందుకే విజయం సాధించిన అనంతరం ద్రవిడ్ కప్ను పట్టుకుని చిన్న పిల్లాడిలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కోచ్గా ద్రవిడ్ రికార్డులు ఇవే..భారత్ 24 టెస్టుల్లో 14 గెలిచి మూడింట్లో ఓడింది.13 వన్డే ద్వైపాక్షిక సిరీస్లలో భారత్ పదింటిని గెలుచుకుంది. అలాగే రోహిత్-ద్రవిడ్ కాంబినేషన్లో ఆడిన 56 మ్యాచ్ల్లో 41 విజయాలున్నాయి.77 టీ20 మ్యాచ్ల్లో 56 గెలిచింది. Never expected idhi #RahulDravid 😂❤️pic.twitter.com/n7o3Ffa83O— Harsha... (@harshatweets03) June 29, 2024 -
టీమిండియా విన్నింగ్ సెలబ్రేషన్స్.. చిన్న పిల్లాడిలా మారిన ద్రవిడ్! వీడియో
టీమిండియా కల నేరవేరింది. గత 11 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ సొంతమైంది. టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించిన భారత జట్టు.. రెండో పొట్టి ప్రపంచకప్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. భారత్కు ఇది రెండో టీ20 వరల్డ్కప్ కాగా.. ఓవరాల్గా నాలుగో ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. అయితే సుధీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. భావోద్వేనికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే కప్ అందుకునే సమయంలో మాత్రం భారత ఆటగాళ్లు నవ్వుతూ సంబరాల్లో మునిగి తేలిపోయారు. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే చిన్నపిల్లాడిలా ప్లేయర్స్తో కలిపి సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఎప్పుడూ సైలెంట్గా ఉండే ద్రవిడ్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకోవడం అందరిని కట్టిపడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ద్రవిడ్కు భారత జట్టు హెడ్ కోచ్గా ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. టీ20 వరల్డ్కప్-2024తో భారత హెడ్కోచ్గా ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. అదే విధంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నారు.Never expected idhi #RahulDravid 😂❤️pic.twitter.com/n7o3Ffa83O— Harsha... (@harshatweets03) June 29, 2024It's that sigh of relief in the end from Rahul Dravid after his aggressive celebration. pic.twitter.com/ZDeXiiLr7k— Aditya Saha (@Adityakrsaha) June 29, 2024 -
T20ప్రపంచ కప్ సొంతం.. ఆనంద క్షణాల్లో ఆటగాళ్ల భావోద్వేగం (ఫొటోలు)
-
భారత్దే టి20 ప్రపంచకప్ .. విశ్వవిజేతగా రోహిత్ సేన (ఫోటోలు)
-
T20 World Cup 2024 Final: ద్రవిడ్కు చివరి మ్యాచ్.. టైటిల్తో వీడ్కోలు పలకండి..!
టీ20 వరల్డ్కప్ 2024 చివరి అంకానికి చేరింది. బార్బడోస్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) జరుగబోయే ఫైనల్తో మెగా టోర్నీ ముగస్తుంది. ఈ మ్యాచ్ టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్కు చివరిది. భారత హెడ్ కోచ్గా ద్రవిడ్ పదవీకాలం ఈ మ్యాచ్తో ముగస్తుంది. టైటిల్ గెలిచి ద్రవిడ్కు ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు. కోచ్గా ద్రవిడ్ టీమిండియాకు ఎనలేని సేవలనందించాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్లు ఆడింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడనుంది. తన హయాంలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ద్రవిడ్కు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదన్న లోటు మిగిలిపోయింది. ఈ ప్రపంచకప్తో ఆ లోటు తీర్చుకోవాలని ద్రవిడ్ పట్టుదలగా ఉన్నాడు. RAHUL DRAVID - ONE FINAL DAY AS HEAD COACH. 🌟- Indian cricket will miss you. pic.twitter.com/Xd7hMZiPBP— Johns. (@CricCrazyJohns) June 28, 2024ఇందుకోసం అతను బాయ్స్ను (టీమిండియా క్రికెటర్లను) సమాయత్తం చేస్తున్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా (రిజర్వ్ డేలో కూడా) భారత్ సంయుక్త విజేతగా నిలుస్తుంది కానీ.. అది ద్రవిడ్కు అంత సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. భారత ఆటగాళ్లకు, అభిమానులకు కూడా సంయుక్త విజేతలుగా నిలవడం ఇష్టం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరిగి. అందులో టీమిండియా విజేతగా నిలవాలని యావత్ భారత దేశం కోరుకుంటుంది. భారత్ చివరిసారి ప్రపంచకప్ టైటిల్ను (వన్డే) 2011లో సాధించింది. టీ20 వరల్డ్కప్ను 2007 అరంగేట్రం ఎడిషన్లో గెలిచింది. ఈ సారి టీమిండియా టైటిల్ సాధిస్తే.. ప్రపంచకప్ కోసం 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లవుతుంది.మరోవైపు ఈ వరల్డ్కప్లో మరో ఫైనలిస్ట్ అయిన సౌతాఫ్రికా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు కోరుకుంటున్నారు. సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క వరల్డ్కప్ టైటిల్ కూడా గెలవలేదు. ఫైనల్స్కు చేరడం కూడా ఆ జట్టుకు ఇదే మొదటిసారి. కాబట్టి సౌతాఫ్రికా కూడా టైటిల్ సాధించే విషయంలో కృత నిశ్చయంతో ఉంది. మరి ఎవరు టైటిల్ గెలుస్తారో వేచి చూడాలి. -
T20 WC: బాధలో విరాట్ కోహ్లి.. ఓదార్చిన ద్రవిడ్! వీడియో వైరల్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్స్లో విరాట్కు మంచి రికార్డు ఉండడంతో ఈ ఏడాది కూడా సత్తాచాటుతాడని అభిమానులు భావించారు. కానీ గయనా వేదికగా ఇంగ్లండ్తో సెమీఫైనల్లో కోహ్లి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో నిరాశతో కోహ్లి తన బ్యాట్ను పంచ్ చేస్తూ పెవిలియన్కు చేరాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో కూడా కోహ్లి తన సహచరులతో దిగులుగా కూర్చోన్నాడు. ఊబికి వస్తున్న కన్నీరును ఆపునకుంటూ విరాట్ మ్యాచ్ను వీక్షించాడు. ఈ క్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. విరాట్ వద్దకు వెళ్లి భుజం తట్టి ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన కోహ్లి 75 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు డక్లు కూడా ఉన్నాయి. Rahul dravid went to Virat as he was looking broken after that dismissal, can't see him like this man 💔 #INDvsENG pic.twitter.com/X0nPoSdF5s— a v i (@973Kohli) June 27, 2024 -
NCA: వీవీఎస్ లక్ష్మణ్ సైతం గుడ్బై!.. కారణం?
భారత క్రికెట్ మేనేజ్మెంట్లో మరో కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు సమాచారం. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్న సంగతి తెలిసిందే. నిజానికి వన్డే వరల్డ్కప్-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినప్పటికీ బీసీసీఐ అభ్యర్థన మేరకు ఈ టీ20 మెగా టోర్నీ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండేందుకు ద్రవిడ్ అంగీకరించాడు.ఈ క్రమంలో అతడి స్థానంలో బాధ్యతలు చేపట్టాల్సిందిగా వీవీఎస్ లక్ష్మణ్ను బోర్డు కోరగా అందుకు అతడు నిరాకరించాడనే వార్తలు వినిపించాయి. అనంతరం రేసులోకి దూసుకొచ్చిన మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రధాన కోచ్గా నియమితుడు కావడం దాదాపుగా ఖరారైపోయింది.కాగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ బాస్గా ఉన్న సమయంలో 2021లో రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టగా.. ఎన్సీఏ హెడ్గా వీవీఎస్ లక్ష్మణ్ నియమితుడయ్యాడు.లక్ష్మణ్ పదవీకాలం ఈ ఏడాదితో ముగిసిపోనున్నట్లు సమాచారం. అయితే, కుటుంబానికి సమయం కేటాయించే క్రమంలో అతడు తన కాంట్రాక్టును పునరుద్ధరించుకునేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది.ఎన్సీఏ హెడ్గా తప్పుకొన్న తర్వాత కామెంట్రీ చేయడంతో పాటు ఐపీఎల్ మెంటార్గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా 2013- 2021 వరకు వీవీఎస్ లక్ష్మణ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్గా ఉన్న విషయం తెలిసిందే.కాగా ఎన్సీఏ చైర్మన్గా తన పదవీకాలంలో వీవీఎస్ లక్ష్మణ్ అబ్బాయిలు, అమ్మాయిల క్రికెట్లోని అన్ని కేటగిరీలపై దృష్టి సారించి జూనియర్ నుంచి సీనియర్ లెవల్ వరకు రాటుదేలేలా శిక్షణ ఇవ్వడంలో సఫలీకృతమయ్యాడని చెప్పవచ్చు. అదే విధంగా.. గాయపడిన ఆటగాళ్ల పునరావాసం, త్వరగా వాళ్లు కోలుకునేలా సహాయక సిబ్బందిని సరైన మార్గంలో నడిపించాడు. ఈ మేరకు ది టెలిగ్రాఫ్ తన కథనంలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2024లో సెమీస్ బెర్తు లక్ష్యంగా ముందుకు సాగుతున్న రోహిత్ సేన.. సోమవారం నాటి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. చదవండి: కోహ్లి, రోహిత్లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! -
Ind vs Ban: అతడిపై వేటు.. సంజూకు ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో శుభారంభం చేసిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. తమ రెండో మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్ను ఓడించి సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ సేన నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చింది. అఫ్గనిస్తాన్తో గురువారం నాటి మ్యాచ్లో విజయానంతరం.. మరుసటి రోజే ప్రాక్టీస్ సెషన్తో బిజీగా గడిపింది.ప్రత్యేకంగా ప్రాక్టీస్ఫామ్లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా కూడా నెట్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శుక్రవారం జరిగిన సెషన్లో సంజూ శాంసన్తో రిజర్వ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా సంజూ శాంసన్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు నెట్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సంజూ బ్యాటింగ్ను వీరిద్దరు పరిశీలించినట్లు రెవ్స్పోర్ట్స్ వెల్లడించింది.అతడిపై వేటు?ఈ నేపథ్యంలో... టోర్నీ ఆరంభం నుంచి బెంచ్కే పరిమితమైన సంజూ శాంసన్కు బంగ్లాదేశ్తో మ్యాచ్లో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శివం దూబే స్థానంలో ఈ కేరళ బ్యాటర్ను తుదిజట్టులోకి తీసుకోనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హిట్టర్గా ఐపీఎల్-2024లో ఇరగదీసిన శివం దూబే వరల్డ్కప్-2024లో మాత్రం బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి 44 పరుగులే చేశాడు. స్ట్రైక్రేటు 83.అందుకే సంజూకు లైన్ క్లియర్ఈ నేపథ్యంలో దూబేను తప్పించి సంజూకు మార్గం సుగమం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో మ్యాచ్ తర్వాత టీమిండియా తదుపరి ఆస్ట్రేలియాతో తలపడనుంది.పటిష్ట ఆసీస్ను ఢీకొట్టేకంటే ముందే తుదిజట్టులో ఈ మేరకు మార్పులతో ప్రయోగం చేయాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. మిడిలార్డర్లో ఉన్న ఒకే ఒక్క లెఫ్టాండర్ బ్యాటర్ శివం దూబే విషయంలో టీమిండియా రిస్క్ చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అంటిగ్వాలోని వివియన్ రిచర్ట్స్ స్టేడియంలో శనివారం టీమిండియా- బంగ్లాదేశ్తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్కు వర్ష సూచన ఉండటం ఆందోళనకరంగా పరిణమించింది.చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి!Barbados ✈️ Antigua #TeamIndia have arrived for today's Super 8 clash against Bangladesh 👌👌#T20WorldCup pic.twitter.com/RM54kEWP3W— BCCI (@BCCI) June 22, 2024 -
కొత్తగా చేయాల్సిందేమీ లేదు.. థాంక్యూ: ద్రవిడ్ కౌంటర్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. బ్యాటర్గా తన ఆట తీరును గుర్తుచేస్తూ.. టీమిండియాను కించపరచాలని చూసిన జర్నలిస్టుకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 లీగ్ మ్యాచ్లను అమెరికాలో ఆడిన టీమిండియా.. సూపర్-8 కోసం వెస్టిండీస్కు చేరుకుంది. ఇందులో భాగంగా గురువారం తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్ వేదికగా అఫ్గనిస్తాన్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ను తన ప్రశ్నలతో ఇరుకున పెట్టాలని ఓ జర్నలిస్టు ప్రయత్నించాడు. ఆటగాడిగా ఇదే వేదికపై ద్రవిడ్కు, టీమిండియాకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేశాడు.‘‘రాహుల్.. మీరు ఇక్కడ మ్యాచ్లు ఆడారు కదా. కానీ 97 టెస్టులో మీకంటూ గొప్ప జ్ఞాపకాలు ఏమీ లేవు’’ అని సదరు జర్నలిస్టు ద్రవిడ్తో అన్నాడు.ఇందుకు బదులిస్తూ.. ‘‘గీజ్.. ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు! ఇక్కడ నాకు కొన్ని మధుర జ్ఞాపకాలు కూడా ఉన్నాయి’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.అయితే, అంతటితో సంతృప్తి చెందని రిపోర్టర్.. ‘‘నేనూ అదే అంటున్నా. ఇక్కడ మీకున్న కాస్తో కూస్తో మంచి జ్ఞాపకాలను గొప్ప జ్ఞాపకాలుగా మార్చుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.దీంతో సహనం కోల్పోయిన ద్రవిడ్.. ‘‘అన్నీ తెలిసిన వ్యక్తి కదా మీరు.. నేను ఇక్కడ కొత్తగా చేయాల్సిందేమీ లేదయ్యా. గతాన్ని మరిచి ముందుకు సాగడంలో నేను ముందుంటాను. వెనక్కి తిరిగి చూసుకుని.. పదే పదే గతాన్ని తవ్వుకోవడం నాకు అలవాటు లేదు.ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను, నా విధి ఏమిటన్న అంశాలపైనే దృష్టి పెడతాను. 97లో ఏం జరిగింది? ఆ తర్వాతి సంవత్సరంలో ఏం జరిగింది? అంటూ కూర్చోను.ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. మంచైనా.. చెడైనా.. రెండింటినీ సమంగా స్వీకరిస్తాను. ఆటగాడిగా ఉన్ననాటి విషయాల గురించి ఆలోచించే సమయమే లేదు. భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తా. ఈ మ్యాచ్ ఎలా గెలవాలన్న విషయం మీద మాత్రమే ఫోకస్ చేస్తా’’ అంటూ ద్రవిడ్ కౌంటర్ ఇచ్చాడు.కాగా 1997లో బార్బడోస్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్టులో రాహుల్ ద్రవిడ్ రెండు ఇన్నింగ్స్లో వరుసగా 78, 2 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నాటి విషయాన్ని గుర్తు చేస్తూ.. సదరు రిపోర్టర్ ద్రవిడ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయగా.. ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం... కోచ్గా జట్టును సరైన దిశలో నడపడం మాత్రమే తన తక్షణ కర్తవ్యమని సమాధానమిచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీ తర్వాత ద్రవిడ్ హెడ్ కోచ్గా వైదొలగనున్న విషయం తెలిసిందే. అతడిస్థానంలో గౌతం గంభీర్ ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.చదవండి: T20 WC 2024: అఫ్గాన్తో అంత ఈజీ కాదు.. కోహ్లి ఫామ్లోకి వస్తాడా? -
BCCI: ద్రవిడ్తో పాటు వాళ్లందరూ అవుట్! గంభీర్ కొత్త టీమ్?
టీమిండియా హెడ్కోచ్గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ నియామకం ఖరారు కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇందుకు సంబంధించిన ప్రక్రియను మంగళవారం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.రవిశాస్త్రి తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వన్డే వరల్డ్కప్-2023 నాటికే ముగిసిపోయింది. అయితే, టీ20 ప్రపంచకప్-2024 పూర్తయ్యే వరకు కొనసాగమని బీసీసీఐ కోరగా.. ద్రవిడ్ అందుకు అంగీకరించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.గంభీర్ వైపే మొగ్గుఈ క్రమంలో బీసీసీఐ ద్రవిడ్ వారసుడి ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ వైపు మొగ్గుచూపిన బోర్డు పెద్దలు.. అతడితో సంప్రదింపులు జరిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.అందుకు అనుగుణంగానే గంభీర్ సైతం తాను టీమిండియా హెడ్కోచ్గా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలపడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. ఈ క్రమంలో గంభీర్ ఒక్కడే ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం ఇంటర్వ్యూకి అతడు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులైన అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్లు గంభీర్ను జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం సహాయక సిబ్బందికి సంబంధించి.. గంభీర్ తన సొంత టీమ్ను ఎంచుకోనున్నట్లు సమాచారం.ద్రవిడ్తో పాటు వాళ్లంతా అవుట్!ద్రవిడ్తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ల పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరందరికి ఉద్వాసన పలికి.. గౌతం గంభీర్ కొత్త వాళ్లను తన టీమ్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్ పేరు వినిపిస్తుండగా.. మిగతా కోచ్లు ఎవరన్న అంశం చర్చనీయంగా మారింది.ఇదిలా ఉంటే.. సలీల్ అంకోలా స్థానంలో కొత్త సెలక్టర్ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గంభీర్కు ఇంత వరకు కోచ్గా పనిచేసిన అనుభవం లేదు. అయితే, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు మెంటార్గా వ్యవహరించాడు గంభీర్. తాజా సీజన్లో కోల్కతా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. -
టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్.. అధికారిక ప్రకటనకు ముహూర్తం ఖరారు
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్) చివరి వారంలో గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో పూర్తి కానున్న నేపథ్యంలో బీసీసీఐ అతి త్వరలోనే రాహుల్ వారసుడి పేరును ప్రకటించవచ్చని సమాచారం.ఒకవేళ ఇదే నిజమైతే 42 ఏళ్ల గంభీర్కు ఫుల్టైమ్ హెడ్ కోచ్గా ఇదే మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్ గతంలో ఏ జట్టుకు ఫుల్టైమ్ హెడ్ కోచ్గా పని చేయలేదు. అయితే అతను మూడు సీజన్ల పాటు ఐపీఎల్లో మెంటార్గా వ్యవహరించాడు. 2022, 2023లో లక్నోతో.. 2024లో కేకేఆర్కు మెంటార్గా పని చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టడంతోనే గంభీర్కు టీమిండియా హెడ్ కోచ్గా అవకాశం వచ్చింది.టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మహేళ జయవర్దనే, జస్టిన్ లాంగర్ లాంటి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. బీసీసీఐ గంభీర్వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు గంభీర్ తన సపోర్టింగ్ స్టాఫ్ను తనే ఎంచుకోనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ గంభీర్ పెట్టిన ఈ షరతుకు బీసీసీఐ అంగీకరిస్తే ప్రస్తుతమున్న సపోర్టింగ్ స్టాఫ్ ద్రవిడ్తో పాటు తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్గా పరస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్గా టి దిలీప్ ఉన్నారు.టీ20 వరల్డ్కప్ 2024 తర్వాత భారత్ జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. గంభీర్ కోచ్గా నియమితుడైతే జింబాబ్వే పర్యటన నుంచే అతని విధులు మొదలవుతాయి. జులై 6 నుంచి 14 మధ్యలో జరిగే జింబాబ్వే పర్యటనలో భారత్ ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. -
అమెరికా-పాక్ థ్రిల్లింగ్ సూపర్ ఓవర్.. ఫాలో అయిన ద్రవిడ్
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికా-పాకిస్తాన్ మధ్య జరిగన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. సూపర్ ఓవరకు దారితీసిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ను ఆతిథ్య అమెరికా చిత్తు చేసింది.యావత్తు క్రికెట్ ప్రపంచం తమ వైపు చూసేలా యూఎస్ఎ అద్బుతమైన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో యూఎస్ఏ కూడా 159/3 స్కోరుతో నిలిచింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. సూపర్ ఓవర్లో మొదటి బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా.. పాక్ 13 పరుగులు మాత్రమే చేసింది. ఇక అమెరికా-పాక్ మధ్య జరిగిన ఈ థ్రిల్లింగ్ పోరుకు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఆకర్షితుడయ్యాడు. న్యూయర్క్లో సబ్వేలో ద్రవిడ్ ప్రయాణిస్తూ ఇరు జట్ల మధ్య జరిగిన సూపర్ ఓవర్ బాల్ టూ బాల్ను తన ఫోన్లో ఫాలోయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.Rahul Dravid following the Super Over of Pakistan vs USA on Espn Cricinfo. [📸: Vishal Misra] pic.twitter.com/eanrXe6my6— Johns. (@CricCrazyJohns) June 6, 2024 -
BCCI: అందుకే తప్పుకొంటున్నా.. ద్రవిడ్ ఫస్ట్ రియాక్షన్
టీమిండియా ప్రధాన కోచ్గా తాను కొనసాగబోవడం లేదని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోచ్గా తన కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు. ఏదేమైనా భారత జట్టు మార్గదర్శకుడిగా వ్యవహరించడం తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఈ మాజీ కెప్టెన్ హర్షం వ్యక్తం చేశాడు.కాగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత ద్రవిడ్ పదవీ కాలం ముగిసినప్పటికీ ఈ మెగా ఈవెంట్ కోసం కొనసాగమని బీసీసీఐ అతడిని కోరిన విషయం తెలిసిందే. ఇందుకు అంగీకరించిన ద్రవిడ్ ప్రస్తుతం టీమిండియాతో కలిసి అమెరికాకు వెళ్లాడు.అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న వరల్డ్కప్-2024 జూన్ 1న మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనున్న తరుణంలో రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా.. ‘‘ప్రతి టోర్నమెంట్ నాకు ముఖ్యమైనదే. టీమిండియా కోచ్గా ప్రతి మ్యాచ్లోనూ పూర్తి ఎఫర్ట్ పెట్టాను. టీ20 వరల్డ్కప్ కూడా అంతే. అయితే, నేను ఇన్చార్జ్గా ఉన్న సమయంలో ఇదే ఆఖరిది కాబట్టి మరింత ప్రాముఖ్యం ఏర్పడింది.నా పనిని పూర్తి నిష్ఠగా.. ప్రేమతో చేశాను. టీమిండియాకు కోచింగ్ ఇవ్వడం అనేది నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనది. గొప్ప ఆటగాళ్లున్ను జట్టుతో పని చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించాను.అయితే, బిజీ షెడ్యూల్స్, పని ఒత్తిడి కారణంగా తిరిగి ఈ జాబ్కు తిరిగి అప్లై చేయాలనుకోవడం లేదు’’ అంటూ తాను హెడ్కోచ్ పదవి నుంచి తప్పుకొనేందుకు సిద్ధమైనట్లు రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.కాగా ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా వస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గౌతీ సైతం తాను ఈ గౌరవప్రదమైన బాధ్యతను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం గమనార్హం. -
ట్రోఫీ గెలిచే వ్యూహాలే లేవు.. ఇకనైనా: ద్రవిడ్పై లారా వ్యాఖ్యలు
టీమిండియాను ఉద్దేశించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో లీగ్ దశలో రాణిస్తున్నా.. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే భారత జట్టు నాకౌట్ మ్యాచ్లలో తేలిపోతోందన్నాడు.జట్టులో ఎంత మంది సూపర్స్టార్లు ఉన్నా టైటిల్ గెలవకపోతే ఏం లాభమని పెదవి విరిచాడు. కనీసం ఈసారైనా బలహీనతలు అధిగమించి వరల్డ్కప్ ట్రోఫీ గెలిచేలా వ్యూహాలు రచించాలని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు లారా సూచించాడు.పదకొండేళ్లుగా నిరీక్షణకాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచిన టీమిండియా.. మళ్లీ ఇప్పటి వరకు ఐసీసీ టైటిల్ నెగ్గలేదు. పదకొండేళ్లుగా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.ఇక హెడ్కోచ్గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లో నిష్క్రమించగా.. వన్డే వరల్డ్కప్-2023లో ఫైనల్లో ఓడిపోయింది. ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేక టైటిల్ వేటలో వెనుకబడింది.మరో అవకాశంఈ నేపథ్యంలో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024 రూపంలో వీరిద్దరు తమను తాము నిరూపించుకునే మరో అవకాశం వచ్చింది. జూన్ 1 నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీ నేపథ్యంలో బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు.వ్యూహాలే లేవుటీమిండియాను కలవరపెడుతున్న అంశాలేమిటి అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘గత టీ20, వన్డే వరల్డ్కప్ ఈవెంట్లలో భారత జట్టును గమనిస్తే.. వారి వద్ద టోర్నీలో ముందుకు సాగేందుకు సరైన ప్రణాళికలు లేవని అనిపించింది.మీ దగ్గర వరల్డ్కప్ గెలిచే వ్యూహాలు లేనపుడు.. జట్టులో ఎంత మంది సూపర్స్టార్లు ఉంటే ఏం లాభం? ఎలా బ్యాటింగ్ చేయాలి? ప్రత్యర్థిని ఎలా అటాక్ చేయాలి అన్న విషయాలపై స్పష్టత ఉండాలి కదా!ఈసారైనా ద్రవిడ్ఈసారి రాహుల్ ద్రవిడ్ తమ ప్లేయర్లందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి.. ప్రపంచకప్ గెలిచే ప్లాన్ చేస్తాడనే ఆశిస్తున్నా’’ అని లారా ఐసీసీ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్కప్ టోర్నీలో.. టీమిండియా జూన్ 5న ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? ద్రవిడ్తో కలిసి View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
ఫోటో అడిగిన అభిమాని.. వర్షంలో పరిగెత్తిన రోహిత్! వీడియో వైరల్
టీ20 వరల్డ్కప్-2024కు టీమిండియా సిద్దమవుతోంది. ఇప్పటికే అమెరికా చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్ను కూడా మొదలు పెట్టేసింది. న్యూయార్క్లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తమ సన్నాహక శిబరాన్ని భారత జట్టు ఏర్పాటు చేసుకుంది.అయితే ప్రాక్టీస్ లేని సమయంలో భారత ఆటగాళ్లు న్యూయార్క్ సీటీలో చక్కెరల్లు కొడుతున్నారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బుధవారం న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ కన్పించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. షాపింగ్కు వెళ్లిన ద్రవిడ్, రోహిత్ భారీ వర్షంలో చిక్కుకున్నారు. భారీ వర్షం కురుస్తుండంతో రోహిత్, ద్రవిడ్ ఇద్దరూ ఓ షాప్లో ఉండిపోయారు. ఈ క్రమంలో ఓ అభిమాని రోహిత్ దగ్గరకు వచ్చి ఫోటో కావాలని అడగగా.. హిట్మ్యాన్ అందుకు నిరాకరించాడు. "నో ఫోటో, బయట భారీ వర్షం పడుతోంది" అంటూ రోహిత్ సమాధనమిచ్చాడు.వెంటనే కారు తీసుకురావలంటూ డ్రైవర్ను రోహిత్ సూచించాడు. కుండపోత వర్షం పడుతుండగానే రోహిత్, ద్రవిడ్ ఇద్దరూ కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. పాపం వారిద్దరితో ఫోటో కోసం ఎదురు చూసిన సదరు అభిమానికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ ఏడాది టీ20 వరల్డ్కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. భారత తమ తొలి మ్యాచ్లో జూన్ 5న ఐర్లాండ్తో తలపడనుంది. Team India spotted in New York. Wait for Rohit Sharma’s sprint. 😂 pic.twitter.com/QlfPlSSLAW— Vipin Tiwari (@Vipintiwari952_) May 29, 2024 -
టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ పేరు ఖరారు.. త్వరలోనే ప్రకటన..?
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. భారత్ హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి ఉన్నట్లు గంభీర్ స్వయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన షారుఖ్ ఖాన్కు కూడా ఈ విషయం తెలుసని సదరు వెబ్సైట్ వెల్లడించింది. హెడ్ కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేశాడా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం ముమ్మాటికి నిజమేనని సోషల్మీడియా సైతం కోడై కూస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్ల మధ్య డీల్ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఈ డీల్ క్లోజ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ముగిశాక గంభీర్-జై షా చాలాసేపు బహిరంగంగా డిస్కస్ చేసుకోవడం జనమంతా చూశారు. ఆ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ పదవిపైనే చర్చ జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కాని ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. టీ20 వరల్డ్కప్ 2024తో భారత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ పదవి వీడేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ప్రకటన వెలువడేందుకు ఆస్కారం ఉంది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, గంభీర్ మెంటార్షిప్లో కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. పదేళ్లకు ముందు ఇదే గంభీర్ కెప్టెన్గా కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. అంతకు రెండేళ్ల ముందు కూడా గంభీర్ ఓసారి కేకేఆర్కు టైటిల్ అందించాడు. ఘనమైన ట్రాక్ రికార్డుతో పాటు దేశం పట్ల గంభీర్కు ఉన్న కమిట్మెంట్ భారత్ హెడ్ కోచ్ పదవి రేసులో అతన్ని ముందుంచుతుంది. -
ముగిసిన డెడ్ లైన్.. భారత కొత్త హెడ్ కోచ్ ఎవరో?
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్-2024తో ముగియున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త కోచ్ను భర్తీ చేసే పనిలో బీసీసీఐ పడింది. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకునేందుకు గడువు సోమవారం(మే 27) సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది.కాగా ధరఖాస్తులను బీసీసీఐ స్వీకరించినప్పటకి..కొత్త హెడ్ కోచ్ను ఎంపిక చేసేందుకు మరింత సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే టీమిండియా హెడ్కోచ్ పదవికి విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలుత ఆస్ట్రేలియా దిగ్గజాలు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ పేర్లు వినిపించినప్పటికి.. వారవ్వరూ హెడ్కోచ్ పదవికి ఆప్లై చేసేందుకు ఆసక్తి చూపలేదని బీసీసీఐ మాలాలు వెల్లడించాయి. నో చెప్పిన వీవీఎస్ లక్ష్మణ్..!కాగా భారత హెడ్ కోచ్ రేసులోప్రధానంగా దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం హెడ్కోచ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయలేదంట. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్గా ఉన్న లక్ష్మణ్కు పూర్తి స్ధాయి హెడ్కోచ్ పదవిపై ఆసక్తి లేనిట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ ఎంపికైతే జట్టుతో పాటు 10 నెలల పాటు కలిసి ప్రయాణం చేయాలి. ఈ క్రమంలోనే లక్ష్మణ్ ప్రధాన కోచ్ పదవి వైపు మొగ్గు చూపకపోయినట్లు తెలుస్తోంది. గంభీర్ కోచ్ అవుతాడా? ఇక వీవీఎస్ లక్ష్మణ్ హెడ్కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించడంతో ద్రవిడ్ వారుసుడుగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు గంభీర్తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ మెంటార్గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఐపీఎల్-2024లో అతడి నేతృత్వంలోనే కేకేఆర్ ఛాంపియన్స్గా నిలిచింది. కోల్కతా నైట్రైడర్స్ జట్టును వీడి గౌతీ వస్తాడా అనే విషయం సందిగ్ధంగా ఉంది. -
టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
టీమిండియా కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ వేటను మొదులెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ధరఖాస్తులను సైతం బీసీసీఐ అహ్హనించింది. హెడ్ కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకునేందుకు మే 27 సాయంత్రం ఆరు గంటలతో గడువు ముగియునుంది. ఈ క్రమంలో హెడ్కోచ్ రేసులో గౌతం గంభీర్, రికీ పాంటింగ్, వీవీఎస్ లక్ష్మణ్,జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి దిగ్గజ క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ పెద్దలు మాత్రం భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. గంభీర్ కూడా భారత ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెడ్కోచ్ పదవికి ధరఖాస్తు చేసేముందు గంభీర్ బీసీసీఐకు ఒక కండీషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'సెలక్షన్ గ్యారెంటీ' ఇస్తేనే హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేస్తానని బీసీసీఐతో గంభీర్ చెప్పినట్లు దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. అందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లు వినికిడి. ప్రస్తుత సమాచారం ప్రకారం ద్రవిడ్ వారసుడిగా గంభీర్ బాధ్యతలు చెపట్టడం దాదాపు ఖాయమన్పిస్తోంది. కాగా గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్-2024లో కోల్కతా నైట్రైడర్స్ మెంటార్గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్తో కేకేఆర్ తలపడనుంది. -
టీమిండియా హెడ్ కోచ్గా డివిలియర్స్?.. హింట్ ఇచ్చిన ఏబీడీ
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. విదేశీ కోచ్లకు కూడా తలుపు తెరిచే ఉన్నాయంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేయడంతో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రిక్కీ పాంటింగ్, మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ తదితరులు టీమిండియా హెడ్కోచ్ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రిక్కీ, లాంగర్ తాము ఈ పదవి పట్ల ఆసక్తిగా లేమని చెప్పగా.. జై షా సైతం తాము ఎవరికీ ఇంకా ఆఫర్ ఇవ్వలేదంటూ కౌంటర్ ఇచ్చాడు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్గా ఆఫర్ వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నాకైతే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనా లేదు.అయితే, ఏదేని జట్టుకు కోచింగ్ ఇవ్వడాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. అదే సమయంలో.. నన్ను ఇబ్బంది పెట్టే అంశాలు కూడా కొన్ని ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు.నాకు తెలియని విషయాలను కూడా త్వరత్వరగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కోచ్గా ఉండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.40 ఏళ్ల వయసులో.. ఇప్పుడు నేను పూర్తి పరిణతి చెందిన వ్యక్తిని. నా కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమేం జరిగాయో అన్న దానిపై మరింత స్పష్టత వచ్చింది. చాలా పాఠాలు నేర్చుకున్నాను.కొంత మంది యువ ఆటగాళ్లకు.. మరికొంత మంది సీనియర్లకు కూడా నా అనుభవం ఉపయోగపడవచ్చు. కొంత మంది ఆటగాళ్లతో.. కొన్ని జట్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.కానీ పూర్తిస్థాయిలో హెడ్ కోచ్గా ఉండేందుకు ఇది సరైన సమయం కాదనుకుంటున్నా. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా. అయితే, ముందుగా చెప్పినట్లు కోచ్ మారడానికి నేనెప్పుడూ నో చెప్పను. పరిస్థితులు మారుతూనే ఉంటాయి కదా!’’ అని ఏబీ డివిలియర్స్ న్యూస్18తో పేర్కొన్నాడు.భవిష్యత్తులో తనను కోచ్ అవతారంలో తప్పక చూస్తారనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఏబీ డీ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే టీమిండియా హెడ్కోచ్గా వచ్చేయమంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. ఆర్సీబీ ఫ్యాన్స్ సైతం వచ్చే ఏడాది డివిలియర్స్ తమ బెంగళూరు జట్టుకు మెంటార్గా రావడం ఖాయమని ఫిక్సయిపోతున్నారు.చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు -
BCCI: అవన్నీ అబద్ధాలే: ఆసీస్ మాజీలకు జై షా కౌంటర్
టీమిండియా కొత్త హెడ్ కోచ్ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కొట్టిపారేశారు. ఈ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా తాము ఇంత వరకు ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ భారత జట్టు ప్రధాన కోచ్గా పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ అతడి వారసుడిని ఎంపిక చేసే క్రమంలో దరఖాస్తులు ఆహ్వానించింది. విదేశీ కోచ్ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.హెడ్ కోచ్ రేసులోఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ సహా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్, శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్ధనే తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో రిక్కీ పాంటింగ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బీసీసీఐ తనకు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించానని పేర్కొన్నాడు. మరోవైపు.. జస్టిన్ లాంగర్ సైతం కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడంటూ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం తాను అప్లై చేసుకోనని పరోక్షంగా వెల్లడించాడు.వాళ్లకు మేమే ఆఫర్ ఇవ్వలేదురిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు. ‘‘టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం నేను గానీ, బీసీసీఐ గానీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లెవరికీ ఆఫర్ చేయలేదు.మీడియా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. జాతీయ జట్టు కోసం సరైన కోచ్ను ఎంపిక చేసుకోవడం క్లిష్టతరమైన ప్రక్రియ. భారత క్రికెట్ స్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకోగల వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నాం.పూర్తి అవగాహన ఉన్నవాళ్లకే ప్రాధాన్యంటీమిండియా హెడ్ కోచ్గా ఉన్నవారికి భారత దేశవాళీ క్రికెట్ గురించి, ఆటగాళ్ల గురించి పూర్తి అవగాహన ఉండాలి. అలాంటి వాళ్ల కోసమే మేము ఎదురుచూస్తున్నాం.భారత జట్టు ప్రధాన కోచ్గా ఉండటం కంటే అంతర్జాతీయ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన పదవి ఇంకోటి ఉంటుందని అనుకోను. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారత క్రికెట్ చరిత్ర, ఔన్నత్యం.. ఆట పట్ల మా అంకితభావం.. అన్నీ వెరసి ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్నాం.ఇలాంటి చోట జాబ్ చేయడం కంటే గొప్ప విషయం ఏముంటుంది?. ఇలాంటి జట్టుకు గురువుగా బాధ్యతలు నిర్వర్తించే సరైన వ్యక్తి కోసం మేము జల్లెడపట్టాల్సి ఉంటుంది’’ అని జై షా ఇండియన్ ఎక్స్ప్రెస్తో వ్యాఖ్యానించారు. చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. అలా అయితేనే సన్రైజర్స్ ముందుకు -
టీమిండియా హెడ్కోచ్గా అతడే సరైనోడు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ వేటలో ఉంది. టీ20 ప్రపంచకప్-2024 ముగిసే నాటికి రాహుల్ ద్రవిడ్ వారసుడిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రం టీమిండియా హెడ్కోచ్గా పనిచేయడానికి సరైన వ్యక్తి ఇతడేనంటూ ఓ మాజీ క్రికెటర్ పేరును ప్రతిపాదించాడు. ఇంతకీ అతడు ఎవరు?..టీ20 వరల్డ్కప్-2021 తర్వాత రవిశాస్త్రి హెడ్కోచ్ పదవి నుంచి వైదొలగగా.. టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ద్రవిడ్ మార్గదర్శనంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నంబర్ వన్గా నిలిచింది.అయితే, టీ20 ప్రపంచకప్-2022, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్, వన్డే వరల్డ్కప్-2023లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. పొట్టి ప్రపంచకప్లో సెమీస్లోనే నిష్క్రమించిన రోహిత్ సేన.. టెస్టు చాంపియన్షిప్, వన్డే వరల్డ్కప్ ఫైనల్లో రెండుసార్లు ఆస్ట్రేలియా చేతిలో చిత్తైంది.ఇక వన్డే వరల్డ్కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసినప్పటికీ పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో అతడిని కొనసాగాల్సిందిగా బీసీసీఐ కోరింది. అయితే, ఈ మెగా టోర్నీ అనంతరం అతడు తన పదవి నుంచి తప్పుకోనుండగా.. అభ్యర్థుల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.మరోవైపు.. విదేశీ కోచ్ల నియామకానికి బీసీసీఐ సుముఖంగా ఉందన్న వార్తల నేపథ్యంలో స్టీఫెన్ ఫ్లెమింగ్, జస్టిన్ లాంగర్, రిక్కీ పాంటింగ్ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘టీమిండియా హెడ్కోచ్గా అత్యుత్తమ వ్యక్తి ఎవరంటే గౌతం గంభీర్ అనే చెప్తా. గౌతం ఈ బాధ్యతను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది అతడి ఇష్టం.నిజానికి గౌతం ఇప్పుడు రాజకీయాలు కూడా వదిలేశాడు. తన కుటుంబానికి సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక హెడ్కోచ్ విషయానికొస్తే.. ఎప్పుడూ బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి తను ఇది ఎంచుకుంటాడా లేదా అన్నది చూడాలి.గౌతం గంభీర్ చాలా సింపుల్గా ఉంటాడు. తాను చెప్పాలనుకున్నది ఏదైనా సరే.. రెండో మాటకు తావులేకుండా సూటిగా చెప్తాడు. నిజానికి టీమిండియా క్రికెట్ కల్చర్కు ఇది విరుద్ధం.కానీ గంభీర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాడు. ఏదేనా ముఖం మీదే చెప్పేస్తాడు. అతడికి దూకుడు ఎక్కువ. జట్టును కూడా తనలాగే అగ్రెసివ్గా తయారుచేయగలడు. నిజంగా తను కోచ్గా వస్తే బాగుంటుంది. కానీ అందుకు అతడు ఒప్పుకొంటాడో లేదో?!’’ అని వసీం అక్రం స్పోర్ట్స్కీడాతో పేర్కొన్నాడు.కాగా గంభీర్ ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా ఉన్నాడు. ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక కేకేఆర్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. -
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది.మే 27 సాయంత్రం ఆరు గంటలలోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. టీమిండియా హెడ్కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, గౌతం గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, పాంటింగ్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అవకాశం లభిస్తే టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు భజ్జీ తెలిపాడు.భారత హెడ్కోచ్ పదవికి నేను దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు. కానీ, టీమిండియాకు కోచింగ్ అనేది మ్యాన్ మేనేజ్మెంట్. భారత ఆటగాళ్లకు క్రికెట్ గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. వారికి మార్గదర్శకత్వంగా ఉంటే చాలు. నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది. కోచ్ రూపంలో ఎంతోకొంత తిరిగి ఇచ్చే అవకాశం వస్తే సంతోషిస్తా" అని ఓ స్పోర్ట్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. -
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
టీ20 వరల్డ్కప్-2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న విషయం విధితమే. భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. మే 27 లోపు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే భారత హెడ్కోచ్ రేసులో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన కోచ్గా ఉండాలని గంభీర్ను బీసీసీఐ కోరినట్లు సమాచారం. గంభీర్ ప్రస్తుతం కేకేఆర్ జట్టుకు గంభీర్ మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన తర్వాత గంభీర్తో బీసీసీఐ పూర్తి స్ధాయి చర్చలు జరపనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గంభీర్ గతంలో ఎప్పుడూ కోచ్గా పనిచేయనప్పటికి మెంటార్గా మాత్రం అపారమైన అనుభవం ఉంది. ప్రస్తుతం కేకేఆర్తో పాటు గతంలో రెండు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా కూడా గంభీర్ పనిచేశాడు. ప్రస్తుతం అతడు మెంటార్గా ఉన్న కోల్కతా అద్భుత ఆటతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. కెప్టెన్గా కూడా కేకేఆర్కు రెండు సార్లు టైటిల్ను గౌతీ అందించాడు. అంతేకాకుండా ఆటగాడిగా గంభీర్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలోనే గౌతీకి భారత హెడ్కోచ్ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు వినికిడి. -
BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ అత్యున్నత పదవి కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగలవారు ఈనెల 27వ తేదీలోపు తమ దరఖాస్తులు పంపించాలి.ఎంపికైన కొత్త హెడ్ కోచ్ పదవీకాలం మూడేన్నరేళ్లపాటు (1 జూలై 2024 నుంచి 31 డిసెంబర్ 2027 వరకు) ఉంటుంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం గత ఏడాది నవంబర్లో వన్డే వరల్డ్కప్ అనంతరం ముగిసింది.అయితే టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ముగిసేవరకు టీమిండియాకు తాత్కాలిక కోచ్గా కొనసాగాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ పదవి కోసం ద్రవిడ్ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. నో చెప్పిన ద్రవిడ్అయితే, ఇందుకు ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరికొంత కాలం పాటు అతడిని కోచ్గా కొనసాగాలని టీమిండియా ప్రధాన ఆటగాళ్లలో కొందరు అభ్యర్థించినట్లు సమాచారం. కనీసం టెస్టు జట్టుకైనా ద్రవిడ్ మార్గదర్శకుడిగా ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.కానీ వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్ల నియామకంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం అని.. ఏదేమైనా ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందకపోవచ్చని జై షా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు.. రాహుల్ ద్రవిడ్ సైతం హెడ్ కోచ్ పదవికి గుడ్బై చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.లక్ష్మణ్కు ఆ ఛాన్స్ లేదుమరోవైపు.. ద్రవిడ్ గైర్హాజరీలో టీమిండియా కోచ్గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ పనులతో బిజీగా ఉన్నాడు. అయితే, బీసీసీఐ అతడిని అక్కడి నుంచి కదిలించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.ఫ్లెమింగ్ లేదంటే రిక్కీ పాంటింగ్?ఈ నేపథ్యంలో.. ఈసారి విదేశీ కోచ్ను రంగంలోకి తీసుకువచ్చేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉన్నట్లు జై షా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు రాగా.. మరో పేరు కూడా తెర మీదకు వచ్చింది.ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రిక్కీ పాంటింగ్ కూడా టీమిండియా హెడ్కోచ్ పదవి రేసులో ఉన్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రస్తుతం ఐపీఎల్ జట్లకు హెడ్కోచ్లుగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడంలో కృషి చేయగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం) జట్లకు కోచ్గా పనిచేసిన అనుభవం పాంటింగ్కు ఉంది.అది సాధ్యం కాదన్న పాంటింగ్అయితే, వీళ్లిద్దరు కూడా టీమిండియా హెడ్కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే వరుస సిరీస్లతో బిజీగా ఉండే టీమిండియా కోసం కోచ్ ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు అంకితం కావాల్సి ఉంటుంది.కాబట్టి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే వీలుండదు. అందుకే భారత జట్టు హెడ్కోచ్ పదవి ఆఫర్ వచ్చినా తాను చేపట్టలేదని రిక్కీ పాంటింగ్ గతం(2021)లో వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్గా ఎవరు వస్తారో? అంటూ క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ -
మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?
టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మరోసారి ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో ఓ ట్విస్టు ఉంది.భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 2017- 2021 మధ్య టీమిండియా హెడ్ కోచ్గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో.. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలవడంసహా నంబర్ వన్ జట్టుగా ఎదిగింది.అయితే, వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గలేకపోయింది టీమిండియా. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియగా.. కెప్టెన్గా విరాట్ కోహ్లి యుగానికి తెరపడింది. ఈ క్రమంలో కోహ్లి రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతుండగా.. రవిశాస్త్రి తిరిగి కామెంటేటర్గా మారాడు.ఈ నేపథ్యంలో తాజాగా రవిచంద్రన్ అశ్విన్తో మాట్లాడుతూ రవిశాస్త్రి.. హెడ్కోచ్గా పనిచేయడంపై తనకున్న ఆసక్తిని వివరించాడు. భవిష్యత్తులో తాను ఐపీఎల్ జట్టు కోచ్గా పనిచేసే అవకాశాలను కొట్టిపారేయలేనని తెలిపాడు.భారత్లో ఎంతో మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారని.. వారిని మెరికల్లా తీర్చిదిద్దే అవకాశం తనకు వస్తే కచ్చితంగా మళ్లీ కోచ్గా మారతానని రవిశాస్త్రి సంకేతాలు ఇచ్చాడు. ఇప్పటికే సూపర్ స్టార్లుగా ఎదిగిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అయితే, కొత్త టాలెంట్ను ప్రోత్సహించేందుకు తనకు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని స్పష్టం చేశాడు.ఏడేళ్లు టీమిండియాతో పనిచేసిన తర్వాత .. తిరిగి కామెంటేటర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్న రవిశాస్త్రి.. తదుపరి ఐపీఎల్ కోచ్గా మారేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియజేశాడు. కాగా రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
టీ20 వరల్డ్ కప్ 2024తో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెచ్ కోచ్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయన మరోసారి దరఖాస్తు చేసుకుంటారా? లేదంటే ఆ అవకాశం మరొకరిని వరిస్తుందా?.. టీమిండియాకు కాబోయే హెడ్ కోచ్ ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఈ లోపే హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది.కొత్త కోచ్ పదవీకాలం ఈ ఏడాది జులై 1 నుంచి 2027 డిసెంబర్ 31వ తేదీ వరకు ఉంటుందని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. అంటే కొత్తగా కోచ్ పదవికి ఎంపికయిన వ్యక్తి 2027 వన్డే ప్రపంచకప్ వరకు భారత జట్టుకు ప్రధాన కోచ్గా కొనసాగుతారన్నమాట. అలాగే.. కొత్త కోచ్కు దరఖాస్తు చేసుకునేవాళ్ల వయసు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. పారితోషికం అనుభవాన్ని బట్టి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. వీటితో పాటు.. మూడు ఫార్మాట్లలో జట్టుకు హెడ్ కోచ్ గా కొనసాగుతాడు. కోచ్కు 14-16 మంది సహాయక సిబ్బంది ఉంటారు. టీమ్ ప్రదర్శన, నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తాడు. అలాగే స్పెషలిస్ట్ కోచ్లు, సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహిస్తాడు. భారత జట్టులోని క్రమశిక్షణా కోడ్లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యతఅర్హతలుకనీసం 30 టెస్ట్ మ్యాచ్లు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదంటే.. టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్గా కనీసం 2 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.ఐపీఎల్ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ జట్లకు/ జాతీయ అ జట్లకు ప్రధాన కోచ్గా కనీసం మూడేళ్లు పనిచేసి ఉండాలి.బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.పై కండిషన్లలో ఏది ఉన్నా సరే.. దరఖాస్తు చేసుకోవచ్చు.ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్లేయర్టీమిండియా హెడ్ కోచ్ దరఖాస్తుల నేపథ్యంలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఈ ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ గా ఉన్నాడు‘‘టీమిండియా హెచ్ కోచ్ పదవిపై నేను ఆసక్తిగా ఉన్నాను. దీని గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు. ప్రతి అంతర్జాతీయ కోచ్ పై నాకు అమితమైన గౌరవం ఉంది. ఎందుకంటే అందులో ఉండే ఒత్తిడి నాకు తెలుసు. కానీ ఇండియన్ టీమ్ కోచింగ్ అద్భుతమైన జాబ్. ఈ దేశంలో ఉన్న టాలెంట్ చూసిన తర్వాత కోచ్ పదవి అనేది ఆకర్షణీయంగా కనిపిస్తోంది’’ అని లాంగర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.లాంగర్ కెరీర్జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా తరఫున 105 టెస్టులు ఆడాడు. 45 సగటుతో 7696 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ కోచ్ గా ఉన్నాడు. అతని కోచింగ్ లోనే 2021లో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా కోచ్ గా ఉన్నాడు. గత రెండు సీజన్లలోనూ ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరుకుంది.ఫారినర్కు ఛాన్స్ దక్కేనా?డంకన్ ఫ్లెచర్ తర్వాత గత పదేళ్లలో మరో విదేశీ కోచ్ ను నియమించలేదు. కుంబ్లే, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ ఈ బాధ్యతను చేపట్టారు. దీంతో.. బీసీసీఐ మరోసారి విదేశీ కోచ్ ను నియమిస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే ఈసారి ఓ విదేశీ కోచ్ ను నియమించే అవకావాలను కూడా కొట్టిపారేయలేం అన్నట్లుగా బీసీసీఐ సెక్రటరీ జై షా మాటలను బట్టి అర్థమవుతోంది. -
ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే!
ముంబై: టి20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దాని కోసం మరికొద్ది రోజుల్లోనే దరఖాస్తులు కోరతామని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత జట్టు వరల్డ్ కప్కు బయల్దేరే ముందే ఈ ప్రక్రియ మొదలవుతుందని కూడా జై షా చెప్పారు. గత ఏడాది రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త కోచ్పై చర్చ జరగడంతో కొంత గందరగోళం నెలకొంది. దాంతో ద్రవిడ్నే మరో ఏడాది కొనసాగించారు. ఈసారి అలాంటి స్థితి రాకుండా బోర్డు ముందే జాగ్రత్త పడుతోంది. ఒప్పందం ప్రకారం వచ్చే జూన్లో ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ మళ్లీ కోచ్గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుందని... కొన్ని ఇతర జట్ల తరహాలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్లను ఎంపిక చేసే ఆలోచన లేదని కూడా షా పేర్కొన్నారు. కొత్త హెడ్ కోచ్కు మూడేళ్ల పదవీ కాలం ఇస్తామని, 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతను కొనసాగుతాడని బోర్డు కార్యదర్శి ప్రకటించారు. కోచ్ ఎంపిక విషయంలో క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)దే తుది నిర్ణయమన్న షా... విదేశీ కోచ్ అయినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు చేరని జట్లలో ఉన్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కలిసి మే 24న తొలి బృందంగా టి20 వరల్డ్ కప్ కోసం అమెరికా బయలుదేరతారని జై షా వెల్లడించారు. ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను ప్రయోగాత్మకంగానే పెట్టామని, అవసరమైతే దీనిపై మళ్లీ చర్చించి కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో చేర్చకపోవడంలో తన పాత్ర ఏమీ లేదని... ఇది పూర్తిగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయమని ఆయన సందేహ నివృత్తి చేశారు. -
దినేష్ కార్తీక్ అరుదైన ఘనత.. ద్రవిడ్ రికార్డు బద్దలు
భారత వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ దినేష్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్గా కార్తీక్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగులు చేసిన డీకే.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు కార్తీక్ ఐపీఎల్లో బెంగళూరు తరపున 57 మ్యాచ్ల్లో 912 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉండేది. ద్రవిడ్ 43 మ్యాచ్ల్లో ఆర్సీబీ తరపున 898 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో ద్రవిడ్ రికార్డును కార్తీక్ బద్దలు కొట్టాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు ఆర్సీబీ తరపున 249 మ్యాచ్ల్లో 7897 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. హై స్కోరింగ్ మ్యాచ్లో పంజాబ్ను 60 పరుగుల తేడాతో ఆర్సీబీ చిత్తు చేసింది. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ఆర్సీబీ సజీవంగా నిలుపున్కుంది.. -
ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్కోచ్ మారబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. కొత్త కోచ్గా భారతీయ క్రికెటర్ లేదంటే విదేశీ ఆటగాడైనా రావొచ్చని సంకేతాలు ఇచ్చాడు.కాగా పొట్టి వరల్డ్కప్-2021 తర్వాత రవిశాస్త్రి స్థానంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి మార్గదర్శనంలో అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్గా నిలిచిన భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది.టైటిల్ పోరులో రాణించలేకటీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే ఇంటిబాట పట్టిన రోహిత్ సేన.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23, వన్డే వరల్డ్కప్-2023 టోర్నీల్లో ఫైనల్ చేరినా టైటిల్ గెలవకలేకపోయింది. ఆఖరి మెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో బోల్తాపడి ట్రోఫీని చేజార్చుకుంది.ఇదిలా ఉంటే.. వాస్తవానికి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 పూర్తయ్యేనాటికి రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తైంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్కప్ వరకు ద్రవిడ్ను కోచ్గా కొనసాగాల్సిందిగా బోర్డు కోరడంతో అతడు సమ్మతించినట్లు వార్తలు వచ్చాయి.ద్రవిడ్ గుడ్బై/ ద్రవిడ్కు గుడ్బై?అయితే, తాజా సమాచారం ప్రకారం ద్రవిడ్ తన పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనుంది.ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘రాహుల్ పదవీ కాలం జూన్ వరకు పూర్తవుతుంది. ఒకవేళ అతడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే.. అప్లై చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ అతడికి ఉంది.కొత్త కోచ్గా ఫారినర్?ఇక కొత్త కోచ్ ఇండియన్ లేదంటే ఫారినర్ అన్న విషయం గురించి ఇప్పుడే చెప్పలేం. క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయానుసారమే కోచ్ నియామకం జరుగుతుంది’’ అని జై షా క్రిక్బజ్తో వ్యాఖ్యానించాడు.అలాంటిదేమీ లేదు!అదే విధంగా.. భిన్న ఫార్మాట్లకు భిన్న కోచ్ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఈ విషయంలో కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్.. ఇలా చాలా మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. కానీ కోచ్ల విషయంలో అలా జరిగే ఆస్కారం లేదు’’ అంటూ కొట్టిపారేశాడు. చదవండి: రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అయ్యర్ కెప్టెన్సీలో! -
T20 WC: జట్టు ఎంపిక ఫైనల్.. అతడిపై వేటు తప్పదా?
టీ20 ప్రపంచకప్-2024 జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోయే ఆటగాళ్లు ఎవరన్న చర్చకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యంలో ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రపంచకప్లో భాగమయ్యే ఇరవై జట్ల ఎంపికను మే 1 వరకు ఖరారు చేయాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆయా దేశాలను ఆదేశించింది.ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించగా.. టీమిండియా కూడా అనౌన్స్మెంట్కు సిద్ధమైంది. జట్టు ఎంపిక గురించి ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.ఢిల్లీలో వీరు ముగ్గురు ఆదివారం సమావేశమై తీసుకున్న నిర్ణయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షాతో మంగళవారం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్నెస్, వికెట్ కీపర్ ఎంపిక గురించి మేనేజ్మెంట్ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.పాండ్యా గనుక బౌలింగ్ చేస్తే అదనపు పేసర్ అవసరం ఉండదు. కానీ అతడి ఫిట్నెస్ దృష్ట్యా బౌలర్గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్తో పాటు సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ పోటీపడుతున్నారు.వీరిలో సంజూ ఐపీఎల్-2024లో దుమ్ములేపుతుండగా.. పంత్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. రాహుల్ కూడా బాగానే ఆడుతున్న నిలకడలేమి ఫామ్ కలవరపెడుతోంది.అతడిపై వేటు తప్పదా?మరోవైపు.. ఓపెనింగ్ స్లాట్లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి పేరు దాదాపుగా ఖరారు కాగా.. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ మధ్య పోటీ నెలకొంది. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ విషయంలో జైస్వాల్వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జట్టు ప్రకటన తర్వాతే వరల్డ్కప్లో పాల్గొనబోయే 15 మంది భారత ఆటగాళ్ల గురించి స్పష్టతరానుంది. -
క్యూలో నిలబడి ఓటు వేసిన ద్రవిడ్.. పవర్ఫుల్ మెసేజ్
టీమిండియా హెడ్ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఓటు హక్కును ఉపయోగించుకున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. కర్ణాటకలో 14 లోక్సభ స్థానాలకు శుక్రవారం రెండో విడత పోలింగ్ జరుగుతున్న వేళ.. బెంగళూరులో ఓటు వేశాడు.ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా అత్యంత సాదాగా పోలింగ్బూత్కు తరలివచ్చిన ద్రవిడ్.. ప్రజాస్వామ్యం తనకు ఇచ్చిన హక్కును వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా భారత యువతను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చాడు.‘‘ఇది నా ఓటు. ప్రజాస్వామ్యం నాకు కల్పించిన అవకాశం. కాబట్టి కచ్చితంగా నేను దీనిని ఇలా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. పోలీసులు బాగా పనిచేస్తున్నారు.ఈసారి పోలింగ్ విషయంలో బెంగళూరు రికార్డు సృష్టిస్తుందని భావిస్తున్నా. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తరలిరావాలి. తమ హక్కును ఉపయోగించుకోవాలి. పౌరులను అప్రమత్తం చేయడంలో మీడియా కూడా ఇంకాస్త చొరవ తీసుకోవాలి’’ అని ఓటు వేసిన అనంతరం రాహుల్ ద్రవిడ్ ఇండియా టుడేతో వ్యాఖ్యానించాడు.కాగా వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉండే రాహుల్ ద్రవిడ్కు ప్రస్తుతం విరామం దొరికింది. ఐపీఎల్-2024 నేపథ్యంలో ఆటగాళ్లంతా క్యాష్ రిచ్ లీగ్లో భాగమైన వేళ.. ద్రవిడ్ కుటుంబానికి సమయం కేటాయించాడు.అయితే, జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, మే 1 లోగా జట్ల వివరాలను సమర్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి గడువు విధించిన వేళ టీమిండియా ఎంపిక గురించి రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే పలుమార్లు చీఫ్ సెలక్టర్తో భేటీ అయినట్లు సమాచారం. -
ఓటు హక్కు వినియోగించుకున్న ద్రవిడ్, కుంబ్లే
దేశంలో ఇవాళ (ఏప్రిల్ 26) సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కేరళలోని 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, ఉత్తర్ప్రదేశ్ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, పశ్చిమ బెంగాల్ 3, చత్తీస్ఘడ్ 3, జమ్మూ కశ్మీర్ 1, మణిపూర్ 1, త్రిపురలో ఒక లోక్సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగతుంది. #WATCH | Rahul Dravid casts his vote in Karnataka's Bengaluru.#LokSabhaElections2024 pic.twitter.com/gZ6Ybairc1— ANI (@ANI) April 26, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాల్టి ఉదయం నుంది వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్రీడారంగానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇవాళ ఉదయం బెంగళూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య, కొడుకుతో సహా పోలింగ్ కేంద్రం వద్దకు చేరిన ద్రవిడ్ అతి సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి ఓటు వేశారు. #Vote #Indiaelections2024 #Karnataka #bengaluru pic.twitter.com/JDi9VYpIA6— Anil Kumble (@anilkumble1074) April 26, 2024 ఓటు వేసిన అనంతరం ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చాడు. ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కు అని ద్రవిడ్ తెలిపాడు. ద్రవిడ్ సహచరుడు, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఇవాళ బెంగళూరులో ఓటు వేశారు. ఓటు వినియోగించుకున్న విషయాన్ని కుంబ్లే సోషల్మీడియాలో షేర్ చేశాడు. కుంబ్లే తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. -
అవన్నీ అబద్ధాలు.. అసలు అగార్కర్..: రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి వస్తున్న వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ విషయం గురించి తాను ఇప్పటి వరకు మేనేజ్మెంట్తో ఎలాంటి చర్చలు జరుపలేదన్నాడు. అదే విధంగా.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో గత వారం తాను సమావేశమైనట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. జట్టు ఎంపిక గురించి తాము అధికారిక ప్రకటన చేసినపుడు మాత్రమే అవి నిజాలని నమ్మాలని విజ్ఞప్తి చేశాడు. కాగా ఐపీఎల్-2024కు మే 26న తెరపడనుండగా.. జూన్ 1 నుంచి ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈవెంట్ మొదలైన ఐదో రోజున టీమిండియా ఐర్లాండ్తో మ్యాచ్తో తమ ప్రయాణం ఆరంభించనుంది. కెప్టెన్గా రోహిత్ శర్మనే ఇక ఈ మెగా టోర్నమెంట్లో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మనే ఉంటాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 ప్రదర్శన ఆధారంగానే వరల్డ్కప్ జట్టు ఎంపిక ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం ముంబైలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ సమావేశమై జట్టు కూర్పు గురించి జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓపెనర్గా విరాట్ కోహ్లి ఫిక్స్ అని.. బౌలింగ్ చేసే విషయంపైనే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక ఆధారపడి ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. అసలు అగార్కర్ ఇక్కడ లేనేలేడు ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా ఈ విషయాలపై స్పందించాడు. ‘‘నేను ఎవరినీ కలవలేదు. అజిత్ అగార్కర్ అక్కడెక్కడో దుబాయ్లో ఉన్నాడు. ఇక రాహుల్ ద్రవిడ్ తన పిల్లల ఆట చూసేందుకు బెంగళూరులోనే ఉండిపోయాడు. అయితే.. తన కుమారుడి కోసం బహుశా ముంబై వచ్చి ఉంటాడు. ఎర్రమట్టి పిచ్పై ఆడించేందుకు ఇక్కడికి తీసుకువచ్చాడేమో! అంతే. అంతకు మించి ఏమీ లేదు. మేము అసలు ఒకరినొకరం కలుసుకోలేదు. అవన్నీ అబద్దాలే ఈరోజుల్లో నేనో, ద్రవిడో, అగార్కరో లేదంటే బీసీసీఐ స్వయంగా స్పందిస్తేనే అవి నిజాలు. మిగతావన్నీ ఫేక్’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. క్లబ్ ప్రైరీ ఫైర్ అనే పాడ్కాస్ట్లో మైకేల్ వాన్, ఆడం గిల్క్రిస్ట్లతో మాట్లాడుతూ రోహిత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆటగాడిగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్తో బిజీగా ఉన్నాడు. చదవండి: #Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే Rohit Sharma said - "I think today's day and age unless you hear it from either myself or Rahul Dravid himself or Ajit Agarkar himself or someone coming from BCCI talking infront of camera everything is fake". (On Kohli-Rohit opening in T20 WC 2024). pic.twitter.com/NUs6Xbs4ek — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 Rohit Himself confirmed he hasn't Met Any bcci official's last week and stated this as a fake news 😂 https://t.co/uIXDn9v8Ew pic.twitter.com/fiNe8keK0Y — Manojkumar (@Manojkumar_099) April 18, 2024 That means reports are fake, Kohli is not in the preference list of BCCI FOR T20 world cup. (Source- Mufa and Johns Paid pr of Kohli) pic.twitter.com/AwP96Uza5w — CAPTAIN (@RoForLife45) April 18, 2024 -
T20 WC 2024: రోహిత్ శర్మకు జోడీగా కోహ్లి ఫిక్స్!
టీ20 ప్రపంచకప్-2024లో విరాట్ కోహ్లిని భారత ఓపెనర్గా చూడబోతున్నామా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రన్మెషీన్ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా మెగా టోర్నీలో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఇప్పటికే రోహిత్ శర్మతో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్తో పాటు కోహ్లి కూడా సుదీర్ఘకాలం పాటు పొట్టి ఫార్మాట్లో టీమిండియా తరఫున బరిలోకి దిగలేదు. ఈ క్రమంలో ఇటీవల అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా విరాహిత్ ద్వయం పునరాగమనం చేశారు. అయితే, ఆ సిరీస్లో కోహ్లి తను రెగ్యులర్గా వచ్చే మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. మరోవైపు.. రోహిత్కు జోడీగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశాడు. ఇదిలా ఉంటే.. యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసే క్రమంలో ప్రపంచకప్-2024లో అసలు కోహ్లికి చోటే దక్కదంటూ గతంలో వార్తలు వచ్చాయి. అగార్కర్ ఈ మేరకు ప్రతిపాదనలు చేయగా.. రోహిత్ శర్మ వాటిని ఖండించాడని.. కోహ్లి జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఐసీసీ ఈవెంట్లో తన పాత్ర ఏమిటన్న విషయం మీద క్లారిటీ కావాలని కోహ్లి సెలక్షన్ కమిటీని అడిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతవారం ముంబైలో జరిగిన సమావేశంలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ ఇందుకు సంబంధించి కోహ్లిని ఓపెనర్గా పంపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు దైనిక్ జాగరణ్.. కథనం వెలువరించింది. కాగా రాయల్ చాలెంజర్స్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి.. ఇప్పటి వరకు ఐపీఎల్-2024లో ఏడు మ్యాచ్లు ఆడి 361 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. మరోవైపు.. ఇటీవల కాలంలో రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న యశస్వి జైస్వాల్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు రాజస్తాన్ తరఫున ఏడు మ్యాచ్లు ఆడి 121 రన్స్ మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తాజా సీజన్ ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి వరల్డ్కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: రోహిత్తో ద్రవిడ్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్!
#T20WorldCup2024: హార్దిక్ పాండ్యా.. క్రీడా వర్గాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ గురించే చర్చ నడుస్తోంది. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన పాండ్యా సొంత జట్టు అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. నిజానికి.. 2022లో గుజరాత్ టైటాన్స్ సారథిగా పగ్గాలు చేపట్టి అరంగేట్రంలోనే ఆ జట్టును చాంపియన్గా నిలిపిన ఘనత పాండ్యా సొంతం. గతేడాది కూడా అద్బుత కెప్టెన్సీతో టైటాన్స్ను ఫైనల్కు తీసుకువచ్చాడు. కలిసిరాని కాలం కానీ ఎప్పుడైతే సొంత గూటికి చేరుకుని ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా సారథిగా నియమితుడు కావడాన్ని ఇప్పటికీ ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే విధంగా.. పాండ్యా సైతం మైదానంలో తన ప్రణాళికలను అమలు చేయడంలో సఫలం కాలేకపోతున్నాడు. ఫలితంగా ముంబై ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. దీంతో పాండ్యా కెప్టెన్సీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాడిగానూ విఫలం ఇక ఆటగాడిగానూ హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 131 పరుగులు చేసిన ఈ పేస్ ఆల్రౌండర్.. కేవలం 3 వికెట్లు తీశాడు. ఫలితంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో పాండ్యాకు అసలు స్థానం ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ తాజా కథనం వీటికి బలాన్ని చేకూరుస్తోంది. వరల్డ్కప్ జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గత వారం సమావేశమైనట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ జట్టులో పాండ్యాకు నో ప్లేస్! ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు స్థానం ఇవ్వాలా? వద్దా? విషయంపై దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు పాండ్యా పూర్తి ఫిట్గా ఉన్నాడా? లేడా? ఆల్రౌండర్గా పూర్తి స్థాయిలో సేవలు అందించగలడా లేడా అన్న అంశం మీద కూడా టీమిండియా మేనేజ్మెంట్ సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి పాండ్యా హిట్టింగ్కు తోడు అదనపు సీమర్గా జట్టుకు ఉపయోగపడటం వల్లే అతడికి జట్టులో ప్రత్యేక స్థానం దక్కింది. కానీ ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ దృష్ట్యా పాండ్యా ఎంపికపై ఇప్పుడే మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరికొన్నాళ్లు వేచి చూసిన తర్వాతే అతడిని మెగా టోర్నీకి సెలక్ట్ చేసే విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయం అతడే! ఐపీఎల్-2024లో పాండ్యా రెగ్యులర్గా బౌలింగ్ చేస్తేనే అతడికి చోటిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అందులో గనుక పాండ్యా విఫలమైతే అతడికి ప్రత్యామ్నాయంగా సీఎస్కే స్టార్ శివం దూబే వైపు సెలక్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది. Most sixes since IPL 2022 - 🔹 66 Shivam Dube 🔹 66 Nicholas Pooran Dube : 34 sixes vs Spinners, 32 sixes vs Pacers - He is not just a spin smasher 💥#TATAIPL #IPL2024 #MIvCSK #MIvsCSK #CSKvsMI #CSKvMIpic.twitter.com/5cQlVDyTMr — TCTV Cricket (@tctv1offl) April 15, 2024 మిడిల్ ఓవర్లలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఎంత ప్రమాదకర బ్యాటరో ఇప్పటికే నిరూపితమైంది. అయితే, ఈసీజన్లో అతడు ఇంత వరకు బౌలింగ్ చేయలేదు. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా హిట్టింగ్కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా పేస్ ఆల్రౌండర్గా బరిలోకి దిగే ఆటగాడు ఎవరన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా వన్డే వరల్డ్కప్-2023 మధ్యలోనే గాయం కారణంగా హార్దిక్ జట్టు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. చదవండి: #Shivam Dube: పేసర్లనూ చితక్కొడుతున్నాడు.. ఈ హిట్టర్కు చోటిచ్చేస్తారా? Kavya Maran: వారెవ్వా.. సూపర్ హిట్టింగ్! సంభ్రమాశ్చర్యంలో కావ్యా మారన్ -
అంతా అతడే చేశాడు.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్లను ఒప్పించి..
విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు జట్టుతో లేకున్నా.. యువ జట్టుతోనే ఇంగ్లండ్పై టెస్టు సిరీస్ గెలిచాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వీరిద్దరి గైర్హాజరీ.. మధ్యలో ఓ మ్యాచ్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి, బ్యాటర్గా కేఎస్ భరత్ వైఫల్యం.. ఫలితంగా ఏకంగా ఐదుగురు క్రికెటర్ల అరంగేట్రం. రెండో టెస్టుతో రజత్ పాటిదార్, మూడో టెస్టుతో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టుతో ఆకాశ్ దీప్, ఐదో టెస్టుతో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో రజత్ తప్ప అందరూ తమను తామను నిరూపించుకున్నారు. అయితే, ధ్రువ్ జురెల్, పడిక్కల్ల అరంగేట్రం గురించి తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరిని తుదిజట్టులో ఆడించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్లను ఒప్పించేందుకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం 15 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడిన జురెల్ను కేఎస్ భరత్ స్థానంలో వికెట్ కీపర్గా ఎంపిక చేయడం, ఛతేశ్వర్ పుజారాను పూర్తిగా పక్కనపెట్టి పడిక్కల్ను ఆడించడంలో అగార్కర్దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ‘‘జట్టు యాజమాన్యం జురెల్పై పూర్తి విశ్వాసంతో లేనపుడు అగార్కర్ ఒక్కడే అతడి పేరును బలపరిచాడు. నిజానికి రెడ్ బాల్ క్రికెట్లో తగినంత అనుభవం లేని కుర్రాణ్ణి.. అదీ ఇంగ్లండ్ వంటి జట్టుతో కీలక సిరీస్లో అరంగేట్రం చేయించడం అంటే సాహసంతో కూడుకున్న నిర్ణయం. అయితే, అగార్కర్ మాత్రం అతడిపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఇక జట్టులో సీనియర్ల గైర్హాజరీలో ఛతేశ్వర్ పుజారాను తిరిగి తీసుకువద్దామా అనే చర్చ కూడా నడిచింది. రంజీ ట్రోఫీలో పరుగులు చేస్తున్న పుజారాకు పిలుపునివ్వాలని భావించినపుడు.. అగార్కర్ మాత్రం పడిక్కల్ వైపే మొగ్గు చూపాడు. రంజీ ట్రోఫీ టోర్నీలో అద్బుత శతకం(150)తో సత్తా చాటిన పడిక్కల్ వంటి మంచి హైట్ ఉన్న ఆటగాడు.. అంతగా అనుభవం లేని ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడని విశ్వసించాడు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నాలుగో టెస్టులో టీమిండియా విజయానికి ధ్రువ్ జురెల్ ఇన్నింగ్సే ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. అదే విధంగా.. నామమాత్రపు ఐదో టెస్టులో పడిక్కల్ అద్భుత అర్ధ శతకం(65)తో చెలరేగాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. స్పందించిన రోహిత్ -
Ranji- శార్దూల్ ఏమన్నాడో విన్నాను: ద్రవిడ్
దేశవాళీ క్రికెట్లో మ్యాచ్ల మధ్య ఎక్కువ విరామం ఉండాలన్న టీమిండియా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ వ్యాఖ్యలపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. శార్దూల్ మాదిరే మెజారిటీ ఆటగాళ్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే తప్పక పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు రంజీల్లో కచ్చితంగా ఆడాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై తరుఫు బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ సెమీ ఫైనల్లో అదరగొట్టాడు. అలా అయితే కష్టమే కదా తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్లో సంచలన సెంచరీ(109)తో జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘కేవలం మూడు రోజుల గ్యాప్లో వరుసగా 10 మ్యాచ్లు ఆడటం అంటే దేశవాళీ క్రికెటర్లకు చాలా కష్టం. ముఖ్యంగా ఫాస్ట్బౌలర్లు ఎక్కువగా గాయాలబారిన పడే అవకాశం ఉంటుంది. గతంలో రెగ్యులర్ మ్యాచ్లకు మూడు రోజులు, నాకౌట్ మ్యాచ్లకు ఐదు రోజుల విరామం ఉండేది. కానీ.. ఇప్పుడు అన్నింటికి కేవలం మూడు రోజుల వ్యవధే ఉంటోంది’’ అని పేర్కొన్నాడు. శరీరాలను పణంగా పెడుతోంది వాళ్లే ఈ నేపథ్యంలో... ఇంగ్లండ్పై టీమిండియా 4-1 సిరీస్ విజయం తర్వాత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ కామెంట్లు చేసింది శార్దూల్ అనుకుంటా.. అతడే కాదు చాలా మంది క్రికెటర్లు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఇండియాలో లాంటి పెద్ద దేశంలో ప్రయణాలు, విరామం లేని షెడ్యూళ్లు అంటే కష్టమే. ఆటగాళ్ల ఇబ్బందుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. విరామం లేని ఆట కోసం వారి శరీరాల(ఆరోగ్యాన్ని)ను పణంగా పెడుతోంది వాళ్లే. కాబట్టి.. ఇలాంటి అంశాల్ని లేవనెత్తుతూ వారు గళం వినిపించినపుడు తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పలు మార్పులు చేర్పులు ఉండేలా షెడ్యూళ్లను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి’’ అని రాహుల్ ద్రవిడ్ శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లకు అండగా నిలిచాడు. ఆధునిక యుగంలో అవసరం లేదనుకున్న కొన్ని టోర్నీల నిర్వహణ గురించి.. ఆటగాళ్లు, కోచ్ల నుంచి అభిప్రాయాలు సేకరించి పునరాలోచన చేస్తే బాగుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. చదవండి: షూ కొనుక్కోవడానికీ డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు -
ధోని, యువీ కాదు..! భారత్లో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. సిక్సర్లు బాదడంలో హిట్మ్యాన్ తనకు తానే సాటి అని కొనియాడాడు. భారత్లో ఇంత వరకు అలాంటి హిట్టర్ మరొకరు లేరని పేర్కొన్నాడు. కాగా 2007లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డేల్లో మూడు ద్విశతకాలు బాదిన ఏకైక క్రికెటర్గా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. టెస్టుల్లో ఇప్పటి వరకు 12 సెంచరీలు నమోదు చేశాడు. ఇక సిక్సర్లు కొట్టడంలో రోహిత్ శర్మ ఎప్పుడూ ‘హిట్టే’! ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి అతడి ఖాతాలో 597 సిక్స్లు ఉన్నాయి. ఇక ఇంగ్లండ్తో శనివారం ముగిసిన ఐదో టెస్టులోనూ రోహిత్ శర్మ విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఇక ఈ టెస్టులో కూడా టీమిండియా గెలుపొంది సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఫలితంగా బ్యాటర్గా, కెప్టెన్గా అద్భుత ప్రదర్శన కనబరిచిన రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. రోహిత్ హిట్టింగ్ పవర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా వాళ్లకు నా వీడియోలు చూపించాను. అందుకే అలా సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నారు(నవ్వుతూ).. జోక్స్ పక్కన పెడితే.. ఈ ఫార్మాట్లో ఎవరైనా సిక్స్లు కొడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. మనకు రోహిత్ శర్మ లాంటి గొప్ప సిక్స్ హిట్టర్ ఉన్నాడు. షాట్ బాదడంలో తన పవర్, నైపుణ్యం అద్భుతం’’ అని కితాబులిచ్చాడు. టీమిండియాలో ఇంతవరకు అతడిలా సిక్సర్లు బాదిన ఆటగాడు మరొకరు లేరని ద్రవిడ్ జియో సినిమా షోలో ఈమేరకు వ్యాఖ్యానించాడు. కాగా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా టీమిండియాలో గొప్ప సిక్స్ హిట్టర్లుగా పేరొందిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2024: వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
ద్రవిడ్, సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్..!
-
మీ నాన్న ఇక్కడ లేరు.. అయితేనేం!.. ద్రవిడ్ వ్యాఖ్యలు వైరల్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున నలుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్, మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడగుపెట్టారు. తాజాగా శుక్రవారం మొదలైన నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. 27 ఏళ్ల వయసులో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. నిజానికి ఆకాశ్ దీప్ ఈ స్థాయికి చేరడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. తండ్రి, సోదరుడిని కోల్పోయిన విషాదం నుంచి కోలుకుని.. ఆటపై దృష్టి సారించాడు. స్వస్థలమైన బిహార్లో అవకాశాలు లేకపోవడంతో పశ్చిమ బెంగాల్కు మకాం మార్చి అక్కడే తన నైపుణ్యాలకు పదును పెట్టి దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ విషయం గురించి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘రాంచికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాడి నుంచి నీ ప్రయాణం మొదలుపెట్టావు. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని.. ఎత్తుపళ్లాలు చూసి ఇక్కడి దాకా వచ్చావు. నీ కాళ్లపై నీవు నిలబడి.. బాడి నుంచి ఢిల్లీ దాకా చేరుకున్నావు. 2007 టీ20 ప్రపంచకప్ విజయం చూసి ఆటపట్ల ఆకర్షితుడవై.. ఢిల్లీలోనే నీ ప్రయాణం మొదలుపెట్టాలని భావించావు. ఆ తర్వాత కోల్కతాకు వెళ్లి.. అక్కడ డొమెస్టిక్ క్రికెట్లో అడుగుపెట్టి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నావు. ఆ జర్నీ నిన్ను ఇప్పుడు ఇక్కడ రాంచి దాకా తీసుకువచ్చింది. నీ గ్రామానికి 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో నువ్వు ఇండియా క్యాప్ అందుకున్నావు. అది కూడా నీ కుటుంబ సభ్యుల సమక్షంలో! ముఖ్యంగా మీ అమ్మగారి ముందు.. ఈ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో నేను ఊహించగలను. కానీ దురదృష్టవశాత్తూ మీ నాన్నగారు, మీ అన్నయ్య ఇక్కడ లేరు. అయితే, వాళ్ల ఆశీర్వాదాలు మాత్రం నీతోనే ఉంటాయి. జట్టు మొత్తం నీకు అండగా ఉంది. శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఈ క్షణాన్ని నువ్వు పూర్తిగా ఆస్వాదించు. నీ కల నిజమైంది. ఇదిగో అందుకో టీమిండియా టెస్టు క్యాప్ నంబర్ 313’’ అంటూ ఆకాశ్ దీప్ను ఉద్దేశించి ఉద్వేగపూరిత, స్ఫూర్తిదాయక ప్రసంగం చేశాడు. ఇక క్యాప్ అందుకున్న అనంతరం ఆకాశ్ దీప్ తన తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక టీమిండియా జెర్సీతో బరిలోకి దిగి ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఒకే ఓవర్లో.. బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా పెవిలియన్కు పంపి ఇంగ్లండ్ టాపార్డర్ను కుప్పకూల్చి తొలి రోజు మొత్తంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఆకాశ్ దీప్ను ఉద్దేశించి ద్రవిడ్ ప్రసంగం, అతడు తన తల్లి పాదాలకు నమస్కరించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Words that inspire 🗣️ ft. Rahul Dravid Dreams that come true 🥹 A debut vision like never seen before 🎥 Akash Deep - What a story 📝#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vSOSmgECfC — BCCI (@BCCI) February 23, 2024 A wonderful moment after Akash Deep was handed his test cap. You are never too old or big to seek your mother's blessings. pic.twitter.com/cauAM3JX7b — Zucker Doctor (@DoctorLFC) February 23, 2024 Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 -
టీమిండియా కోచ్ పదవిపై కీలక ప్రకటన చేసిన జై షా
బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియా కోచ్ పదవిపై కీలక ప్రకటన చేశాడు. ఈ ఏడాది జూన్లో జరిగే టీ20 వరల్డ్కప్ వరకు భారత జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య రాజ్కోట్ వేదికగా ఇవాళ మొదలైన మూడో టెస్ట్కు ముందు షా మాట్లాడుతూ ఇలా అన్నాడు. వరల్డ్కప్ ముగిశాక ద్రవిడ్తో మాట్లాడే అవకాశం దొరకలేదు. ఆతర్వాత కూడా టీమిండియా వరుస సిరీస్లతో బిజీ కావడంతో ద్రవిడ్తో ఎలాంటి మాటామంతి జరపలేదు. రాజ్కోట్ టెస్ట్కు ముందు ద్రవిడ్తో మాట్లడే అవకాశం దొరికింది. టీ20 వరల్డ్కప్ వరకు అతన్నే కోచ్గా కొనసాగాలని కోరాం. అందుకు ద్రవిడ్ కూడా సానుకూలంగానే స్పందించాడు. అనుభవజ్ఞుడైన ద్రవిడ్ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అతను టీమిండియాను సమర్దవంతంగా ముందుండి నడిపించగలడు. అతని మార్గనిర్దేశకం భారత జట్టు టీ20 వరల్డ్కప్లో రాణిస్తుందన్న నమ్మకం ఉంది. ద్రవిడ్తో పాటు సహాయక కోచింగ్ సిబ్బంది మొత్తం వరల్డ్కప్ వరకు యధాతథంగా కొనసాగుతారని షా స్పష్టం చేశాడు. దీనికి ముందే షా మరో కీలక ప్రకటన కూడా చేశాడు. టీ20 వరల్డ్కప్లో రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్గా ఉంటాడని స్పష్టం చేశాడు. కాగా, భారత క్రికెట్ జట్టుతో రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్కప్తో ముగిసిందన్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ సేవల పట్ల సంతృప్తి చెందిన బీసీసీఐ అతన్ని మరో దఫా కోచ్గా కొనసాగాలని విజ్ఞప్తి చేసింది. అనేక సంప్రదింపుల అనంతరం రాహుల్ బీసీసీఐ ప్రతిపాదనకు ఒప్పుకుని హుటాహుటిన సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరాడు. అప్పట్లో కాంట్రాక్ట్ పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయని బీసీసీఐ.. తాజాగా ద్రవిడ్ కొనసాగింపుపై స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే, రాజ్కోట్ టెస్ట్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా తొలి రోజు టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (10), శుభ్మన్ గిల్ (0), రజత్ పాటిదార్ (5) నిరాశపరచగా.. రోహిత్ శర్మ (97 నాటౌట్), రవీంద్ర జడేజా (68 నాటౌట్) టీమిండియాను ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 152 పరుగులు జోడించి, టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించే దిశగా తీసుకెళ్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2, టామ్ హార్ట్లీ ఓ వికెట్ పడగొట్టారు. -
విరాట్ గొప్ప బ్యాటర్.. ఎంట్రీ ఇస్తే ఏం చేయాలో తెలుసు!
'Respect His Prowess & Competitiveness': టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ ఆటంటే తనకెంతో గౌరవమని.. అతడు భాగంగా ఉన్న జట్టుతో పోటీపడటాన్ని తాను ఆస్వాదించేవాడినని గుర్తు చేసుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలు కోహ్లి సొంతమన్న మెకల్లమ్.. ప్రత్యర్థి జట్టుతో అతడు పోటీపడే తీరు మజా అందిస్తుందని పేర్కొన్నాడు. ఏదేమైనా మూడో టెస్టుతో కోహ్లి రీ ఎంట్రీ ఇస్తే అతడిని ఎదుర్కొనేందుకు తమ బౌలర్లు సిద్ధంగా ఉన్నారని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు. కాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కెప్టెన్ బెన్ స్టోక్స్తో కలిసి.. ‘బజ్బాల్’ పేరిట సంప్రదాయ క్రికెట్ను కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అతడి మార్గదర్శనంలో టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శిస్తూ ఇంగ్లండ్ విజయవంతంగా ముందుకు సాగుతుండటం విశేషం. ఈ క్రమంలో భారత్ వేదికగా టీమిండియాతో తొలి టెస్టులో గెలుపొందిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్లో మాత్రం భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ రెండు టెస్టులకు భారత మాజీ సారథి విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరమయ్యాడు. అందుకే కోహ్లి దూరం గర్భవతిగా ఉన్న భార్య అనుష్క శర్మ కోసం అతడు సమయం కేటాయించాడని కోహ్లి స్నేహితుడు ఏబీ డివిలియర్స్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో టెస్టుకు కోహ్లి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోహ్లి పోటీతత్వం అంటే నాకెంతో గౌరవం ఈ నేపథ్యంలో బ్రెండన్ మెకల్లమ్ టాక్స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘గొప్ప క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. అతడి ఆట, పోటీతత్వం అంటే నాకెంతో గౌరవం. తనతో మ్యాచ్లు ఆడటాన్ని నేను ఆస్వాదించేవాడిని. విజయవంతమైన ఆటగాడితో పోటీ పడటం అంటే.. మనం కూడా ఎంతో కొంత నేర్చుకునే వీలు ఉంటుంది కదా!’’ అంటూ కోహ్లిని కొనియాడాడు. మూడో టెస్టు నేపథ్యంలో కోహ్లి తిరిగి వస్తే.. అతడిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై దృష్టి సారించామని మెకల్లమ్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా కోహ్లి రీఎంట్రీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం గురించి రాహుల్ ద్రవిడ్కు ప్రశ్న ఎదురుకాగా.. సెలక్టర్లకే కోహ్లి అందుబాటులో ఉండే విషయం గురించి అవగాహన ఉంటుందని తెలిపాడు. అతడితో వాళ్లు టచ్లో ఉన్నారని.. జట్టు ప్రకటన నాటికి క్లారిటీ వస్తుందంటూ మాట దాటేశాడు. చదవండి: శివం దూబేకు విశ్రాంతి.. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ! -
అలాంటి పిచ్లు అవసరమా అన్న గంగూలీ.. ద్రవిడ్ కౌంటర్!
Ind vs Eng- Dravid Comments On Pitch: ఇటీవల కాలంలో టెస్టు మ్యాచ్లు ఐదురోజుల పాటు పూర్తిగా జరిగిన సందర్భాలు అరుదు. ఒక్కోసారి ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్లు ముగిసిపోవడం వల్ల పిచ్ల తయారీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా- ఇంగ్లండ్ తాజా సిరీస్పై క్రికెట్ దిగ్గజాల దృష్టి పడింది. భారత్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన గత సిరీస్లో పిచ్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సహా ఇతర మాజీ క్రికెటర్లు వ్యంగ్యస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుకు మాత్రమే ఉపయోగపడేలా వికెట్ రూపొందించారంటూ విమర్శించారు. ఈ క్రమంలో తాజా సిరీస్లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్లు నాలుగు రోజుల పాటు సాగాయి. బుమ్రా అద్భుత ప్రదర్శన హైదరాబాద్ టెస్టులో విజయంతో ఇంగ్లండ్ సిరీస్ ఆరంభిస్తే... విశాఖపట్నంలో టీమిండియా గెలుపొంది సిరీస్ను 1-1తో సమం చేసింది. రెండు మ్యాచ్లు కూడా రసవత్తరంగానే సాగడం విశేషం. ముఖ్యంగా టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీసిన తీరు ముచ్చటగొలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. భారత్లో స్పిన్తో పాటు పేస్కూ అనుకూలించే పిచ్లు రూపొందించాలని విజ్ఞప్తి చేశాడు. కేవలం టర్న్ అయ్యే పిచ్లు మనకు అవసరమా అని ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. ఈ క్రమంలో.. తాజాగా ఈ విషయంపై టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం స్పందించాడు. When I see Bumrah Sami Siraj Mukesh bowl . I wonder why do we need to prepare turning tracks in india ..my conviction of playing on good wickets keeps getting stronger every game .. They will get 20 wickets on any surface with ashwin jadeja Kuldeep and axar .. batting quality… — Sourav Ganguly (@SGanguly99) February 3, 2024 విశాఖ మ్యాచ్లో భారత్ గెలుపు నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తామెప్పుడూ పూర్తి స్పిన్ పిచ్ తయారు చేయాలని కోరలేదని స్పష్టం చేశాడు. పిచ్ల రూపకల్పన క్యూరేటర్ల పని అని.. అందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశాడు. టర్న్ అయ్యే పిచ్లే కావాలని మేము కోరలేదు ‘‘పిచ్లను క్యూరేటర్ తయారు చేస్తారు. పూర్తిగా టర్నింగ్ పిచ్లు మాత్రమే కావాలని మేము అడగము. ఇండియాలో సహజంగానే వికెట్లు స్పిన్కు అనుకూలిస్తాయి. అయితే, అవి ఎంత వరకు టర్న్ అవుతాయి? ఎంత తక్కువ టర్న్ అవుతాయి? అన్న విషయాలు మనకు తెలియవు. నేనేమీ పిచ్ నిపుణుడిని కాదు. ఇండియాలో పిచ్లు నాలుగు- ఐదు రోజుల ఆట కోసమే రూపొందిస్తారు. మళ్లీ చెప్తున్నా ఇక్కడి పిచ్లు టర్న్ అవుతాయి. అంతేగానీ.. టర్న్ అవుతూనే ఉండవు. ఒక్కోసారి మూడో రోజు.. ఒక్కోసారి నాలుగో రోజు.. ఒక్కో సారి రెండోరోజే టర్న్ అవుతాయి. పిచ్ స్వభావం ఎలా ఉండబోతుందన్న అంశంపై ఎవరికీ పూర్తి అవగాహన ఉండదు. ఏ పిచ్పై అయినా మా ఆట తీరు ఎలా ఉంటుందనేదే ముఖ్యం. తదుపరి మేము రాజ్కోట్కు వెళ్తున్నాం. అక్కడి పిచ్ ఎలా ఉంటుందో మాకు ఐడియా లేదు. ఎలాంటి వికెట్పై అయినా మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే మాకు ప్రథమ ప్రాధాన్యం’’ అని రాహుల్ ద్రవిడ్ కుండబద్దలు కొట్టాడు. గంగూలీకి కౌంటర్గానేనా? ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెటిజన్లు.. గంగూలీ లాంటి వాళ్లకు ద్రవిడ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా గంగూలీ బీసీసీఐ బాస్గా ఉన్న సమయంలోనే తన సహచర ఆటగాడు ద్రవిడ్ను హెడ్కోచ్గా నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్లో మూడో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: IPL 2024: అందుకే రోహిత్ను ముంబై కెప్టెన్గా తప్పించాం.. కోచ్పై రితిక ఫైర్ -
ఇషాన్ తిరిగి రావాలంటే తనను తాను నిరూపించుకోవాలి: రాహుల్ ద్రవిడ్
టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ గతకొద్ది రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. వ్యక్తిగత కారణాల చేత గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చేసిన ఇషాన్.. అప్పటి నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. గ్యాప్ కావడంతో జాతీయ సెలెక్టర్లు సైతం ఇషాన్ను ఏ ఫార్మాట్కు పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో అలకబూనాడో ఏమో తెలీదు కానీ.. అతను కనీసం దేశవాలీ టోర్నీల్లో కూడా ఆడకుండా బీష్మించుకు కూర్చున్నాడు. తాజాగా విశాఖ టెస్ట్ అనంతరం విలేకరులు ఇషాన్ గురించి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వద్ద ఆరా తీశారు. అసలు ఇషాన్కు ఏమైంది.. అతను ఇంతకాలంగా జట్టుకు ఎందుకు దూరంగా ఉంటున్నాడంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ద్రవిడ్ స్పందిస్తూ.. ఇషాన్ను జాతీయ సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవాలంటే, అతను తొలుత క్రికెట్ ఆడటం మొదలుపెట్టాలి. ఏ తరహా గేమ్లోనైనా సరే తనను తాను నిరూపించుకోవాలి. ఇషాన్ అభ్యర్ధన మేరకే బ్రేక్ లభించింది. తిరిగి జట్టులోకి రావాలంటే తప్పనిసరిగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇషాన్తో టచ్లోనే ఉన్నామని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. బీసీసీఐలోని ఓ వర్గం ఇషాన్ రీఎంట్రీని అడ్డుకుంటుందన్న ప్రచారం జరుగుతున్న వేల ద్రవిడ్ ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా మారింది. ఇషాన్ కూడా కోహ్లిలా బీసీసీఐ పెద్దలతో ఏదైనా గొడవ పడ్డాడా అని జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. అప్పటివరకు మూడు ఫార్మాట్లలో సభ్యుడిగా ఉన్న ఇషాన్ ఒక్కసారిగా కనుమరుగైపోవడం ఏంటని చర్చించుకుంటున్నారు. ద్రవిడ్ ఇచ్చిన వివరణ చూస్తుంటే, ఇషాన్ రీఎంట్రీని అడ్డుకునే ప్రణాళికగా ఉందంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుత టెస్ట్ వికెట్కీపర్ కేఎస్ భరత్ వరుసగా విఫలమవుతున్నా.. అతనితోనే నెట్టుకొస్తున్నారు కానీ, ఇషాన్ను అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్ట్లో బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్ (209), శుభ్మన్ గిల్ (104) అద్భుత ప్రదర్శనలతో చెలరేగడంతో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమానంగా నిలిచింది. -
కుర్రాళ్లకు అనుభవం లేదు.. మరో 70-80 చేయాల్సింది: ద్రవిడ్
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లో మాత్రం చెతేలేత్తేశారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో 202 పరుగులకే భారత్ ఆలౌటైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు టెస్ట్ల సిరీస్లో 1-0తో శుభారంభం చేసింది. ఇక తొలి టెస్టులో ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. "ఈ మ్యాచ్లో మా బ్యాటర్లు ఎవరూ సెంచరీ సాధించలేకపోయారు. ఎవరో ఒకరైనా మూడెంకెల స్కోర్ సాధించి వుంటే బాగుండేది. తొలి ఇన్నింగ్స్లో 70 నుంచి 80 పరుగులు చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడూ బ్యాటర్లకు ఛాలెంజింగ్గానే ఉంటుంది. లక్ష్యం 230 పరుగులే అయినప్పటికి ఛేజ్ చేయడం అంత సులభం కాదు. ప్రస్తుత మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారికి వైట్బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది. కానీ రెడ్ బాల్ క్రికెట్లో పెద్దగా అనువభం లేదు. టెస్టు క్రికెట్లో ఎదగడానికి వారికి ఇంకాస్త సమయం అవసరం. ప్రతీ ఒక్క ఆటగాడికి అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. వారు దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించి సీనియర్ జట్టులోకి వచ్చారు. వారు తప్పకుండా భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నానని" విలేకరుల సమావేశంలో ద్రవిడ్ పేర్కొన్నాడు. -
పోప్పై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా కెప్టెన్, కోచ్
హైదరాబాద్ టెస్ట్లో భారీ ద్విశతం (196) సాధించి, తమ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిన ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ పోప్పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వీరిద్దరూ పోప్ ఆడిన మ్యాచ్ విన్నింగ్స్ను కొనియాడారు. ద్రవిడ్ మాట్లాడుతూ.. గతంలో పలువురు విదేశీ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూశాను. కానీ పోప్లా భారత స్పిన్నర్లను నిలదొక్కుకోనీయకుండా ఇబ్బంది పెట్టిన బ్యాటర్లను చూడలేదు. పోప్ వైవిధ్యభరితమైన షాట్లను (రివర్స్ స్వీప్) ఎంతో సమర్థవంతంగా ఆడి భారత స్పిన్నర్లు లయ తప్పేలా చేశాడు. పోప్ ఎదురుదాడికి దిగి భారత స్పిన్నర్లను కుదురుకోనీయకుండా చేశాడు. కష్టమైన పిచ్పై పోప్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే మేటి స్పిన్నర్లను పోప్ తన బ్యాటింగ్ నైపుణ్యంతో ముప్పుతిప్పలు పెట్టాడు. ఫైనల్గా హ్యాట్స్ ఆఫ్ టు పోప్ అంటూ ద్రవిడ్ కొనియాడాడు. మరోవైపు పోప్ గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. భారత గడ్డపై ఓ విదేశీ ప్లేయర్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఇది (పోప్) ఒకటని రోహిత్ కితాబునిచ్చాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో పర్యాటక ఇంగ్లండ్.. టీమిండియాపై 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల భారీ లీడ్ సాధించినప్పటికీ ఓటమిపాలైంది. ఓలీ పోప్ మూడో ఇన్నింగ్స్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ ముందు ఫైటింగ్ టోటల్ను ఉంచడంలో కీలకపాత్ర పోషించాడు. 230 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడిన భారత్ 202 పరుగులకు ఆలౌటై, స్వదేశంలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్లోని రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి మొదలవుతుంది. -
కేఎల్ రాహుల్ వికెట్కీపింగ్ చేయడు: రాహుల్ ద్రవిడ్
త్వరలో ఇంగ్లండ్తో జరుగబోయే టెస్ట్ సిరీస్లో కేఎల్ రాహుల్ వికెట్కీపింగ్ చేస్తాడా లేదా అన్న విషయమై భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సిరీస్లో రాహుల్ వికెట్కీపింగ్ చేసేది లేదని ఖరాఖండిగా చెప్పాడు. రాహుల్ కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగుతాడని తెలిపాడు. ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్కప్ను దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అందులో భాగంగానే జట్టులో అదనంగా ఇద్దరు వికెట్కీపర్లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నాడు. ఇటీవలికాలంలో రాహుల్ ఫార్మాట్లకతీతంగా వికెట్కీపర్ బ్యాటర్గా రాణిస్తున్నప్పటికీ ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో మాత్రం ప్రయోగాలు చేయలేమని అన్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉన్నందున బ్యాటింగ్ పరంగానే రాహుల్పై అధిక భారం పడే అవకాశం ఉందని, అందుకే అతనిపై వికెట్కీపింగ్ భారాన్ని మోపే సాహసం చేయలేమని వివరణ ఇచ్చాడు. వికెట్కీపింగ్ బ్యాటర్ స్థానం కోసం కేఎస్ భరత్, దృవ్ జురెల్ మధ్య పోటీ నెలకొందని, ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తామని తెలిపాడు. ఇద్దరూ అద్భుతమైన ఫామ్లో ఉండటంతో తుది జట్టులోకి ఎవరిని ఎంపిక చేయాలో అర్ధం కావట్లేదని అన్నాడు. కాగా, ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్ల కోసం భారత సెలక్టర్లు రాహుల్తో కలిపి ముగ్గురు వికెట్కీపర్లను ఎంపిక చేశారు. రాహుల్పై అధిక భారం పడకూడదనే ఉద్దేశంతోనే సెలెక్టర్లు కేఎస్ భరత్, దృవ్ జురెల్ స్టాండ్ బై కీపర్లుగా ఎంపిక చేశారు. కాగా, ఈ నెల 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇదివరకే హైదరాబాద్కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్లో బిజీగా ఉన్నారు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల చేత తొలి రెండు టెస్ట్లకు దూరం కాగా.. ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల చేత సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. -
అందుకే ఇషాన్పై వేటు?.. వస్తే నేరుగా తుదిజట్టులోకే!
Ind vs Eng 5 Match Test Series 2024: ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్లలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ శుక్రవారం రాత్రి ప్రకటించింది. సొంతగడ్డపై దాదాపు నెలన్నర పాటు జరుగనున్న ఈ సిరీస్ సందర్భంగా ఓ కొత్త ఆటగాడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్కు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు. కేఎల్ రాహుల్, కోన శ్రీకర్ భరత్లతో పాటు మూడో వికెట్ కీపర్ ఆప్షన్గా అతడికి అవకాశం ఇచ్చారు. నిజానికి స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సెలక్షన్కు అందుబాటులో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. మధ్యలోనే తిరిగి వచ్చాడు గత కొన్నాళ్లుగా ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జట్టుతో ప్రయాణిస్తున్నా తుదిజట్టులో ఆడే అవకాశం రావడం లేదు. దీంతో సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. మానసికంగా అలసిపోయానంటూ బీసీసీఐ దగ్గర సెలవు తీసుకుని ఆటకు విరామం ప్రకటించాడు. అయితే, ఇషాన్ కిషన్ వ్యవహారశైలి నచ్చని బీసీసీఐ పెద్దలు క్రమశిక్షణ చర్యల కింద అతడిని కొన్నాళ్లపాటు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఈ లెఫ్టాండ్ బ్యాటర్ను అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు కూడా ఎంపిక చేయలేదనే విమర్శలు వచ్చాయి. అలాంటిదేమీ లేదన్న ద్రవిడ్ ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా స్పందించాడు. ఇషాన్పై అలాంటి చర్యలేమీ తీసుకోలేదని.. అతడు సెలక్షన్కు అందుబాటులో లేడు కాబట్టే ఎంపిక చేయలేదని తెలిపాడు. అయితే, మళ్లీ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్లో నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. రంజీలో నేరుగా తుదిజట్టులో ఆడిస్తామన్న జార్ఖండ్ మేనేజ్మెంట్ ఈ క్రమంలో జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేబాశిష్ చక్రవర్తి ఇషాన్ కిషన్కు తాము స్వాగతం పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఇంత వరకు ఇషాన్ తమను సంప్రదించలేదని.. ఒకవేళ అతడు రంజీ ట్రోఫీ-2024 సీజన్లో జార్ఖండ్ జట్టుకు ఆడాలనుకుంటే.. నేరుగా తుదిజట్టులో ఆడిస్తామని స్పష్టం చేశాడు. అయినప్పటికీ ఇంత వరకు ఇషాన్ కిషన్ జార్ఖండ్ జట్టుతో చేరలేదని తెలుస్తోంది. ఒకవేళ రంజీలకు దూరంగా ఉండాలని ఇషాన్ నిర్ణయించుకుంటే ఇక ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అతడికి చోటు దక్కకపోవచ్చు. తొలి టెస్టు హైదరాబాద్లో ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమైన ఇషాన్.. మిగతా మూడు మ్యాచ్లు కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ చెప్పిన మాటలు పెడచెవిన పెడితే రీఎంట్రీ అసాధ్యమవుతుంది. చూడాలి మరి ఈ యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఏం చేస్తాడో!! ఇదిలా ఉంటే.. ఇషాన్ స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ధ్రువ్ భారత అండర్–19 జట్టుకు ఆడాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్లో... రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నంలో జరుగుతాయి. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్. చదవండి: Ind vs Eng ఎవరీ ధ్రువ్ జురెల్? తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి త్యాగం! -
వెళ్లడం వరకే నీ ఇష్టం!.. ద్రవిడ్ ‘వార్నింగ్’ తర్వాత ఇషాన్ ఫస్ట్ రియాక్షన్
Rahul Dravid- Ishan Kishan: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ ఇంకా సెలవులోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు అతడు అందుబాటులోకి వస్తాడని భావించినా.. అలా జరుగలేదని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు.. ఇషాన్ మళ్లీ భారత జట్టుతో చేరాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో.. మానసికంగా అలసిపోయానని తనకు తాను తప్పుకొన్న ఇషాన్ కిషన్.. పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండటం బీసీసీఐ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందనే వార్తలు వినిపించాయి. వెళ్లడం వరకే మీ ఇష్టం.. తిరిగి రావాలంటే ఈ నేపథ్యంలోనే .. ‘‘జట్టును వీడి వెళ్లాలా వద్దా అనేది మాత్రమే ఆటగాళ్ల ఇష్టం.. వాళ్లను తిరిగి తీసుకోవాలా వద్దా అనేది మాత్రం మా ఇష్టమే’’ అన్న అర్థం ద్రవిడ్ మాటల్లో ధ్వనించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీలైనప్పుడల్లా అవకాశాలు ఇస్తున్నా.. తనను కావాలనే పక్కనపెడుతున్నారని ఇషాన్ ఇగోకు పోయి తన కెరీర్ను తానే నాశనం చేసుకుంటున్నాడనే మాటలూ వినిపిస్తున్నాయి. రంజీల్లో ఆడతాడో లేదో చెప్పలేదు.. వస్తే మాత్రం మరోవైపు.. ద్రవిడ్ చెప్పిన తర్వాత ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీ-2024 సీజన్లో కచ్చితంగా ఆడతాడని అంతా భావించారు. ఇంగ్లండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్కు ముందు ఇషాన్.. దేశవాళీ క్రికెట్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జార్ఖండ్ తరఫున బరిలోకి దిగుతాడని ఊహించారు. కానీ.. ఇందుకు సంబంధించి తమకు ఇషాన్ నుంచి ఎలాంటి సమాచారం లేదని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేబాశిష్ చక్రవర్తి వార్తా సంస్థ పీటీఐకి తెలిపాడు. ఒకవేళ ఇషాన్ రంజీల్లో ఆడాలనుకుంటే నేరుగా తుదిజట్టులో చేర్చుకుంటామని స్పష్టం చేశాడు. అయినప్పటికీ ఈ పరిణామాలపై ఇషాన్ కిషన్ ఇంత వరకు నేరుగా స్పందించకపోవడం గమనార్హం. అయితే, తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోతో ప్రత్యక్షమయ్యాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. యోగా చేస్తూ, మైదానంలో పరుగులు తీస్తూ ఇందులో... యోగా చేస్తూ, మైదానంలో పరుగులు తీస్తూ కనిపించాడు. దీనిని బట్టి త్వరలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇషాన్ చెప్పకనే చెప్పినట్లయింది. అయితే, ఇప్పటికే శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్లతో పాటు రుతురాజ్ గైక్వాడ్ నుంచి ఓపెనింగ్ స్థానానికి ఇషాన్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. మరోవైపు... కేఎల్ రాహుల్- శ్రీకర్ భరత్(టెస్టు), సంజూ శాంసన్- జితేశ్ శర్మ(వన్డే, టీ20లలో) రూపంలో వికెట్ కీపర్ స్థానానికి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ విషయంలో మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: NZ vs Pak: చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్గా రికార్డు 🏃♂️ pic.twitter.com/XjUfL18Ydc — Ishan Kishan (@ishankishan51) January 12, 2024 -
Dravid: అప్పటి వరకు ఇషాన్కు టీమిండియాలో స్థానం లేదు
Ishan Kishan Return?: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్పై బీసీసీఐ గుర్రుగా ఉందన్న వార్తల నేపథ్యంలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్లో నిరూపించుకున్న తర్వాతే ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మళ్లీ సెలక్షన్కు అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. అంతవరకు ఇషాన్ కిషన్కు టీమిండియాలో స్థానం దక్కదని ద్రవిడ్ సంకేతాలు ఇచ్చాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టులకు ఎంపికైన ఇషాన్ సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి తిరిగి వచ్చాడు. మానసికంగా అలసిపోయానని.. కుటుంబంతో గడిపేందుకు తనకు సెలవు మంజూరు చేయాలని అతడు విజ్ఞప్తి చేయగా.. మేనేజ్మెంట్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. నమ్మకాన్ని వమ్ము చేశాడంటూ వదంతులు అయితే, బీసీసీఐ పెద్దల నమ్మకాన్ని వమ్ము చేసేలా ఇషాన్ వ్యవహరించాడన్న కారణంతోనే అతడిని అఫ్గనిస్తాన్తో సిరీస్కు పక్కనపెట్టినట్లు వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో.. తొలి టీ20 ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్కు ఇషాన్ గురించి ప్రశ్న ఎదురైంది. అప్పుడే మళ్లీ టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ.. తేల్చేసిన ద్రవిడ్ ఇందుకు బదులిస్తూ.. ‘‘అలాంటిదేమీ లేదు. సెలక్షన్కు అతడు అందుబాటులో లేడు. నిజానికి సౌతాఫ్రికా టూర్లో ఉన్నపుడే తనకు బ్రేక్ కావాలని ఇషాన్ అడిగాడు. మేము కూడా అందుకు అంగీకరించాం. అన్ని విధాలా మద్దతుగా నిలబడ్డాం. సమస్యకు తగిన పరిష్కారం వెదకాలని సూచించాం. ఆ తర్వాత అతడు ఇంత వరకు సెలక్షన్కు అందుబాటులోకి రాలేదు. ఒకవేళ తను మళ్లీ మైదానంలో దిగాలనుకుంటే.. దేశవాళీ క్రికెట్ ఆడి.. అప్పుడు సెలక్షన్కు అవైలబుల్గా ఉంటాడు’’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. సంజూ, జితేశ్లకు లక్కీ ఛాన్స్ కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ శాంసన్, జితేశ్ శర్మ వికెట్ కీపర్లుగా చోటు దక్కించుకున్నారు. ఇక టీ20 ప్రపంచకప్-2024కు ముందు టీమిండియా ఆడే ఆఖరి సిరీస్ ఇదే కావడం గమనార్హం. మళ్లీ ఐపీఎల్-2024లో ప్రదర్శనను బట్టే ఇషాన్ వరల్డ్కప్ నాటికి తిరిగి వస్తాడా లేదా అన్నది తేలనుంది. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకోవాలంటే జార్ఖండ్ తరఫున ఇషాన్ రంజీల్లో ఆడటం తప్ప మరోమార్గం లేదు. అక్కడ తనను తాను నిరూపించుకున్నా.. కేఎల్ రాహుల్ రూపంలో వికెట్ కీపర్ స్థానానికి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. చదవండి: Ind vs Afg: అఫ్గన్ బ్యాటింగ్ సంచలనం.. 22 ఏళ్ల కెప్టెన్! రోహిత్ సేనతో ఢీ అంటే ఢీ! ఎవరితడు? -
అందుకే అయ్యర్పై వేటు?.. క్లారిటీ ఇచ్చిన ద్రవిడ్
Ind vs Afg T20Is- Rahul Dravid Comments On Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గురించి వస్తున్న వార్తలను హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఖండించాడు. క్రమశిక్షణా రాహిత్యం వల్లనే అతడిని జట్టు నుంచి తప్పించారన్న వదంతులను కొట్టిపారేశాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఆసీస్ సిరీస్కు వైస్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జరిగిన ఈ సిరీస్ తాలుకు ఆఖరి రెండు మ్యాచ్లకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీ20 జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. కానీ.. పొట్టి ఫార్మాట్లో సఫారీలతో జరిగిన సిరీస్లో అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అఫ్గన్తో సిరీస్కు పక్కనపెట్టేశారు ఈ క్రమంలో సొంతగడ్డపై జనవరి 11 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్తో సిరీస్కు అతడిని పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగానే అయ్యర్పై వేటు వేశారంటూ వదంతులు వ్యాపించాయి. ఈ విషయంపై తాజాగా స్పందించిన హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్.. ‘‘అఫ్గన్తో సిరీస్కు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడానికి డిసిప్లినరీ యాక్షన్ కారణమన్నది పూర్తిగా అవాస్తవం. అతడు ఈ సిరీస్ మిస్సయ్యాడంతే! చాలా మంది ఉన్నారు జట్టులో ఇప్పటికే చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. అందుకే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. జట్టులో ఎక్కువ మంది బ్యాటర్లు ఉన్నందువల్ల గట్టి పోటీ ఉంది. ప్రతి ఒక్కరిని తుదిజట్టులో ఆడించడం కుదరదు కదా. అందుకే అయ్యర్ను పక్కనపెట్టాల్సి వచ్చింది. అంతేగానీ క్రమశిక్షణారాహిత్యం వల్ల అతడిని తప్పించామనడం సరికాదు. అసలు ఈ విషయం గురించి సెలక్టర్లతో నేను ఎలాంటి చర్చలు జరుపలేదు’’ అని స్పష్టతనిచ్చాడు. రంజీల్లో అయ్యర్ ఆట కాగా అఫ్గన్తో సిరీస్కు ఎంపిక కాని శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్తో టెస్టులకు సన్నద్ధమయ్యే పనిలో పడ్డాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీ-2024 సీజన్లో ఆడేందుకు అతడు నిర్ణయించుకున్నాడు. ఆంధ్రా జట్టుతో జనవరి 12 నుంచి మొదలుకానున్న మ్యాచ్లో పాల్గొనే ముంబై జట్టులో సెలక్టర్లు అయ్యర్ పేరును చేర్చారు. చదవండి: IND Vs AFG T20I Series: రీఎంట్రీలో అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కోహ్లి -
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్.. అరుదైన రికార్డు ముంగిట కోహ్లి
India Vs South Africa 1st Test: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత జట్టు ప్రొటిస్ దేశానికి వెళ్లింది. పరిమిత ఓవర్ల సిరీస్లో మరోసారి సత్తా చాటి ఇందులో భాగంగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ20 సిరీస్ను 1-1తో సమం చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డేలను 2-1 తేడాతో గెలుచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా తదితర కీలక ఆటగాళ్లు లేకుండానే సౌతాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడి ఈ విజయాలు సాధించింది. అయితే, వరల్డ్కప్-2023 ఫైనల్ ఓటమి తర్వాత విశ్రాంతి తీసుకున్న ఈ ముగ్గురు స్టార్లు టెస్టు సిరీస్కు మాత్రం అందుబాటులోకి వచ్చారు. కాగా సఫారీ గడ్డపై ఇంతవరకు టెస్టు సిరీస్ గెలిచిన ఘనత ఏ భారత జట్టుకూ లేదు. అయితే, రోహిత్ సేన ఆ అపవాదును చెరిపివేయాలని భావిస్తోంది. ఈ సిరీస్లో కోహ్లి 70 పరుగులు చేశాడంటే ఇందుకోసం ఇప్పటికే బాక్సింగ్ డే నాటి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి అరుదైన ఫీట్ నమోదు చేసే అవకాశం ఉంది. కాగా సౌతాఫ్రికాతో టెస్టుల్లో కోహ్లి ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్ ఆడి 1236 పరుగులు సాధించాడు. ఈ రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా అతడు.. 70 రన్స్ చేయగలిగితే... సఫారీ జట్టుతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో భారత బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు. తద్వారా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను అధిగమించి దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాడు. (ఒకవేళ ఈ సిరీస్లో పూర్తిగా విఫలమై కేవలం 15 పరుగులకే పరిమితమైతే సెహ్వాగ్ తర్వాతి స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ను కూడా అధిగమించలేడు). సౌతాఫ్రికాతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు 1.సచిన్ టెండుల్కర్- 24 టెస్టుల్లో 1741 రన్స్ 2.వీరేంద్ర సెహ్వాగ్- 15 టెస్టుల్లో 1306 పరుగులు 3.రాహుల్ ద్రవిడ్- 21 టెస్టుల్లో 1252 పరుగులు 4.విరాట్ కోహ్లి- 14 ఇన్నింగ్స్లో 1236 పరుగులు 5.వీవీఎస్ లక్ష్మణ్- 17 మ్యాచ్లలో 976 పరుగులు 6. సౌరవ్ గంగూలీ- 17 మ్యాచ్లలో 947 పరుగులు 7. అజింక్య రహానే- 13 టెస్టుల్లో 884 పరుగులు. చదవండి: స్టార్ బౌలర్లకు షాకిచ్చిన అఫ్గన్ బోర్డు.. రెండేళ్ల నిషేధం! ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఎదురుదెబ్బ -
రాహుల్కు కఠిన సవాలు.. ఏం చేస్తాడో చూడాలి! మరి భరత్?
Ind vs SA 2023 Test Series: కేఎల్ రాహుల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా వికెట్ కీపర్గా, బ్యాటర్గా రాణిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో ఓపెనర్గా పాతుకుపోయిన ఈ కర్ణాటక ఆటగాడు గత కొన్నేళ్లుగా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీ శుబ్మన్ గిల్ మూడు ఫార్మాట్లలో స్థానం సుస్థిరం చేసుకోవడంతో.. అవసరాన్ని బట్టి నాలుగు లేదంటే ఐదు స్థానాల్లో బరిలోకి దిగుతున్నాడు. అంతేకాదు.. గతానికి భిన్నంగా ఇటీవలి కాలంలో వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియాకు వికెట్ కీపింగ్ ఆప్షన్లలో మొదటి ప్రాధాన్యంగా మారాడు. వన్డే వరల్డ్కప్-2023లో బ్యాటింగ్తో పాటు, అద్భుతమైన కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పంత్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అయితే, టెస్టుల్లో మాత్రం వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు మెరుగైన రికార్డు లేదు. ముఖ్యంగా రిషభ్ పంత్ జట్టులో ఉంటే అతడికి జట్టులో అసలు స్థానమే కరువయ్యే పరిస్థితి. కానీ.. రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ సుదీర్ఘకాలంగా ఆటకు దూరమైన నేపథ్యంలో వికెట్ కీపర్గా కాకపోయినా.. స్పెషలిస్టు బ్యాటర్గానైనా రాహుల్ జట్టులో చోటు సంపాదిస్తున్నాడు. ఆసీస్తో సిరీస్ నుంచి భరత్ వికెట్ కీపర్ పంత్ గైర్హాజరీలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(ఆసీస్ వర్సెస్ ఇండియా) నుంచి ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ టెస్టుల్లో టీమిండియా వికెట్ కీపర్గా వ్యవహరిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో భరత్ను కాదని కేఎల్ రాహుల్కే కీపర్గా బాధ్యతలు అప్పజెప్పనున్నారు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ధ్రువీకరించాడు. ఇషాన్ ఇంకా నిరూపించుకోనే లేదు ఇషాన్ కిషన్ జట్టుతో లేడు కాబట్టి వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ మాత్రమే తమకు మిగిలి ఉన్న ఆప్షన్ అని పేర్కొన్నాడు. గత ఐదారు నెలలుగా రాహుల్ కీపింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకున్నాడన్న ద్రవిడ్.. సౌతాఫ్రికాలో అతడికి గట్టి సవాలు ఎదురుకానుందని పేర్కొన్నాడు. రాహుల్ వైపే మొగ్గు చూపిన ద్రవిడ్ అయితే, ఇక్కడ పెద్దగా స్పిన్ బౌలింగ్కు ఆస్కారం లేదు కాబట్టి.. కేఎల్ రాహుల్ మెరుగ్గానే కీపింగ్ చేస్తాడని భావిస్తున్నట్లు ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. రాహుల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడనే నమ్మకం ఉందని తెలిపాడు. తప్పుబట్టిన మాజీ వికెట్ కీపర్ ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కేఎల్ రాహుల్ను టెస్టుల్లో కీపర్గా ఆడించడం సరికాదని పేర్కొన్నాడు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. india’s test match wicketkeeper should be someone who is keeping regularly in ranji trophy or first class cricket….#imho #INDvSA #IndianCricket — parthiv patel (@parthiv9) December 24, 2023 భరత్కు పరోక్ష మద్దతు ‘‘రంజీ ట్రోఫీ లేదంటే ఫస్ట్క్లాస్ క్రికెట్లో తరచుగా కీపింగ్ చేసే ఆటగాడినే టీమిండియా టెస్టు మ్యాచ్ వికెట్ కీపర్గా తీసుకోవాలి’’ అని పార్థివ్ పటేల్ పరోక్షంగా కేఎస్ భరత్కు మద్దతునిచ్చాడు. అయితే, కేఎల్ రాహుల్ అభిమానులకు మాత్రం పార్థివ్ ఆలోచన నచ్చడం లేదు. రాహుల్- భరత్ బ్యాటింగ్ గణాంకాలు పోలుస్తూ అతడిని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ ఏం చేస్తాడో? పేసర్ల బౌలింగ్లో అద్భుతంగా కీపింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్.. రవీంద్ర జడేజా లేదంటే రవిచంద్రన్ అశ్విన్ వంటి స్పిన్నర్ల బౌలింగ్ విషయంలో ఏ మేరకు ఆకట్టుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక పేస్, బౌన్సీ పిచ్లు ఉన్న సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టీమిండియా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రయోగాలు ఎంతవరకు మేలు చేస్తాయో చూడాలి! ఇషాన్ స్థానంలో భరత్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు ఎంపికైన ఇషాన్ కిషన్.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతడి స్థానాన్ని కేఎస్ భరత్తో భర్తీ చేశారు టీమిండియా సెలక్టర్లు. సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్లో భారత-ఏ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న భరత్ను ప్రధాన జట్టుకు ఎంపిక చేశారు. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
దుమ్ము రేపిన రాహుల్ ద్రవిడ్ కొడుకు.. వీడియో వైరల్
కూచ్ బెహార్ అండర్-19 ట్రోఫీలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయడు సమిత్ ద్రవిడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో సమిత్ కర్ణాటక తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో సమిత్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 159 బంతులు ఎదుర్కొన్న జూనియర్ ద్రవిడ్.. 13 ఫోర్లు, 1 సిక్సర్తో 98 పరుగులు చేశాడు. సమిత్ ఇన్నింగ్స్లో అద్భుతమైన కవర్ డ్రైవ్లు ఉన్నాయి. కొన్ని కవర్ డ్రైవ్ షాట్లు అతడి తండ్రిని తలపించాయి. సమిత్ బ్యాటింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడుతున్నారు. కాగా ఇదే మ్యాచ్లో సమిత్ ద్రవిడ్ బౌలింగ్లో కూడా రాణించాడు. మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన సమిత్..280 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జమ్మూపై ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో కర్ణాటక విజయం సాధించింది. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో వన్డే.. తిలక్పై వేటు! ఆర్సీబీ ప్లేయర్ అరంగేట్రం Samit Dravid, Rahul Dravid’s son, at Jammu while playing for Karnataka in Cooch Behar Trophy (U19) against J&K. He made 98 runs in Karnataka’s easy win. 📹: MCC Sports pic.twitter.com/t7EQSro023 — Mohsin Kamal (@64MohsinKamal) December 20, 2023 -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్! ఎవరంటే?
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఇప్పటికే టీ20 సిరీస్ను సమం చేసిన భారత జట్టు.. డిసెంబర్ 17న జోహన్నెస్బర్గ్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో ప్రోటీస్తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈ సిరీస్కు భారత కెప్టెన్గా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ వ్యవహరించనుండగా, యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ప్రోటీస్తో వన్డే సిరీస్కు టీమిండియా రెగ్యూలర్ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్తో పాటు ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్లు కూడా ప్రోటీస్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండకపోయినట్లు సమాచారం. అతడి స్ధానంలో నేషనల్ క్రికెట్ అకాడమీ స్టాప్, సౌరాష్ట్ర లెజెండ్ సితాన్షు కొటాక్ హెడ్కోచ్గా వ్యవహరించనున్నట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. అదే విధంగా భారత మాజీ వికెట్ కీపర్ అజయ్ రత్రా ఫీల్డింగ్ కోచ్గా, రజిబ్ దత్తా బౌలింగ్ కోచ్గా వన్డే సిరీస్ కోసం బాధ్యతలు చేపట్టనున్నారు. మరి ద్రవిడ్..? కాగా వన్డే సిరీస్ అనంతరం టీమిండియా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకుంది. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా జట్టుతో కలిశారు. అయితే దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు భారత్ ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదు. ఈ సారి ఎలాగైనా సఫారీలను ఓడించి చరిత్ర సృష్టించాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ క్రమంలోనే ద్రవిడ్తో కూడిన కోచింగ్ బృందం దగ్గరుండి భారత జట్టు సన్నాహాకాలను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. టెస్టు సిరీస్ కంటే ముందు వార్మాప్ మ్యాచ్ల్లో భారత తలపడనుంది. అదే విధంగా వరల్డ్ టెస్టు చాంపియన్షిష్లో భాగంగా జరగుతున్న టెస్టు సిరీస్ కాబట్టి ద్రవిడ్ ప్రత్యేకంగా దృష్టిసారించాడు. ఈ నేపథ్యంలోనే వన్డేలకు దూరంగా ఉండాలని మిస్టర్ డిఫెండ్బుల్ నిర్ణయించుకున్నాడు. -
Ind vs SA: సౌతాఫ్రికాపై గెలవడం అంత సులువేం కాదు: ద్రవిడ్
India’s tour of South Africa, 2023: సౌతాఫ్రికా గడ్డ మీద టెస్టు సిరీస్ గెలవడం అంత సులువేమీ కాదని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. సఫారీ పిచ్లపై బ్యాటింగ్ చేయడం భారత బ్యాటర్లకు సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నాడు. ప్రొటిస్ గడ్డపై ఒక్కటీ గెలవలేదు కాగా ఐసీసీ ర్యాంకింగ్స్లో టెస్టు, వన్డే, టీ20.. ఇలా మూడుఫార్మాట్లలో ప్రస్తుతం నంబర్ వన్గా కొనసాగుతున్న టీమిండియా.. ఇంతవరకు దక్షిణాఫ్రికాలో ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. పటిష్ట జట్టుగా పేరొందిన భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో రెండుసార్లు వరుసగా ఫైనల్ చేరినప్పటికీ ప్రొటిస్ గడ్డ మీద జెండా పాతలేకపోతోంది. అయితే, తాజా పర్యటన నేపథ్యంలో ఈ అపవాదును చెరిపివేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. స్వదేశంలో వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఓటమితో డీలా పడిన టీమిండియా.. సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలిచి అభిమానుల బాధను కాస్తైనా తగ్గించాలనే యోచనలో ఉంది. సఫారీ పిచ్లపై బ్యాటింగ్ అంటే సవాలే ఈ నేపథ్యంలో డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభం కానున్న తరుణంలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘దక్షిణాఫ్రికా పిచ్లపై బ్యాటింగ్ చేయడం సవాలుతో కూడుకున్నదనే విషయం గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా జొహన్నస్బర్గ్, సెంచూరియన్లలో బ్యాటింగ్ చేయడం బిగ్ చాలెంజ్. కాబట్టి ప్రతి బ్యాటర్ కూడా తమదైన ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. గేమ్ ప్లాన్ను పక్కాగా అమలు చేసే నిబద్ధత ఉంటేనే అక్కడ ఏ బ్యాటర్ అయినా విజయవంతం కాగలడు. అందుకు తగ్గట్లుగా ముందు నుంచే ప్రాక్టీస్ చేయడం అత్యవసరం’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి అదే విధంగా.. దక్షిణాఫ్రికా టూర్లో తాము.. ప్రతి ఒక్క ఆటగాడు ఒకే రీతిలో ఆడాలని తాము కోరుకోవడం లేదన్న ద్రవిడ్.. ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా ఆడేలా చూడటమే లక్ష్యమని పేర్కొన్నాడు. అలాంటపుడే వారి నుంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ రావాలని కోరుకోగలమని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. కాగా డిసెంబరు 10 నుంచి ఆరంభం కానున్న సౌతాఫ్రికా టూర్లో టీమిండియా తొలుత.. టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది. ఆ తర్వాత డిసెంబరు 26 నుంచి సెంచూరియన్, కేప్టౌన్ వేదికగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పాల్గొననుంది. చదవండి: నువ్వే నా ప్రపంచం.. నా సర్వస్వం: బుమ్రా భార్య భావోద్వేగ పోస్ట్ -
చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్, రాహుల్ ద్రావిడ్ (ఫొటోలు)
-
చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన రామ్ చరణ్, ద్రావిడ్
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వారాంతం ప్రారంభంలోనే చాముండేశ్వరిని దర్శించుకున్నారు. రామ్ చరణ్ తన 'గేమ్ ఛేంజర్' చిత్ర బృందంతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం చాముండేశ్వరి దర్శనం చేసుకున్నారు. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం మైసూరులో ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయానికి వెళ్లారు. రాహుల్ ద్రావిడ్ తన కుమారుడి క్రికెట్ ఆట చూసేందుకు మైసూర్ వచ్చారు. ఇదే సమయంలో చాముండి కొండను ఆయన సందర్శించారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ తన భార్య విజయతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ కర్ణాటక, ఉత్తరాఖండ్ మధ్య మైసూరులోని మానసంగోత్రిలో ఉన్న శ్రీకాంత్ దత్తా నరసింహరాజ వడయార్ స్టేడియంలో జరుగుతోంది. ఇందులో ద్రవిడ్ కుమారుడు ఆడుతున్నాడు. అతని ఆటను చూసేందుకు ద్రావిడ్తో పాటు అతని భార్య మైసూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈ స్టార్స్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ద్రావిడ్,రామ్ చరణ్తో సెల్ఫీలు దిగారు. -
టీమిండియాను భారతీయుడు, పాక్ను పాకిస్తానీయే నడిపించాలి: గంభీర్
టీమిండియా, పాకిస్తాన్ కోచింగ్ సిబ్బందిని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విదేశీ కోచ్ల సేవల కోసం తాపత్రయ పడకుండా.. స్వదేశీ క్రికెటర్లను మార్గ నిర్దేశకులుగా నియమించుకుంటే సత్ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇందుకు భారత జట్టు చక్కని ఉదాహరణ అంటూ పరోక్షంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చురకలు అంటించాడు. కాగా గత కొన్నేళ్లుగా టీమిండియాకు భారత మాజీ క్రికెటర్లు హెడ్కోచ్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చాలాకాలం వరకు రవిశాస్త్రి, అతడి తర్వాత ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్గా సేవలు అందిస్తున్నాడు. అయితే, పాకిస్తాన్ మాత్రం ఎక్కువగా విదేశీ కోచ్లనే నియమించుకుంటోంది. అయితే, వరల్డ్కప్-2023లో ఘోర పరాభవం తర్వాత మాత్రం పూర్తి ప్రక్షాళనకు సిద్ధమై.. మాజీ క్రికెటర్ల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్లో టీమిండియా ఆడిన విధానం చూసిన తర్వాత.. మనకు బయటి వ్యక్తులు కోచ్లుగా అవసరం లేదనే విషయం నిరూపితమైంది. విదేశీ కోచ్ల కంటే మన కోచ్లు ఏమాత్రం తక్కువకాదు. అయితే, మనవాళ్లకున్న ప్రధాన సమస్య ఏమిటంటే.. విదేశీ కోచ్లలా.. ప్రజెంటేషన్ ఇవ్వలేకపోవడం.. ఆ ల్యాప్టాప్లు పట్టుకుని హల్చల్ చేయడం.. అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడలేకపోవడం వంటివన్న మాట! ఎందుకంటే మనది కార్పొరేట్ సంస్కృతి కాదు. అయితే, క్షేత్రస్థాయి నుంచే మన ఆటగాళ్లను మెరికల్లా ఎలా తీర్చిదిద్దాలో మనవాళ్లకు బాగా తెలుసు’’ అని గంభీర్ స్పోర్ట్స్కీడాతో వ్యాఖ్యానించాడు. ఇదే షోలో పాల్గొన్న పాక్ దిగ్గజ బౌలర్ వసీం అక్రంతో చర్చిస్తూ.. ‘‘మనవి ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆడుతున్న దేశాలు కాదు. వరల్డ్కప్ గెలిచిన ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారు. టీమిండియాను భారత కోచ్, పాకిస్తాన్ టీమ్ను పాకిస్తానీ ముందుకు నడిపించగలరు’’ అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా 2007 టీ20, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన టీమిండియాలో గంభీర్ సభ్యుడు. ఇక 2007లో భారత జట్టుకు కోచ్గా లాల్చంద్ రాజ్పుత్ వ్యవహరించగా.. 2011లో గ్యారీ కిర్స్టన్ మార్గదర్శనం చేశాడు. చదవండి: WC 2023: రోహిత్, ద్రవిడ్ను వివరణ అడిగిన బీసీసీఐ.. హెడ్కోచ్ ఆన్సర్ ఇదే?! -
వరల్డ్కప్ ఓటమిపై వివరణ అడిగిన బీసీసీఐ.. ద్రవిడ్ ఆన్సర్ ఇదే!?
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ నియంత్రణ మండలికి వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా ద్రవిడ్ అహ్మదాబాద్ పిచ్ తయారు చేసిన విధానం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచకప్ ఫైనల్లో పరాజయంతో రోహిత్ సేనతో పాటు కోట్లాది అభిమానుల హృదయాలు ముక్కలైన విషయం తెలిసిందే. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది గెలిచి.. సెమీస్లోనూ సత్తా చాటిన భారత జట్టు తుదిపోరులో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్కు అడుగుదూరంలో నిలిచిపోయింది. సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత ట్రోఫీ గెలుస్తుందని ధీమాగా ఉన్న రోహిత్ సేనకు షాకిచ్చిన ఆసీస్ ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆసీస్తో ఫైనల్లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ రాహుల్ ద్రవిడ్, రోహిత శర్మను వివరణ అడిగినట్లు దైనిక్ జాగరణ్ తాజాగా కథనం వెలువరించింది. ఇందులో ఉన్న వివరాల ప్రకారం.. బీసీసీఐ సమావేశానికి రాహుల్ ద్రవిడ్ ప్రతక్ష్యంగా హాజరు కాగా.. కుటుంబంతో పాటు లండన్ పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ వీడియో కాల్ ద్వారా అటెండ్ అయ్యాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి రాజీవ్ శేఖర్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో.. టీమిండియా వైఫల్యం గురించి ద్రవిడ్, రోహిత్ శర్మను వివరణ కోరారు. ఇందుకు బదులుగా.. నరేంద్ర మోదీ స్టేడియంలో తయారు చేసిన స్లో ట్రాక్ తమ అవకాశాలను దెబ్బకొట్టిందని ద్రవిడ్ సమాధానమిచ్చాడు. టీమ్ మేనేజ్మెంట్ ఊహించినట్లుగా పిచ్ నుంచి సహకారం అందలేదని.. బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడం ప్రభావం చూపిందని ద్రవిడ్ తెలిపాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను స్పిన్ మాయాజాలంతో తిప్పలు పెట్టాలన్న వ్యూహాలు ఫలించలేదని ద్రవిడ్ పేర్కొన్నాడు. కాగా మోదీ స్టేడియంలో నవంబరు 19న టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసింది. రోహిత్ శర్మ 47 పరుగులు, విరాట్ కోహ్లి 54, కేఎల్ రాహుల్ 66 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ను ఓపెనర్ ట్రవిస్ హెడ్ 137 పరుగులతో రాణించి విజయతీరాలకు చేర్చాడు. తద్వారా కంగారూ జట్టు మరోసారి వన్డే వరల్డ్కప్ చాంపియన్గా నిలిచింది. చదవండి: Ind vs Pak: మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే -
టీమిండియా హెడ్కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా..
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన భార్య విజితతో కలిసి ఉన్న ఈ చిత్రం మైసూర్లోనిది. ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ఇక్కడ జరుగుతున్న బీసీసీఐ దేశవాళీ టోర్నీ (అండర్–19) కూచ్ బెహర్ ట్రోఫీలో కర్నాటక తరఫున ఆడుతున్నాడు. ఉత్తరాఖండ్తో జరుగుతున్న ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు ద్రవిడ్ వచ్చాడు. మరో వైపు విజయవాడలో జరుగుతున్న అండర్–16 విజయ్మర్చంట్ ట్రోఫీలో ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ బరిలో ఉన్నాడు. ఉత్తరాఖండ్తోనే జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజు.. కెప్టెన్, వికెట్కీపర్ అయిన అన్వయ్ 59 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. అయితే, అతడి కాంట్రాక్ట్ను పొడగిస్తూ బీసీసీఐ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. తదుపరి టీ20 ప్రపంచకప్-2024 వరకు ద్రవిడ్నే హెడ్కోచ్గా కొనసాగించే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం సెలవులో ఉన్న రాహుల్ ద్రవిడ్ తన కుటుంబానికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో కుమారుడు సమిత్ మ్యాచ్ చూసేందుకు భార్యతో కలిసి మైదానానికి వెళ్లాడు. ఇక ఉత్తరాఖండ్తో మ్యాచ్లో తొలి రోజు ఆటలో ఆల్రౌండర్ సమిత్ తన ఐదు ఓవర్ల బౌలింగ్లో రెండు మెయిడెన్స్ వేసి 11 పరుగులు ఇచ్చాడు. మొదటిరోజు ఆట ముగిసే సరికి ఉత్తరాఖండ్ 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్కు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్కోచ్గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ద్రవిడ్ తిరిగి తన బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా భార్యతో కలిసి ద్రవిడ్ మైసూర్లో మ్యాచ్ చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు ద్రవిడ్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. Rahul Dravid and his wife Vijeta watched the the Cooch Behar U-16 Trophy match between Karnataka and Uttarakhand. Their son Samit Dravid is a part of the squad.#CricketTwitter pic.twitter.com/zaQrqncsJ4 — Himanshu Pareek (@Sports_Himanshu) December 1, 2023 -
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్..
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించిన సంగతి తెలిసిందే. ద్రవిడ్తో పాటు మిగతా కోచింగ్ సిబ్బంది కాంట్రాక్టులను కూడా భారత క్రికెట్ బోర్డు పొడిగించింది. అయితే ద్రవిడ్ ఎంత కాలం కోచ్గా కొనసాగుతాడనే విషయాన్ని మాత్రం బోర్డు వెల్లడించలేదు. ఇక తాజాగా ఇదే విషయంపై రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను ఇంకా కాంట్రాక్ట్ పై సంతకం చేయలేదని ద్రవిడ్ తెలిపాడు. "నేను ఇంకా బీసీసీఐతో ఒప్పందంపై సంతకం చేయలేదు. కానీ నా పదవీకాలంపై చర్చలు జరిపాను. నాకు కాంట్రాక్ట్ పేపర్లు వచ్చిన తర్వాత సంతకం చేస్తాను" అని ద్రవిడ్ పీటీఐతో పేర్కొన్నాడు. కాగా ద్రవిడ్ వచ్చే ఏడాది టీ20 వరల్డ్కప్ వరకు భారత హెడ్ కోచ్ పదవిలో కొనసాగే ఛాన్స్ ఉంది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేముందు భారత జట్టుతో ద్రవిడ్ కలవనున్నాడు. ఈ టూర్లో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. కాగా టూర్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: T20 World Cup 2024: జింబాబ్వేకు బిగ్ షాక్.. టీ20 వరల్డ్కప్కు ఉగాండా ఆర్హత -
కోచ్గా ద్రవిడ్ ట్రాక్ రికార్డు ఇలా.. అయినా..!
టీమిండియా హెడ్ కోచ్గా బీసీసీఐ మళ్లీ రాహుల్ ద్రవిడ్నే కొనసాగించింది. ద్రవిడ్తో పాటు విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్), పారస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి.దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) కాంట్రాక్ట్లను కూడా బీసీసీఐ మళ్లీ పొడిగించింది. వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమి నేపథ్యంలో ద్రవిడ్ కోచింగ్ పదవిని మళ్లీ చేపట్టేందుకు సుముఖంగా లేనప్పటికీ బీసీసీఐ ప్రాధేయపడి అతన్ని ఒప్పించినట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు ద్రవిడ్ను టీమిండియా కోచ్గా ఎంపిక చేయడంపై పలువురు భారత క్రికెట్ అభిమానులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. కోచ్గా వరుస వైఫల్యాలు చెందిన వ్యక్తిని మళ్లీ ఎందుకు నియమించారంటూ మండిపడుతున్నారు. కోచ్గా ద్రవిడ్ ట్రాక్ రికార్డు ఇలా..! రాహుల్ ద్రవిడ్ 2021 నవంబర్ 17నుంచి తొలి సారి హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. రెండేళ్ల పదవీ కాలాన్ని అతనికి బోర్డు నిర్దేశించింది. వ్యక్తిగత సాన్నిహిత్యం ఉన్న సీనియర్ ఆటగాళ్లతో పాటు అంతకు ముందు వరకు ద్రవిడ్ కోచింగ్లో అండర్–19, భారత్ ‘ఎ’ జట్లకు ఆడిన ఆటగాళ్లు చాలా మంది జట్టులో ఉండటంతో కోచింగ్లో ద్రవిడ్ పని సులువైంది. అతను కోచ్గా ఉన్న సమయంలోనే భారత జట్టు టెస్టు, వన్డే, టి20ల్లో నంబర్వన్ ర్యాంక్ను అందుకుంది. అయితే మూడు అవకాశాలు లభించినా ఒక్క సారి కూడా ఐసీసీ టోర్నీని మాత్రం గెలవలేకపోయింది. 2022 టి20 ప్రపంచకప్లో సెమీ ఫైనల్, 2023 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. అయితే ఫైనల్కు ముందు వరుసగా పది మ్యాచ్లలో సంపూర్ణ ఆధిపత్యంతో విజయం సాధించింది. ఈ ఏడాది ఆసియా కప్లో భారత్ విజేతగా నిలిచింది. రెండో సారి కోచ్గా ఇప్పుడు ద్రవిడ్ బాధ్యతలు డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనతో మొదలవుతాయి. ఈ టూర్లో 3 టి20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు ఆడుతుంది. సఫారీ గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ నెగ్గని రికార్డు భారత్కు ఉంది. అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది. -
ద్రవిడ్ బృందానికే జై
ముంబై: వన్డే వరల్డ్ కప్లో భారత జట్టుకు వరుస విజయాలతో ఫైనల్ వరకు చేర్చిన శిక్షణా బృందంపై బీసీసీఐ నమ్మకముంచింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా ఇతర ముగ్గురు కోచ్ల కాంట్రాక్ట్ను పొడిగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్లకు కూడా మళ్లీ అవకాశం దక్కింది. వీరందరి కాంట్రాక్ట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్తో ముగిసింది. పొడిగింపుపై అప్పటి వరకు బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే బృందాన్ని మరికొంత కాలం కొనసాగించడమే సరైందిగా బోర్డు భావించింది. ముందుగా దీనికి సంబంధించి ద్రవిడ్కు సమాచారం అందించింది. ద్రవిడ్ అంగీకరించకపోతే మరో ప్రత్యామ్నాయం వైపు బోర్డు చూసే ఆలోచనలో ఉండగా...ద్రవిడ్ కోచ్గా కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. వీరి కాంట్రాక్ట్ ఎప్పటి వరకు అనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోయినా... వచ్చే ఏడాది జూన్–జూలైలో జరిగే టి20 ప్రపంచ కప్ వరకు ఉండే అవకాశం ఉంది. మరో వైపు వన్డే, టి20లకు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పేరుపై కూడా చర్చ జరిగినా...నెహ్రా విముఖత చూపడంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు సమాచారం. అందుకే కొనసాగింపు... గత రెండేళ్లుగా ద్రవిడ్, అతని సహచర కోచింగ్ బృందం భారత జట్టులో తీసుకొచ్చిన మార్పులు, ఏర్పరచిన మంచి వాతావరణం మున్ముందూ కొనసాగించాలని బీసీసీఐ అనుకుంది. కొత్తగా వచ్చే కోచ్తో ఇవన్నీ ఒక్కసారి మారిపోతే కష్టమని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. కోచ్ మారితే అతనితో పాటు ఇతర సహాయక సిబ్బంది కూడా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ద్రవిడ్ బృందం భవిష్యత్తులో ఎప్పటి వరకు కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేకపోయినా... ఇదే జట్టు సహకారంతో కనీసం మరో ఐసీసీ టోర్నీలో జట్టు పాల్గొనడమే సరైందని వారు భావించారు. ‘రాహుల్ ద్రవిడ్కు బోర్డు అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. మూడు ఫార్మాట్లలో భారత జట్టు అద్భుతంగా ఆడుతూ అగ్రస్థానంలో ఉంది. ద్రవిడ్ దూరదృష్టి, ఆలోచన, ప్రణాళిక అందుకు కారణం. వరల్డ్ కప్లో ఫైనల్కు ముందు వరుసగా పది మ్యాచ్లు గెలవడం అసాధారణ ప్రదర్శన. అందుకు హెడ్కోచ్ను తప్పకుండా అభినందించాలి. మున్ముందు మరిన్ని విజయాలు సాధించేందుకు వారికి అన్ని విధాలా సహకారం అందిస్తాం’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. తనకు కొనసాగింపు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘భారత జట్టుతో నా ప్రయాణంలో ఎన్నో మధుర క్షణాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో విజయాలు, పరాజయాలతో ఎత్తుపల్లాలు చవిచూశాం. ఆటగాళ్లు, మా శిక్షణా బృందం మధ్య మంచి అనుబంధం ఉంది. డ్రెస్సింగ్ రూమ్లో మేం నెలకొల్పిన మంచి సంస్కృతి పట్ల గర్వంగా ఉన్నాం. అద్భుతమైన ప్రతిభ ఉన్న మా జట్టుకు సరైన మార్గనిర్దేశనం చేసి మంచి ఫలితాలు సాధించేలా చేయడంలో సఫలమయ్యాం. నాపై నమ్మకం ఉంచి మళ్లీ అవకాశం కల్పించిన బోర్డుకు కృతజ్ఞతలు. ప్రపంచకప్ తర్వాత రాబోయే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ద్రవిడ్ తన స్పందనను తెలియజేశాడు. -
ద్రవిడ్ మాదిరే రోహిత్ శర్మ.. వరల్డ్ కప్ ముగిసేంత వరకు! బీసీసీఐ ప్లాన్?
టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగేలా చర్చలు జరిపిన భారత క్రికెట్ నియంత్రణ మండలి కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలోనూ అదే పంథాలో వెళ్లనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండాలనుకుంటున్న హిట్మ్యాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా బీసీసీఐ పెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీ ముగిసే వరకు సారథిగా కొనసాగాలని రోహిత్ను ఒప్పించే దిశగా ఇప్పటికే చర్చలు మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ.. టీ20 వరల్డ్ కప్-2022లో జట్టును సెమీస్ వరకు చేర్చాడు. అనంతరం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ వరకు తీసుకువచ్చాడు. ఇక ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్లో కూడా ఫైనల్కు తీసుకొచ్చినా టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. ఈ ప్రపంచకప్నకు సిద్ధమయ్యే క్రమంలో టీ20లలకు దూరంగా ఉన్నా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీ20లకు పూర్తిగా దూరమై వన్డే, టెస్టుల్లో కొనసాగాలని 36 ఏళ్ల రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హిట్మ్యాన్ తప్పుకొంటే హార్దిక్ పాండ్యా టీ20ల సారథి కావడం లాంఛనమే! అయితే, బీసీసీఐ పెద్దలు మాత్రం ద్రవిడ్ మాదిరే రోహిత్ను కూడా కొనసాగిస్తేనే వచ్చే ఏడాది ప్రపంచకప్లో అనుకున్న ఫలితాలు రాబట్టగలమనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ దిశగా హిట్మ్యాన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సౌతాఫ్రికా పర్యటన నుంచే రోహిత్ను మళ్లీ టీ20ల బరిలో దించేందుకు బీసీసీఐ సిద్ధమవుతుందన్నది వాటి సారాంశం. -
వరల్డ్ కప్ ముందుంది.. బీసీసీఐ నిర్ణయం సరైంది: గంభీర్
టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ను కొనసాగించాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సమర్థించాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్కప్ జరుగనున్న నేపథ్యంలో బీసీసీఐ సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి తర్వాత... కాగా 2021లో రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత అతడి స్థానంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ భారత జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. జాతీయ క్రికెట్ అకాడమీ పెద్దగా.. అండర్-19 జట్టుకు మార్గదర్శనం చేసిన మిస్టర్ డిఫెండబుల్ను ఒప్పించి మరీ నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పగ్గాలు అప్పజెప్పాడు. ఈ క్రమంలో ద్రవిడ్ శిక్షణలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్లలో అదరగొట్టింది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరింది. కానీ టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే నిష్క్రమించిన రోహిత్ సేన.. సొంతగడ్డపై వరల్డ్ కప్-2023లో ఫైనల్ చేరినప్పటికీ టైటిల్కు అడుగుదూరంలో నిలిచిపోయింది. ఇక టోర్నీతోనే తన పదవీకాలం కూడా ముగిసిపోవడంతో ద్రవిడ్ కోచ్గా వైదొలగాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బీసీసీఐ మాత్రం రాహుల్ ద్రవిడ్ను ఒప్పించి హెడ్కోచ్గా కొనసాగేలా చేసింది. ఇందుకు సంబంధించి బుధవారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. బీసీసీఐ నిర్ణయం సరైంది ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ స్పందించాడు. “బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ రూపంలో మెగా ఈవెంట్ ముందుంది. ఇలాంటి సమయంలో కోచింగ్, సహాయక సిబ్బందిని మార్చడం సరికాదు. నిజానికి రాహుల్ బీసీసీఐ ప్రతిపాదనను అంగీకరించడం శుభపరిణామం. టీమిండియా ఇలాగే తమ ఆధిపత్యం కొనసాగిస్తూ మున్ముందు మరింత గొప్పగా ఆడాలని కోరుకుంటున్నా” అని గౌతీ హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: కేన్ విలియమ్సన్ అద్భుత సెంచరీ.. విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సమం -
ద్రవిడ్ తనేంటో నిరూపించుకున్నాడు.. వరల్డ్కప్లో కూడా: జై షా
మిండియా హెడ్ కోచ్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. భారత జట్టు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. అతడితో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కాంట్రాక్ట్లను కూడా బీసీసీఐ పెంచింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ.. భారత క్రికెట్ బోర్డు నుంచి పూర్తి మద్దతు ద్రవిడ్కు ఉంటుందని తెలిపాడు. కాగా ద్రవిడ్ కొత్త కాంట్రాక్ట్ వివరాలను మాత్రం బోర్డు బహిర్గతం చేయలేదు. అయితే వచ్చ ఏడాది టీ20 వరల్డ్కప్కు ద్రవిడ్ హెడ్కోచ్ పదవిలో కొనసాగే ఛాన్స్ ఉంది. "భారత ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ ద్రవిడ్ను మించిన గొప్ప వ్యక్తి లేడని నేను ముందే చెప్పాను. ద్రవిడ్ మరోసారి తన నిబద్ధతతో జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ద్రవిడ్ తన కాంట్రాక్ట్ను పొడిగించేందుకు ఒప్పుకోవడంతో టీమిండియా యూనిట్ మరింత బలంగా మారనుంది. ఇప్పటికే అతడి నేతృత్వంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నెం1 జట్టుగా అవతరించింది. ఇది ఒక్కటి చాలు అతడి కోచింగ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. కోచ్గా తనంటో ద్రవిడ్ నిరూపించుకున్నాడు. వన్డే వరల్డ్కప్లో కూడా భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. వరుసగా 10 మ్యాచ్లు గెలిచిన తర్వాత దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓటమిపాలైంది. హెడ్కోచ్ ద్రవిడ్కు బోర్డు నుంచి ఎల్లప్పడూ సపోర్ట్ ఉంటుంది. భారత జట్టును అంతర్జాతీయ స్దాయిలో మరింత అద్బుతంగా ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాని" జై షా పేర్కొన్నాడు. కాగా ద్రవిడ్ తిరిగి మళ్లీ దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు జట్టుతో కలవనున్నాడు. -
టీమిండియా హెడ్కోచ్గా అతడే.. బీసీసీఐ అధికారిక ప్రకటన
భారత పురుషల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. ద్రవిడ్తో పాటు ఇప్పటికే ఉన్న ఇతర సహాయ సిబ్బంది కాంట్రాక్ట్లను బీసీసీఐ పొడిగించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తమ పదవిల్లో కొనసాగనున్నారు. ఈ మెరకు బీసీసీఐ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ఎంతకాలం పాటు వారి పదవికాలాన్ని పెంచారన్నది బీసీసీఐ వెల్లడించలేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్-2024 వరకు కొనసాగే ఛాన్స్ ఉంది. "వన్డే ప్రపంచకప్-2023తో రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్గా పదవీ కాలం ముగిసిన తర్వాత బీసీసీఐ అతడితో సంప్రదింపులు జరిపింది. అతడితో పాటు సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్టుల పొడిగింపును బీసీసీఐ ఏకగ్రీవంగా అంగీకరించింది. టీమిండియాను తీర్చిదిద్దడంలో రాహుల్ ద్రవిడ్ పాత్రను బోర్డు గుర్తించింది. అతడి నేతృత్వంలో భారత జట్టు ఎన్నో అద్బుతవిజయాలను అందుకుంది. అదే విధంగా నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్, స్టాండ్ ఇన్ హెచ్ వీవీయస్ లక్ష్మణ్ను కూడా బోర్డు అభినందిస్తుంని" బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా టీమిండియా హెడ్ కోచ్గా ద్రవిడ్ కాంట్రాక్ట్ వన్డే ప్రపంచకప్-2023తో ముగిసింది. 2021లో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాడు. అయితే తర్వాత కూడా అతడినే కొనసాగించాలని బీసీసీఐతో పాటు ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భావించినప్పటికీ.. అందుకు ద్రవిడ్ మాత్రం మొదట్లో ఒప్పుకోలేదు. కానీ బీసీసీఐ పెద్దలు జోక్యం చేసుకుని ద్రవిడ్ను ఒప్పించారు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో జట్టుతో పాటు ద్రవిడ్ కూడా సౌతాఫ్రికాకు వెళ్లనున్నాడు. NEWS 🚨 -BCCI announces extension of contracts for Head Coach and Support Staff, Team India (Senior Men) More details here - https://t.co/rtLoyCIEmi #TeamIndia — BCCI (@BCCI) November 29, 2023 -
నెహ్రా వద్దన్నాడు.. మళ్లీ ద్రవిడే దిక్కయ్యాడు..!
టీమిండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం ప్రపంచకప్-2023 ఫైనల్తో ముగిసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో భారత కోచ్గా మరో దఫా కొనసాగాలని బీసీసీఐ ద్రవిడ్ను కోరింది. అయితే అతని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో బీసీసీఐ పెద్దలు ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో పడ్డారు. స్వదేశంలో ఆసీస్తో జరుగుతున్న సిరీస్కు తాత్కాలిక కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్కు బాధ్యతలు అప్పజెప్పిన బీసీసీఐ.. ఫుల్ టైమ్ కోచ్ వేటలో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలోనే బీసీసీఐ పెద్దలు టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాను కలిశారు. భారత్ జట్టు కోచింగ్ బాధ్యతలు స్వీకరించాలని ఆహ్వానించారు. అయితే ఈ ప్రతిపాదనను నెహ్రా తిరస్కరించినట్లు తెలుస్తుంది. తన ఐపీఎల్ కమిట్మెంట్ల కారణంగా ఈ పదవిని స్వీకరించలేనని చెప్పినట్లు వినికిడి. దీంతో గత్యంతరం లేక బీసీసీఐ మళ్లీ ద్రవిడ్నే సంప్రదించినట్లు సమాచారం. త్వరలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కోచ్గా వ్యవహరించాలని ద్రవిడ్కు కబురు పంపారని తెలుస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటన కోసం అతనికి వీసా కూడా తీశారని సమాచారం. ఒకవేళ ద్రవిడ్ దక్షిణాఫ్రికా సిరీస్కు ఓకే చెబితే కోచింగ్ స్టాఫ్గా విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్), పరాస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. -
ద్రవిడ్ గురించి రోహిత్ అలా చెప్పడం సరికాదు: గంభీర్
ICC ODI WC 2023- Gambhir Comments On Rohit Sharma: వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలను మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తప్పుబట్టాడు. రాహుల్ ద్రవిడ్ను ఉద్దేశించి రోహిత్ అలా కామెంట్ చేయడం సరికాదని పేర్కొన్నాడు. ఆటగాళ్లు దేశం కోసం మాత్రమే ఆడాలని.. వ్యక్తుల కోసం కాదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత ప్రపంచకప్ ఫైనల్కు చేరిన భారత జట్టు ట్రోఫీ గెలుస్తుందన్న ఆశలపై ఆస్ట్రేలియా నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో రోహిత్ సేనను ఓడించి ఆరోసారి విశ్వవిజేతగా చరిత్రపుటల్లోకెక్కింది. ద్రవిడ్ కోసమన్న రోహిత్ అయితే, ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసం తాము కప్ గెలవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. వరల్డ్కప్-2003లో ద్రవిడ్ ఆటగాడిగా ఉన్నపుడు ఆసీస్ చేతిలో భారత్ ఓడగా.. 20 ఏళ్ల తర్వాత అతడి మార్గదర్శనంలో తాము ప్రతీకారం తీర్చుకుంటామన్న ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా స్పోర్ట్స్కీడా ఇంటర్వ్యూలో గౌతం గంభీర్ ఈ విషయంపై స్పందించాడు. దేశం కోసం ఆడాలే తప్ప.. వ్యక్తుల కోసం గెలుస్తామంటూ చెప్పడం సరికాదంటూ రోహిత్ వ్యాఖ్యలను విమర్శించాడు. తాను 2011 వరల్డ్కప్ సమయంలో కూడా ఇదే మాట సహచర ఆటగాళ్లతో చెప్పానని పేర్కొన్నాడు. సచిన్ కోసం నాడు ట్రోఫీ గెలిచామంటూ కాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా వరల్డ్కప్- 2011 చేరినపుడు.. సచిన్ టెండుల్కర్ కోసం తాము ట్రోఫీ గెలుస్తామంటూ కొంతమంది ఆటగాళ్లు చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే సచిన్ సొంతమైదానం వాంఖడేలో శ్రీలంకను ఓడించి విజయాన్ని అతడికి బహుమతిగా అందించారు. ఈ రెండు సందర్భాల్లో ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ గంభీర్.. ‘‘అసలు క్రికెటర్లు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారో నాకు ఇంతవరకూ అర్థం కాలేదు. ఒక వ్యక్తి కోసం తాము గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పడం సరికాదు. ఇలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు దేశం కోసం మనం టైటిల్ గెలవాలి అనుకోవాలి. ఒకవేళ మీరు ఓ వ్యక్తి కోసం ఇలా చేయాలని భావిస్తే అలాంటివి మీడియా ముందు చెప్పడం ఎందుకు? 2011లో చాలా మంది నాతో.. ‘‘మనం వ్యక్తి కోసం గెలవాలి’’అని చెప్పారు. కానీ నేను మాత్రం బ్యాట్ చేతబట్టి నా దేశం కోసం గెలుస్తానని వాళ్లందరికీ చెప్పాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా గౌతం గంభీర్ ఐపీఎల్తో బిజీ కానున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ 2024 సీజన్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి కోల్కతా నైట్రైడర్స్కు మారిన గౌతీ.. ఆజట్టుకు మెంటార్గా వ్యవహరించనున్నాడు. చదవండి: మనుషులు దూరంగా ఉన్నా.. విరాట్ కోహ్లి తోబుట్టువు, వ్యాపారవేత్త భార్య! -
రాహుల్ ద్రవిడ్కు కూతురు వరుసయ్యే నటి.. ఎవరంటే (ఫొటోలు)
-
IPL 2024: గంభీర్ గుడ్బై.. లక్నో మెంటార్గా రాహుల్ ద్రవిడ్?
టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా లేదా అన్న అంశంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. వన్డే వరల్డ్కప్-2023 ముగిసిన తర్వాత అతడి భవితవ్యంపై ఓ స్పష్టత వస్తుందనుకుంటే బీసీసీఐ నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటనా రాలేదు. కాగా టీ20 వరల్డ్కప్-2021 తర్వాత రవిశాస్త్రి టీమిండియా హెడ్కోచ్గా వైదొలగగా.. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ద్రవిడ్ను ఒప్పించి మరీ ఈ పదవిని కట్టబెట్టారు. ఈ క్రమంలో రాహుల్ మార్గదర్శనం, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ద్వైపాక్షిక సిరీస్లలో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా ఐసీసీ టోర్నీల్లో మాత్రం చేతులెత్తేసింది. టీ20 వరల్డ్కప్-2022లో సెమీస్లోనే నిష్క్రమించిన భారత జట్టు.. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ హెడ్కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం అతడి సేవలను మరోమారు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతడు గనుక సుముఖంగా లేకపోతే వీవీఎస్ లక్ష్మణ్ హెడ్కోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రాహుల్ ద్రవిడ్ను తమ మెంటార్గా నియమించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. మెంటార్గా గౌతం గంభీర్ స్థానంలో ద్రవిడ్ అయితే బాగుంటుందని ఎల్ఎస్జీ యాజమాన్యం ఆలోచిస్తోందట. కాగా లక్నో మెంటార్గా సేవలు అందించిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తిరిగి కోల్కతా నైట్రైడర్స్ గూటికి చేరుకున్నాడు. ఇక ఐపీఎల్-2024 వేలానికి ముందు ఆవేశ్ ఖాన్ వదులుకున్న లక్నో ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్తో డైరెక్ట్ స్వాప్ ద్వారా దేవ్దత్ పడిక్కల్ను దక్కించుకుంది. కోచ్గా ఆస్ట్రేలియా మాజీ హెడ్కోచ్ జస్టిన్ లాంగర్ను నియమించుకుంది. -
ద్రవిడ్ మా అంకుల్.. ఆయనను చూస్తే బాధేసింది: సీరియల్ నటి
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో భారత్ ఓటమి తననెంతో బాధించిందని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ బంధువు, మరాఠా నటి అదితి ద్రవిడ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా తన అంకుల్ అత్యుత్తమ కోచ్గా చరిత్రలో నిలిచిపోతారంటూ ఉద్వేగానికి లోనైంది. కాగా సొంతగడ్డపై టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలుస్తుందనుకున్న అభిమానులకు నిరాశే మిగిలిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా రోహిత్ సేనను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా ఉన్న భారత జట్టుకు షాకిస్తూ.. ఏకంగా ఆరోసారి జగజ్జేతగా అవతరించింది. దీంతో టీమిండియా తీవ్ర నిరాశలో మునిగిపోయింది. స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ తదితరులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దృశ్యాలు చూసి టీమిండియా ఫ్యాన్స్ హృదయాలు ముక్కలయ్యాయి. ఈ నేపథ్యంలో అదితి ద్రవిడ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకుంది. రాహుల్ ద్రవిడ్ను చూసి తమ కుటుంబమంతా గర్విస్తోందని పేర్కొంది. ద్రవిడ్ మా అంకుల్ ఈ మేరకు.. ‘‘రాహుల్ ద్రవిడ్ మా అంకుల్. గత 30- 35 ఏళ్లుగా ఆయన క్రికెట్ మైదానంలో కఠిన శ్రమకోరుస్తున్నారు. మా నాన్న వినాయక్ ద్రవిడ్ కూడా రంజీ ప్లేయర్. అందుకే నాకు క్రికెట్తో అనుబంధం ఏర్పడింది. టీమిండియా ఓడిపోయిన దృశ్యాలు చూసి నేను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. ఆ సమయంలో మా అంకుల్ను చూస్తే చాలా బాధేసింది. హెడ్కోచ్గా ఆయన ప్రస్థానం కూడా ముగింపునకు వస్తోంది. ఆయనకు బహుశా ఇదే ఆఖరి వరల్డ్కప్. ఎంతో హార్డ్వర్క్ చేసి జట్టును ఇక్కడిదాకా తీసుకువచ్చారు. కానీ ఆఖర్లో ఇలా జరిగిపోయింది. ఏదేమైనా ఆయన బెస్ట్ కోచ్’’ అని అదితి ద్రవిడ్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది. ది వాల్ రాహుల్ ద్రవిడ్.. హెడ్కోచ్గానూ కాగా మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాహుల్ ద్రవిడ్కు అదితి కూతురు వరుస అవుతుంది. ఆమె ప్రస్తుతం బుల్లితెరపై నటిగా రాణిస్తోంది. ఇటీవల సుందర మన మధ్యే భార్లీ సీరియల్లో కనిపించింది. అంతేకాదు రెండు మరాఠా సినిమాల్లోనూ అదితి మెరిసింది. ఎంటర్ప్రెన్యూర్గానూ రాణిస్తోంది. ఇక మరాఠా మూలాలున్న రాహుల్ ద్రవిడ్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించిన విషయం తెలిసిందే. తండ్రి ఉద్యోగరిత్యా కర్ణాటకకు షిఫ్ట్ కావడంతో అక్కడే పెరిగి పెద్దైన ద్రవిడ్.. దేశవాళీ క్రికెట్లో కన్నడ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా తరఫున ది వాల్గా.. దిగ్గజ క్రికెటర్గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం హెడ్కోచ్గా సేవలు అందిస్తున్నాడు. త్వరలోనే అతడి కాంట్రాక్ట్ ముగియనుంది. -
కాంట్రాక్ట్ పొడిగింపునకు నో చెప్పిన ద్రవిడ్.. టీమిండియా కొత్త హెడ్ కోచ్ అతడే..?
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వరల్డ్కప్ 2023 ఫైనల్తో ముగిసింది. 2021 నవంబర్లో బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగాడు. వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో ద్రవిడ్ భారత జట్టు కోచింగ్ పదవికి గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ద్రవిడ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సన్నిహితులతో స్పష్టం చేశాడని సమాచారం. వరల్డ్కప్ ఫైనల్ ముగిసిన అనంతరం కోచ్గా కొనసాగడంపై ఇంకా తేల్చుకోలేదని చెప్పిన ద్రవిడ్ తాజాగా బీసీసీఐ పెద్దల వద్ద నో చెప్పాడని తెలుస్తుంది. ద్రవిడ్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన వెంటనే భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా ప్రస్తుత ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ను నియమిస్తారని సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ పెద్దలు పూర్తి క్లారిటీగా ఉన్నారని తెలుస్తుంది. లక్ష్మణ్కు పట్టం కట్టేందుకు బీసీసీఐ ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నట్లు వినికిడి. ప్రస్తుతం లక్ష్మణ్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ తాత్కాలిక హెడ్ కోచ్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒకటి రెండు రోజుల్లో బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత రెండేళ్ల కాలంలో ద్రవిడ్ గైర్హాజరీలో లక్ష్మణ్ పలు సిరీస్ల్లో టీమిండియా కోచ్గా వ్యవహరించాడు. లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ద్రవిడ్ ఎన్సీఏ చీఫ్గా ట్రాన్స్ఫర్ అవుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవిడ్ ఓ ఐపీఎల్ జట్టుతో జత కట్టనున్నాడని టాక్ కూడా నడుస్తుంది. మొత్తానికి ద్రవిడ్ దిగిపోతే టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్కు పట్టం కట్టేందుకు సర్వం సిద్దమైందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా వైజాగ్లోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. -
ద్రవిడ్ను కొనసాగిస్తారా? సాగనంపితే... టీమిండియా కొత్త కోచ్ ఎవరు..?
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్కప్ 2023 ఫైనల్తో ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. మరో దఫా కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్ వరల్డ్కప్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్ను రెండో దఫా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆసీస్తో టీ20 సిరీస్కు స్టాండ్ ఇన్ కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఒకవేళ ద్రవిడ్ రెండో దఫా కోచ్గా పని చేసేందుకు నిరాకరిస్తే లక్ష్మణ్ భారత జట్టు హెడ్ కోచ్ పదవి రేసులో ముందువరుసలో ఉంటాడు. ఈ పదవి కోసం లక్ష్మణ్తో పాటు మరో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్గా ప్రకటించబడ్డ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే లక్ష్మణ్తో పాటు ప్రధాన పోటీదారులుగా నిలిచే ఛాన్స్ ఉంది. వీరిలో కుంబ్లేకు గతంలో భారత జట్టు హెడ్ కోచ్గా పని చేసిన అనుభవం ఉంది. ధోనిని ఒప్పించి అప్పచెబితే.. టీమిండియా హెడ్ కోచ్ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ద్రవిడ్నే కొనసాగించాలని అంటుంటే, మరికొందరు అతడిని సాగనంపాలని వాధిస్తున్నారు. ఒకవేళ హెడ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఆసక్తి కనబర్చకపోతే లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్లు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా కొందరు టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును తెరపైకి తెస్తున్నారు. ధోనికి ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించి మరీ భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని వారు పట్టుబడుతున్నారు. మరి భారత జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు ధోని ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి. -
CWC 2023: ఇంకా తేల్చుకోలేదు... అహర్నిశలు పనిచేశా
అహ్మదాబాద్: టీమిండియా హెడ్ కోచ్ పదవీ కాలాన్ని పొడిగించుకోవాలా లేదంటే ముగించుకోవాలనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ ఆయనతో కుదుర్చుకున్న రెండేళ్ల కాంట్రాక్టు నవంబర్ 19న వరల్డ్కప్ ఫైనల్తో ముగిసింది. టైటిల్ పోరులో పరాజయం అనంతరం భారమైన హృదయంతో ద్రవిడ్ మీడియా సమావేశానికి వచ్చాడు. నిరాశను దిగమింగి జట్టు ప్రదర్శన, ఫైనల్ పరాజయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ‘కొంతకాలంగా నేను పూర్తిగా ప్రపంచకప్పైనే దృష్టి పెట్టాను. జట్టు సన్నద్ధత కోసమే అహర్నిశలు పనిచేశాను. ఇది కాకుండా మరో ఆలోచనేది నేను చేయలేదు. భవిష్యత్ ప్రణాళికలపై ఆలోచించడానికి కూడా నేను సమయం వెచ్చించలేదు. నా రెండేళ్ల పదవీకాలంలోని జయాపజయాలు, ఘనతలు, విశేషాలపై విశ్లేషించుకోవడం లేదు’ అని 50 ఏళ్ల ద్రవిడ్ వివరించాడు. ‘అన్ని ఫార్మాట్లకు కోచ్గా పనిచేయడం చాలా బాగా అనిపించింది. వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ మార్గదర్శనంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. జట్టు కోసం, ప్రపంచకప్ కోసం నాయకుడిగా రోహిత్ శర్మ ఎంతో శ్రమించాడు. మున్ముందు భారత హెడ్ కోచ్గా కొనసాగడంపై ఏ నిర్ణయం తీసుకోని నేను 2027 వన్డే ప్రపంచకప్పై ఏం మాట్లాడగలను. అప్పటికి జట్టులో ఎవరు ఉంటారో... ఏవరు పోతారో ఎవరికీ తెలియదు. అలాంటి దానిపై స్పందించడం తగదు’ అని ద్రవిడ్ వివరించాడు. -
కోహ్లి కాదు!.. అతడి కోసం మేము కచ్చితంగా గెలవాల్సిందే: రోహిత్ శర్మ
ICC CWC 2023 Final ind Vs Aus: వన్డే వరల్డ్కప్- 2011లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని భారత జట్టు ట్రోఫీ గెలిచి ఆ విజయాన్ని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్కు అంకితం చేసింది.. విరాట్ కోహ్లి వంటి యువ ఆటగాడు సహా జట్టులోని ఇతర సభ్యులు ‘క్రికెట్ దేవుడి’ని తమ భుజాలపై మోస్తూ.. వాంఖడే స్టేడియమంతా తిప్పి సముచితంగా గౌరవించుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో ఒక్కసారి కూడా వరల్డ్కప్ ట్రోఫీ గెలవలేదన్న లోటు.. సచిన్కు అలా ఆరో ప్రయత్నంలో తీరింది. కెరీర్లో ఆఖరి వన్డే ప్రపంచకప్ ఆడుతున్న అత్యుత్తమ ఆటగాడికి సొంతగడ్డపై.. అదీ అతడి సొంతమైదానంలో సహచరులు అలా గొప్ప కానుక అందించారు. మళ్లీ పుష్కరకాలం తర్వాత భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ టోర్నీ.. పది విజయాలతో టాప్గేర్లో ఫైనల్కు దూసుకువచ్చిన టీమిండియా ఆఖరి పోరులో ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగునంది. ఈ నేపథ్యంలో.. నాడు క్రికెట్ గాడ్ సచిన్కు దక్కిన గౌరవం.. క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లికి దక్కితే చూడాలని అతడి అభిమానులు ఆశపడుతున్నారు. ఆసీస్ను చిత్తు చేసి టీమిండియా ట్రోఫీని ముద్దాడితే.. ఆ అపురూప క్షణాల్లో తమ రికార్డుల రారాజుకు కూడా.. నాడు సచిన్ మాదిరే పట్టం కట్టాలని ఆకాంక్షిస్తున్నారు. కోహ్లికి ఈ విజయాన్ని అంకితం చేయాలని కోరుకుంటున్నారు. చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం 35 ఏళ్ల కోహ్లి కోసం భారత జట్టు టైటిల్ గెలిస్తే చూడాలని ఉందనే ఆకాంక్షను వెలిబుచ్చారు. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈసారి భారత జట్టు తమ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసం కప్పు గెలవాలని కోరుకుంటోందని రోహిత్ వ్యాఖ్యానించాడు. ద్రవిడ్ కెరీర్లో మిగిలిపోయిన లోటును తీర్చాలనుకంటున్నట్లు తెలిపాడు. కాగా 2003లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టులో రాహుల్ ద్రవిడ్ సభ్యుడు. సౌతాఫ్రికా వేదికగా జొహన్నస్బర్గ్లో జరిగిన నాటి ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా తలపడ్డాయి. అప్పటి ఆసీస్ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ 140, డామిన్ మార్టిన్ 88 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు 359 పరుగుల భారీ స్కోరు అందించారు. అయితే, టీమిండియా టాపార్డర్లో ఓపెనర్ సచిన్ టెండుల్కర్ (4), వన్డౌన్ బ్యాటర్ గంగూలీ(24) విఫలం కాగా మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 82 పరుగులు సాధించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన రాహుల్ ద్రవిడ్ 47 పరుగులు రాబట్టాడు. వీరిద్దరు మినహా మిగతా వాళ్లంతా కనీసం ముప్పై పరుగుల మార్కును దాటకపోవడంతో 234 పరుగులకే పరిమితమైంది టీమిండియా. దీంతో 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. అలా నాడు కంగారూల చేతిలో టీమిండియాకు పరాభవం ఎదురైంది. కాలక్రమంలో ఇరవై ఏళ్ల తర్వాత.. నాటి భారత జట్టులో సభ్యుడైన ద్రవిడ్ మార్గదర్శనంలోని టీమిండియా ఇప్పుడు ఫైనల్కు చేరుకుంది. అదే ప్రత్యర్థితో మరోసారి తుదిపోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ గెలిచి ద్రవిడ్కు అంకితం చేయాలని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. ‘‘మేము ఇక్కడి దాకా చేరుకోవడంలో రాహుల్ భయ్యా పాత్ర ఎంతో కీలకం. ఆయన తన కెరీర్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడారు. కోచ్గా ఉన్నప్పటికీ మాకు కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తూనే ఎలా ఆడాలో కూడా మార్గదర్శనం చేస్తారు. గడ్డు పరిస్థితుల్లో ముఖ్యంగా టీ20 వరల్డ్కప్ సమయంలో మాకు ఆయన నైతికంగా ఎంతో మద్దతుగా నిలిచారు. సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత మా లోపాలు సరిచేసి ఎలా ముందుకుసాగాలో నేర్పించారు. ఇలాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఆయన కోసం మేము కచ్చితంగా గెలిచి తీరాల్సిందే’’ అని రోహిత్ శర్మ రాహుల్ ద్రవిడ్పై అభిమానం చాటుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
IND VS SL: అయ్యర్తో ఆ విషయమై రోహిత్ మాట్లాడే ఉంటాడు..!
భారత జట్టుకు చెందిన ‘బిహైండ్ ద సీన్స్’ వీడియోలు అందరూ ఇష్టపడుతున్నారని భావిస్తున్నాను. వ్యక్తిగతంగా ఈ వీడియోలు నాకెంతో నచ్చుతున్నాయి. మ్యాచ్ సందర్భంగా రాణించిన భారత ఫీల్డర్ టీమ్ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ చేతుల మీదుగా ఉత్తమ ఫీల్డర్ పతకం అందుకుంటున్నాడు. ఈ అవార్డు ఇచ్చే సమయంలో చిన్న ప్రసంగం, సంబరాలు ఉంటున్నాయి. ఈ తరహా కార్యక్రమాలతో జట్టు సభ్యులందరిలో మరింత ఐక్యత పెరుగుతుంది. ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండటం, వరుస విజయాలు లభిస్తుండటంతో జట్టులోని సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. డ్రెస్సింగ్ రూమ్లోనూ ఎవరూ అభద్రతాభావంతో కనిపించడంలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తమ ఆటగాళ్లకు అవసరమైనన్ని అవకాశాలు ఇస్తున్నారు. టోర్నీ ఆరంభ మ్యాచ్ల్లో షమీని ఆడించకపోవడం జట్టు వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. గతంలో కేఎల్ రాహుల్ విఫలమైనా అతనితో మాట్లాడుతూ, తప్పిదాలను సరిచేస్తూ మరిన్ని అవకాశాలు ఇస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. షార్ట్ బాల్ ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న శ్రేయస్ అయ్యర్తో కూడా రోహిత్, ద్రవిడ్ బృందం మాట్లాడే ఉంటుంది. పొరపాటు ఎక్కడ జరుగుతుందో, ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతాడో అయ్యర్కు రోహిత్ సూచించే ఉంటాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని ఫ్లాట్ పిచ్పై ఈరోజు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్లో పరుగుల వరద పారే అవకాశం కనిపిస్తోంది. భారత బ్యాటర్లకంటే బౌలర్లు మరోసారి మెరిపించాలని కోరుకుంటున్నాను. ఈ టోర్నీలో శ్రీలంక తడబడుతోంది. పూర్తిస్థాయి ఆటతీరును ఆ జట్టు ఇంకా కనబర్చలేదు. వారి ప్రదర్శనలో ఏదో లోపిస్తోంది. ఒకరిద్దరి వ్యక్తిగత ప్రదర్శనలు మినహా జట్టుగా మెరిపించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు నుంచి మరో భారీ విజయం రావడం ఖాయమనిపిస్తోంది. -
అప్పుడు ద్రవిడ్ నా కోసం రెండు గంటలు ఎదురుచూశాడు.. ఇప్పుడు: షోయబ్ మాలిక్
Shoaib Malik Comments On Rahul Dravid: పాకిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్పై ప్రశంసలు కురిపించాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనదని కొనియాడాడు. తన పట్ల ద్రవిడ్ వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమంటూ గత జ్ఞాపకాలను తాజాగా గుర్తుచేసుకున్నాడు. పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 1999లో అడుగుపెట్టిన షోయబ్ మాలిక్ ఇప్పటి వరకు.. 34 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1898.. 7534.. 2435 పరుగులు సాధించడంతో పాటు.. 32.. 158.. 28 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో తన సుదర్ఘీ కెరీర్లో వ్యక్తిగత రికార్డులెన్నో సాధించిన మాలిక్.. ఎత్తుపళ్లాలు కూడా చవిచూశాడు. పాక్ కెప్టెన్గానూ పనిచేసిన అనుభవం ఈ స్పిన్ ఆల్రౌండర్ సొంతం. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన 41 ఏళ్ల షోయబ్ మాలిక్.. పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగమవుతూ తన కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఆరోజు అంతా ఒకే ఫ్లైట్లో ఉన్నాం తాజాగా పాకిస్తాన్ స్పోర్ట్స్-ఏ చానెల్తో మాట్లాడిన షోయబ్ మాలిక్.. వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా జైత్రయాత్ర వెనుక హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర కీలకమని పేర్కొన్నాడు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడైనప్పటికీ ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో ఉంటాడని.. అదే ఆయనను ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టిందంటూ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు పాత సంఘటన గుర్తుచేసుకుంటూ.. ‘‘మేము పాకిస్తాన్ నుంచి న్యూజిలాండ్కు వెళ్తున్నాం. ఆరోజు ఇండియా అండర్-19 క్రికెట్ జట్టు కూడా మాతో పాటే అదే విమానంలో ప్రయాణం చేస్తోంది. అప్పుడు రాహుల్ ద్రవిడ్ అండర్-19 టీమ్కు కోచ్గా ఉన్నాడు. నా కోసం ఆయన రెండు గంటలు ఎదురుచూశాడు విమానంలో నాకు బాగా నిద్రపట్టేసింది. నాతో మాట్లాడేందుకు ద్రవిడ్ దాదాపు రెండు గంటల పాటు ఎదురుచూశాడు. నేను నిద్రలేచిన తర్వాత .. ‘ఎన్నోసార్లు ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాత కూడా నువ్వు తిరిగి ఎలా పునరాగమనం చేయగలిగావు. నిన్ను ముందుకు నడిపే స్ఫూర్తి మంత్రం ఏమిటి?’ అని ద్రవిడ్ నన్ను అడగాలనుకున్నానని చెప్పాడు. తాను అప్పుడు అండర్-19 టీమ్ కోచ్గా ఉన్నాను కాబట్టి ఇలాంటివి యువ ప్లేయర్లకు చెప్పడం ఎంతో ముఖ్యమని నాతో అన్నాడు. ద్రవిడ్కు ఈగో అస్సలు ఉండదు నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏమిటంటే.. ద్రవిడ్కు అస్సలు ఈగో ఉండదు. ఎవరి నుంచి ఏదైనా నేర్చుకోవాలని భావిస్తే తప్పక అడిగి తెలుసుకుంటాడు. తన కెరీర్లో ఆయన ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడు. ఆటగాడిగా ఎంతో అనుభవం ఉంది. అయినా, ఎప్పుటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతాడు. అందుకే ఈరోజు టీమిండియా ఈ స్థాయిలో ఉంది’’ అని షోయబ్ మాలిక్.. ద్రవిడ్ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తాడు. కాగా రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో టీమిండియా వన్డే వరల్డ్కప్-2023 ట్రోఫీ గెలిచే దిశగా పయనిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన షాహిన్ ఆఫ్రిది.. తొలి బౌలర్గా రికార్డు WC 2023: గెలుపు జోష్లో ఉన్న టీమిండియాకు మరో గుడ్న్యూస్! -
WC 2023: టీమిండియా ఫ్యాన్స్కు ద్రవిడ్ గుడ్న్యూస్! అతడు వచ్చేస్తున్నాడు!
ICC Cricket World Cup 2023- Ind Vs Aus- Update On Shubman Gill: టీమిండియా వన్డే వరల్డ్కప్-2023 ప్రయాణ ఆరంభానికి కౌంట్డౌన్ మొదలైంది. చెన్నైలోని చెపాక్ వేదికగా భారత జట్టు తమ ఆరంభ మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో అక్టోబరు 8న తలపడేందుకు రోహిత్ సేన సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ గురించి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం గిల్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. ఆదివారం నాటి మ్యాచ్కు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు. గిల్ బాగానే ఉన్నాడు కాగా సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్కు కూడా రాలేకపోయాడు. దీంతో ఆసీస్తో మ్యాచ్కు అతడు దూరం కానున్నాడనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు గిల్ కాస్త బెటర్గా ఫీల్ అవుతున్నాడు. వైద్య బృందం నిరంతరం అతడిని పర్యవేక్షిస్తోంది. అప్పుడే క్లారిటీ వస్తుంది ఇంకా 36 గంటల సమయం ఉంది. ఆ తర్వాతే మేము ఏదైనా నిర్ణయం తీసుకోగలం. ఈరోజైతే తను బాగానే ఉన్నాడు. ఇప్పటివరకైతే మెడికల్ టీమ్ అతడు ఆదివారం నాటికి అందుబాటులోకి వస్తాడనే నమ్మకంతోనే ఉంది. రేపటిలాగే ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది’’ అని శుక్రవారం పేర్కొన్నాడు. అలా అయితే ఇషాన్కు ఛాన్స్ కాగా ఒకవేళ ఫీవర్ తగ్గక శుబ్మన్ గిల్ ఆసీస్తో మ్యాచ్కు దూరమైతే అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు ఓపెనర్గా బంపరాఫర్ దక్కే అవకాశం ఉంది. ఇక సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న రోహిత్ సేన.. ఆసీస్తో మ్యాచ్లో శుభారంభం అందుకోవాలని భావిస్తోంది. మెగా టోర్నీకి ముందు కంగారూలను 2-1తో చిత్తు చేసిన జోష్లో ఉన్న భారత్.. ఆరంభ మ్యాచ్లో ఎలాంటి అస్త్రశస్త్రాలతో బరిలోకి దిగనుందో చూడాలి! చదవండి: WC: అప్పుడు తండ్రి టీమిండియాపై.. కొడుకు ఇప్పుడు పాకిస్తాన్పై! వన్డే ప్రపంచకప్ చరిత్రలో.. చరిత్ర సృష్టించిన రిజ్వాన్, సౌద్ షకీల్.. ప్రపంచకప్ హిస్టరీలో..! -
ప్లేయర్స్ ఫీవర్తో బాధపడ్డారు.. వరల్డ్ కప్ ప్రిపరేషన్స్పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్కప్ సమరానికి రంగం సిద్దమైంది. దాదాపు పుష్కరకాలం తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో అదరగొట్టాలని భారత జట్టు భావిస్తోంది. ప్రస్తుతం టీమిండియా ఫామ్ను చూస్తే మరోసారి వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచే అవకాశం ఉంది. వరల్డ్కప్కు ముందు జరిగిన ఆసియాకప్, ఆసీస్తో వన్డే సిరీస్లోనూ టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆసియా ఛాంపియన్స్గా నిలిచిన భారత్.. ఆసీస్తో వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియాతో మూడో వన్డే అనంతరం భారత జట్టు వరల్డ్ కప్ ప్రిపేరేషన్స్ గురించి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ప్రపంచకప్కు ముందు తమ జట్టు సాధించిన విజయాలపై ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే జోరును వరల్డ్కప్లోనూ కొనసాగిస్తామని ఆయన తెలిపాడు. "మెగా టోర్నీకి ముందు ప్రతీ ఒక్క ప్లేయర్ ఫామ్లో ఉండడం చాలా ఆనందగా ఉంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పునరాగమనంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆసీస్తో వన్డే సిరీస్లో జస్ప్రీత్ రెండు మ్యాచ్లు ఆడాడు. అతడు తన 10 ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. సిరాజ్ కూడా మడమ నొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సాధించి బౌలింగ్ చేయగలిగాడు. అశ్విన్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. మరోవైపు కేఎల్ బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ 50 ఓవర్ల పాటు చేశాడు. శ్రేయస్ కూడా సెంచరీతో రాణించాడు. వరల్డ్ కప్కు ముందు వారు తమ రిథమ్ను తిరిగి పొందడానికి మంచి సమయం దొరికింది. వారికి మంచి ప్రాక్టీస్ కూడా లభించింది. అయితే వరల్డ్ కప్ ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచుల్లో మొత్తం 15 మంది భాగమవుతారు. దీనివల్ల వార్మప్ మ్యాచ్లలో ఆటగాళ్లు అంత ఏకగ్రాతతో ఆడలేరని" ద్రవిడ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. అదే విధంగా భారత జట్టులో కొంత మంది సభ్యులు వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం కోలుకున్నారని ద్రవిడ్ తెలిపాడు. వరల్డ్ కప్కు ముందు భారత జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది. సెప్టెంబర్ 30న గువాహతి వేదికగా ఇంగ్లండ్ తో తలపడనుంది. ఇప్పటికే ఇరు జట్లు గువాహతికి చేరుకున్నాయి. చదవండి: అయ్యర్ అదరగొడుతున్నాడు.. సూర్యకు జట్టులో చోటు కష్టమే: గవాస్కర్ -
WC 2023: సంజూను మర్చిపోవాల్సిందే!.. కుండబద్దలు కొట్టిన ద్రవిడ్
ICC ODI WC 2023- Suryakumar Yadav Vs Sanju Samson: వన్డేల్లో వరుసగా విఫలమవుతున్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ అండగా నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2023 జట్టులో ఈ టీ20 స్టార్ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని స్పష్టం చేశాడు. సూర్యకు మేనేజ్మెంట్ మద్దతు కొనసాగుతుందని ఉద్ఘాటించాడు. ఆడిన ఒక్క మ్యాచ్లోనూ.. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఆరంభం కానున్న ఐసీసీ ఈవెంట్కు ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ముంబై బ్యాటర్ సూర్యకు చోటు దక్కింది. అయితే, కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను కాదని సూర్యను ఎంపిక చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఆసియా వన్డే కప్-2023లో ఆడిన ఒకే ఒక్క మ్యాచ్లోనూ సూర్య వైఫల్యం వీటిని బలపరించింది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 28 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మిస్టర్ 360 ప్లేయర్కు ఉద్వాసన పలికి వేరొకరికి అవకాశమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యకు మా పూర్తి మద్దతు ఉంటుందన్న ద్రవిడ్ ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘27 గురించి సూర్య దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మేము వరల్డ్కప్ జట్టును ఎంపిక చేసుకున్నాం. ఇందులో సూర్య ఉన్నాడు. మా నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అతడికి పూర్తిగా మద్దతుగా నిలుస్తాం. టీ20 క్రికెట్లో అతడి సత్తా ఏమిటో అందరికీ తెలుసు. అతడి నైపుణ్యాలు, సామర్థ్యాలపై మాకు నమ్మకం ఉంది. వన్డేల్లో ఆరోస్థానంలో సూర్య బ్యాటింగ్ చేయగలడు. ఒంటిచేత్తో మలుపు తిప్పగల సత్తా ఉన్నవాడు. అందుకే అతడికి ఎల్లప్పుడూ మా సహకారం, అండ ఉంటాయి. ఇదే నిజం. సంపూర్ణ మద్దతు అతడికి ఉంటుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో అతడు పుంజుకుంటాడనే అనుకుంటున్నాం. సంజూ శాంసన్ ఆస్ట్రేలియాతో సిరీస్లో రాణిస్తాడు కనీసం రెండు మ్యాచ్లు అయినా ఆడతాడు కాబట్టి వన్డే క్రికెటర్గా తన ప్రయాణం సజావుగా కొనసాగాలని ఆశిస్తున్నాం. ఏదేమైనా వరల్డ్కప్ జట్టు విషయంలో అతడి గురించి తుది నిర్ణయం తీసుకున్నాం’’ అని ద్రవిడ్ కుండబద్దలు కొట్టాడు. సంజూను మర్చిపోవాల్సిందే దీంతో సంజూ వరల్డ్కప్ ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయని, ఈసారికి మర్చిపోవాల్సిందేనని అభిమానులు ఉసూరుమంటున్నారు. కాగా ఆసీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో సూర్యకు అవకాశం దక్కింది. ఇక సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు మొత్తంగా ఆడిన 28 వన్డేల్లో 24.41 సగటుతో 537 పరుగులు చేశాడు. మరోవైపు సంజూ శాంసన్ 13 వన్డేల్లో 55.71 సగటుతో 390 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
‘టీమిండియా హెడ్కోచ్ పదవి వద్దు’.. ఆసక్తి లేదన్న మాజీ పేసర్! కారణం?
Team India Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోచ్గా అవతారమెత్తిన టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అనూహ్యరీతిలో ముందుకు దూసుకుపోతున్న విషయం విదితమే. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ను జట్టును చాంపియన్గా నిలిపిన ఘనత అతడిది. మలి ప్రయత్నంలోనూ నెహ్రా మార్గదర్శనం చేసిన టీమ్ రన్నరప్గా నిలవడం విశేషం. టీమిండియా కోచ్ అయితే బాగుంటుంది ఈ నేపథ్యంలో నెహ్రా కోచింగ్ నైపుణ్యాలకు ఫిదా అయిన హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు భవిష్యత్తులో అతడికి టీమిండియా కోచింగ్ బాధ్యతలు అప్పజెపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాదిరే.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్లను నియమిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో రాహుల్ ద్రవిడ్ కంటే ఎక్కువ అనుభవం ఉన్న నెహ్రాను పరిమిత ఓవర్ల కోచ్గా నియమించాలని భజ్జీ గతంలో సూచించాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత టీమిండియా హెడ్కోచ్గా ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. తెరమీదకు నెహ్రా పేరు ఈ నేపథ్యంలో మెగా టోర్నీ తర్వాత అతడు కోచ్గా కొనసాగడానికి ఇష్టపడతాడా? లేదంటే బాధ్యతల నుంచి తప్పుకొంటాడా? అన్న సందేహాల నడుమ ఆశిష్ నెహ్రా పేరు తెరమీదకు వచ్చింది. ఒకవేళ ద్రవిడ్ కాంట్రాక్ట్ పునురుద్ధరించుకుంటే.. టెస్టు జట్టు కోచ్గా అతడు ఉంటే.. నెహ్రాకు వన్డే, టీ20 బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసక్తి లేదన్న నెహ్రా! కారణమిదే ఈ క్రమంలో ఆశిష్ నెహ్రా మాత్రం తన సన్నిహితుల వద్ద.. తాను టీమిండియా హెడ్కోచ్ పదవిపై ఆసక్తిగా లేనని చెప్పినట్లు సమాచారం. గుజరాత్ టైటాన్స్తో 2025 వరకు ఒప్పందం ఉన్న కారణంగా ఈ మేరకు బీసీసీఐ పదవిని నెహ్రా తిరస్కరించే అవకాశం ఉన్నట్లు పీటీఐ కథనంలో పేర్కొంది. తొలి సీజన్లో ట్రోఫీ గెలిచి కాగా అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి చెందిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్లీగ్లో ఎంట్రీ ఇచ్చింది. టీమిండియా హార్దిక్ పాండ్యా సారథ్యంలో నెహ్రా మార్గదర్శనంలో తమ తొలి సీజన్లో టైటిల్ గెలిచి సత్తా చాటింది. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 జరుగనుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాతే ద్రవిడ్ కోచ్గా కొనసాగుతాడా లేదా అన్న విషయం తేలుతుంది. ఈలోపే ఇలా ఊహాగానాలు వెలువడటం గమనార్హం. చదవండి: WC 2023: తిలక్ ఉండగా అతడిని ఎలా సెలక్ట్ చేస్తారు: ఆసీస్ మాజీ క్రికెటర్ -
వరల్డ్కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్గా అతడే?
Will BCCI Extend Dravid's Contract As Head Coach After WC 2023?: టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలితో ఉన్న ఒప్పందం ముగియడానికి ఇంకొన్నాళ్లు మాత్రమే మిగిలి ఉంది. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత ఈ కర్ణాటక మాజీ క్రికెటర్ రెండేళ్ల కాంట్రాక్ట్ పూర్తికానుంది. ఈ నేపథ్యంలో తదుపరి ద్రవిడ్ హెడ్కోచ్గా కొనసాగుతాడా? లేదంటే తన బాధ్యతల నుంచి తప్పుకొంటాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా ప్రదర్శనపైనే ద్రవిడ్ భవితవ్యం ఆధారపడి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవిశాస్త్రి తర్వాత కాగా టీ20 వరల్డ్కప్-2021లో భారత జట్టు నిరాశజనక ప్రదర్శన అనంతరం రవిశాస్త్రి హెడ్కోచ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో అనేక చర్చల అనంతరం రాహుల్ ద్రవిడ్ను ఒప్పించిన నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. తన హయాంలో ‘వాల్’ను హెడ్కోచ్గా నియమించాడు. ద్వైపాక్షిక సిరీస్లలో హిట్ 2021, నవంబరు 3న బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్లలో టీమిండియాకు వరుస విజయాలు అందించాడు. అయితే, గతేడాది ఆసియా టీ20 కప్, టీ20 ప్రపంచకప్లో రోహిత్ సేన వైఫల్యం చెందడం ద్రవిడ్కు మచ్చగా మారింది. మేజర్ ఈవెంట్లలో టీమిండియా తుస్సుమనడంతో అంతేగాక.. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా చిత్తు కావడంతో అటు కెప్టెన్.. ఇటు హెడ్కోచ్పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రయోగాలతో జట్టుకు నష్టం కలిగిస్తున్నాడంటూ ద్రవిడ్ను తొలగించాలనే డిమాండ్లు ముందుకు తెచ్చారు టీమిండియా అభిమానులు. ఈసారి సొంతగడ్డపై వరల్డ్కప్.. కానీ ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ రూపంలో తనను తాను నిరూపించుకునే అవకాశం ద్రవిడ్ ముంగిట నిలిచింది. ముఖ్యంగా సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్ జరుగనుండటం సానుకూలాంశంగా మారింది. అయితే, ఏమాత్రం తేడా జరిగి అనుకున్న ఫలితం రాకపోతే.. ద్రవిడ్పై మరోసారి విమర్శలు తప్పవు. ఈ క్రమంలో బీసీసీఐ ఆఫీస్ బేరర్ ఒకరు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ‘‘ఒకవేళ భారత్ ప్రపంచకప్ గెలిచినా ద్రవిడ్ తన కాంట్రాక్ట్ను పునరుద్ధరించుకోకపోవచ్చు. ఎందుకంటే కోచ్గా ఉన్నతస్థితిలో ఉన్నపుడే బాధ్యతల నుంచి వైదొలగాలనుకోవడం సహజం. ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కోచ్! అంతేకాదు.. వరల్డ్కప్ తర్వాత బీసీసీఐ కోచ్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కోచ్ను నియమిస్తే బాగుంటుంది. అప్పుడు వాళ్లు రాహుల్ ద్రవిడ్ను టెస్టు జట్టు కోచ్గా కొనసాగమని అడగవచ్చు’’ అని పీటీఐతో వ్యాఖ్యానించారు. నాడు అతడు బలిపశువు కీలక ఈవెంట్లలో జట్టు వైఫల్యం చెందితే ఆ ప్రభావం కోచ్లు, కెప్టెన్లపై పడటం సహజం. వన్డే వరల్డ్కప్-2007 సమయంలో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్గా ఉన్న సమయంలో టీమిండియా హెడ్కోచ్గా గ్రెగ్ చాపెల్ ఉన్నాడు. వెస్టిండీస్లో జరిగిన ఈ మెగా టోర్నీలో టీమిండియా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. కనీసం సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించడంతో చాపెల్కు రాజీనామా తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. కొత్త కోచ్గా ఊహించని పేరు! అయితే, ద్రవిడ్ విషయంలో అలా జరుగుతుందని చెప్పలేం గానీ.. తమను తాము కాపాడుకోవాలంటే ఎవరో ఒకరిని బలిపశువును చేయకతప్పని పక్షంలో ఎవరిపైనైనా వేటు పడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రాహుల్ ద్రవిడ్ తప్పుకొంటే.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ను తొలి సీజన్లోనే విజేతగా నిలిపిన ఆశిష్ నెహ్రా రేసులోకి రావొచ్చని పలువురు విశ్లేషకులు అంటున్నారు. చదవండి: సిగ్గుపడు రోహిత్! నువ్వసలు కెప్టెన్వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు! -
Asia Cup: వారెవ్వా! ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్- హార్దిక్
Asia Cup 2023 Ind Vs Pak- Ishan Kishan and Hardik Pandya Record: పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఇషాన్ కిషన్- హార్దిక్ పాండ్యా ద్వయం సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆసియా కప్ చరిత్రలో ఇప్పటిదాకా రాహుల్ ద్రవిడ్- యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. కాగా శ్రీలంక వేదికగా ఆసియా కప్-2023లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ మధ్య శనివారం మ్యాచ్ జరుగుతోంది. పాక్ పేసర్ల జోరు.. టీమిండియా టాపార్డర్ బేజారు ఈ వన్డే టోర్నీ తాజా ఎడిషన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, నసీం షా ధాటికి టీమిండియా టాపార్డర్ కకావికలమైంది. ఈ నేపథ్యంలో ఇషాన్, పాండ్యా అర్ధ శతకాలతో రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించారు. ఆదుకున్న ఇషాన్- హార్దిక్.. వీరిద్దరి విజృంభణతో భారత జట్టు 48.5 ఓవర్లలో 266 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. టీమిండియా పరువు కాపాడిన ఇషాన్ కిషన్(82)- హార్దిక్ పాండ్యా(87) ఐదో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆసియా కప్ ఈవెంట్లో ఐదో వికెట్కు టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు. ద్రవిడ్- యువీ రికార్డు బద్దలు ఈ క్రమంలోనే ఇషాన్- పాండ్యా 19 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు. కాగా 2004లో ద్రవిడ్(82)- యువీ(47) శ్రీలంకతో మ్యాచ్లో ఐదో వికెట్కు 133 పరుగులు జోడించారు. పాక్తో మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ రికార్డును అధిగమించారు. ఆ రికార్డు కూడా బ్రేక్ అంతేకాదు.. వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్తో మ్యాచ్లో ఐదో వికెట్కు అత్యధిక పరుగులు జోడించిన జోడీగా రాహుల్ ద్రవిడ్- మహ్మద్ కైఫ్ల రికార్డు(135)ను బద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే.. పాక్తో సెప్టెంబరు 2 నాటి మ్యాచ్లో టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో ఆఫ్రిదికి నాలుగు, రవూఫ్, నసీం షాలకు చెరో మూడు వికెట్లు దక్కాయి. ఆసియా కప్ చరిత్రలో ఐదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన టాప్-4 జోడీలు ►ఇషాన్ కిషన్- హార్దిక్ పాండ్యా- 2023లో పాకిస్తాన్తో మ్యాచ్లో 138 పరుగులు ►రాహుల్ ద్రవిడ్- యువరాజ్ సింగ్- 2004లో శ్రీలంకతో మ్యాచ్లో 133 పరుగులు ►ధోని- రోహిత్ శర్మ- 2008లో పాకిస్తాన్తో మ్యాచ్లో 112 పరుగులు ►ధోని- రోహిత్ శర్మ- 2010లో శ్రీలంకతో మ్యాచ్లో 79 పరుగులు. చదవండి: IND VS PAK: షమీని కాదని శార్దూల్ను తీసుకుంది ఇందుకేనా..? -
ఆసియా కప్కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్
ఆసియా కప్-2023కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకుని ఇటీవలే జట్టులో చేరిన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గాయం తిరగబెట్టడంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఆసియా కప్లో టీమిండియా ఆడే తొలి రెండు మ్యాచ్లకు (పాకిస్తాన్, నేపాల్) రాహుల్ దూరంగా ఉంటాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇవాళ (ఆగస్ట్ 29) వెల్లడించాడు. ఈ మేరకు బీసీసీఐ కూడా అధికారికంగా ట్వీట్ చేసింది. గతవారం రోజులుగా కేఎల్ రాహుల్ జట్టుతో పాటు కఠోరంగా శ్రమించాడని, దురదృష్టవశాత్తు అతను ఆసియాకప్ తొలి రెండు మ్యాచ్లకు జట్టుకు అందుబాటులో ఉండడని ద్రవిడ్ తెలిపాడు. ఈ మధ్యకాలంలో కేఎల్ రాహుల్ ఎన్సీఏలోనే ఉంటాడని, సెప్టెంబర్ 4న అతను ఆసియాకప్లో పాల్గొనడంపై తదుపరి నిర్ణయం వెలువడనుందని పేర్కొన్నాడు. UPDATE KL Rahul is progressing really well but will not be available for India’s first two matches – against Pakistan and Nepal – of the #AsiaCup2023: Head Coach Rahul Dravid#TeamIndia — BCCI (@BCCI) August 29, 2023 కాగా, ఆసియా కప్ కోసం టీమిండియా ఇవాళ కొలొంబోకు బయల్దేరింది. దీనికి ముందు జట్టు ప్రధాన కోచ్ ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదే సందర్భంగా ద్రవిడ్.. కేఎల్ రాహుల్ విషయంలో అప్డేట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023కి పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఈ నెల 30న జరుగనుంది. ముల్తాన్లో జరిగే ఈ మ్యాచ్లో పాక్ –నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరుగనుంది. ఈ మ్యాచ్కు పల్లెకెలె మైదానం ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్ 4 భారత్.. నేపాల్తో మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్తో ఆసియాకప్ ముగుస్తుంది. అనంతరం భారత్ వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే వరల్డ్కప్ జరుగనుంది. ఆసియా కప్-2023 కోసం టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. స్టాండ్ బై: సంజూ శాంసన్. -
మా ఓటమికి కారణమదే.. ఆ విషయంలో మేము ఇంకా మెరుగుపడాలి: ద్రవిడ్
టీ20 క్రికెట్లో నెం1గా ఉన్న టీమిండియాకు వెస్టిండీస్ భారీ షాకిచ్చింది. స్వదేశంలో భారత్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2తో విండీస్ సొంతం చేసుకుంది. ఫ్లోరిడా వేదికగా ఆఖరి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ను ఓడించిన వెస్టిండీస్.. ఆరేళ్ల తర్వాత టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక సిరీస్ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే సిరీస్ను కోల్పోయామని ద్రవిడ్ తెలిపాడు. "తొలుత టెస్టు, వన్డే సిరీస్లో మా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అదే విధంగా టీ20 సిరీస్లో కూడా మేము తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయాం. అయినప్పటికీ మేము అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చి సిరీస్ను సమం చేశాం. కానీ ఆఖరి మ్యాచ్లో ఓడి సిరీస్ను కోల్పోయాం. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు, ఐదో టీ20లో మేము కొన్ని తప్పులు చేశాం. ఈ మూడు మ్యాచ్ల్లో కూడా బ్యాటింగ్ బాగా చేయలేదు. అయితే జట్టు మొత్తం యువ ఆటగాళ్లతో కూడి ఉన్నది. కాబట్టి కొన్నిసార్లు మనం ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఈ సిరీస్లో యువ ఆటగాళ్లకు ఛాన్స్లు ఇవ్వాలని నిర్ణయించకున్నాం. అదేవిధంగా సరికొత్త కాంబనేషన్స్ను కూడా ప్రయత్నించాం. ఈ విషయంలో అయితే కొంతమెరకు మేము విజయం సాధించాం. జైశ్వాల్, తిలక్ వంటి యువ ఆటగాళ్లు తమ సత్తాచాటారు. నాలుగో టీ20లో జైశ్వాల్ తన టాలెంట్ చూపించాడు. తిలక్ కూడా బ్యాటింగ్, ఫీల్డింగ్తో అదరగొట్టాడు. అయితే విండీస్ పర్యటనలో మాకు కొన్ని పాజిటివ్ అంశాలతో పాటు ప్రతికూల విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో మేము ఈ విషయాల్లో మెరుగవ్వాలన్నది ఈ కరేబియన్ టూర్లో తెలుసుకున్నాం. ముఖ్యంగా మా బ్యాటింగ్ డెప్త్ను ఇంకా పెంచుకోవాలి. బౌలింగ్ అయితే మరి అంత బలహీనంగా లేదు. మాకు ముందు ఇంకా చాలా సవాళ్లు ఎదురుకానున్నాయి. అందుకు తగట్టు సిద్దం కావడమే మా పని అని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో ద్రవిడ్ పేర్కొన్నాడు. చదవండి: Ind vs WI: కొరకరాని కొయ్య.. తిలక్ వర్మ నుంచి ఇది ఊహించలేదు! వీడియో వైరల్ -
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. తొలి భారత ఆటగాడిగా!
టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ తన అరంగేట్ర మ్యాచ్లోనే సత్తా చాటాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తిలక్.. తన ప్రదర్శనతో అందరిని అకట్టుకున్నాడు. తన కెరీర్లో ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లోనే 2 సిక్సర్లు బాదాడు. ఓవరాల్గా 22 బంతులు ఆడిన తిలక్ వర్మ 2 ఫోర్లు, 3 సిక్స్లతో 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అదే విధంగా ఫీల్డింగ్లో కూడా రెండు అద్భుతమైన క్యాచ్లతో వర్మ మెరిశాడు. ఇక తొలి మ్యాచ్లో సంచలన బ్యాటింగ్ చేసిన తిలక్.. ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు. విదేశీ గడ్డపై టీ20 అరంగేట్ర మ్యాచ్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్, మురళీ విజయ్తో కలిసి సంయుక్తంగా తిలక్ నిలిచాడు. అంతకుముందు మురళీ విజయ్ 2010 లో తన డెబ్యూ మ్యాచ్లో ఆఫ్గానిస్తాన్పై 3 సిక్స్లు బాదగా.. 2011లో రాహుల్ ద్రవిడ్ కూడా తన అరంగేట్ర మ్యాచ్లో ఇంగ్లండ్పై 3 సిక్స్లు కొట్టాడు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత తిలక్ వర్మ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. అదే విధంగా ఈ మ్యాచ్లో తిలక్ మరో అరుదైన రికార్డును కూడా సాధించాడు. టీ20ల్లో అరంగేట్ర మ్యాచ్లో అత్యధిక స్ట్రైక్రేట్తో 30కు పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా వర్మ చరిత్ర సృష్టించాడు. తిలక్ 177.27 స్ట్రైక్రేట్తో 39 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్ చేతిలో 4 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(41), రోవ్మన్ పోవెల్(48) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ త్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లు జాసన్ హోల్డర్, రోమారియో షెఫర్డ్, ఒబెడ్ మెక్కాయ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. టీమిండియాను చూశాక తప్పుచేశా అనుకున్నా! కానీ: విండీస్ కెప్టెన్ -
రోహిత్, కోహ్లి లేకుండానే! మళ్లీ మరో ప్రయోగం? కుండబద్దలు కొట్టిన ద్రవిడ్
West Indies vs India ODI Series: అనవసర ప్రయోగాలతో వెస్టిండీస్తో రెండో వన్డేలో పరాభవం పాలైంది టీమిండియా. తొలి మ్యాచ్లో గెలిచినప్పటికీ.. లోపాలను సరిచేసుకోకపోగా మరోసారి ఎక్స్పెరిమెంట్కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిచ్చి భారీ మూల్యం చెల్లించింది. వన్డే ప్రపంచకప్-2023కి అర్హత సాధించని జట్టు చేతిలో ఓటమి పాలైంది. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసి ఫలితం అనుభవించింది. ఓవర్ కాన్ఫిడెన్స్తో విండీస్ గెలిచేందుకు బాటలు వేసింది. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్కు ముందు వెస్టిండీస్ లాంటి జట్ల చేతిలో ఓడటం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కనీసం మూడో వన్డేలోనైనా చెత్త ప్రయోగాలకు వెళ్లకుండా.. జట్టును ఎంపిక చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు. నిర్ణయాన్ని సమర్థించుకున్న ద్రవిడ్ ఈ క్రమంలో టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. రెండో వన్డేలో రోహిత్, కోహ్లిలను తప్పిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. నిర్ణయాత్మక మ్యాచ్లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తామని చెప్పకనే చెప్పాడు. ‘‘మేము దీర్ఘకాలిక ప్రయోజనాల కోణంలో దూరదృష్టితో ఆలోచిస్తున్నాం. ఆసియా కప్, వన్డే వరల్డ్కప్ టోర్నీలకు సమయం ఆసన్నమవుతోంది. మా జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారు. ఇలాంటపుడు మేము కచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి చిన్న విషయం గురించి పట్టించుకోం ప్రతి చిన్న విషయం గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి మ్యాచ్ను పట్టించుకోవాల్సిన పనిలేదు. ప్రతి సిరీస్ గురించి బెంబేలెత్తిపోవాల్సిన అగత్యం అంతకన్నా లేదు. ఒకవేళ మేము వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే పెద్ద తప్పు చేసినవాళ్లమవుతాం’’ అని ద్రవిడ్.. ప్రయోగాలకు వెనుకాడబోమని కుండబద్దలు కొట్టాడు. కీలక ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్న వేళ.. మెగా ఈవెంట్లను దృష్టిలో పెట్టుకునే ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నామని చెప్పుకొచ్చాడు. కాగా విండీస్- టీమిండియా మధ్య మంగళవారం (ఆగష్టు 1)న నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. చదవండి: కుల్దీప్ను అంత మాటన్నాడా? ‘చెత్త’ వాగుడు కట్టిపెట్టు సూర్య.. ఇదేం పద్ధతి! -
'లాభం కంటే నష్టమే ఎక్కువ.. తక్షణమే తొలగించండి'
వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వరల్డ్కప్కు క్వాలిఫై అవ్వని జట్టు చేతిలో ఓడిపోయి రోహిత్ సేన పరువు పోగొట్టుకుందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్కప్కు ముందు అనవసర ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకుంటుంది. మంచి ఫామ్లో ఉన్న రోహిత్, కోహ్లిలకు విశ్రాంతినివ్వడం ఏంటని తప్పబట్టారు. పనిలో పనిగా టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ను కూడా అభిమానులు ఒక రౌండ్ వేసుకున్నారు. ద్రవిడ్ కోచ్గా వచ్చినప్పటి నుంచి టీమిండియాకు ఏది కలిసి రావడం లేదని.. ఒక్క పెద్ద టోర్నీని కూడా గెలవలేకపోయిందని పేర్కొన్నారు. ద్రవిడ్ కోచ్గా వచ్చిన తర్వాత బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత అదే ప్రొటిస్ జట్టుకు వన్డే సిరీస్ను కూడా అప్పగించింది. అటుపై ఆసియా కప్ను నెగ్గడంలో విఫలమైన టీమిండియా టి20 వరల్డ్కప్లోనూ సెమీస్లోనే చేతులెత్తేసింది. ఆసీస్తో టెస్టు సిరీస్ను నెగ్గినా వన్డే సిరీస్ను.. ఆ తర్వాత జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ ఫైనల్ 2023)లో ఆసీస్ చేతిలో దారుణ పరాజయం చవిచూసింది. ద్రవిడ్ కోచ్గా వచ్చిన తర్వాత గెలుపు శాతం కంటే ఓటముల పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం ఆసక్తి కలిగించింది. ఈ లెక్కన టీమిండియా ద్రవిడ్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పొచ్చు. ద్రవిడ్ కోచ్గా వచ్చిన తర్వాత టీమిండియా ఓడిన సిరీస్లు ► బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ► సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్తో పాటు వన్డే సిరీస్ ► ఆసియా కప్లో ఓటమి ► టి20 వరల్డ్కప్లో సెమీస్లో ఓటమి ► స్వదేశంలో ఆసీస్తో వన్డే సిరీస్లో ఓటమి ► డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో ఆసీస్ చేతిలో పరాజయం దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ద్రవిడ్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ద్రవిడ్ పిచ్చి ప్రయోగాలు వల్ల టీమిండియాకు లాభాల కంటే నష్టమే ఎక్కువని ఆరోపణలు చేస్తున్నారు. #SackDravid.. అంటూ హ్యాష్ ట్యాగ్తో పోస్టులు చేస్తున్నారు. ''సచిన్ 194 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఇప్పుడు కోహ్లి రెడ్ హాట్ ఫామ్లో ఉన్నప్పుడు అతనికి విశ్రాంతి ఇస్తున్నారు. అనేక సమస్యలు.. ఒకటే పరిష్కారం.. ద్రవిడ్ను తొలగించండి'' అని ఓ నెటిజన్ కోరారు. అయితే ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన ద్రవిడ్.. ఆసియా కప్, ఆ తర్వాత వరల్డ్ కప్కు వెళ్లే ముందు వెస్టిండీస్ సిరీస్ తమకు ఈ ప్రయోగాలను చేయడానికి చివరి అవకాశంగా ఉపయోగపడిందని వివరించాడు. గాయపడిన ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి రావడం గురించి అనిశ్చితి కారణంగా.. వారిని వారు మ్యాచ్ సిద్ధంగా ఉంచుకోవడానికి బ్యాకప్ ఎంపికలకు కొంత సమయం ఇవ్వవలసి ఉంటుందని సమర్థించుకోవడం ఆసక్తి రేపింది. declared innings when sachin was batting on 194 now resting kohli in every other series when he's in red hot form many problems , one solution#SackDravid pic.twitter.com/ptfyTCTECb — flick (@onlykohly) July 29, 2023 Now ive become death, the destroyer of Indian Cricket team with my politics.#sackdravid💔 pic.twitter.com/oaNSKfy83q — 𝐒𝐞𝐫𝐠𝐢𝐨𝐂𝐒𝐊 (@SergioCSKK) July 29, 2023 Rahul Dravid as a coach : - lost odi series against ban - lost test series against sa - lost odi series aginst sa - lost asia cup - lost 2022 T20 wc - lost ODI series against aus - lost WTC final - lost ODI Agaisnt WI who didn't qualify for Wc Dravid Destroyed ICT #SackDravid pic.twitter.com/T6Zx8a6KMk — Laksh Sharma (@im_laksh_18) July 29, 2023 చదవండి: ICC ODI WC 2023: వరల్డ్కప్ జరిగేది మన దగ్గర.. విండీస్లో కాదుగా; ఈ ప్రయోగాలేంది? Carlos Alcaraz: సంచలనాల 'అల్కరాజ్'.. 'ఆల్టైమ్ గ్రేట్' లక్షణాలు పుష్కలంగా -
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ద్రవిడ్ అడిగాడు! అప్పుడు నేను..
ఐపీఎల్లో గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు జితేశ్ శర్మ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గతేడాది 10 ఇన్నింగ్స్లో 234 పరుగులు సాధించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 16వ ఎడిషన్లో 14 ఇన్నింగ్స్లో 309 రన్స్ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఓసారి టీమిండియాకు ఎంపికైన జితేశ్కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. శ్రీలంకతో టీ20 సిరీస్ నేపథ్యంలో ఈ విదర్భ బ్యాటర్కు పిలుపు వచ్చింది. కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ గాయపడటంతో అతడి స్థానంలో జితేశ్ను జట్టులోకి తీసుకున్నారు. కానీ ఇషాన్ కిషన్ రూపంలో వికెట్ కీపర్ అందుబాటులో ఉండటంతో అతడికి ఆడే అవకాశం రాలేదు. ఈ క్రమంలో ఆసియా క్రీడలు-2023 సందర్భంగా మరోసారి అదృష్టం జితేశ్ తలుపుతట్టింది. చైనాలో జరుగునున్న ఈ మెగా ఈవెంట్లో పాల్గొననున్న భారత ద్వితీయ శ్రేణి జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఏబీపీ న్యూస్తో మాట్లాడిన జితేశ్ మొదటిసారి జట్టుకు ఎంపికైనపుడు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్తో జరిగిన సంభాషణ గురించి వెల్లడించాడు. ‘‘జితేశ్.. నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావో తెలుసా?’’ అని ద్రవిడ్ అడిగారు. అందుకు బదులుగా.. ‘‘వీలైనంత ఎక్కువ స్ట్రైక్రేటు నమోదు చేయడం నా బలం. త్వరత్వరగా పరుగులు రాబడతాను. అందుకే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు’’ అని సమాధానమిచ్చాను. అందుకు రాహుల్ సర్ కూడా.. ‘‘అవును.. నువ్వు ఇక్కడిదాకా వచ్చింది అందుకే! నీదైన శైలిలో ఆడు.. జట్టు కోసం ఆడు.. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని చెప్పారు’’ అంటూ 29 ఏళ్ల జితేశ్ డ్రెస్సింగ్రూం అనుభవాలు పంచుకున్నాడు. కాగా ఆసియా క్రీడలకు రింకూ సింగ్, జితేశ్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్ తదితరులు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకుడు. -
Ind vs WI: శుబ్మన్ సెంచరీ చేయాలంటే అదొక్కటే దారి! పేలుతున్న సెటైర్లు
Shubman Gill Again Fails IND vs WI 2nd Test Leads To Pointing Out Reasons: వెస్టిండీస్లో టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ వైఫల్యం కొనసాగుతోంది. మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేసి.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ను ఒప్పించిన ఈ రెగ్యులర్ ఓపెనర్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఏరికోరి ఎంచుకున్న స్థానంలో సఫలం కాలేక గిల్ విమర్శల పాలవుతున్నాడు. డొమినికా వేదికగా తొలి టెస్టులో 11 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ కేవలం 6 పరుగులు చేశాడు. విండీస్ స్పిన్నర్ వారికన్ బౌలింగ్లో అలిక్ అథనాజ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వరుస వైఫల్యాలు ట్రినిడాడ్లోని రెండో టెస్టులోనైనా రాణిస్తాడనుకుంటే మళ్లీ నిరాశ పరిచాడు. తొలి ఇన్నింగ్స్లో భాగంగా 12 బంతులు ఎదుర్కొని 10 పరుగులు మాత్రమే రాబట్టాడు. కరేబియన్ పేసర్ కీమర్ రోచ్ బౌలింగ్లో వికెట్ కీపర్ జాషువా డా సిల్వాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ ఆట తీరుపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఏరికోరి వన్డౌన్లో బ్యాటింగ్కు రావడాన్ని ఉద్దేశించి.. ‘‘విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నెట్టింట పేలుతున్న సెటైర్లు శుబ్మన్ గిల్.. రాహుల్ ద్రవిడ్తో మాట్లాడి ఇకపై అన్ని మ్యాచ్లు అహ్మదాబాద్ స్టేడియంలో జరిగేలా చూడాలని కోరాడు. నేను అహ్మదాబాద్ పిచ్లపై మాత్రమే బ్యాటింగ్ చేయగలను. అందుకే ఈ సాయం చేయగలరు అని అభ్యర్థించాడు’’ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. అహ్మదాబాద్ పిచ్ ఎందుకంటే కాగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబీ బ్యాటర్ శుబ్మన్ గిల్ తన కెరీర్లో గత మూడు సెంచరీలు చేయడంవిశేషం. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో శతకం బాదిన అతడు.. న్యూజిలాండ్తో టీ20లోనూ సెంచరీ కొట్టాడు. ఇక ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో శతక్కొట్టాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఈ మేరకు గిల్ను ట్రోల్ చేయడం గమనార్హం. కాగా విండీస్తో రెండో టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా మెరుగైన స్థితిలో ఉంది. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఇక అంతర్జాతీయ కెరీర్లో 500వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి 87, రవీంద్ర జడేజా 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో గిల్తో పాటు విఫలమైన టీమిండియా వైస్ కెప్టెన్ రహానే మలి టెస్టులోనూ అతడి మాదిరే వైఫల్యం చెంది విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. చదవండి: సన్రైజర్స్ హెడ్కోచ్గా వీరేంద్ర సెహ్వాగ్.. ఇక తిరుగుండదు! Ind vs WI: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా వాళ్లను పిలిస్తే.. -
Ind vs WI: కోహ్లిపై ద్రవిడ్ ప్రశంసల జల్లు.. తన నుంచి చాలా నేర్చుకున్నా!
Virat Kohli 500 International Match: విరాట్ కోహ్లి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. టీమిండియా స్టార్ బ్యాటర్గా, సారథిగా అరుదైన రికార్డులెన్నో సాధించి కింగ్ కోహ్లిగా పేరొందాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే 75 సెంచరీలు సాధించి సమకాలీన క్రికెటర్లెవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. రికార్డుల రారాజుగా ప్రసిద్ధికెక్కి GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనిపించుకుంటున్న కోహ్లి తన కెరీర్లో మరో అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో(టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలో కలిపి) 500వ మ్యాచ్ ఆడబోతున్నాడు. వెస్టిండీస్తో గురువారం(జూలై 20)న ఆరంభం కానున్న రెండో టెస్టుతో ఈ ఫీట్ నమోదు చేయనున్నాడు. ఈ సందర్భంగా పరుగుల యంత్రం కోహ్లిపై ప్రశంపల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్.. విరాట్ కోహ్లిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విండీస్తో రెండో టెస్టు ఆరంభానికి ముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంతటి కఠినశ్రమకైనా ఓరుస్తాడు ‘‘అతడంటే ఏమిటో.. కెరీర్ గణాంకాలు, రికార్డులే చెబుతున్నాయి. మ్యాచ్కు ముందు తను ఎంతగానో శ్రమిస్తాడు. ఎంతటి కఠిన శ్రమకైనా ఓరుస్తాడు. తనలో నాకు నచ్చిన గుణం అదే. ఆ అంకితభావమే 500వ మ్యాచ్ ఆడే దాకా తీసుకువచ్చింది. కోహ్లి తన నోటితో ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఆటగాడైనా ఎప్పటికప్పుడు తనను తాను సమీక్షించుకుని, లోపాలుంటే సవరించుకుని.. ఫిట్నెస్ కాపాడుకుంటూ ముందుకు సాగితే యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆ గుణాల వల్లే విరాట్లో ఉన్న ఈ గుణాలే అతడు సుదీర్ఘకాలం పాటు ఆడేందుకు ఉపకరిస్తున్నాయి. క్రమశిక్షణ, పరిస్థితులకు తగ్గట్లు మసలుకునేతత్వం, కఠిన శ్రమ ఇవే కెరీర్ను పొడిగించుకునేందుకు సాయపడే అంశాలు. అవన్నీ కోహ్లిలో ఉన్నాయి గనుకనే ఇన్నేళ్లుగా తను ఆటలో కొనసాగుతున్నాడు’’ అని రాహుల్ ద్రవిడ్.. కోహ్లిని ఆకాశానికెత్తాడు. తాను క్రికెట్ ఆడేటపుడు కోహ్లి యువకుడిగా జట్టులోకి వచ్చాడన్న ద్రవిడ్.. హెడ్కోచ్గా ఏడాదిన్నర కాలంలో అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. తన ప్రయాణంలో నేను కూడా ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. ఫిట్నెస్ ఫ్రీక్ 34 ఏళ్ల కోహ్లి ఫిట్నెస్ సమస్యల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. అలా క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన కోహ్లి తన కెరీర్లో టీమిండియా తరఫున ఇప్పటి వరకు 110 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20 మ్యాచ్లు ఆడాడు. టీమిండియా క్రికెటర్గా పదిహేనేళ్ల ప్రయాణంలో 25, 461 పరుగులు సాధించాడు. ఇందులో 75 శతకాలు, 131 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 500 & Counting 😃 Hear from #TeamIndia Head Coach Rahul Dravid and milestone man Virat Kohli ahead of a special occasion 👌🏻👌🏻#WIvIND | @imVkohli pic.twitter.com/cJBA7CVcOj — BCCI (@BCCI) July 20, 2023