Spot fixing
-
టీ20 ప్రపంచకప్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం.. బంగ్లా క్రికెటర్తో
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో స్పాట్ ఫిక్సింగ్ వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ మెగా టోర్నీలో ఫిక్సింగ్ కోసం ఓ బంగ్లాదేశీ ప్లేయర్ను బుక్కీలు సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఈఎస్పీన్ క్రిక్ఈన్ఫో వెల్లడించింది. అయితే ఆమె ఈ ఆఫర్ను తిరష్కరించి ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేసినట్లు ఈఎస్పీన్ తన నివేదికలో పేర్కొంది. అదే విధంగా ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణను బంగ్లాదేశ్కు చెందిన ఓ మీడియా సంస్థ విడుదల చేసినట్లు ఈఎస్పీన్ తెలిపింది. ఆ ఆడియో సంభాషణ ప్రకారం.. బుక్కీలకు ఆమెకు మరో మరో బంగ్లా ప్లేయర్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఈ స్పాట్ ఫిక్సింగ్కు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఐసీసీ యాంటీ కరప్షన్ విభాగంకు ఫిర్యాదు చేశాం. ఐసీసీ దర్యాప్తు చేపడుతుంది. అయితే మా క్రికెటర్లకు ఫిక్సర్లు సంప్రదిస్తే.. వారికి ఏమో చేయాలో బాగా తెలుసు. ఈవెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేయాలని మా ప్లేయర్స్కు తెలుసు. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన ఆంశం కాదు. అందుకే మేము ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడాలని అనుకోలేదు. అంతా ఐసీసీ చూసుకుంటుందని"ఈఎస్పీన్తో పేర్కొన్నారు. ఇక టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. చదవండి: T20 WC: ప్రపంచకప్లో పాకిస్తాన్ బోణీ.. ఐర్లాండ్పై ఘన విజయం -
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా పాక్ దిగ్గజ పేసర్లు వసీం అక్రం, వకార్ యూనిస్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకే గనక అధికారం ఉంటే అక్రమ్ తో పాటు వకార్ లను శాశ్వతంగా నిషేధించేవాడినని చెప్పుకొచ్చాడు. వసీం అక్రమ్ తో పాటు వకార్ లు 1993-94లలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ ఇద్దరితో పాటు సలీమ్ మాలిక్ పైనా ఆరోపణలు రావడంతో దీనిపై జస్టిస్ ఖయ్యూం కమిటీ విచారణ జరిపి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అక్రమ్, వకార్ల పేర్లు ఉన్నాయి. తాజాగా రమీజ్ రాజా ఒక మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ''వాళ్లెవరికీ తిరిగి జట్టుతో అవకాశమే ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఇందులో ఆరోపణలు ఎదుర్కున్న ఎవరికీ జట్టులోకి వచ్చే అవకాశమే ఉండకూడదని అనుకున్నా. వాళ్ల (అక్రమ్, వకార్)ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో నా చేతిలో పవర్ లేదు. ఒకవేళ నేనే నిర్ణయాధికారంలో గనక ఉంటే తప్పకుండా వారిపై జీవిత కాలం నిషేధం విధించేవాడిని. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నాకు తెలిసి ఈ ఫిక్సింగ్ కేసులో చాలా మంది ఉన్నారని నా అనుమానం. వారిని ఎందుకు వదిలేశారో నాకైతే తెలియదు..’ అని అన్నాడు. 2010లో మహ్మద్ అమీర్, మహ్మద్ అసిఫ్, సల్మాన్ భట్ ల మీద కూడా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. వీరిమీద విచారణ జరిపిన పీసీబీ.. భట్, అమీర్, అసిఫ్ లపై నిషేధం విధించింది. అమిర్ 2016లో తిరిగి పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ రమీజ్ రాజా పీసీబీ చైర్మెన్ అయ్యాక వీళ్లెవరినీ సెలక్షన్స్ సమయంలో పరిగణించలేదు. అయితే ఈ విషయంపై రమీజ్ తనదైన రీతిలో వ్యాఖ్యానించాడు. ''నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఇలాంటి తప్పులు చేసిన వారు ఎంతటి స్థాయి వ్యక్తులైనా తప్పించుకోకూడదు'' అని అన్నాడు. . చదవండి: లేక లేక మ్యాచ్లు.. పీసీబీకి సంకటస్థితి -
వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా?
ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం అసన్నమైంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదిల్లో మెగా వేలం జరగనుంది. కాగా ఇప్పటికే 1214 మంది ఆటగాళ్లు మెగా వేలం కోసం తమ పేర్లును రిజిస్టర్ చేశారు. కాగా భారత మాజీ పేసర్ శ్రీశాంత్ మరో సారి వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సారి తన బేస్ ప్రైస్ రూ. 50 లక్షలుగా నిర్ణయించాడు. గత ఏడాది వేలంలో రూ. 75 లక్షలుగా తన కనీస ధరగా శ్రీశాంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఐపీఎల్లో శ్రీశాంత్ చివరిసారిగా 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత అతడిపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అతడిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. కాగా గత ఏడాదిలో సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలలో కేరళ తరఫున ఆడాడు. అంతే కాకుండా త్వరలో జరగనున్న కేరళ రంజీ జట్టులో కూడా శ్రీశాంత్ భాగమై ఉన్నాడు. చదవండి: అంతర్జాతీయ క్రికెట్కు స్టార్ ఆల్ రౌండర్ గుడ్బై.. -
‘ఆ రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరగలేదు’
దుబాయ్: సుమారు మూడేళ్ల క్రితం ‘క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్’ పేరుతో ప్రముఖ టీవీ చానల్ ‘అల్ జజీరా’ ప్రసారం చేసిన రెండు డాక్యుమెంటరీలలోని ఆరోపణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొట్టి పారేసింది. ఇందులో పేర్కొన్న అంశాలపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరిపామని, ఎక్కడా తప్పు జరగలేదని స్పష్టం చేసింది. డాక్యుమెంటరీ తొలి భాగంలో రెండు టెస్టు మ్యాచ్లలో స్పాట్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పిన చానల్... రెండో భాగంలో 2011–12 మధ్య కాలంలో 15 మ్యాచ్లలో ఫిక్సింగ్ చోటు చేసుకుందని ఆరోపించింది. 2016లో భారత్, ఇంగ్లండ్ మధ్య చెన్నైలో జరిగిన టెస్టు (ఇందులో భారత్ ఇన్నింగ్స్, 75 పరుగులతో గెలిచింది)...2017లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రాంచీలో జరిగిన టెస్టు (మ్యాచ్ డ్రాగా ముగిసింది)లలో ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు ఫిక్సర్ల సూచనల ప్రకారం బ్యాటింగ్ చేసినట్లు అల్ జజీరా వెల్లడించింది. అయితే సుదీర్ఘ కాలం విచారణ జరిగిన ఐసీసీ వీటన్నింటిని తప్పుగా తేల్చింది. అసలు చానల్ సమర్పించిన ఆధారాలు ఏ రకంగానూ నమ్మశక్యంగా లేవని స్పష్టం చేసింది. ‘చానల్ చూపించిన దృశ్యాలను బట్టి చూస్తే ఏదీ అసహజంగా అనిపించలేదు. ఫిక్సింగ్ను సూచించే విధంగా ఎలాంటి అంశం అందులోనూ కనిపించలేదు. అసలు అందులో చెప్పే విషయాలేవీ నమ్మశక్యంగా లేవు. ఇలాంటి అంశాలపై పట్టు ఉన్న నలుగురు నిపుణులతో మేం నియమించిన కమిటీ అన్ని అంశాలను పరిశీలించి తమ నివేదిక ఇచ్చింది’ అని ఐసీసీ ప్రకటించింది. మొత్తంగా ఈ వివాదంతో సంబంధం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురికి కూడా క్లీన్చిట్ ఇచ్చింది. -
శ్రీశాంత్.. నీ కోసమే వెయిటింగ్
తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్ల పాటు నిషేధానికి గురైన శ్రీశాంత్ తన రీఎంట్రీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్తో శ్రీశాంత్పై నిషేధం ముగియనుండటంతో క్రికెట్ పునరాగమనం కోసం యత్నాలు ఆరంభించాడు. దేశవాళీ సీజన్లో భాగంగా తన రాష్ట్ర రంజీ జట్టు కేరళతో ఆడాలనే యత్నంలో ఉన్నాడు. దీనిపై కేరళ బ్యాట్స్మన్ సచిన్ బేబీ మాట్లాడుతూ. శ్రీశాంత్ కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపాడు. గత ఏడేళ్లుగా శ్రీశాంత్ కేరళ జట్టుకు దూరమైన విషయాన్ని కాస్త బాధగా చెప్పిన సచిన్ బేబీ.. అతను ఎప్పుడూ జట్టుకు సలహాలు ఇస్తూ ఉండేవాడనే విషయాన్ని వెల్లడించాడు. గతంలో ప్రాక్టీస్ సెషన్లో కూడా శ్రీశాంత్ బౌలింగ్ చేసేవాడన్నాడు. (శ్రీశాంత్ మళ్లీ వస్తున్నాడు...) శ్రీశాంత్ పేస్లో స్వింగ్ ఎక్కువగా ఉండటంతో తాను ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడేవాడినని సరదాగా వ్యాఖ్యానించాడు. టెలివిజన్ కామేంటేటర్, ప్రజెంటర్ అరుణ్ వేణుగోపాల్తో ఇన్స్టా లైవ్ సెషన్లో అనేక విషయాలను సచిన్ బేబీ షేర్ చేసుకున్నాడు. ‘ నాకు శ్రీశాంత్ సోదరుడు లాంటివాడు. కేరళ తరఫున మళ్లీ ఆడతాడని ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.మా జట్టులోని ఆటగాళ్లంతా శ్రీశాంత్ రీఎంట్రీ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. మేమిద్దరం గత కొన్నేళ్లుగా కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం. నాకు శ్రీశాంత్ చాలా సాయం చేశాడు. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నాం. శ్రీశాంత్తో ప్రాక్టీస్ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. కేరళ జట్టుకు సలహాలు ఇస్తూ సహకరిస్తున్నాడు. అతను నెట్స్లో బౌలింగ్ అమోఘంగా వేస్తున్నాడు. ఇది వరకు శ్రీశాంత్ బౌలింగ్ ప్రాక్టీస్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇక శ్రీశాంత్ తన ఫిట్నెస్పై శ్రద్ధ చూపించాల్సి ఉంది’ అని కేరళ మాజీ కెప్టెన్ సచిన్ బేబీ తెలిపాడు. భారత్ తరఫున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టి20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్లలో అతను సభ్యుడు కావడం విశేషం. 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. శ్రీశాంత్ దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్కు ఊరట లభించింది. శ్రీశాంత్ను దోషిగానే గుర్తించిన సుప్రీం... జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుతో అతని శిక్షా కాలం పూర్తి కానుంది. (‘చాలాసార్లు చనిపోవాలనుకున్నా’) -
శ్రీశాంత్ మళ్లీ వస్తున్నాడు...
తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి నిషేధానికి గురైన భారత పేస్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ తిరిగి క్రికెట్లోకి అడుగు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. కేరళ రంజీ ట్రోఫీ జట్టులోకి అతడిని ఎంపిక చేయడం దాదాపుగా ఖరారైంది. రంజీ కోసం ఎంపిక చేసే ప్రాబబుల్స్లో 37 ఏళ్ల శ్రీశాంత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు జట్టు కోచ్ టిను యోహానన్ వెల్లడించాడు. దాంతో అతని పునరాగమనం లాంఛనమే కానుంది. ‘కేరళ తరఫున శ్రీశాంత్ మళ్లీ ఆడాలని మేం కోరుకుంటున్నాం. ఈ ఏడాది రంజీ ట్రోఫీ కోసం అతని పేరును కూడా పరిగణలోకి తీసుకుంటాం. కేరళలో కూడా ప్రతీ ఒక్కరు అదే కోరుకుంటున్నారు. ఇదంతా అతని ఫిజికల్ ఫిట్నెస్, బౌలింగ్ సత్తాను బట్టి ఉంటుంది. జట్టు నిర్దేశించిన ప్రమాణాలను శ్రీశాంత్ అందుకోవాల్సి ఉంటుంది’ అని యోహానన్ చెప్పాడు. కోవిడ్–19 కారణంగా ఎప్పటినుంచి క్రికెట్ మళ్లీ మొదలవుతుందో, రంజీ మ్యాచ్లు ఎప్పటినుంచో జరుగుతాయో ఎవరికీ తెలీదని... అయితే సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం శ్రీశాంత్కు ఉంది కాబట్టి అతను తన ఆటపై దృష్టి పెట్టవచ్చని టిను సూచించాడు. నేపథ్యమిదీ... భారత్ తరఫున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టి20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్లలో అతను సభ్యుడు కావడం విశేషం. 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. శ్రీశాంత్ దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్కు ఊరట లభించింది. శ్రీశాంత్ను దోషిగానే గుర్తించిన సుప్రీం... జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుతో అతని శిక్షా కాలం పూర్తి కానుంది. మరో సారి క్రికెట్ ఆడేందుకు తాను కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానన్న శ్రీశాంత్... కష్టకాలంలో తనకు అండగా నిలిచిన సన్నిహితులు, కేరళ క్రికెట్ సంఘానికి కృతజ్ఞతలు తెలిపాడు. -
‘నేనే చివరి ఫిక్సర్ను కాదు కదా’
కరాచీ: ఎంతో మంది తప్పులు చేస్తూ ఉంటారని అందులో తాను ఒకడినని అంటున్నాడు పాకిస్తాన వెటరన్ పేసర్ మహ్మద్ అసిఫ్. 2010లో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడి ఆపై ఏడేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న అసిఫ్.. మళ్లీ పాకిస్తాన్ జట్టులో కనిపించలేదు. అప్పట్లో అసిఫ్పై ఉన్న నిషేధాన్ని ఐదేళ్లకు తగ్గించినా ఆ తర్వాత అతనికి పాక్ జట్టులో పునరాగమనం చేసే అవకాశం రాలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ఫిక్సింగ్కు పాల్పడిన క్రికెటర్లలో కొంతమందికి తిరిగి జాతీయ జట్టులో ఆడే అవకాశం ఇచ్చినా తనకు మాత్రం రెండో చాన్స్ ఇవ్వలేదని అంటున్నాడు అసిఫ్. తన సహచర బౌలర్, మహ్మద్ అమిర్ కూడా ఫిక్సింగ్లో ఇరుక్కొన్నప్పటికీ మళ్లీ రీఎంట్రీ చేయడాన్ని అసిఫ్ పరోక్షంగా ప్రస్తావించాడు. (‘నో డౌట్.. ఆ సామర్థ్యం కోహ్లిలో ఉంది’) ‘నా కంటే ముందు ఫిక్సింగ్ చేసిన వాళ్లు కావొచ్చు.. నాతో పాటు ఫిక్సింగ్ చేసిన వారు కావొచ్చు. నా తర్వాత ఫిక్సింగ్స్ చేసిన వాళ్లు కావొచ్చు.. ఎవరికైనా రెండో అవకాశం అనేది ఉంటుంది. ప్రతీ ఒక్కరిలాగా నేను కూడా తప్పు చేశా. ఇక్కడ ఫిక్సింగ్ చేసిన వేరే వాళ్లకి ఆడే అవకాశం ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదు. ఒక్కొక్కరికీ ఒక్కో తీరుగా ఉంటుందా పీసీబీ విధానం. ఫిక్సింగ్కు పాల్పడిన కొంతమంది క్రికెటర్లను పీసీబీ కాపాడింది. పీసీబీ మనుషులు కాబట్టి వారిని రక్షించుకుంది. నన్ను ఏ విషయంలోనూ పట్టించుకోలేదు.పాకిస్తాన్ క్రికెట్లో నేనే చివరి ఫిక్సర్ను అన్నట్లు ట్రీట్ చేస్తున్నారు. నా తర్వాత కూడా చాలా మంది ఫిక్సింగ్ చేశారు. వారికి కూడా పీసీబీ అవకాశం ఇచ్చింది. కొంతమంది ఏకంగా పీసీబీలోనే ఉన్నారు’ అంటూ అసిఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడితో తన ప్రపంచం ఏమీ అయిపోలేదని, జరిగిపోయిందేదో జరిగిందని, ఇక జరగాల్సింది మాత్రమే ఉందన్నాడు. తన కెరీర్లో చాలా క్రికెట్ను ఆడేశానని అసిఫ్ పేర్కొన్నాడు. తాను క్రికెట్ ఆడే సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు లభించిందన్నాడు. తానెప్పుడు స్వార్థ పరుడిలా ఉండేవాడినని చాలా మంది అంటారనీ, అది వికెట్లు తీసి జట్టును గెలిపించాలనే స్వార్థం మాత్రమేనన్నాడు. జట్టు విజయం కోసం ఎప్పుడూ శ్రమించేవాడినని, ఒకవేళ అదే స్వార్థమైతే తాను ఏమీ చేయలేనని అసిఫ్ పేర్కొన్నాడు.(కెప్టెన్సీపై తిరుగుబాటు చేశారు..) -
మాజీ క్రికెటర్కు ఐదేళ్ల జైలు శిక్ష
కేప్టౌన్: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గులామ్ బోడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. దాదాపు నాలుగేళ్ల క్రితం ఒక దేశవాళీ మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని అభియోగాలు ఎట్టకేలకు రుజువు కావడంతో అతనికి జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కింద జైలు శిక్ష అనుభవించబోతున్న తొలి దక్షిణాఫ్రికా క్రికెటర్గా బోడి నిలిచాడు. 2015లో రామ్స్లామ్ టీ20 దేశవాళీ టోర్నమెంట్లో బోడి ఫిక్సింగ్కు పాల్పడ్డాడు.ఫలితంగా సఫారీ క్రికెట్ బోర్డు అతనిపై 20 ఏళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా తరఫున రెండు వన్డేలు ఆడిన బోడి.. క్రికెటర్గా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కామెంటేటర్ అవతారం ఎత్తాడు. ఆ క్రమంలోనే జట్టులోని ఆటగాళ్లకు డబ్బులు ఆఫర్ చేశాడు. అల్వీరో పీటర్సన్ అనే క్రికెటర్కు ఫిక్సింగ్ చేయమని నగదు ఆశ చూపాడు. అతను కాస్తా విషయం బయటపెట్టడంతో బోడిపై విచారణ చేపట్టారు. దాంతో అతనిపై రెండు దశాబ్దాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, 2018 నవంబర్ నెలలో పోలీసులకు బోడి పోలీసులకు లొంగిపోగా, తాజాగా అతనికి ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. బోడికి జైలు శిక్షను ఖరారు చేయడంతో అల్వీరో పీటర్సన్ ట్వీటర్ వేదికగా స్పందించాడు. క్రికెట్కు మంచి రోజులు వచ్చాయంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. గతంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రోనేపై కూడా ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అయితే అతనిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేసు విచారణ దశలో ఉండగానే క్రానే విమాన ప్రమాదంలో మృతిచెందాడు. -
‘వంద కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’
న్యూఢిల్లీ: గత నెలలో భారత పేసర్ శ్రీశాంత్పై ఉన్న నిషేధాన్ని తగ్గిస్తూ బీసీసీఐ అంబుడ్స్మన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అతనిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ అంబుడ్స్మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇప్పటికే ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్.. వచ్చే ఏడాది ఆగస్టు నెలతో నిషేధాన్ని పూర్తి చేసుకోనున్నాడు. అయితే తాజాగా శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణల్ని మరోసారి ఖండించాడు. ఈ క్రమంలోనే ఉద్వేగానికి లోనయ్యాడు. ‘ నా పిల్లలు మీద, మా నాన్నపై ఒట్టేసి చెబుతున్నా. నేను ఎటువంటి ఫిక్సింగ్కు పాల్పడలేదు. నాకు ఎప్పుడూ ఆ ఆలోచన రాలేదు. రాబోదు. ఇప్పుడు మా నాన్న మంచాన పడ్డాడు. గత ఐదున్నరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మా అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు. వారిద్దరూ కనీసం నా మ్యాచ్ను చూసే స్థితిలో కూడా లేరు. నేను ఎప్పుడూ స్పాట్ ఫిక్సింగ్ అనేది చేయలేదు. రూ. 100 కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మన దేశంలో చాలా లీగ్లు ఉన్నాయని, తన కుటుంబాన్ని చూసుకోవాలంటే క్రికెట్లో పునరాగమనం చేయాల్సి ఉందన్నాడు. -
స్పాట్ ఫిక్సింగ్ సమాచారం ముందే తెలుసు
న్యూఢిల్లీ: మొన్న అసలు వయసు దాచిన విషయం... నిన్న గంభీర్పై వాఖ్యలు... తాజాగా స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం! పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఆత్మకథ ‘గేమ్ చేంజర్’లో రోజుకో వివాదాస్పద అంశం బయటకు వస్తోంది. 2010 ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ‘స్పాట్ ఫిక్సింగ్’కు పాల్పడి అప్పటి పాక్ కెప్టెన్ సల్మాన్ భట్, ఆసిఫ్, ఆమిర్లు ఐసీసీ నిషేధానికి గురయ్యారు. అయితే ఈ స్పాట్ ఫిక్సింగ్కు సంబంధించి తనకు ముందే సమాచారం అందిందని ఆఫ్రిది తన పుస్తకంలో చెప్పుకొచ్చాడు. అదెలాగో అతడి మాటల్లోనే... ‘2010 ఆసియా కప్ సందర్భంగా శ్రీలంకలో ఉండగా... బుకీ మజహర్ మాజిద్, భట్ మధ్య సంభాషణ తాలూకు సందేశాలు నాకు అందాయి. మాజిద్ కుటుంబంతో పాటు శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు అతడి చిన్న కుమారుడు ఫోన్ను నీళ్లలో పడేశాడు. తర్వాత మరమ్మతు కోసం దానిని మాజిద్ లండన్లోని ఓ దుకాణంలో ఇచ్చాడు. ఆ దుకాణదారు నా స్నేహితుడికి స్నేహితుడు. రిపేర్ చేస్తుండగా అతడు ఫిక్సింగ్కు సంబంధించిన సందేశాలు చూశాడు. వాటి గురించి నా స్నేహితుడు, మరికొందరికి చెప్పాడు. దీంతో విషయం బయటకు పొక్కింది. అప్పుడే నేను వాటిని కోచ్ వకార్కు చూపెట్టాను. అతడు దానిని ముందుకు తీసుకెళ్లలేదు. మేమిద్దరం ఏదో జరుగుతుందని భావించాం కానీ, అది ఇంత తీవ్రమైనదని అనుకోలేదు. ఆ వెంటనే జరిగిన ఇంగ్లండ్ పర్యటనలో మాజిద్ అతడి బృందం మా ఆటగాళ్లతో సన్నిహితంగా ఉండటాన్ని చూశా. దీంతో పరిస్థితిని జట్టు మేనేజర్ యావర్ సయీద్కు వివరించా. మాజిద్ను దూరం పెట్టాలని ఆటగాళ్లకు చెప్పమని కోరా. మొదట ఆయనా నమ్మలేదు. నేను మెసేజ్లను ప్రింట్ తీసుకెళ్లి చూపడంతో ‘ఇప్పుడేం చేద్దాం’ అంటూ తాపీగా అడిగారు. కానీ, అప్పటికే అందరికీ తెలిసిపోయింది’ అని వివరించాడు. -
శ్రీశాంత్కు ఊరట
న్యూఢిల్లీ: ఐపీఎల్–2013లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న భారత మాజీ పేసర్ శాంతకుమారన్ శ్రీశాంత్కు సుప్రీం కోర్టులో కొంత ఊరట లభించింది. తనపై బీసీసీఐ క్రమశిక్షణా కమిటీ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అతను వేసిన పిటిష¯Œ పై సుప్రీం తీర్పునిచ్చింది. శ్రీశాంత్పై విధించిన జీవిత కాల నిషేధాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన ద్విసభ్య బెంచీ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా శ్రీశాంత్ శిక్షా కాలాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని కూడా బీసీసీఐకి నిర్దేశించింది. అయితే శిక్షా కాలం తగ్గించమని మాత్రమే ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం ఇతర అంశాల జోలికి వెళ్లలేదు. స్పాట్ ఫిక్సింగ్కు సంబంధించి శ్రీశాంత్పై ఢిల్లీ హైకోర్టులో నమోదైన క్రిమినల్ అభియోగాల విచారణపై తమ తీర్పు ప్రభావం ఉండదని కూడా స్పష్టం చేసింది. అంటే అతడిని పూర్తిగా నిర్దోషిగా ప్రకటించలేదని అర్థమవుతోంది. అయితే తాజా తీర్పు పట్ల కేరళ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు టీసీ మాథ్యూ సంతోషం వ్యక్తం చేశారు. నిషేధం కారణంగా శ్రీశాంత్ ఆరేళ్లు కోల్పోయాడని, దానిని తొలగిస్తే అతను ఇప్పటికి ప్పుడు క్రికెట్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నా... క్రికెట్కు సంబంధించి ఏదో ఒక రంగంలో మళ్లీ కెరీర్ను వెతుక్కోగలడని ఆయన అన్నారు. పరిశీలిస్తాం: సీఓఏ శ్రీశాంత్ నిషేధం విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై తాము వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ అన్నారు. త్వరలో జరిగే సీఓఏ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని ఆయన వెల్లడించారు. క్రికెట్నే జీవితంగా భావించిన నేను ఇన్నేళ్లుగా ఆటకు దూరమయ్యాను. సుప్రీం తీర్పును గౌరవించి బీసీసీఐ మళ్లీ ఆడే అవకాశం నాకు ఇస్తుందని ఆశిస్తున్నా. మైదానంలో నీకు అనుమతి లేదంటూ ఎవరైనా అడ్డుకోకుండా ఇప్పటికైనా నేను ప్రాక్టీస్ చేయగలిగితే చాలు. కష్టకాలంలో హర్భజన్, సెహ్వాగ్, రైనా తదితరులు కూడా నాకు అండగానిలిచారు. నా జీవితంలో ఎంతో కొంత మిగిలి ఉన్న ఆటను ఆడాలనుకుంటున్నా. అయినా 42 ఏళ్ల వయసులో లియాండర్ పేస్ గ్రాండ్స్లామ్ సాధించగా లేనిది నేను క్రికెట్ ఆడలేనా. – శ్రీశాంత్ -
ఆసియాకప్లో ఫిక్సింగ్ కలకలం!
దుబాయ్: ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియాకప్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం రేగింది. అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ మొహ్మద్ షహ్జాద్ను స్పాట్ ఫిక్సింగ్ చేయమని కొంతమంది బుకీలు కలిశారు. ఈ విషయాన్ని షహజాద్.. టీమ్ మేనేజ్మెంట్కు తెలపడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) యాంటీ కరెప్షన్ యూనిట్ రంగంలోకి దిగింది. వచ్చే నెల్లో షార్జాలో జరుగనున్న అఫ్గాన్ ప్రీమియర్ లీగ్లో ఫిక్సింగ్ చేయాలంటూ తనను కొంతమంది కలిసినట్లు షహ్జాద్ తెలిపాడు. దీనిపై అలెక్స్ మార్షల్ నేతృత్వంలోని ఐసీసీ యాంటీ కరెప్షన్ యూనిట్ దర్యాప్తు చేపట్టింది. ‘షహజాద్ను ఫిక్పింగ్కు పాల్పడమని కొంతమంది కలిసిన ఘటన వెలుగు చూసింది. అది అఫ్గాన్ టీ20 లీగ్లో ఫిక్సింగ్ చేయాలంటూ బుకీలు ప్రేరేపించారు. కాగా, దీన్ని టీమ్ మేనేజ్మెంట్ ద్వారా మా దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు చేపట్టాం. గత 12 నెలల్లో ఐదుగురు అంతర్జాతీయ స్థాయి కెప్టెన్లను బుకీలు కలిశారు. ఇందులో పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన నాలుగు దేశాలకు చెందిన కెప్టెన్లు ఉన్నారు. గతేడాది నుంచి 32 మంది ఆటగాళ్లను స్పాట్ ఫిక్సింగ్ కేసులో విచారించాం. అందులో ఎనిమిది మందిపై వేటు పడింది’ అని మార్షల్ తెలిపారు. -
క్రికెట్లో కలకలం.. యాషెస్పై ఫిక్సింగ్ ఆరోపణలు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగే యాషెస్ సిరీస్పై ఐసీసీ పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు ది సన్ అనే అంతర్జాతీయ వార్త పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గత డిసెంబర్లో పెర్త్లో జరిగిన మూడో టెస్టులో ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేసింది. సెషన్కు రూ.60 లక్షలు, రెండు సెషన్లకు 120 లక్షల చొప్పున బుకీలు బేరాలు ఆడినట్లు తెలిపింది. దీనిపై అన్ని ఆధారాలు ఐసీసీ వద్ద ఉన్నాయని 'ది సన్' ప్రచురించింది. అంతేకాదు దీనిపై ఐసీసీ రహస్య విచారణకు ఆదేశించినట్లు పేర్కొంది. భారత్కు చెందిన బుకీ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించింది. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఐసీసీ స్పందించింది. విచారణలో ఇరు జట్ల ఆటగాళ్లు, స్టాఫ్ ఎటువంటి అక్రమాలకు, అవకతవకలకు పాల్పడలేదని తెలిపింది. ఐసీసీ అవినీతి నిరోధక శాఖ జనరల్ మేనేజర్ అలెక్స్ మెర్షల్ మాట్లాడుతూ యాషెస్ ఫిక్సింగ్పై వచ్చిన ఆరోపణలపై విసృతస్థాయిలో విచారణ జరిపామని తెలియచేశారు. ఫిక్సింగ్కు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆటగాళ్లు, జట్టు సభ్యులు, కోచ్, సహాయకులు ఇలా ప్రతిఒక్కరిని వ్యక్తిగతంగా విచారించామని, ఏ ఒక్కరు బుకీలతో ఫిక్సింగ్కు పాల్పడినట్లు నిరూపితం కాలేదని మెర్షల్ పేర్కొన్నారు. ఇక బుకీ తెలిపిన వివరాల ప్రకారం గతంలో భారత్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లను, ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ టీ20 లీగ్ల్లోను ఫిక్సింగ్ చేసినట్లు ది సన్ ప్రచురించింది. సదరు పత్రిక జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్లో మ్యాచ్ బుకీ తెలుపినట్లు పేర్కొంది. ఒక ప్రపంచకప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్తోపాటు, పలు అవినీతి నిరోధక శాఖలతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు మరో బుకీ తెలిపాడని ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టులో 'ది సైలెంట్ మ్యాన్'గా పేరొందిన ఆటగాడు ఈఫిక్సింగ్కు చేసినట్లు తమ స్ట్రింగ్ ఆపరేషన్లో వెల్లడైందని 'ది సన్' ఆరోపించింది. -
కీలక ప్రకటన చేసిన ఐసీసీ
సాక్షి, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించటంతో క్రీడా లోకం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీనిపై తక్షణ విచారణ చేపట్టిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. స్పాట్ ఫిక్సింగ్ జరిగిందనటానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఐసీసీ యాంటీ కరప్షన్ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ దీనిపై స్పందిస్తూ... ఫిక్సింగ్ ఆరోపణలను చాలా తీవ్రంగా పరిగణించాం. మా బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. అయితే ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేవలం ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగానే ఈ విచారణ చేపట్టాం. ఈ ఫిక్సింగ్ ఆరోపణలు టీ20 టోర్నీలతో పాటు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లపై ప్రభావం చూపుతాయి. మా విచారణలో అన్ని అంశాలను పరిగణనలోకి దీనిపై విచారణ చేస్తున్నాం అని ఆయన వివరించారు. కాగా, యాషెస్ సిరీస్ సందర్భంగా పెర్త్ లో వాకా మైదానం వేదికగా గురువారం నుంచి జరగబోయే మూడో టెస్ట్ స్పాట్ ఫిక్సింగ్ అయినట్లు ఆరోపణలు వినిపించాయి. భారత్ కు చెందిన ఇద్దరు బుకీలు ఈ స్కాంలో ఉన్నట్లు బ్రిటీష్ పత్రిక ది సన్ ఆరోపణలు గుప్పించింది. అయితే ఇరు జట్లకు చెందిన సభ్యుల పేర్లు ఆ కథనంలో ప్రస్తావించపోగా.. ఆస్ట్రేలియాకు చెందిన బుకీ గ్రూప్ ‘ది సైలెంట్ మాన్’ భారీ మొత్తానికి ఈ మ్యాచ్ను ప్రభావితం చేసేందుకు ప్రణాళిక పన్నిందని ఆ కథనం వివరిచింది. ప్రస్తుతం ఈ సిరీస్లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంతో సిరీస్లో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
మరో క్రికెటర్పై ఏడాది నిషేధం
కరాచీ: తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో భాగంగా విచారణకు సహకరించనందుకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ నాసిర్ జంషెడ్పై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్ణయం తీసుకుంది. దాంతో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) వంటి తదితర టోర్నీలకు జంషెడ్ను ఏడాది పాటు బహిస్కరిస్తున్నట్లు పేర్కొంది. గతేడాది ఒక టీ 20 టోర్నమెంట్లో జంషెడ్ స్పాట్ ఫిక్సింగ్లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నేతృత్వంలోని యాంటీ కరెప్షన్ యూనిట్(ఏసీయూ) విచారణ చేపట్టడానికి సిద్దమవ్వగా, అందుకు జంషెడ్ సహకరించలేదు. దాంతో అతనిపై ఏడాది నిషేధం విధిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. అంతకుముందు పలువురు పాక్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్లో ఇరుక్కుని నిషేధం ఎదుర్కొంటున్నారు. అందులో బ్యాట్స్మెన్ షార్జిల్ ఖాన్, ఖలిద్ లతీఫ్లపై ఐదేళ్ల పాటు నిషేధం విధించగా, పేసర్ మొహ్మద్ ఇర్ఫాన్, ఆల్ రౌండర్ మొహ్మద్ నవాజ్లపై 12నెలల నిషేధం పడింది. -
‘ఫిక్సర్’ సోట్సోబ్పై ఎనిమిదేళ్ల నిషేధం
కేప్టౌన్: స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినందుకు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ లోన్వాబో సోట్సోబ్పై ఆ దేశ బోర్డు ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. 2015లో దక్షిణాఫ్రికా దేశవాళీ టి20 టోర్నీ రామ్స్లామ్లో అతను ఫిక్సింగ్కు పాల్పడ్డాడు. ఈ వివాదంలో నిషేధం ఎదుర్కొంటున్న ఏడో ఆటగాడు సోట్సోబ్. దక్షిణాఫ్రికా తరఫున అతను 5 టెస్టులు, 61 వన్డేలు, 23 టి20లు ఆడాడు. రెండేళ్ల క్రితం ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సమయంలో ఫిక్సింగ్ వైపు మొగ్గు చూపినట్లు అంగీకరించిన సోట్సోబ్, అభిమానులను క్షమించమని కోరాడు. -
బుకీలు కలిస్తే ఆ పని చేసేవాడ్ని: సెహ్వాగ్
ముంబయి: క్రికెట్లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ లాంటి అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండేందుకు ఆటగాళ్లు ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సిందేనని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. బుధవారం కాన్పూర్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ముగ్గురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ డాషింగ్ ఓపెనర్ ఈ విధంగా స్పదించారు. 'బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఇలాంటి వ్యవహారాలను ఎవరూ ఆపలేరు. తాను ఎవరిని కలుసుకుంటున్నాం అనేది ప్రతి ఆటగాడికి తెలిసుండాలి. తన మనస్సాక్షి స్పష్టంగా ఉన్నప్పుడే ఆటను కూడా క్లీన్గా ఉంచగలరు. ఎంత భద్రత ఉన్నా ఓ ఆటగాడు ఫిక్సింగ్కు పాల్పడాలనుకుంటే ఎవరూ ఆపలేరు. తనను ఎవరూ తప్పుపట్టకూడదనే విచక్షణ ఎవరికి వారు కలిగి ఉంటేనే ఈ మార్పు సాధ్యం. ఒకవేళ నేను క్రికెట్ ఆడే రోజుల్లో ఎవరైనా నాపై బెట్టింగ్ ఆరోపణలు లేవనెత్తినట్లయితే మరో ఆలోచన లేకుండా రిటైర్మెంట్ ప్రకటించేవాడిని. దాంతో పాటు నేను సాధించిన రికార్డులను తొలగించేయాలని విజ్ఞప్తి చేసేవాడిని. ముఖ్యంగా ఫిక్సింగ్ మహమ్మారి పారిపోవాలంటే ఆటగాళ్లు వంద శాతం నిజాయితీగా ఉండటమే దానికి విరుగుడు' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం గుజరాత్, ఢిల్లీ ఆటగాళ్లు ఫిక్సింగ్కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. -
స్పాట్ ఫిక్సింగ్: అడ్డంగా దొరికిపోయారు
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై తాజాగా మరో క్రికెటర్ విచారణ ఎదుర్కోనున్నాడు. గత ఫిబ్రవరిలో జరిగిన పాకిస్తాన్ సూపర్లీగ్లో నలుగురు క్రికెటర్లలు స్పాట్ఫిక్సింగ్లో దొరికిపోయారు. ఖలీద్ లతీఫ్, షర్జీల్ ఖాన్, పేసర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు మరో బ్యాట్స్మన్ షహజైబ్ హసన్పై ఆరోపణలు రావడంతో పీసీబీ అవినీతి వ్యతిరేక కోడ్ కింద అభియోగం నమోదైంది. 2009లో టీ20 ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో షహజైబ్ సభ్యుడిగా ఉన్నాడు. షహజైబ్ హసన్కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను మే 4 వరకు అందించాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను అవినీతి వ్యతిరేక ట్రైబ్యునల్ ఆదేశించింది. -
'ఐపీఎల్.. ప్రతి సీజన్లోనూ సమస్యలు'
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రతి ఏడాది ఫ్రాంచైజీలకు ఏదో రకంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని బాలీవుడ్ నటి , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతీ జింటా వ్యాఖ్యానించారు. ప్రతి సీజన్లో ఆటగాళ్లపై, ఫ్రాంచైజీలపై వదంతులు వ్యాపిస్తున్నాయని అవి తమ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర నుంచి మ్యాచ్ వేదికల తరలింపు అంశంపై ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఐపీఎల్ లో ప్రతి సీజన్ సమస్యలమయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐపీఎల్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని కానీ లీగ్ నిర్వహణ సమస్యలతో తమ ఫ్రాంచైజీకి కలిసిరావడం లేదన్నారు. 2013 లో చూసినట్టయితే స్పాట్ ఫిక్సింగ్ కలకలం సృష్టించింది. అందులో ఆరోపణలు ఎదుర్కొన్న టీమిండియా ఆటగాడు శ్రీశాంత్ ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని ప్రీతీ జింటా ప్రస్తావించారు. 2014 సీజన్ విషయానికొస్తే.. దేశంలో సార్వత్రిక ఎన్నికల దృష్టా ఐపీఎల్-7 తొలి అర్థభాగంలో మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 2015 సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను రెండేళ్లపాటు నిషేధించారు.గత సీజన్లో తమ బౌలింగ్ బలహీనంగా ఉందని, ప్రస్తుతం ఆ లోపాలను సరిచేసుకున్నామని ప్రీతీ జింటా పేర్కొన్నారు. -
ఆ ఇద్దరి పైనే ఎందుకంత వివక్ష?
కరాచీ: జట్టు నుంచి కొన్నేళ్లపాటు ఉద్వాసనకు గురై పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ చోటు సంపాదించిన మహమ్మద్ ఆమీర్ తరహాలోనే మరో ఇద్దరికి రెండో అవకాశం కల్పించాలని ఆ జట్టు కోచ్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు. ఆమీర్కు ఇచ్చినట్లుగానే స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి నిషేధానికి గురైన బాట్స్మన్ సల్మాన్ బట్, బౌలర్ మహమ్మద్ ఆసిఫ్లకు జట్టులో చోటు కల్పించాలన్నాడు. ఐదేళ్ల నిషేధం తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే బట్ సెంచరీ చేశాడని, ఆసిఫ్ రెండు వికెట్లు తీశాడని.. అయినప్పటికీ ఆ ఇద్దరిపైనే ఎందుకంత వివక్ష అని వ్యాఖ్యానించాడు. దేశవాలీ క్రికెట్లో బట్, ఆసిఫ్ రాణిస్తున్నారని, వారు ఫిట్నెస్ మెరుగ్గానే ఉందని యూనిస్ పేర్కొన్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఒకే రకమైన తప్పు చేసి, ఒకే రకమైన శిక్షకు గురయ్యారు. అటువంటిది, ఇప్పుడు ఒకరికి అవకాశం కల్పించి మిగతా ఇద్దరిని జట్టులోకి తీసుకోకపోవడం భావ్యం కాదన్నాడు. బట్, ఆమీర్, ఆసిఫ్ లను ఒకే విధంగా ట్రీట్ చేయాలని గత కొన్ని రోజుల నుంచి పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్, పాక్ టీ20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిలకు వకార్ యూనిస్ సూచించాడు. ఆమీర్ విషయం, బట్, ఆసిఫ్ వ్యవహారాన్ని ఓకే తీరున చూడలేమని షాహిద్ ఇటీవలే ప్రకటించాడు. కానీ, ఆఫ్రిది ఏం ఆలోచిస్తున్నాడో తనకు అర్ధం కావడం లేదన్నాడు. బట్, ఆసిఫ్ లను జట్టులోకి ఎందుకు తీసుకోరని యూనిస్ ప్రశ్నించాడు. వారు తప్పుచేసినందుకు ఐదేళ్ల పాటు క్రికెట్ ఆటకు దూరం చేసి శిక్షించారు. ఇప్పుడు వారిని జట్టులోకి తీసుకోవాలని, వారికి స్థానం కల్పిస్తే పాక్ టీమ్కు మంచి జరుగుతందని యూనిస్ పేర్కొన్నాడు. -
ఆఫ్రిదికి క్షమాపణలు చెప్పిన సల్మాన్!
కరాచీ: గతంలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఐదేళ్లు నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్ సల్మాన్ భట్ తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అసలు ఆ సమయంలో ఫిక్సింగ్ అంశానికి దూరంగా ఉండాల్సిందంటూ తన సహచరుడు షాహిద్ ఆఫ్రిది ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం సాయంత్రం ఆఫ్రిదిని వ్యక్తిగతంగా కలిసిన సల్మాన్ భట్ తనను క్షమించాల్సిందిగా వేడుకున్నాడు. 2010 వ సంవత్సరంలో ఇంగ్గండ్ తో టెస్టు సిరీస్ లో భాగంగా ఫిక్సింగ్ ఆరోపణలు వెలుగు చూశాయి. దీనికి అప్పటి టెస్టు కెప్టెన్ సల్మాన్ భట్ తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు ఫిక్సింగ్ పాల్పడిట్లు ఆరోపణలు రావడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే సల్మాన్ భట్ పై ఐసీసీ విధించిన ఐదు సంవత్సరాల సస్పెన్షన్ వేటు సెప్టెంబర్ 1 వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో జరిగే దేశవాళీ మ్యాచ్ లకు సల్మాన్ భట్ కు పీసీబీ అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా ప్రస్తుత ట్వంటీ 20 కెప్టెన్ ఆఫ్రిదిని సల్మాన్ భట్ కలిశాడు. 'కనీసం ఆ సమయంలో నీ సలహా అయిన తీసుకోవాల్సింది. ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్ ఉదంతం వెలుగు చూసింది. అందుకు నన్ను క్షమించండి' అంటూ ఆఫ్రిదిని భట్ కోరాడు. దీనిపై ఆఫ్రిది స్పందిస్తూ గతంలో జరిగిపోయిన దాన్ని వదిలి పెట్టి క్రికెట్ పై దృష్టిపెట్టాలని సూచించాడు. -
ముద్గల్ కమిటీ నివేదికపై నేడు విచారణ
న్యూఢిల్లీ : స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్పై 13 మంది క్రికెటర్ల పేర్లతో కూడిన ముకుల్ ముద్గల్ నివేదికను.. తదుపరి విచారణ కోసం జస్టిస్ లోధా కమిటీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. బీహార్ క్రికెట్ సంఘం (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మ సోమవారం ఈ పిటిషన్ను దాఖలు చేశారు. జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ నేటి (శుక్రవారం) మధ్యాహ్నం అత్యవసర విచారణ జరుపుతుంది. గత నవంబర్లో ముద్గల్ కమిటీ ఇచ్చిన మూడో నివేదికలో ఉన్న పలువురి క్రికెటర్ల పేర్లు ఇప్పటిదాకా బహిర్గతం కాలేదు. ఈ రిపోర్ట్ను లోధా కమిటీకి ఇవ్వలేదని వర్మ తెలిపారు. దీని కారణంగా ముద్గల్ కమిటీ తీసుకున్న సమయం, చేసిన పరిశోధన వృథా అయ్యిందని అన్నారు. ఆటగాళ్ల పేర్లను వెల్లడించకూడదని అప్పట్లో బీసీసీఐ కోర్టును కోరింది. -
యువ ఆటగాళ్లపై ప్రభావం పడుతుంది: ద్రవిడ్
చెన్నై: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో ఐపీఎల్ నుంచి చెన్నై, రాజస్తాన్ జట్లను రెండేళ్ల పాటు నిషేధించిన జస్టిస్ లోధా కమిటీ తీర్పును గౌరవిస్తున్నానని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. అయితే ఆయా జట్లలోని యువ ఆటగాళ్లపై ఇది ప్రభావం చూపుతుందని అన్నాడు. ‘ఎవరో ఒకరిద్దరు చేసిన అవినీతి చాలా మందిపై ప్రభావం చూపడం నిజంగా శోచనీయం. రెండు జట్లు నిషేధానికి గురవ్వడంతో యువ ఆటగాళ్లు ఇబ్బంది ఎదుర్కొంటారు. మా జట్టులోని టాప్ ఆటగాళ్లకు ఇతర జట్లలో చోటు లభించడం పెద్ద సమస్య కాదు. కానీ యువ ఆటగాళ్ల పరిస్థితి ఏమిటి?’ అని రాజస్తాన్ రాయల్స్ మెంటార్ ద్రవిడ్ ప్రశ్నించాడు. -
మహిళా క్రికెటర్లకూ గ్రేడింగ్!
ముంబై : భారత మహిళా క్రికెటర్లకు కూడా గ్రేడింగ్ విధానంలో ఏడాదికి నిర్ణీత మొత్తం చెల్లించాలని బీసీసీఐ భావిస్తోంది. బోర్డు ఫైనాన్స్ కమిటీ తాజాగా దీనిని ప్రతిపాదించింది. ఇది అమలైతే మిథాలీరాజ్, జులన్ గోస్వామివంటి సీనియర్ క్రికెటర్లకు ఎక్కువ ప్రయోజనం కలుగనుంది. మరో వైపు బీసీసీఐ గత రెండేళ్లలో లీగల్ వ్యవహారాలు, కోర్టు కేసుల నిమిత్తం రూ. 56 కోట్లు ఖర్చు చేయడం విశేషం. స్పాట్ ఫిక్సింగ్ను విచారించిన ముద్గల్ కమిటీకి రూ. 1.5 కోట్లు, సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీకి బోర్డు రూ. 3.90 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. వాస్తవానికి రాష్ట్ర సంఘాలకు ఇస్తున్న మౌలిక సౌకర్యాల మొత్తాన్ని ఈ ఏడాది రూ. 75 కోట్లకు పెంచాలని భావించినా... భారీ మొత్తంలో లీగల్ ఖర్చులు ఉండటంతో దానిని రూ. 50 కోట్లకే సరిపెట్టాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. -
స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణాధికారిగా వివేక్
సుప్రీంకోర్టు నియామకం న్యూఢిల్లీ: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసును విచారించేందుకు సీబీఐ అధికారి వివేక్ ప్రియదర్శిని సుప్రీంకోర్టు కొత్తగా నియమించింది. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక సెల్లో సూపరిండెంట్గా పని చేస్తున్నారు. ఇంతకుముందు విచారణాధికారిగా ఉన్న బీబీ మిశ్రా రిటైర్ కావడంతో ఆయన స్థానంలో వివేక్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల స్కామ్ కేసును వివేక్ సమర్థంగా నిర్వహించడంతో జస్టిస్ ఆర్.ఎమ్. లోథా కమిటీ కోరిక మేరకు సుప్రీం కోర్టు ఈ నియామకాన్ని చేపట్టింది. స్పాట్ ఫిక్సింగ్లో ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్ పాత్రపై వివేక్ విచారణ జరపనున్నారు. ఈ విచారణ కోసం సరైన టీమ్ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ సీబీఐ అధికారికి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే బీబీ మిశ్రా టీమ్కు ఉన్న అధికారాలన్ని వివేక్ బృందానికి ఉంటాయని స్పష్టం చేసింది. విచారణ చేయడం, సోదాలు నిర్వహించడం, అవసరమైన డాక్యుమెంట్లను సీజ్ చేయడం కూడా ఈ టీమ్ చేయొచ్చని తెలిపింది. ఈ మొత్తం టాస్క్లో వివేక్ టీమ్ సేవలు లోథా కమిటీకి కూడా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్కు శిక్ష ఖరారు చేయడం కోసం సుప్రీంకోర్టు...జస్టిస్ లోథా అధ్యక్షతన జస్టిస్ అశోక్ భాను, ఆర్.వి. రాఘవేంద్రలతో కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. -
ఆ నివేదికపై మాట్లాడేంత తెలివైన వాడిని కాను: సచిన్
న్యూఢిల్లీ: 2013 ఐపీఎల్ టోర్నీలో స్పాట్ ఫిక్సింగ్ , బెట్టింగ్ వ్యవహారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై వ్యాఖ్యానించడానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విముఖత వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తానేమీ వ్యాఖ్యానించలేనన్నాడు. ' ఆ కేసును సుప్రీంకోర్టు దర్యాప్తు చేస్తోంది. ఆ ఫిక్సింగ్ వ్యవహారంపై మాట్లాడేంత తెలివైన వాడిని కాను'అని మాస్టర్ స్పష్టం చేశాడు. ఆ కేసులో దోషులను కోర్టే శిక్షిస్తోందని సచిన్ తెలిపాడు. ఫిక్సింగ్ వ్యవహారంపై ముద్గల్ కమిటీ సమర్పించిన నివేదికపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరుపనుంది. -
ఐపీఎల్ ఫిక్సింగ్పై విచారణకు ముద్గల్ కమిటీ
ఆగస్టులోగా నివేదిక ఇవ్వాలి సుప్రీం కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్లో నెలకొన్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్లపై పూర్తి స్థాయి విచారణకు రిటైర్డ్ జడ్జి ముకుల్ ముద్గల్ కమిటీయే నేతృత్వం వహించనుంది. ఇదే కమిటీ గతంలో తమ ప్రాథమిక విచారణను పూర్తి చేసి సీల్డ్ కవర్లో కోర్టుకు అప్పగించింది. దీంట్లో ఎన్.శ్రీనివాసన్తో సహా, 12 మంది క్రికెటర్ల పేర్లున్న విషయం తెలిసిందే. సభ్యులుగా ఎల్.నాగేశ్వర్ రావు, నిలయ్ దత్తా కొనసాగనున్నారు. అలాగే ఈ విచారణను ఆగస్టు చివరిలోగా పూర్తి చేసి సీల్డ్ కవర్లో అందించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కమిటీకి సహాయంగా ఐపీఎస్ మాజీ అధికారి బీబీ మిశ్రా ఉండనున్నారు. బీహార్లో సంచలనం కలిగించిన గడ్డి కుంభకోణం కేసును దర్యాప్తు చేసిన అనుభవం ఈయనకు ఉంది. అలాగే ముంబై, చెన్నై, ఢిల్లీల నుంచి ఒక్కో సీనియర్ పోలీస్ అధికారి సేవలు కూడా తీసుకోనున్నారు. అలాగే వీరితో పాటు ఓ మాజీ క్రికెటర్ను ముద్గల్, మిశ్రా ఎంపిక చేసుకోనున్నారు. విచారణలో భాగంగా కమిటీకి పరిశోధనా హక్కులతో పాటు సంబంధిత పత్రాలను సీజ్ చేయడం, సాక్ష్యాలను రికార్డు చేసే అధికారం ఉంటుంది. అయితే ఎవరినీ అరెస్ట్ చేసే అధికారం మాత్రం లేదు. విచారణ సాగినంత కాలం ఒక్కో రోజుకు రూ.లక్ష ఇవ్వడంతో పాటు అన్ని ఖర్చులను బీసీసీఐ భరించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ విచారణ కోసం ముద్గల్ కమిటీ కాకుండా కొత్త వారిని నియమించాలన్న బోర్డు విన్నపాన్ని జస్టిస్ ఏకే పట్నాయక్తో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. నివేదికలో ఉన్న 13 మంది నిందితుల పేర్లను కొత్త వారు చూడడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. వీటితో పాటు తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా గవాస్కర్, శివలాల్ యాదవ్ తమ పదవుల్లో కొనసాగుతారని కోర్టు స్పష్టం చేసింది. ఐసీసీ సమావేశాలకు, బీసీసీఐ ఏజీఎంలకు శ్రీనివాసన్ వెళ్లేందుకు అనుమతించాలన్న వినతిని కోర్టు తిరస్కరించింది. కోర్టు నిర్ణయం బాగుంది: ఆదిత్య వర్మ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్లపై విచారణకు ముద్గల్ కమిటీనే నియమించడంపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఫిక్సింగ్ విచారణపై పూర్తి అధికారాలను ముద్గల్ కమిటీకి ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పుపై మేం చాలా సంతోషంగా ఉన్నాం’ అని వర్మ చెప్పారు. -
‘ఫిక్సింగ్’ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఆటగాళ్లకు ద్రవిడ్ సూచన అహ్మదాబాద్: ఐపీఎల్-7లో స్పాట్ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి వివాదాలేవీ లేకుండా టోర్నీ సాఫీగా సాగిపోతుండడం పట్ల రాజస్థాన్ రాయల్స్ మెంటర్ రాహుల్ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే ఆటగాళ్లు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించాడు. ‘ఎటువంటి వివాదాలకు తావులేకుండా లీగ్ కొనసాగుతుండడం సంతోషకరం. కానీ, క్రికెట్ను దెబ్బతీయాలని చూసే వ్యక్తులూ ఉన్నందున ఆటగాళ్లు, జట్లు అప్రమత్తంగా ఉండాలి’ అని ద్రవిడ్ అన్నాడు. ఈ ఏడాది రాజస్థాన్కు సొంత వేదికగా ప్రకటించిన అహ్మదాబాద్ తమకు కలిసివచ్చే వేదికేనని, గతంలో ఇక్కడ తమ జట్టుకు మంచి రికార్డే ఉందని ద్రవిడ్ తెలిపాడు. -
విచారణ కమిటీ ఏర్పాటుపై తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో ఆరోపణలను విచారించాల్సిన కమిటీ ఏర్పాటును సుప్రీం కోర్టు రిజర్వ్లో ఉంచింది. ఎన్.శ్రీనివాసన్తో పాటు మరో 12మందిపై విచారణ జరిపేందుకు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిషన్కే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారనే కథనాలు వినిపించాయి. అయితే ఈ కమిటీపై బీసీసీఐ అభ్యంతరం లేవనెత్తింది. ఈ కమిషన్ స్థానంలో తాజాగా మరో కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది. దీంతో జస్టిస్ ఏకే పట్నాయక్తో కూడిన బెంచ్ తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇంతకుముందు ఇదే అంశంపై బోర్డు వర్కింగ్ కమిటీ... త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ముద్గల్ కమిటీయే ఈ విచారణకు ముందుకు వస్తే బాగుంటుందని సూచనప్రాయంగా వెల్లడించింది. దీనికి అటు ముద్గల్ కమిటీ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే ఆ కమిటీపై తమకు నమ్మకం లేదని, వారు ఇప్పటిదాకా అందించిన నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీసీఐ ఆరోపించింది. శ్రీనివాసన్, మరో 12 మందిపై ముద్గల్ కమిటీ చేసిన ఆరోపణలపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయానికి రాలే దని, కొత్తగా ఏర్పాటయ్యే కమిటీ ఈ వ్యవహారాన్ని చూస్తుందని కోర్టు తెలిపింది. కమిటీ నివేదికలో ఉన్న విషయాలను రహస్యంగా ఉంచేందుకే ముద్గల్ కమిటీకి విచారణ అధికారం అప్పగించాలని భావించామని, మరో కమిటీ వస్తే ఇందులోని విషయాలు వారికి కూడా తెలిసిపోతాయని కోర్టు అభిప్రాయపడింది. సిద్ధంగా ఉన్న ముద్గల్ కమిటీ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపేందుకు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తమ సంసిద్ధతను తెలిపింది. ఈ విషయంలో తమకు సహాయకంగా ఉండేందుకు సీబీఐ (స్పెషల్ డెరైక్టర్) మాజీ అధికారి ఎంఎల్ శర్మ సేవలను వినియోగించుకుంటామని కోర్టుకు తెలిపింది. శర్మతో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నైలకు చెందిన ఒక్కో పోలీస్ అధికారి... ఓ మాజీ క్రికెటర్ ఉంటాడని బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. -
బీసీసీఐ కమిటీని తిరస్కరించిన సుప్రీం
మళ్లీ ముద్గల్ కమిటీనే విచారణ చేయమని కోరిన న్యాయస్థానం న్యూఢిల్లీ: బీసీసీఐ చర్యలపై సుప్రీం కోర్టుకు ఏ కోశానా నమ్మకం కుదిరే ట్టు కనిపించడం లేదు. గతేడాది ఐపీఎల్లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం అనుమానితులపై విచారణ కోసం ఓ కమిటీని నియమించాలని గతంలో బోర్డును కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ముగ్గురు సభ్యుల (రవిశాస్త్రి, సీబీఐ మాజీ డెరైక్టర్ రాఘవన్, మాజీ చీఫ్ జస్టిస్ జేఎన్ పటేల్)తో కూడిన ప్యానెల్ను బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. కానీ సుప్రీం కోర్టు ఆ కమిటీని తేలిగ్గా తీసుకుంది. ఇప్పటికే సభ్యులపై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. దీంతో ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ వైపే కోర్టు మొగ్గు చూపింది. ఎన్.శ్రీనివాసన్ మరో 12 మంది పాత్ర గురించి విచారణ జరిపే బాధ్యతను తీసుకుంటారా? అని జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం ముద్గల్ కమిటీని అడిగింది. ఒకవేళ కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందిస్తే వారికి సహాయకంగా పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరోవైపు ముద్గల్ కమిటీ నివేదికలోని ఆడియో రికార్డులో కొంత భాగాన్ని వినేందుకు బీసీసీఐ, శ్రీనివాసన్లకు కోర్టు అనుమతించింది. అయితే ఇందులోని విషయాలను ఎక్కడా బహిర్గతపరచవద్దని ఆదేశించింది. మేం సిద్ధం: ముద్గల్ కమిటీ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్లో అనుమానితులుగా ఉన్న వారిపై విచారణ జరిపేందుకు తాము సిద్ధమేనని ముద్గల్ కమిటీ స్పష్టం చేసింది. ‘ఇప్పటికే కోర్టుకు మా అంగీకారం తెలిపాం. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు. కోర్టు ఆదేశం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం’ అని ముద్గల్ అన్నారు. ఈనెల 29న జరిగే విచారణలో కమిటీని కోర్టు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
ఫిక్సింగ్పై విచారణకు త్రిసభ్య కమిటీ
ప్యానెల్లో రవిశాస్త్రి, సీబీఐ మాజీ డెరైక్టర్ రాఘవన్ బీసీసీఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఉదంతాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి విచారణ కమిటీని నియమించనుంది. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన ముద్గల్ కమిటీ నివేదికలో బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్తో పాటు మరో 12 మందిని నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఫిక్సింగ్పై పూర్తి పారదర్శకంగా విచారణ సాగాలంటే సభ్యులుగా ఎవరిని నియమిస్తారో తెలపాల్సిందిగా ఈనెల 16న కోర్టు బీసీసీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన వర్కింగ్ కమిటీ... ఫిక్సింగ్పై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో మాజీ ఆల్రౌండర్ రవిశాస్త్రితో పాటు కలకత్తా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జేఎన్ పటేల్, సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్కే రాఘవన్ సభ్యులుగా ఉంటారని తెలిపింది. 1999-2000లో సంచలనం సృష్టించిన మ్యాచ్ ఫిక్సింగ్పై సీబీఐ విచారణకు రాఘవన్ నేతృత్వం వహించారు. ఓ దశలో లోక్సభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ ఛటర్జీ పేరుపై కూడా చర్చ జరిగింది. సభ్యుల పేర్లను సుప్రీం కోర్టు పరిశీలనకు పంపనున్నారు. ‘ఈ త్రిసభ్య కమిటీకి ఎవరు నేతృత్వం వహించాలో కోర్టు తెలుపుతుంది. మా బాధ్యతల్లా విచారణ కమిటీకి సభ్యులను నియమించడం వరకే. దాన్ని పూర్తి చేశాం’ అని వర్కింగ్ కమిటీలో పాల్గొన్న సభ్యుడొకరు తెలిపారు. శ్రీనివాసన్ను విమర్శిస్తున్న శశాంక్ మనోహర్ విద ర్భ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా సమావేశానికి హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా శ్రీని స్థానంలో మరొకరు... మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బోర్డు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న శ్రీనివాసన్ స్థానంలో మరొకరిని నియమించనున్నారు. మే రెండో వారంలో జరిగే ప్రత్యేక సాధారణ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటామని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సంయుక్త కార్యదర్శి పీవీ శెట్టి తెలిపారు. మరోవైపు ఈ కమిటీలో ఉన్న రవిశాస్త్రి ఐపీఎల్, క్రికెట్ కామెంట్రీతో సంబంధం ఉన్నవాడని, అందుకే వీరు ఏమేరకు స్వేచ్ఛగా పనిచేస్తారో చూడాల్సిందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఏసీ ముత్తయ్య అభిప్రాయపడ్డారు. రవిశాస్త్రి ఎంపికపై అభ్యంతరం ఫిక్సింగ్పై విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో రవిశాస్త్రిని నియమించడాన్ని బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ వ్యతిరేకించారు. ‘బీసీసీఐ ఏర్పాటు చేసిన ఈ ప్యానెల్ను 22న సుప్రీం కోర్టులో జరిగే విచారణలో వ్యతిరేకిస్తాను. సీబీఐ లేదా జాతీయ ఇం టెలిజన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆధ్వర్యంలో మాత్రమే విచారణ జరగాలి. ముగ్గురు సభ్యుల్లో ఇద్దరిపై నాకెలాంటి వ్యతిరేకత లేకపోయినా రవిశాస్త్రి చాలాకాలంగా బీసీసీఐ నుంచి వేతనం పొందుతున్న ఉద్యోగి. గత కొన్ని రోజులుగా ఆయన శ్రీని జపం చేస్తున్నారు. అందుకే ఆయనపై ఎలాంటి ఆశ లేదు’ అని వర్మ తేల్చి చెప్పారు. -
మేం కళ్లు మూసుకోం...
న్యూఢిల్లీ: ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఎన్. శ్రీనివాసన్, మరో 12 మందిపై బీసీసీఐ విచారణ జరపాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీసీసీఐ స్వయంప్రతిపత్తి గల సంస్థ అయిన బీసీసీఐ ఈ వ్యవహారంపై మిన్నకున్నా తాము మాత్రం కళ్లు మూసుకోమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. జస్టిస్ ముకుల్ ముగ్దల్ కమిటీ తన నివేదికలో చేసిన ఆరోపణలపై విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేసింది. కమిటీ ప్రతిపాదనలను శ్రీనివాసన్ సీరియస్గా తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఐపీఎల్-7కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా సుందర్ రామన్ను కొనసాగించేందుకు కోర్టు అనుమతించింది. సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలనే దానిపై నిర్ణయాన్ని జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ రిజర్వు చేసింది. -
'బీసీసీఐ అధ్యక్షుడిగా గవాస్కర్ ను నియమించండి'
న్యూఢిల్లీ: బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా సునీల్ గవాస్కర్ను నియమించండని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో తుది తీర్పు వచ్చేంత వరకూ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీనివాసన్ను పక్కనపెట్టాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఐపీఎల్-7లో చెన్నై సూపర్కింగ్స్, రాజస్థాన్ రాయల్స్పై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టు ప్రతిపాదన చేయడం సంచలనం రేపుతోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ఆటగాళ్లు, యాజమాన్యాలపై ఆరోపణలు వెలువడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన శ్రీశాంత్, చండీలా, చవాన్ లు అరెస్టయ్యారు. ఈ కుంభకోణంలో చెన్నై సూపర్ కింగ్స్ సహ యజమాని గురునాథన్ మేయప్పన్ ను కూడా అరెస్ట్ ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్లపై నమోదైన కేసులో సుప్రీంకోర్టు తీర్పు శుక్రవారం తీర్పు వెల్లడించనుంది. -
చండీలాకు మరో వారం గడువు
ముంబై: ఐపీఎల్-6లో స్పాట్ఫిక్సింగ్కు పాల్పడిన రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు అజిత్ చండీలా తన వివరణ ఇచ్చేందుకు బీసీసీఐ ఈ నెల 12 వరకు గడువిచ్చింది. జైలు నుంచి బెయిలుపై విడుదలైన చండీలా బుధవారం బోర్డు క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యాడు. ఈ సందర్భంగా తాను లిఖితపూర్వక వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కావాలన్న చండీలా విన్నపాన్ని ఎన్.శ్రీనివాసన్ నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ మన్నించింది. గత ఏడాది ఐపీఎల్లో చండీలాతోపాటు భారత టెస్టు క్రికెటర్ శ్రీశాంత్, అంకిత్ చవాన్, అమిత్సింగ్, సిద్ధార్థ్ త్రివేదిలు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు రవి సవాని నేతృత్వంలోని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం నిర్ధారించిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీశాంత్, చవాన్లపై జీవితకాల నిషేధం, త్రివేదిపై ఏడాది, అమిత్సింగ్పై ఐదేళ్లపాటు నిషేధం విధించిన బీసీసీఐ.. చండీలాపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాను నిర్దోషినని, ఎటువంటి తప్పూ చేయలేదని, తనకు అండగా నిలిచే వారెవరూ లేరని చండీలా వాపోయాడు. బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సివుందన్నాడు. -
యజమానే ఫిక్సింగ్కు ప్రయత్నించాడు
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ )లో అవినీతి చోటుచేసుకున్నది వాస్తవమేనని విచారణ జరిపిన ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి బుధవారం తీర్పునిచ్చిన ట్రిబ్యునల్.. ఢాకా గ్లాడియేటర్స్ జట్టు యజమానుల్లో ఒకరైన షిహాబ్ జీషన్ చౌదురి స్వయంగా ఓ మ్యాచ్ను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించాడని ధ్రువీకరించింది. అయితే ఈ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న కెంట్ (ఇంగ్లండ్ కౌంటీ) ఆల్రౌండర్ డారెన్ స్టీవెన్స్తో సహా మరో ఆరుగురికి క్లీన్చిట్ ఇచ్చింది. కాగా, గత ఏడాది మేలో బీపీఎల్లో మ్యాచ్, స్పాట్ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చాక స్వయంగా నేరాన్ని అంగీకరించిన బంగ్లాదేశ్ బ్యాట్స్మన్ అష్రాఫుల్.. తనతోపాటు మరో ఆటగాడు కూడా ఉన్నాడని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆటగాడెవరన్నది మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. మరోవైపు ట్రిబ్యునల్ తీర్పుపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)తోపాటు ఐసీసీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్ తీర్పు తమను నిరాశకు గురిచేసిందని, పూర్తి వివరాలు చూశాక తదుపరి చర్యల గురించి ఆలోచిస్తామని బీసీబీ తెలిపింది -
ఐఓసీ సలహా కోరిన క్రీడా శాఖ
న్యూఢిల్లీ: క్రీడల్లో మ్యాచ్, స్పాట్ ఫిక్సింగ్ను నియంత్రించే విషయంలో తగిన సూచనల కోసం కేంద్ర క్రీడా శాఖ.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సహాయాన్ని కోరింది. ఫిక్సింగ్ వ్యతిరేక చట్టాన్ని తెచ్చే క్రమంలో ఉన్న క్రీడా శాఖ... దీనిపై పరిజ్ఞానాన్ని పంచుకోవాలంటూ ఐఓసీ డెరైక్టర్ జనరల్ క్రిస్టఫ్ డి కెప్పెర్కు లేఖ రాసింది. ఐపీఎల్లో ఇలాంటి తరహా ఉదంతాలు వెలుగులోకి రావడంతో ఈ చట్టం అమలుపై డిమాండ్ వినిపించింది. ‘ఒకవేళ ఐఓసీ తమ వినతిని అంగీకరిస్తే సంతోషిస్తాం. వారి సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి’ అని క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. -
'మిస్టర్ కూల్' పాత్రపై అనేక అనుమానాలు!
ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదిక భారత క్రికెట్ రంగాన్ని మరోసారి కుదిపేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్న టాప్ క్రికెటర్ల పేర్లు జస్టిస్ ముకుల్ నివేదికలో వెలుగు చూడటం క్రికెట్ పండితులను, అధికారులను, అభిమానులను కలవరపరుస్తోంది. ముఖ్యంగా భారత క్రికెటర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాల పేర్లు నివేదికలో ఉండటం క్రికెట్ ఆటపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో శ్రీశాంత్ తోపాటు మరికొంత మంది కీలక ఆటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో క్రికెట్ రంగం ఉలిక్కి పడింది. రాజస్థాన్ రాయల్స్ తోపాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ఫిక్సింగ్ ఆరోపణల్లో ఎదుర్కోవడం మరింత ఆందోళన కలిగించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యమే ఫిక్సింగ్ కు పాల్పడినట్టు, ఆ జట్టు యజమాని, బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ కీలక సూత్రధారి అంటూ ఆరోపణలు వెల్లువెత్తడం సంచలనం రేపింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి సైతం ఫిక్సింగ్ కుంభకోణంలో పాత్ర ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ కుంభకోణంలో అరెస్టైన దారాసింగ్ తనయుడు విందూ దారా సింగ్ తో ధోనీ సతీమణి సాక్షి సన్నిహితంగా మెలగడం అనేక విమర్శలకు తావిచ్చింది. ఫిక్సింగ్ కుంభకోణంలో ధోనీ పాత్రపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత ఫిక్సింగ్ కుంభకోణంలో తనపై వచ్చిన ఆరోపణలు సమాధానమిస్తూ.. కాలమే సమాధానం చెపుతుంది అని అప్పట్లో వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. శ్రీశాంత్ తోపాటు, ఇతర క్రికెటర్లు అరెస్ట్ కావడం, ఇదే కేసులో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురునాథ్ మేయప్పన్ ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత క్రికెట్ ప్రతిష్టకు మచ్చ తెచ్చిన ఫిక్సింగ్ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశిస్తూ పంజాబ్, హర్యానా మాజీ చీఫ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంపై విచారణ చేపట్టి.. సోమవారం నాడు నివేదిక సమర్పించింది. మేయప్పన్ పిక్సింగ్ కు పాల్పడ్డారనే ఈ కమిటీ నిగ్గు తేల్చింది. మేయప్పన్ ఓ ఔత్సాహికుడు మాత్రమేనని, ఆయనకు జట్టు వ్యహరాల్లో పాత్ర లేదంటూ గతంలో ధోనీ మీడియాకు వివరించారు. కానీ ప్రతి మ్యాచ్ జరగడానికి ముందు ధోనీ, ఫ్లెమింగ్ తో కలిసి జట్టు వ్యూహాలను రచించేవారమని మేయప్పన్ వెల్లడించారు. ఫ్లెమింగ్ తో కలిసి జట్టు వేలం గురించి తాను చర్చించానని మేయప్పన్ తెలిపారు. జట్టులో మేయప్పన్ పాత్ర కీలకమే అని దాన్ని బట్టి అర్ధమవుతోంది. కానీ బీసీసీఐ చీఫ్, భారత కెప్టెన్ ధోనీ మాత్రం వీలైనంతవరకు మేయప్పన్ పై వచ్చిన ఆరోపణల తీవ్రత తగ్గించేందుకు గతంలో ప్రయత్నించారన్నది తాజా వివేదికలో వెల్లడవుతోంది. ముకుల్ కమిటీ నివేదిక వెల్లడైన నేపథ్యంలో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిక్సింగ్ కుంభకోణంలో పాత్ర ప్రత్యక్షంగా ఉందని తెలిసినా మేయప్పన్ ను ధోనీ ఎందుకు వెనుకేసుకొచ్చాడు? పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన బీసీసీఐ చీఫ్ అల్లుడిని కాపాడాల్సిన అవసరం ధోనీకి ఏముంది? విందూ సింగ్ తో ధోనీ సతీమణి సన్నిహిత సంబంధాలు ఫిక్సింగ్ కు దారితీశాయా? స్పాట్ ఫిక్సింగ్ లో దోనీ పాత్ర కూడా ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ ప్రతిష్ట గంగలో కలువక ముందే ధోనీ స్పందించాల్సిన సమయం వచ్చిందని పలువురు పండితులు అంటున్నారు. ముకుల్ కమిటీ నివేదిక వెల్లడైన నేపథ్యంలో అన్ని వేళ్లు ధోనీ వైపే ఉన్నాయి. ఫిక్సింగ్ కుంభకోణంలో తనపై వస్తున్న ఆరోపణల్ని, తన పాత్రపై వస్తున్న అనుమానాలకు ధోనీ ఎలా సమాధానం చెబుతాడో వేచి చూడాల్సిందే. -
శ్రీశాంత్ను ప్రశ్నించనున్న సుప్రీం కమిటీ
ముంబై: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్పై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మాజీ పేసర్ శ్రీశాంత్ను ప్రశ్నించనుంది. బెట్టింగ్ కేసులో ఇరుక్కున్న రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాతో పాటు కామెంటేటర్ హర్షా భోగ్లే, ఇతరుల నుంచి కూడా వివరాలు సేకరించనుంది. ‘ఈనెల 15 నుంచి 17 వరకు ముంబైలో కమిటీ పర్యటించనుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ సీవోవో సుందర్ రామన్, చిరాయు అమిన్, హర్షా భోగ్లే, అంకిత్ చవాన్, శ్రీశాంత్, హర్మీత్ సింగ్, రాజ్ కుంద్రా, విందూ దారాసింగ్లను సభ్యులు కలుసుకోనున్నారు’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. -
సొంత జట్టుకు వ్యతిరేకంగా బెట్టింగ్
ముంబై: ఐపీఎల్ ఆరో సీజన్లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్పై ముంబై పోలీసులు నమోదు చేసిన చార్జిషీట్లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లపై ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలాగే బెట్టింగ్లో నిండా మునిగిన గురునాథ్ మెయ్యప్పన్ తమ సొంత జట్టుకు వ్యతిరేకంగా బెట్లు కాసేవాడని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. గురునాథ్, విందూ దారాసింగ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణల్లో ఇది తేలిందని చెప్పారు. ‘మే 12న రాజస్థాన్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి వీరిద్దరు మాట్లాడుకున్నారు. చెన్నై 130-140 పరుగులు సాధిస్తుందని విందూకు చెప్పాడు. ఆ రోజు చెన్నై 141 పరుగులు చేసింది. ఇలాంటి సమాచారం సెషన్ బెట్టింగ్కు చాలా కీలకంగా మారుతుంది. అలాగే ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలుస్తుందని గురునాథ్ బెట్టింగ్ కాశాడు. అంతేకాకుండా మే 14న ఉదయం చెన్నై, ఢిల్లీ మ్యాచ్ గురించి మాట్లాడుతూ మనం కచ్చితంగా గెలుస్తాం.. టీమ్లో ఎలాంటి మార్పులు లేవు అని విందూకు చెప్పాడు. కేకేఆర్, బెంగళూరు మ్యాచ్కు సంబంధించిన అంతర్గత విషయాలను కూడా గురునాథ్ బహిర్గతం చేశాడు. ముంబైతో జరిగే మ్యాచ్ను సన్రైజర్స్ గెలుస్తుందని కూడా చెప్పాడు. మెయ్యప్పన్ వాయిస్ శాంపిల్ను ల్యాబ్కు పంపాం. నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం’ అని తమ చార్జిషీట్లో విపులంగా వివరించారు. గురునాథ్ కచ్చితంగా చెన్నై జట్టు యజమాని అని సాక్షి నరేశ్ హిమ్మత్లాల్ మకానీ చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. అంపైర్ రవూఫ్ బెట్టింగ్ కాసేవాడు: పోలీసులు పాకిస్థాన్ అంపైర్ అసద్ రవూఫ్ ఐపీఎల్ సందర్భంగా బుకీల నుంచి బహుమతులు స్వీకరించడమే కాకుండా స్వయంగా బెట్టింగ్ కూడా కాసేవాడని పోలీసులు తెలిపారు. దీనికి తగిన సాక్ష్యాలను తమ చార్జిషీట్లో పొందుపరిచారు. మ్యాచ్కు సంబంధించిన సమాచారాన్ని బుకీలను అందించినందుకు రవూఫ్ విలువైన బహుమతులు పొందాడని, అలాగే తాను స్వయంగా అంపైరింగ్ చేసే మ్యాచ్లపై బెట్టింగ్కు దిగేవాడన్నారు. విందూ, బుకీలతో మాట్లాడిన ఫోన్ రికార్డులను పోలీసులు సంపాదించారు. ‘మే15న మధ్యాహ్నం విందూతో ‘ఈరోజు జీవితంలో గెలుపో.. ఓటమో తేలుతుంది’ అని రవూఫ్ చెప్పడంతో వెంటనే విందూ బుకీలకు ఫోన్ చేసి అతడు చెప్పిన మ్యాచ్పై భారీ మొత్తంలో బెట్ కాయమని చెప్పాడు’ అని పోలీసుల రిపోర్ట్లో పేర్కొన్నారు. -
ఫిక్సింగ్ ఉదంతాన్నిమర్చిపోతున్నాం: ద్రవిడ్
జైపూర్: ఐపీఎల్-6లో బయటపడ్డ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాన్ని తాము ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. జట్టు సమష్టిగా ముందుకు సాగుతోందని చెప్పాడు. ‘గత సీజన్ దుష్ర్పభావం మాపై లేదు. వాటన్నింటిని పక్కనబెట్టాం. క్రమశిక్షణ చర్యలు కూడా పరిష్కారమయ్యాయి. ఇప్పుడు మా జట్టులో 15 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడే ఫిక్సింగ్ ఎపిసోడ్పై చర్చించుకున్నాం. ఇక దాన్ని పక్కనబెట్టి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ఓ జట్టుగా మా అభిమానులకు ఆనందాన్ని కలిగించాలి. ఇందుకోసం మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు శ్రీశాంత్పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
నేనే తప్పు చేయలేదు: శ్రీశాంత్
కొచ్చి: బోర్డు తనపై జీవితకాల నిషేధం విధించడం తనను తీవ్రంగా కలచివేసిందని వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ తెలిపాడు. తన జీవితంలో ఇదే పెద్ద కుదుపు అని అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో తానేతప్పు చేయలేదని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని పేర్కొన్నాడు. తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఏనాడు, ఏ ఒక్కరూ తనకు మద్దతుగా నిలువలేదన్నాడు. కనీసం ఇలాంటి గడ్డు స్థితిలో తనకు అండగా నిలుస్తారని ఆశించినా... అలాంటి సాంత్వనేదీ దక్కలేదని శ్రీ వాపోయాడు. ‘భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం నన్ను బాధించింది. ఈ మొత్తం ఉదంతంలో నన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో తెలీదు. ఏదేమైనా నిర్దోషిగా బయటపడతాననే నమ్మకముంది. తప్పకుండా తిరిగి జట్టులోకి వస్తాను’ అని అన్నాడు. తాను జైల్లో లేనని, బయటే ఉన్నానని... ఇదొక్కటే తనకు ఊరటనిచ్చే విషయమన్నాడు. -
ఖేల్ ఖతం
అడ్డదారుల్లో సులువుగా డబ్బు సంపాదించాలని ఆరాటపడిన భారత క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు శ్రీశాంత్... అతని సహచరుడు అంకిత్ చవాన్ తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఐపీఎల్-6లో బెట్టింగ్ ఉచ్చులో పడి స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన వీరిపై బీసీసీఐ కొరడా ఝళిపించింది. జీవిత కాలంలో వీరు క్రికెట్ ఆడరాదంటూ ఆదేశించింది. తద్వారా ఈ ఆటగాళ్లు తమ కెరీర్ను అర్ధాంతరంగా ముగించుకున్నట్టయ్యింది. న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్గా పేరు తెచ్చుకున్న శ్రీశాంత్ క్రికెట్ కెరీర్ అవమానకర రీతిలో ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరో సీజన్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినందుకు ఈ కేరళ ఆటగాడిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొరడా ఝుళిపించింది. ఫిక్సర్లపై కఠినంగా వ్యవహరిస్తామని ఆది నుంచీ చెబుతూ వస్తున్న బోర్డు అందుకు తగ్గట్టుగానే శ్రీశాంత్పై క్రికెట్ నుంచి జీవితకాల నిషేధం విధించింది. అతనితోపాటు రాజస్థాన్ రాయల్స్కు ఆడిన ముంబై రంజీ జట్టు స్పిన్నర్ అంకిత్ చవాన్ కూడా ఇదే శిక్షను ఎదుర్కోనున్నాడు. శుక్రవారం జరిగిన బోర్డు క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరితోపాటు బుకీగా మారిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ సభ్యుడు, గుజరాత్ క్రికెటర్ అమిత్ సింగ్పై ఐదేళ్ల నిషేధం... విషయం తెలిసినప్పటికీ అధికారులకు తెలపకుండా ఉన్న రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సిద్ధార్థ్ త్రివేదిపై ఏడాది పాటు వేటు పడింది. తమపై ఉన్న నిషేధం సమయంలో వీరు ఎలాంటి క్రికెట్ మ్యాచ్ల్లో పాలుపంచుకోకూడదు. అలాగే బోర్డు దాని గుర్తింపు సంఘాలతో కలిసి ఎలాంటి కార్యక్రమాల్లోనూ కనిపించేందుకు అనుమతి ఉండదు. మరోవైపు సరైన ఆధారాలు లేని కారణంగా స్పిన్నర్ హర్మీత్ సింగ్కు ఊరట లభించింది. బుకీలు సంప్రదించిన విషయాన్ని వెల్లడించనందుకు అతడిని మందలించారు. చండిలాపై త్వరలో నిర్ణయం... దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ వ్యవహారం గత మే నెలలో బయటపడగానే బీసీసీఐ తమ అవినీతి వ్యతిరేక యూనిట్ చీఫ్ రవి సవానీ నేతృత్వంలో విచారణ కమిటీ వేసింది. ఆయన ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని బోర్డు క్రమశిక్షణ కమిటీ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. విచారణ సమయంలో అజిత్ చండిలా జైలులో ఉండడంతో అతడిని వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం చిక్కలేదు. దీంతో ఈ ఆటగాడిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం అతడు కూడా బెయిల్పై విడుదల కావడంతో త్వరలోనే రవి సవానీ కలుసుకునే అవకాశం ఉంది. ‘తగిన సాక్ష్యాధారాలతో పాటు స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి రూపొందించిన నివేదికను పరిగణనలోకి తీసుకున్నాం. క్షుణ్ణంగా పరిశీలించాకే క్రమశిక్షణ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. గత నెలలో కోల్కతాలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో సవానీ ఈ నివేదికను సమర్పించారు. దయ చూపాల్సిన అవసరం లేదు: సవానీ స్పాట్ ఫిక్సర్లపై బోర్డు తరఫున విచారణ చేసిన అవినీతి వ్యతిరేక యూనిట్ చీఫ్ రవి సవానీ తన నివేదికలో పలు విషయాలు పేర్కొన్నారు. ‘ఫిక్సింగ్కు పాల్పడిన ఈ ఆటగాళ్లకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. శ్రీశాంత్ ఇప్పటికే చాలా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అలాగే తొలి టి20 ప్రపంచకప్ టోర్నీ, 2011లో వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఐసీసీ ఏసీఎస్యూ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఐపీఎల్-6కు ముందు కూడా తనతోపాటు ఫిక్సింగ్ చేసిన ఇతర ఆటగాళ్లు ఈ అవగాహన శిబిరంలో ఉన్నారు. అవినీతి నిరోధక పాఠాలు వీరిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అందుకే వీరిపై ఎలాంటి దయ చూపాల్సిన అవసరం లేదు’ అని సవానీ నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆటగాళ్లపై ఐదేళ్ల నుంచి జీవితకాల నిషేధం విధించాలని బోర్డుకు సూచించారు. బీసీసీఐ వేటు ఆశ్చర్యకరం: శ్రీశాంత్ బీసీసీఐ తనపై జీవిత కాల నిషేధం విధించడం పట్ల పేసర్ శ్రీశాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘న్యూస్ చానెల్స్ చూస్తుండగా విషయం తెలిసింది. నాపై జీవిత కాల బహిష్కరణా..? చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని ట్విట్టర్లో పేర్కొన్నాడు. అయితే వెంటనే ఈ ట్వీట్ను శ్రీశాంత్ తొలగించాడు. కమిటీ ముందు హాజరైన ఆటగాళ్లు బీసీసీఐ నిర్ణయానికి ముందు శ్రీశాంత్, అంకిత్ చవాన్, చండిలా, హర్మీత్ సింగ్, సిద్ధార్థ్ త్రివేది క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు. ‘కమిటీ సభ్యులు ఎంతో సహకరించారు. వారికి నా వాదనను సమర్థవంతంగా వినిపించాను. భారత్కు ఆడాలనేది నా చిన్నప్పటి కల. అలాంటిది క్రికెట్ను నేను ఎప్పటికీ మోసం చేయలేను. వారు నిషేధం గురించి ఏమీ చెప్పలేదు. బీసీసీఐతో పాటు భారత న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. ఈ మొత్తం వ్యవహారం నుంచి సచ్ఛీలుడిగా బయటపడతాను’ అని కమిటీ ముందు హాజరైన అనంతరం శ్రీశాంత్ అన్నాడు. సమావేశానికి హాజరైన శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న ఎన్.శ్రీనివాసన్ శుక్రవారం జరిగిన క్రమశిక్షణ కమిటీకి హాజరయ్యారు. వాస్తవానికి ఉపాధ్యక్షులు అరుణ్ జైట్లీ, నిరంజన్ షా సభ్యులుగా ఉన్న ఈ కమిటీకి బోర్డు అధ్యక్షుడి హోదాలో ఆయనే నేతృత్వం వహించాలి. కానీ అల్లుడు గురునాథ్ బెట్టింగ్ వ్యవహారంలో ఆయన పదవి నుంచి తాత్కాలికంగా తప్పుకోవడంతో ఇద్దరు సభ్యులు మాత్రమే హాజరవుతారని భావించినా శ్రీనివాసన్ కమిటీకి అధ్యక్షత వహించారు. -
స్పాట్ ఫిక్సింగ్: శ్రీశాంత్, చవాన్లపై జీవితకాల నిషేధం
స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరు క్రికెటర్లపై వేటు పడింది. స్పీడ్స్టర్, బ్రేక్ డాన్సర్ ఎస్.శ్రీశాంత్, అంకిత్ చవాన్ ఇద్దరిపైనా బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. క్రికెట్ మ్యాచ్లను స్పాట్ ఫిక్సింగ్ చేసినందుకు వీరిద్దరిపైనా శాశ్వతంగా వేటు వేశారు. ఇక ఇదే కేసులో అమిత్ సింగ్పై ఐదేళ్ల నిషేధం, అలాగే మరో క్రికెటర్ సిద్దార్థ త్రివేదిపై ఏడాది నిషేధం విధించారు. హర్మీత్ సింగ్ను పూర్తిగా విడిచిపెట్టగా.. అజిత్ చండిలా విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
వారి ఉద్దేశాలు నాకు తెలీదు!
ముంబై: స్పాట్ ఫిక్సింగ్ వంటి అనైతిక పనికి పాల్పడాలనే ఉద్దేశంతో తన సహచరులు ఉన్నారనే ఆలోచన తనకెప్పుడూ రాలేదని రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ హర్మీత్ సింగ్ అన్నాడు. శ్రీశాంత్, చవాన్, చండీలా ఫిక్సింగ్ సమాచారం తెలిసి కూడా చెప్పలేదంటూ బీసీసీఐ జారీ చేసిన షోకాజ్ నోటీస్కు హర్మీత్ సమాధానమిచ్చాడు. వారి ఉద్దేశాలు ఏమిటో తెలీదు కాబట్టే బోర్డుకు ఆ సమాచారం ఇవ్వలేకపోయానని చెప్పాడు. గత ఏడాది అండర్-19 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన హర్మీత్సింగ్ను క్రమశిక్షణా కమిటీ విచారణ పూర్తయ్యే వరకు బీసీసీఐ సస్పెండ్ చేసింది. -
అజిత్ చండిలాకు బెయిల్
న్యూఢిల్లీ: ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అజిత్ చండిలా, మాజీ క్రికెటర్ బాబురావు యాదవ్, బుకీ దీపక్ కుమార్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ ముగ్గురి బెయిల్ పిటిషన్లను సోమవారం ఢిల్లీ కోర్టు ఆడిషినల్ జడ్డి ధర్మేష్ శర్మ విచారించారు. ఈ కేసు పురోగతిలో కొన్ని లింక్లు మిస్సయ్యాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన న్యాయమూర్తి బెయిల్ను మంజూరు చేశారు. నిందితులు రూ. 50వేల వ్యక్తిగత బాండ్లు సమర్పించడంతో పాటు అంతే మొత్తానికి పూచీకత్తు ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బుకీలు జితేందర్ కుమార్ జైన్, రమేశ్ వ్యాస్, అశ్విన్, సునిల్, అన్సారీ బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. వీరిపై ‘మోకా’ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు తగిన ఆధారాలు ఉన్నందున బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. -
బింద్రాపై క్రమశిక్షణ చర్య!
ముంబై: తమకు ఇబ్బందికరంగా మారుతున్న మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రాపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలకు దిగనుంది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడికి మద్దతిస్తుండడమే కాకుండా వర్కింగ్ కమిటీ మీటింగ్లో స్పాట్ ఫిక్సింగ్పై సరైన రీతిలో వ్యవహరించలేదని బింద్రా విమర్శించారు. ‘ఫిక్సింగ్ వ్యవహారంలో బీసీసీఐ ఎప్పటిలాగే మిన్నకుండిపోయింది. రూ.10 వేల కోట్ల కుంభకోణంలో మోడిని ఇరికించేందుకు సమాయత్తమవుతుంది’ అని గురువారం తన ట్విట్టర్ పేజిలో బింద్రా పేర్కొన్నారు. దీంతో పాటు పలు బీసీసీఐ సమావేశాల మినిట్స్ను కూడా జత పరిచారు. దీంతో బోర్డు ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. బీసీసీఐ పరువుకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నందుకు ముందుగా ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని భావిస్తున్నారు. గత జూన్లో గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారంపై విచారణ ముగిసేదాకా శ్రీనివాసన్ను సమావేశాలకు హాజరు కానీయవద్దని ఐసీసీ బోర్డు సభ్యులకు బహిరంగ లేఖ రాశారు. అలాగే ద క్షిణాఫ్రికా క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా లోర్గాట్ నియామకాన్ని సమర్థించారు. -
దావూద్తో సంబంధం లేదు: చండిలా
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్లతో తనకెలాంటి సంబంధాలు లేవని స్పాట్ ఫిక్సింగ్లో దొరికి పోయిన క్రికెటర్ అజిత్ చండిలా స్పష్టం చేశాడు. తప్పుడు ఆరోపణలతో ఈ కేసులో తనని ఇరికించారని, వారిద్దరితో సంబంధాలపై ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదని గుర్తు చేశాడు. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న చండిలా సోమవారం ఢిల్లీ కోర్టుకు హాజరయ్యాడు. ‘నేనో క్రీడాకారుడిని. ఈ కేసులో ఇప్పటికే శ్రీశాంత్, చవాన్లకు బెయిల్ మంజూరైంది. నేను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడాను. విజయవంతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాను. పోలీసులు తప్పుడు ఆధారాలతో నన్ను ఇరికించారు. వారు చెబుతున్నట్టుగా దావూద్, చోటా షకీల్లతో నాకెలాంటి సంబంధాలు లేవు’ అని చండిలా ప్రకటనను అతడి లాయర్ రాకేశ్ కుమార్ కోర్టుకు విన్నవించారు. -
నా వ్యాఖ్యలు వక్రీకరించారు: ద్రవిడ్
భారత్ క్రికెట్ సంఘం(బీసీసీఐ) విశ్వసనీయతపై తాను చేసిన వ్యాఖ్యలు వక్రీకరణకు గురయ్యాయని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. తన వ్యాఖ్యలు వక్రీకరణకు గురవడం పట్ల 'మిస్టర్ డిపెండబుల్' అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను మాటాడిన మాటలను సందర్భ రహితంగా చేసి మీడియాలో ఒక వర్గం వక్రీకరించిందని పేర్కొన్నాడు. ఈఎస్పీఎన్ 'క్రిక్ఇన్ఫో'కు ఇచ్చిన ద్రవిడ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఐపీఎల్-6లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో అతడు స్పందించినట్టు తెలిపాయి. క్రికెట్పై విశ్వసనీయత పెరిగేలా ఆటగాళ్ల, పరిపాలకుల ప్రవర్తన ఉండాలని, ప్రజా జీవితంలో ఉన్న వారికి ఇది మరీ ముఖ్యమని అతడు వ్యాఖ్యానించాడని కథనాలు వచ్చాయి. అయితే ద్రవిడ్ ఇంటర్వ్యూ ను రేపు పాఠకులకు అందుబాటులో ఉంచనున్నట్టు ఈఎస్పీఎన్ 'క్రిక్ఇన్ఫో' తెలిపింది. ద్రవిడ్ వ్యాఖ్యలతో మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఏకీభవించాడు. అబిమానులు ఆటను తప్ప మరేమీ పట్టించుకోరన్న భావనతోనే క్రికెట్ వ్యవహారాల పర్యవేక్షకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాజీ స్పిన్నర్ ద్రవిడ్ వ్యాఖ్యలను ఎర్రాపల్లి ప్రసన్న కూడా సమర్థించారు.