
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్య రాణించింది. కోయంబత్తూర్లో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి సారా యాదవ్తో కలిసి డబుల్స్ రన్నరప్గా నిలిచింది.
శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సాయిదేదీప్య–సారా యాదవ్ (మధ్య ప్రదేశ్) జంట 2–6, 4–6తో నిధి చిలుముల (తెలంగాణ)–శ్వేతా రాణా (ఢిల్లీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment