కేవీఎస్ ‘డబుల్’ | KVS doubles | Sakshi
Sakshi News home page

కేవీఎస్ ‘డబుల్’

Published Mon, Sep 16 2013 12:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

KVS doubles

 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: వి.పురుషోత్తం స్మారక ఇంటర్ స్కూల్ హాకీ టోర్నమెంట్‌లో బాలబాలికల టీమ్ టైటిల్స్‌ను గచ్చిబౌలికి చెందిన కేంద్రీయ విద్యా సంఘటన్ (కేవీఎస్) స్కూల్ గెలుచుకుంది.  (హెచ్‌హెచ్) ఆధ్వర్యంలో జింఖానా మైదానంలో ఆదివారం జరిగిన బాలికల విభాగం ఫైనల్లో కేవీఎస్ 6-0తో ఐ.వి.వై లీగ్ అకాడమీ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేవీఎస్ స్కూల్‌కు చెందిన గీతా హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. శృతి, సోను చెరో గోల్ సాధించారు.
 
  బాలుర విభాగం ఫైనల్లో కేవీఎస్ జట్టు 2-0తో బాలంరాయి హైస్కూల్ టీమ్‌ను ఓడించింది. కేవీ స్కూల్ జట్టు తరఫున అభిమన్యు, వంశీ గోల్ చేశారు. ఈ పోటీల ముగింపు వేడుకలకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేసింది. ఈ కార్యక్రమంలో హెచ్‌హెచ్ అధ్యక్షుడు జయేష్ రంజన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement