ఐపీఎల్ బెట్టింగ్ ముఠా పట్టివేత | ipl betting racket busted in rajasthan | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా పట్టివేత

Apr 25 2014 9:27 AM | Updated on Sep 2 2017 6:31 AM

రాజస్థాన్‌లో ఐపీఎల్ బెట్టింగ్‌ ముఠా పట్టుబడింది. అజ్మీర్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రాజస్థాన్‌లో ఐపీఎల్ బెట్టింగ్‌ ముఠా పట్టుబడింది. అజ్మీర్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 5 ల్యాప్‌టాప్‌లు, 68 సెల్‌ఫోన్లు, 2 టీవీలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌లలో 3 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌ జరిగినట్లు సమాచారం ఉందని ఈ వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇంతకుముందు కూడా ఐపీఎల్ బెట్టింగు వ్యవహారం చాలా దూరం వెళ్లింది. పలువురు ఆటగాళ్లు దీని పేరు చెప్పి విలువైన కెరీర్ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తాజా బెట్టింగు విషయం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement