AITA
-
ఏఐటీఏపై బోపన్న విమర్శలు, సానియా మద్దతు
2012 లండన్ ఒలింపిక్స్కు ముందు... లియాండర్ పేస్తో డబుల్స్ ఆడేది లేదని మహేశ్ భూపతి, రోహన్ బోపన్న పట్టు... బలవంతంగా మిక్స్డ్ డబుల్స్లో పేస్ భాగస్వామిగా సానియా మీర్జా... పురుషాధిక్య ప్రపంచంలో తనను బలి పశువును చేశారని సానియా తీవ్ర వ్యాఖ్య! 2016 రియో ఒలింపిక్స్కు ముందు... పేస్తో కలిసి ఆడనని, డబుల్స్లో సాకేత్ మైనేనితోనే బరిలోకి దిగుతానని బోపన్న పట్టు... అలా కుదరదంటూ బలవంతంగా జోడీని ఎంపిక చేసిన ఏఐటీఏ!! 2020 టోక్యో ఒలింపిక్స్కు ముందు... ఇంకా వివాదమేమీ లేదు, అంతా బాగుందనే అనిపించిది. కానీ అలా అయితే అది భారత టెన్నిస్ ఎలా అవుతుంది...ఆటలకు ముందు వ్యాఖ్యల దుమారం రేగింది!!! న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో తాను పాల్గొనే అవకాశాల విషయంలో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అందరినీ తప్పుదోవ పట్టించిందని టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న వ్యాఖ్యానించాడు. సుమిత్ నగాల్కు జోడీగా తాను ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాలు లేవని తెలిసి కూడా అధికారులు ఇలా వ్యవహరించారని అతను విమర్శించాడు. బోపన్న వ్యాఖ్యలకు సానియా మీర్జా మద్దతు పలకగా... ఏఐటీఏ ప్రతిగా స్పందిస్తూ ఇద్దరి విమర్శలను ఖండించింది. నేపథ్యమిదీ... ఒలింపిక్స్ పురుషుల డబుల్స్లో పాల్గొనే జోడీగా రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ల పేర్లను ఏఐటీఏ ప్రకటించింది. అయితే వీరిద్దరి ‘సంయుక్త ర్యాంక్’ 113 కాగా... అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నిబంధనల ప్రకారం తక్కువ ర్యాంక్ కారణంగా వీరు అర్హత సాధించలేకపోయారు. ఆ తర్వాత పురుషుల సింగిల్స్లో పలువురు తప్పుకోవడంతో అనూహ్యంగా సుమిత్ నగాల్ అర్హత సాధించాడు. దాంతో దివిజ్ స్థానంలో నగాల్ను చేర్చి కొత్తగా ఈ జోడీని పరిశీలించమంటూ ఐటీఎఫ్ను ఏఐటీఏ కోరింది. చివరకు బోపన్న–నగాల్ జోడీకి కూడా అవకాశం దక్కలేదు. ఇదే విషయంపై వ్యాఖ్య చేసిన బోపన్న... అసలు ఏఐటీఏ అలాంటి ప్రయత్నమే చేయలేదని విమర్శించాడు. ‘నగాల్తో నా జోడీని ఐటీఎఫ్ అసలు అంగీకరించనే లేదు. గాయం తదితర బలమైన కారణం ఉంటే తప్ప చివరి తేదీ అయిన జూన్ 22 తర్వాత ఎలాంటి మార్పులు అంగీకరించబోమని ఐటీఎఫ్ స్పష్టం చేసింది. అయినా సరే మాకేదో అవకాశం ఉందని, తామేదో చేస్తున్నట్లుగా ఆటగాళ్లు, ప్రభుత్వం, మీడియా... ఇలా అందరినీ ఏఐటీఏ తప్పుదోవ పట్టించింది’ అని బోపన్న ట్వీట్ చేశాడు. దీనిని మద్దతుగా సానియా...‘అవునా...ఇదే నిజమైతే చాలా ఘోరం. సిగ్గు పడాల్సిన విషయం. దీని ప్రకారం చూస్తే మనిద్దరం కలిసి మిక్స్డ్ డబుల్స్లో పతకం సాధించే అవకాశం కూడా కోల్పోయాం. నీతో పాటు సుమిత్ పేరు పంపించినట్లు నాకు కూడా చెప్పారు’ అని ట్వీట్ చేసింది. అయితే ఈ విమర్శలన్నింటికీ ఏఐటీఏ కొట్టి పారేసింది. బోపన్న, సానియా వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితం. వారికి అసలేం తెలీదు. అర్హత గురించి రూల్ బుక్ చదివి మాట్లాడితే బాగుండేది. డబుల్స్ జోడీని మార్చమంటూ మేం ఐటీఎఫ్కి విజ్ఞప్తి చేశాం. అయితే ప్రత్యేక పరిస్థితుల్లోనే అది సాధ్యమవుతుందని వారు మాకు చెప్పారు. అయినా సరే డెడ్లైన్ ముగియడానికి ఏడు గంటల ముందు వరకు కూడా సమాచారం ఇస్తామని చెప్పి మేమూ వేచి చూసేలా చేశారు. ఇందులో తప్పుదోవ పట్టించడం ఏముంది. దాని వల్ల మాకేంటి లాభం. బోపన్న ఒలింపిక్స్లో ఆడాలని అతనికి సహాయం చేసేందుకే ప్రయత్నించాం. అంతగా అనుకుంటే అతను సొంతంగా తన ర్యాంకింగ్తో అర్హత సాధించాల్సింది. –అనిల్ ధుపార్, ఏఐటీఏ కార్యదర్శి -
కూతురికి వేధింపులు.. తండ్రి అలుపెరగని పోరాటం
చండీగఢ్: ఆడవారి మీద వేధింపులకు ప్రధానమైన కారణం.. బలహీనులు, బయటకు చెప్తే.. సమాజంతోపాటు కుటుంబ సభ్యులు కూడా వారినే శిక్షిస్తారనే ఉద్దేశంతో చాలా మంది మృగాళ్లు ఆడవారి పట్ల దారుణాలకు పాల్పడుతుంటారు. ప్రతిరోజు వెలుగులోకి వచ్చే వార్తలు చూస్తే.. ఇది నిజమేననిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆడవారికి అన్యాయం జరిగినప్పుడు సమాజం సంగతి పక్కనే పెడితే.. కుటుంబం తోడుగా నిలబడి మద్దతిస్తే చాలు.. మరిన్ని అన్యాయాలు వెలుగులోకి వస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి చండీగఢ్లో చోటు చేసుకుంది. కుమార్తెను వేధించిన వారికి శిక్ష పడేలా చేయడం కోసం ఓ తండ్రి అలుపెరగిన పోరాటం చేస్తున్నాడు. ఆ వివరాలు.. చండీగఢ్కు చెందిన ఓ యువతి టెన్నిస్ శిక్షణ కోసం రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన ఓ అకాడమీలో చేరింది. అక్కడ ఆమెతో పాటు శిక్షణ పొందుతున్న ఓ ఐదుగురు యువకులు బాధితురాలిని లైగింక వేధింపులకు గురి చేశారు. వీరిలో ఒక వ్యక్తి జూనియర్ డేవిస్ కప్ ప్లేయర్ కూడా కావడం గమనార్హం. దీని గురించి బాధితురాలు తండ్రితో చెప్పింది. ఆయన ఈ విషయం బయటకు తెలిస్తే.. పరువు పోతుందని ఆలోచించలేదు. తన బిడ్డ పట్ల తప్పుగా ప్రవర్తించిన వారికి శిక్షపడాలని భావించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు కోర్టుకు చేరింది. ఇక వారికి తప్పక శిక్ష పడుతుంది.. కూతురికి న్యాయం జరుగుతుందని ఆశించిన ఆ తండ్రికి నిరాశే ఎదురయ్యింది. కేసు విచారణ సమయంలో పోలీసులు టెన్నిస్ అకాడమీ వారు ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్లు కోర్టుకు అందజేశారు. దాని ప్రకారం నిందితులంతా మైనర్లుగా భావించింది కోర్టు. వారికి బెయిల్ మంజూరు చేసింది. తప్పు చేసిన వాళ్లే దర్జగా బయటకు వెళ్తుంటే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. నిందితులు కోర్టుకు తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చారని గ్రహించిన ఆ తండ్రి.. వాస్తవాలు వెలుగు తీసేందుకు ప్రయత్నించాడు. (మరో ఇద్దరు యువతుల ప్రమేయం!) నిజమైన బర్త్ సర్టిఫికెట్ల కోసం ఆ తర్వాత కొన్ని నెలల పాటు శ్రమించి ఆ ఐదుగురు నిందితుల స్వగ్రామాలైన హరియాణాలోని రోహ్తక్, పాల్వాల్, హిసార్లలో పర్యటించాడు. నిందితులు ప్రాథమిక స్థాయిలో చదివిన ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి వారి అసలు పుట్టిన తేదీల గురించి ఆరా తీయడం ప్రారంభించాడు. అతడి అనుమానం నిజమయ్యింది. పోలీసులు తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిసింది. స్కూల్ రికార్డ్స్ ప్రకారం వారి మైనర్లు కాదని తేలింది. వీటిని కోర్టులో సమర్పించి.. నిందితుల బెయిల్ రద్దు చేయాలని బాధితురాలి తండ్రి కోరాడు. కోర్టు దీని గురించి పోలీసులను ప్రశ్నిస్తే వారు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. ‘కోర్టు ఆదేశాల మేరకు మేం పత్రాలను పరిశీలించి రికార్డు సబ్మిట్ చేశాం. అయితే నిందితులు ఇచ్చిన పత్రాలు నిజమైనవా.. కావా అనే విషయం తేల్చాల్సింది కోర్టు’ అన్నారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు బాధితురాలి తండ్రి ఇంతటితో ఊరుకోలేదు. జరిగిన విషయాల గురించి హరియాణా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాడు. అనంతరం జరిగిన విచారణలో ఒక నిందితుడు తప్పుడు పత్రాలు సమర్పించాడని రుజువయ్యింది. దాంతో ఆరోగ్య శాఖ అతడి బర్త్ సర్టిఫికెట్ను క్యాన్సల్ చేసింది. నిందితుడితో పాటు అతడి తండ్రి, మరో ఇద్దరి మీద కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే కారణంతో కేసు కూడా నమోదు చేసింది. మరో ఇద్దరిపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కోర్టు విచారణకు తాత్కలికంగా బ్రేక్ పడింది. కోర్టులు తెరిచిన తర్వాత అయినా వీరందరికి తగిన శిక్ష పడుతుందని భావిస్తున్నాడు బాధితురాలి తండ్రి. ఏఐటీఏ నుంచి ఎలాంటి స్పందన లేదు ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘ఈ విషయం గురించి నేను ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్కు లేఖ రాశాను. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అంతేకాక చండీగఢ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్(సీఎల్టీఏ) నిందితులకు చట్టపరమైన మద్దతు ఇవ్వడమే కాక వారి బెయిల్ బాండ్లను కూడా చెల్లించింది’ అని తెలిపాడు. దీని గురించి సీఎల్టీఏను ప్రశ్నించగా.. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నందున తామేమి స్పందించలేమని తెలిపింది. -
‘అర్జున’ బరిలో అంకిత, దివిజ్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారులు అంకితా రైనా, దివిజ్ శరణ్ కేంద్ర ప్రభుత్వ పురస్కారం ‘అర్జున’ అవార్డు బరిలో నిలవనున్నారు. 2018 ఆసియా క్రీడల పతక విజేతలైన వీరిద్దరి పేర్లను అర్జున అవార్డు కోసం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సిఫారసు చేయనుంది. వీరిద్దరితో పాటు భారత డేవిస్ కప్ మాజీ కోచ్ నందన్ బాల్ పేరును ధ్యాన్చంద్ అవార్డు కోసం ‘ఐటా’ నామినేట్ చేయనున్నట్లు సమాచారం. -
‘ఐటా’ తీరు ఆశ్చర్యం కలిగించలేదు!
ముంబై: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) తనతో వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని మాజీ ఆటగాడు మహేశ్ భూపతి వ్యాఖ్యానించాడు. అయితే ‘ఐటా’ గత రికార్డును బట్టి చూస్తే ఇది తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని అతను అన్నాడు. పాకిస్తాన్తో జరిగే డేవిస్ కప్ మ్యాచ్ కోసం ముందుగా మహేశ్నే నాన్ప్లేయింగ్ కెప్టెన్గా ‘ఐటా’ ఎంపిక చేసింది. అయితే అతను పాకిస్తాన్ ప్రయాణించేందుకు ఇష్టపడటం లేదంటూ తొలగించింది. దీనిపై భూపతి స్పందించాడు. ‘నేను కెప్టెన్గా పనికి రానని వారు భావిస్తే తప్పు లేదు. కానీ ప్రస్తుతం నీకు బదులుగా మరొకరిని ఎంపిక చేస్తున్నామని ఒక్క ఫోన్ కాల్ చేసినా బాగుండేది. కానీ నాకు కనీస సమాచారం కూడా అందించలేదు. నన్ను కెప్టెన్గా ఎంపిక చేయాలని భావించిన రోజున హైదరాబాద్కు వచ్చి మరీ నాతో కలిసి మాట్లాడారు. కానీ ఇప్పుడు వారి ప్రవర్తన తీవ్ర నిరాశ కలిగించింది. నేను బాధ పడటం కూడా సహజం. అయితే గత ఇరవై ఏళ్లుగా భారత టెన్నిస్ సంఘం పలువురు ఆటగాళ్లతో వ్యవహరించిన తీరును బట్టి చూస్తే ఇది ఆశ్చర్యం కలిగించలేదు’ అని భూపతి వివరించాడు. -
ఐటా సింగిల్స్ చాంప్ వినీత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కుర్రాడు ముత్యాల వినీత్ అదరగొట్టాడు. తొలిసారి తెలుగు రాష్ట్రాల నుంచి బాలుర విభాగంలో అఖిల భారత టెన్నిస్ సంఘం సింగిల్స్ టైటిల్ని నెగ్గిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. బాలుర అండర్–14 విభాగంలో వినీత్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్లో వినీత్ 6–3, 4–6, 6–3తో సిద్ధార్థ్ మరాఠే (మహారాష్ట్ర)పై విజయం సాధించి టైటిల్ను ఖాయం చేసుకున్నాడు. తొలి సెట్ గెలిచిన వినీత్ రెండో సెట్లో వెనుకబడ్డాడు. అయితే నిర్ణాయక మూడో సెట్లో దూకుడుగా ఆడి సెట్తో పాటు మ్యాచ్నూ గెలిచాడు. -
మరీ ఇంత దారుణమా?: మహేశ్ భూపతి
న్యూఢిల్లీ: తనను భారత డేవిస్కప్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించడంపై మాజీ టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి ఆవేదన వ్యక్తం చేశాడు. టెన్నిస్ కెరీర్కు ఎప్పుడో దూరమైన భూపతి.. డేవిస్కప్ ఆడే భారత జట్టుకు ఇప్పటివరకూ కెప్టెన్గా వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఐటా) అతన్ని కెప్టెన్సీ పదవి నుంచి అర్థాంతరంగా తొలగించడంపై భూపతి మండిపడ్డాడు. మరీ ఇంత దారుణంగా వ్యహరిస్తారా అంటూ ఐటా తీరును తప్పుబట్టాడు. ‘ నన్ను భారత డేవిస్కప్ కెప్టెన్సీ నుంచి తప్పించాలంటే ఆ పని ముందే చేయాల్సింది. ఈ ఏడాది ఆరంభంలో ఇటలీతో జరిగిన డేవిస్కప్లో భారత్ ఓడిపోయినప్పుడే కెప్టెన్సీ నుంచి తప్పించాల్సింది. ఇప్పుడు దాన్ని సాకుగా చూపుతూ ఉన్నపళంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇక్కడ ఐటా వ్యవహరించిన తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక్కసారిగా నన్ను తప్పించడం వెనుక కుట్ర జరిగింది. నేను ఎప్పుడూ ఆటగాళ్ల కోసం వారి రక్షణ కోసం ఆలోచిస్తూ వచ్చాను. దానిలో భాగంగానే డేవిస్కప్ మ్యాచ్లు ఆడటానికి పాకిస్తాన్ వెళ్లలేమని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీఎఫ్)కు తేల్చిచెప్పాను దాంతో తటస్థ వేదికపై ఆడటానికి ఐటీఎఫ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 15వ తేదీన జరిగిన ఒక సమావేశానికి నేను కెప్టెన్సీ హోదాలో హాజరయ్యా. ఉన్నట్టుండి నా కెప్టెన్సీకి స్వస్థి పలికారు. నవంబర్ 4వ తేదీన నన్ను కెప్టెన్గా తొలగిస్తూ ఐటా సెక్రటరీ జనరల్ హిరోన్మయ్ ఛటర్జీ ఫోన్లో చెప్పారు. కానీ కారణాలు చెప్పలేదు. విభజించు-పాలించు విధానాన్ని ఐటా అవలంభిస్తోంది’ అని మహేశ్ భూపతి విమర్శించాడు. -
సెమీస్లో సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సీవీజీ నాయుడు స్మారక ఆలిండియా మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య నిలకడగా రాణిస్తోంది. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఈ టోరీ్నలో దేదీప్య సెమీఫైనల్కు చేరుకుంది. బుధవారం సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్లో సాయిదేదీప్య 6–1, 6–1తో షరోన్ విలియమ్స్ (కర్ణాటక)పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు ప్రిక్వార్టర్స్లో 6–2, 6–2తో ఆపేక్ష సోలంకీ (కర్ణాటక)పై గెలుపొందగా... తొలి రౌండ్లో తెలంగాణ ప్లేయర్ మౌలికరామ్ తప్పుకోవడంతో దేదీప్యకు వాకోవర్ లభించింది. ఇదే టోరీ్నలో మరో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రషి్మక క్వార్టర్స్కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్లో రష్మిక 6–0, 6–1తో అదితి నారాయణన్పై నెగ్గింది. తొలి రౌండ్లో ఆమె 6–3, 6–0తో ఎస్బీ అపూర్వను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్స్ మ్యాచ్లో వన్షిత పతానియా (కర్ణాటక)తో దేదీప్య ఆడుతుంది. -
ప్రిక్వార్టర్స్లో తీర్థశశాంక్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పురుషుల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ ఎం. తీర్థ శశాంక్ నిలకడగా రాణిస్తున్నాడు. పంజాబ్లోని జసోవాల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో శశాంక్ ప్రిక్వార్టర్స్కు చేరుకున్నాడు. సోమవారం పురుషుల సింగిల్స్ మ్యాచ్లో తీర్థ శశాంక్ (తెలంగాణ) 6–3, 6–4తో ఎనిమిదో సీడ్ అనురాగ్ (ఢిల్లీ)పై విజయం సాధించాడు. -
చాందిని డబుల్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి చాందిని శ్రీనివాసన్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. జలంధర్లో జరిగిన ఈ టోర్నీలో అండర్–14 బాలికల సింగిల్స్ ఫైనల్లో చాందిని 6–0, 6–1తో ప్రాణ్య (ఢిల్లీ)పై గెలుపొందింది. సెమీస్లో 6–0, 6–2తో సహీరా సింగ్ (హరియాణా)పై, క్వార్టర్స్లో 6–1, 6–1తో ఐశ్వర్య (మహారాష్ట్ర)పై గెలిచింది. డబుల్స్లో ప్రతిష్ట సైనీ (పంజాబ్)తో జతకట్టిన చాందిని ఫైనల్లో 6–2, 6–3తో ఇనాయత్ రాయ్–ప్రాణ్యలను ఓడించి చాంపియన్లుగా నిలిచారు. సెమీస్లో చాందిని–ప్రతిష్ట ద్వయం 6–2, 6–2తో సీరత్ (పంజాబ్)–షగుణ్ (ఉత్తరప్రదేశ్) జోడీపై గెలిచి ఫైనల్కు చేరుకుంది. -
రన్నరప్ రాజేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్:అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు పట్లోళ్ల రాజేశ్వర్ రెడ్డి ఆకట్టుకున్నాడు. హరియాణాలోని కర్నాల్లో జరిగిన ఈ టోర్నీలో రాజేశ్వర్ రెడ్డి రన్నరప్ ట్రోఫీని అందుకున్నాడు. శుక్రవారం జరిగిన అండర్–16 బాలుర సింగిల్స్ ఫైనల్లో రాజేశ్వర్ రెడ్డి (తెలంగాణ) 5–7, 2–6తో ఆర్యన్ ఠాకూర్ (చండీగఢ్) చేతిలో వరుస సెట్లలో ఓడిపోయాడు. -
తరుణ్, తానియాలకు టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) టోర్నమెంట్లో తానియా సరాయ్, టి. తరుణ్ సత్తా చాటారు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో అండర్–14 బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. బాలుర ఫైనల్లో తరుణ్ 6–4, 6–4తో శ్రీశరణ్పై గెలుపొందగా... బాలికల కేటగిరీలో తానియా 6–2, 6–3తో లక్ష్మీశ్రీని ఓడించింది. అండర్–12 కేటగిరీలో వన్షిక మరియా, తిరుమురుగన్ విజేతలుగా నిలిచారు. బాలుర తుదిపోరులో తిరుమురుగన్ 6–2, 6–2తో అనీష్ జైన్పై, బాలికల ఫైనల్లో వన్షిక 5–7, 6–4, 6–2తో రిషితపై విజయం సాధించారు. మరోవైపు బాలుర డబుల్స్ విభాగంలో మురళీ కౌశల్–భవ్యానంద్ రెడ్డి జంట... బాలికల విభాగంలో రిషిత–తోరిత చక్రవర్తి జంటలు చాంపియన్లుగా నిలిచాయి. ఆకాంక్ష–స్నిగ్ధ జోడీ, ఆరవ్–శ్రీవంత్ రెడ్డి జోడీ రన్నరప్తో సరిపెట్టుకున్నాయి. అండర్–14 బాలుర డబుల్స్ ఫైనల్లో ప్రణీత్ సింగ్–మిహిర్ పర్చా జోడీపై తరుణ్ కోర్వర్–శ్రీశరణ్ జంట... బాలికల విభాగంలో లక్ష్మీసిరి–పద్మ వేద జోడీపై తానియా సరాయ్–నైనిక రెడ్డి ద్వయం గెలుపొంది విజేతలుగా నిలిచాయి. -
సింగిల్స్ విజేత లక్ష్మీసాహితిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ), చండీగఢ్ లాన్ టెన్నిస్ సంఘం (సీఎల్టీఏ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వుటుకూరు లక్ష్మీసాహితిరెడ్డి చాంపియన్గా అవతరించింది. చండీగఢ్లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో లక్ష్మీసాహితి 7–5, 6–4తో సాల్సా అహిర్ (మహారాష్ట్ర)పై వరుస సెట్లలో విజయం సాధించింది. కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన లక్ష్మీసాహితి క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టింది. టైటిల్ గెలిచే క్రమంలో ఆమె ప్రత్యర్థులకు ఒక్కసెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్లో లక్ష్మీసాహితి 6–2, 6–2తో ఆర్తి మునియన్ (తమిళనాడు)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లో 7–6 (8/6), 6–1తో టాప్ సీడ్ యుబ్రాని బెనర్జీ (పశ్చిమ బెంగాల్)కి షాకిచ్చింది. క్వార్టర్ ఫైనల్లో 6–2, 6–4తో ఆరో సీడ్ ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ)పై, సెమీఫైనల్లో 6–4, 6–3తో నాలుగో సీడ్ శ్రావ్య శివాని (తెలంగాణ)పై విజయం సాధించింది. -
సాయికార్తీక్ రెడ్డికి సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: గురుకుల్ ‘ఐటా’ ఆలిండియా పురుషుల టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయికార్తీక్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. భువనేశ్వర్లో జరిగిన ఈ టోర్నమెంట్లో క్వాలిఫయర్గా బరిలోకి దిగిన సాయికార్తీక్ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ టైటిల్పోరులో అన్సీడెడ్ సాయికార్తీక్ 6–3, 6–3తో టాప్ సీడ్ అన్షు కుమార్ భూయాన్ (ఒడిశా)ను కంగుతినిపించాడు. ఈ టోర్నమెంట్ ఆసాంతం నిలకడగా ఆడిన సాయికార్తీక్... జనవరిలో జరిగిన ఖేలో ఇండియా చాంపియన్షిప్లో అండర్–21 పురుషుల సింగిల్స్, డబుల్స్ కేటగిరీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాడు. -
టైటిల్ పోరుకు సాయికార్తీక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గురుకుల్ ‘ఐటా’ ఆలిండియా పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయికార్తీక్ రెడ్డి నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. భువనేశ్వర్లో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వాలిఫయర్గా బరిలోకి దిగిన సాయికార్తీక్ రెడ్డి తనకన్నా మెరుగైన క్రీడాకారులను ఓడించి టైటిల్పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సాయికార్తీక్ రెడ్డి 6–2, 6–4తో రెండోసీడ్ విలాసిర్ (హరియాణా)పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో సాయికార్తీక్ 4–6, 6–3, 6–2తో కైవల్య కలాంసే (మహారాష్ట్ర)పై పోరాడి గెలిచాడు. రెండో రౌండ్లో 3–6, 6–0, 6–2తో వి. హేవంత్ (తెలంగాణ)పై, తొలి రెండ్లో ఏకే రోహిత్పై గెలుపొందాడు. -
రన్నరప్ సాయిదేదీప్య జంట
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు సాయిదేదీప్య, మౌలిక రామ్ రాణించారు. బెంగళూరులో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ జతగా రన్నరప్గా నిలిచారు. గురువారం జరిగిన టైటిల్పోరులో సాయిదేదీప్య–మౌలిక రామ్ ద్వయం 6–0, 4–6, 10–8తో సాల్సా అహెర్ (మహారాష్ట్ర)–లిఖిత (తెలంగాణ) జంట చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సాయిదేదీప్య–మౌలిక జంట 6–4, 6–2తో ఆర్తి ముణియన్ (తమిళనాడు)–విదుల (కర్ణాటక) జోడీపై గెలుపొందింది. -
సెమీస్లో సాయిదేదీప్య జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు సాయిదేదీప్య, మౌలిక రామ్ నిలకడగా రాణిస్తున్నారు. బెంగళూరులో జరుగుతోన్న ఈ టోర్నీలో జంటగా బరిలోకి దిగిన వీరిద్దరూ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య–మౌలిక రామ్ ద్వయం 6–2, 7–6 (9/7)తో రాధిక యాదవ్ (హరియాణా)–స్నిగ్ధ (కర్ణాటక) జోడీపై విజయం సాధించి ముందంజ వేసింది. -
సంజన డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–16, అండర్–18 టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల సత్తా చాటింది. హరియాణాలోని కర్నల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆమె పాల్గొన్న రెండు వయో విభాగాల్లోనూ విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. అండర్–16 బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన సంజన... అండర్–18 కేటగిరీలో రన్నరప్తో సరిపెట్టుకుంది. కానీ అండర్–18 డబుల్స్ కేటగిరీలో తన భాగస్వామి ఆర్నిరెడ్డితో కలిసి చాంపియన్గా నిలిచింది. శనివారం జరిగిన అండర్–16 బాలికల టైటిల్పోరులో సంజన 6–4, 7–5తో రాధిక రాజేశ్ (మహారాష్ట్ర)పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్లో సంజన 6–2, 6–1తో నియతి (ఉత్తరాఖండ్)పై, క్వార్టర్స్లో 6–2, 6–0తో క్రిస్టీ బోరో (అస్సాం)పై, ప్రిక్వార్టర్స్లో 6–0, 6–0తో వన్య అరోరా (మహారాష్ట్ర)పై, తొలి రౌండ్లో 6–1, 6–3తో అనా వర్షిణి (ఉత్తర్ప్రదేశ్)పై విజయం సాధించింది. సింగిల్స్ ఓడినా.. డబుల్స్ దక్కింది అండర్–16 విభాగంలో ఆధిపత్యం ప్రదర్శించిన సంజన... అండర్–18 కేటగిరీ సింగిల్స్లో చివరి మెట్టుపై తడబడింది. ఫైనల్లో సంజన 4–6, 3–6తో గార్గి (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్లో సంజన 6–4, 1–6, 6–1తో కశిష్ భాటియా (ఢిల్లీ)పై, క్వార్టర్స్లో 6–1, 5–7, 6–4తో హర్లీన్ కౌర్ (పంజాబ్)పై, ప్రిక్వార్టర్స్లో 6–1, 6–2తో క్రితిక (హరియాణా)పై, తొలి రౌండ్లో 6–1, 6–1తో ఐరా సూద్ (తెలంగాణ)పై గెలుపొంది ంది. మరోవైపు డబుల్స్ విభాగంలో భాగస్వామి ఆర్నిరెడ్డితో కలిసి సంజన టైటిల్ను సాధించింది. అండర్–18 బాలికల డబుల్స్ తుదిపోరులో సంజన–ఆర్నిరెడ్డి ద్వయం 7–6, 6–4తో పవిత్రా రెడ్డి జోడీపై విజయం సాధించింది. -
ఫైనల్లో అపురూప్ రెడ్డి జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం పురుషుల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు పి. అపురూప్ రెడ్డి నిలకడగా రాణిస్తున్నాడు. తన భాగస్వామి బీఆర్ నిక్షేప్తో కలిసి అపురూప్ రెడ్డి డబుల్స్ విభాగంలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్ మ్యాచ్లో పి.అపురూప్ రెడ్డి–నిక్షేప్ ద్వయం 6–1, 6–3తో ఆకాశ్ నంద్వాల్–ఉదిత్ యాదవ్ జంటపై గెలుపొందింది. అంతకుముందు క్వార్టర్స్లో అపురూప్–నిక్షేప్ జంట 6–0, 6–1తో సందీప్ యాదవ్–హ్రితేశ్ పటేల్ జోడీని ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో తాహా కపాడియా–పరీక్షిత్ సోమని జంటతో అపురూప్ జోడీ తలపడుతుంది. అరబిందో ఫార్మా ఫౌండేషన్ గత మూడేళ్లుగా అపురూప్ రెడ్డికి స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. -
నిధి చిలుములకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పురుషుల, మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి నిధి చిలుముల విజేతగా నిలిచింది. పుణేలో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకొని ఈ సీజన్లో తొలి టైటిల్ను అందుకుంది. ఆదివారం గంటన్నరపాటు జరిగిన తుదిపోరులో ఏడో సీడ్ నిధి చిలుముల 6–4, 6–0తో నాలుగో సీడ్ సోహా సాధిక్ (కర్ణాటక)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన నిధి రూ. 15,600 ప్రైజ్మనీగా అందుకుంది. పురుషుల సింగిల్స్లో స్థానిక ఆటగాడు అన్విత్ బింద్రే చాంపియన్గా నిలిచాడు. డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి శ్రావ్య చిలకలపూడి జంట టైటిల్ను హస్తగతం చేసుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రావ్య (తెలంగాణ)–వైదేహి చౌదరి (గుజరాత్) ద్వయం 4–6, 6–1, 10–5తో షేక్ హుమేరా–సారా యాదవ్ (తెలంగాణ) జంటపై పోరాడి గెలుపొందింది. -
టైటిల్ పోరుకు నిధి, సోహా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పురుషుల, మహిళల ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు నిధి చిలుముల, షేక్ హుమేరా, సారా యాదవ్ నిలకడగా రాణిస్తున్నారు. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నీలో నిధి సింగిల్స్ విభాగంలో... షేక్ హుమేరా–సారా యాదవ్ ద్వయం డబుల్స్ కేటగిరీలలో ఫైనల్కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో ఏడో సీడ్ నిధి చిలుముల (తెలంగాణ) 7–6 (9/7), 6–4తో టాప్ సీడ్ వైదేహి చౌదరీ (గుజరాత్)కి షాకిచ్చింది. మరో మ్యాచ్లో నాలుగో సీడ్ సోహా సాధిక్ (ఆంధ్రప్రదేశ్) 6–3, 6–2తో రెండో సీడ్ నిత్యరాజ్ బాబురాజ్ (తమిళనాడు)ను కంగుతినిపించింది. మరోవైపు మహిళల డబుల్స్ సెమీస్ మ్యాచ్లో షేక్ హుమేరా–సారా యాదవ్ ద్వయం 6–3, 6–4తో సాయి–ఆర్తి జంటపై గెలుపొందగా... అనూష కొండవీటి–సాయిదేదీప్య జంట 1–6, 1–6తో శ్రావ్య చిలకలపూడి–వైదేహి చౌదరీ జంట చేతిలో ఓటమి పాలైంది. -
ఫైనల్లో సాయిదేదీప్య జంట
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య నిలకడగా రాణి స్తోంది. బెంగళూరులో జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి అనూష కొండవీటి (ఏపీ)తో కలిసి డబుల్స్ ఫైనల్కు చేరుకుంది. బుధవారం జరిగిన బాలికల డబుల్స్ సెమీఫైనల్లో సాయిదేదీప్య (తెలంగాణ)–అనూష (ఏపీ) ద్వయం 7–6 (7/5), 6–1తో ఆర్తి మునియన్ (తమిళనాడు)–దీక్ష మంజు ప్రసాద్ (కర్ణాటక) జంటపై విజయం సాధించింది. -
మలిష్క డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్షిప్ సిరీస్ అండర్–14 టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కె. మలిష్క సత్తా చాటింది. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మలిష్క సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ మలిష్క (తెలంగాణ) 6–0, 6–3తో రెండోసీడ్ హర్షిణి విశ్వనాథ్ (ఏపీ)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్లో మలిష్క 6–1, 6–2తో రాహీన్ తరనమ్ (తెలంగాణ)పై, క్వార్టర్స్లో 6–2, 6–1తో జ్యోత్స్న (ఏపీ)పై నెగ్గింది. మరోవైపు బాలికల డబుల్స్ టైటిల్పోరులో మలిష్క–రాహీన్ (తెలంగాణ) ద్వయం 7–5, 6–2తో హర్షిణి–జ్యోత్స్న (ఏపీ) జోడీపై నెగ్గి చాంపియన్గా నిలిచింది. సెమీస్లో మలిష్క జంట 6–1, 6–2తో శవినిత–చరిష్మా జోడీపై గెలిచింది. బాలుర విభాగంలో మహారాష్ట్రకు చెందిన అర్నవ్ విజేతగా నిలవగా... ఏపీ ప్లేయర్ సుహృధ్ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో అర్నవ్ 7–6 (1), 6–1తో సుహృధ్ను ఓడించాడు. డబుల్స్ ఫైనల్లో మురళీ సాత్విక్–సుహృధ్ (ఏపీ) జంట 6–3, 6–1తో సిద్ధాంత్ కృష్ణ (హరియాణా)–యజ్ఞేశ్ (తెలంగాణ) జోడీపై విజయం సాధించి టైటిల్ను అందుకుంది., , , -
అబ్దుల్ గఫర్, ప్రతిమ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) వీల్ చెయిర్ టెన్నిస్ టోర్నమెంట్లో కర్ణాటక క్రీడాకారులు అబ్దుల్ గఫర్, ప్రతిమా రావు శుభారంభం చేశారు. హైదరాబాద్ తొలిసారి ఆతిథ్యమిస్తోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ తొలిరౌండ్లో విజయం సాధించారు. ఎల్బీ స్టేడియంలో నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీని అగ్రశ్రేణి కథానాయిక అక్కినేని సమంత ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. బుధవారం జరిగిన పురుషుల తొలిరౌండ్ మ్యాచ్లో అబ్దుల్ గఫర్ 9–2తో దేవేంద్ర (కర్ణాటక)పై గెలుపొందగా... మహిళల విభాగంలో ప్రతిమా రావు 9–0తో సుధ (కర్ణాటక)ను ఓడించింది. ఇతర మ్యాచ్ల్లో శిల్ప 9–6తో నళిని కుమారిపై, వీరాస్వామి శేఖర్ (కర్ణాటక) 9–0తో కుందరాగి బసవరాజు (కర్ణాటక)పై గెలుపొందారు. ఇతర పురుషుల తొలిరౌండ్ మ్యాచ్ల్లో అంజినప్ప (కర్ణాటక) 9–5తో కేదార్ మండల్ (ఢిల్లీ)పై, శరవణన్ (కర్ణాటక) 9–3తో ఇందుధర బీఎస్ (కర్ణాటక)పై, దేవ గౌడ (కర్ణాటక) 7–5తో కేశవన్ (కర్ణాటక)పై, మౌలాలి (కర్ణాటక) 9–4తో హనుమంతప్ప (కర్ణాటక)పై నెగ్గారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్ ఎండీ ఎ. దినకర్బాబు, తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, ఇండియన్ వీల్చెయిర్ టెన్నిస్ టూర్ (ఐడబ్ల్యూటీటీ) చైర్మన్ సునీల్ జైన్, భారత టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
రన్నరప్ సాయిదేదీప్య జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్య రాణించింది. కోయంబత్తూర్లో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి సారా యాదవ్తో కలిసి డబుల్స్ రన్నరప్గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సాయిదేదీప్య–సారా యాదవ్ (మధ్య ప్రదేశ్) జంట 2–6, 4–6తో నిధి చిలుముల (తెలంగాణ)–శ్వేతా రాణా (ఢిల్లీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
అదితి డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ఐటా చాంపియన్షిప్ సిరీస్లో తెలంగాణ అమ్మాయి అదితి ఆరే రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. కొంపల్లిలో జరిగిన ఈ టోర్నీలో ఆమె అండర్–16, 18 బాలికల సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన అండర్–18 బాలికల సింగిల్స్ ఫైనల్లో అదితి 6–4, 6–2తో ఆర్ని రెడ్డి (తెలంగాణ)పై గెలుపొందింది. బాలుర విభాగంలో ఇక్బాల్ ఖాన్ (తెలంగాణ) 7–5, 6–4తో సుహిత్ రెడ్డి (తెలంగాణ)ను ఓడించాడు. అండర్–16 ఫైనల్లో అదితి 6–3, 6–4తో అభయ వేమూరి (తెలంగాణ)పై గెలుపొందింది. బాలుర డబుల్స్లో మోహిత్ జోడీ విజేతగా నిలిచింది. అండర్–18 బాలికల డబుల్స్ ఫైనల్లో అభయ– అపూర్వ (తెలంగాణ) ద్వయం 6–3, 6–0తో వేద వశిష్ట– వేదరాజు ప్రపూర్ణ (తెలంగాణ) జోడీపై నెగ్గగా... బాలుర విభాగంలో సుహిత్ రెడ్డి (తెలంగాణ)–అద్వైత్ అగర్వాల్ (మహారాష్ట్ర) జంట 7–5, 6–3తో రిషికేశ్ సుంకర–కార్తీక్ నీల్ వడ్డేపల్లి (తెలంగాణ) జోడీని ఓడించి విజేతలుగా నిలిచాయి. -
ఏషియాడ్కు పేస్ దూరం
పాలెమ్బాంగ్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొత్త వివాదాన్ని రేపాడు. డబుల్స్లో తన భాగస్వామిని ఎంపిక చేసిన తీరును నిరసిస్తూ ఏకంగా పోటీలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మెగా ఈవెంట్లో తనకు సరితూగే డబుల్స్ పార్ట్నర్ను ఎంపిక చేయలేదంటూ ‘ఐటా’పై విమర్శలు గుప్పించాడు. ఇండోనేసియా ఆతిథ్యమివ్వనున్న ఈ క్రీడల నుంచి పేస్ ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో నిబంధనల ప్రకారం మరో ఆటగాడిని ఎంపిక చేసే అవకాశం లేదు. భారత టెన్నిస్ జట్టు గురువారం ఇండోనేసియా చేరుకుంది. అయితే ఈ జట్టుతో పాటు వెటరన్ స్టార్ వెళ్లలేదు. 2010, 2014 ఆసియా క్రీడల్లోనూ పాల్గొనని లియాండర్ వరుసగా మూడోసారీ ప్రతిష్టాత్మక క్రీడలకు దూరమయ్యాడు. దీనిపై వెటరన్ స్టార్ మాట్లాడుతూ ‘బరువెక్కిన హృదయంతో చెబుతున్నా... నేను ఆసియా క్రీడల్లో బరిలోకి దిగడం లేదు. సరైన డబుల్స్ భాగస్వామి లేకే క్రీడల నుంచి తప్పుకుంటున్నా. నాకు సరితూగే డబుల్స్ భాగస్వామిని చూడాలని ఇది వరకే ‘ ఐటా’ను కోరినప్పటికీ సానుకూల స్పందన రాలేదు. అందువల్లే వైదొలగాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పారు రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ జోడీ కట్టడంతో విశేష అనుభవజ్ఞుడైన పేస్కు సుమిత్ నాగల్, సింగిల్స్ స్పెషలిస్ట్ రామ్కుమార్ రామనాథన్లలో ఒకరిని జత చేయాలనుకున్నారు. దీంతో అతను ఆడలేనంటూ తప్పుకున్నాడు. 1994లో జరిగిన హిరోషిమా ఆసియా క్రీడల నుంచి 2006 దోహా క్రీడల వరకు ప్రతీ ఈవెంట్ల్లోనూ పాల్గొన్న 45 ఏళ్ల పేస్ 5 స్వర్ణ పతకాలను గెలిచాడు. -
రన్నరప్ మలిష్క జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–14 సూపర్ సిరీస్ టోర్న మెంట్లో హైదరాబాద్ జోడీ మలిష్క– ఆర్నిరెడ్డి డబుల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచింది. గువాహటిలో జరిగిన ఈ టోర్నీ బాలికల డబుల్స్ ఫైనల్లో టాప్సీడ్ పరీ సింగ్ (మహారాష్ట్ర)– శ్వేత సమంత (పశ్చిమ బెంగాల్) జంట చేతిలో మలిష్క ద్వయం ఓటమి పాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్లో మలిష్క– ఆర్నిరెడ్డి 5–3, 5–4 (7)తో జెన్నిక (మహారాష్ట్ర)– అదితి(కర్ణాటక) జంటపై, క్వార్టర్స్లో 4–0, 4–0తో చాందిని (తెలంగాణ)– పరి చవాన్ (మహారాష్ట్ర) జోడీపై గెలుపొందింది. -
‘ద్రోణాచార్య’కు నాగరాజ్ పేరు సిఫారసు
సాక్షి, హైదరాబాద్: ఎంతోకాలంగా టెన్నిస్కు విశేష సేవలందిస్తోన్న హైదరాబాద్ నగర కోచ్ సీవీ నాగరాజ్ సేవలకు గుర్తింపు దక్కింది. ఆయన ఈ ఏడాదికి గానూ ద్రోణాచార్య అవార్డు కోసం నామినేట్ అయ్యారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ద్రోణాచార్య అవార్డు కోసం ఆయన పేరును సిఫారసు చేసింది. ఈ సందర్భంగా నాగరాజ్ ‘ఐటా’కు కృతజ్ఞతలు తెలిపారు. -
డబుల్స్ విజేత మలిష్క జంట
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సూపర్ సిరీస్ అండర్–12 టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి కె. మలిష్క ఆకట్టుకుంది. గువాహటిలోని ఆల్ అస్సాం టెన్నిస్ కాంప్లెక్స్లో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ ఫైనల్లో మలిష్క– అనన్య జంట 6–3, 6–1తో స్నిగ్ధ–తాన్య (అస్సాం) జోడీపై గెలుపొందింది. అన్సీడెడ్గా బరిలోకి దిగిన ఈ జంట అంతకుముందు జరిగిన సెమీస్లో 7–5, 7–6 (7/5)తో టాప్ సీడ్ దుర్గాన్షి (ఢిల్లీ)–రిధి చౌదరి (ఏపీ) జోడీకి షాకిచ్చింది. క్వార్టర్స్లో 2–6, 6–4, 10–2తో నాలుగోసీడ్ సోహా సింగ్ (కర్ణాటక)–అస్మీ అడ్కర్ (మహారాష్ట్ర) జంటను ఓడించింది. పోటీల అనంతరం ఐటీఎఫ్ చీఫ్ రిఫరీ సురజిత్ బందోపాధ్యాయ్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
సహజ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ 50కే ప్రైజ్మనీ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి రెండు టైటిళ్లతో మెరిసింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో అన్సీడెడ్గా బరిలోకి దిగిన సహజ మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సహజ 6–1, 6–1తో టాప్సీడ్ ప్రతిభ ప్రసాద్ (కర్ణాటక)పై ఘనవిజయం సాధించింది. మరోవైపు డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్యతో జతకట్టి టైటిల్ను కైవసం చేసుకుంది. తుదిపోరులో సహజ–సాయిదేదీప్య (తెలంగాణ) జంట 7–6 (7/5), 7–5తో టాప్ సీడ్ షాజిహా బేగం–షేక్ హుమేరా (తెలంగాణ) జోడీకి షాకిచ్చింది. పురుషుల విభాగంలో ఏపీకి చెందిన కె. శ్రీనివాస్కు నిరాశ ఎదురైంది. సింగిల్స్ ఫైనల్లో శ్రీనివాస్ 6–3, 4–6, 2–6తో భరత్ కుమారన్ (తమిళనాడు) చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచాడు. డబుల్స్ ఫైనల్లో నిక్షీప్–జూడ్ రేమండ్ జంట 7–6 (7/5), 6–4తో కవిన్ మసిలమణి–భరత్ కుమారన్ జోడీపై విజయం సాధించింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్టీఏ) కార్యదర్శి అశోక్ కుమార్ మఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీఏ సంయుక్త కార్యదర్శి వి. నారాయణదాస్ పాల్గొన్నారు. -
సింగిల్స్, డబుల్స్ ఫైనల్లో సహజ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ 50కే ప్రైజ్మనీ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఫైనల్కు చేరింది. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సహజ 6–1, 7–5తో కె. లిఖిత (తెలంగాణ)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో కర్ణాటకకు చెందిన ప్రతిభ ప్రసాద్తో తలపడుతుంది. డబుల్స్ సెమీఫైనల్లో సహజ– వై. సాయిదేదీప్య (తెలంగాణ) జంట 6–3, 6–1తో ప్రతిభ– ప్రగతి జోడీపై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. మరో సెమీస్ మ్యాచ్లో షాజీహా బేగం– షేక్ హుమేరా జంట 6–3, 7–5, 10–7తో భక్తి షా– సి. శ్రావ్య శివాని ద్వయాన్ని ఓడించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఏపీకి చెందిన కె. శ్రీనివాస్ ఫైనల్కు చేరాడు. -
రన్నరప్ సన్నీత్
సాక్షి, హైదరాబాద్: ‘ఐటా’ అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్లో సరోజిని అకాడమీ క్రీడాకారుడు సన్నీత్ ఉప్పాటి రన్నరప్గా నిలిచాడు. బంజారాహిల్స్లోని సంజయ్ టెన్నిస్ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సన్నీత్ 7–8తో వర్షిత్ చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన సెమీస్లో 7–1తో వేదాంత్ మిశ్రాపై, క్వార్టర్స్లో 8–7తో జయసింహాపై విజయం సాధించాడు. ఈ సందర్భంగా సన్నీత్ను టీఎస్ఆర్టీసీ కార్యదర్శి, మాజీ వాలీబాల్ క్రీడాకారుడు జి. కిరణ్రెడ్డి అభినందించారు. -
ప్రిక్వార్టర్స్లో సాయి దేదీప్య, సహజ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) 50కే ప్రైజ్మనీ మహిళల, పురుషుల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య, సహజ శుభారంభం చేశారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ ప్రిక్వార్టర్స్కు చేరుకున్నారు. సోమవారం జరిగిన తొలిరౌండ్లో రెండోసీడ్ దేదీప్య 5–7, 6–4, 6–1తో సింధు జనగాం (తెలంగాణ)పై విజయం సాధించింది. నేడు జరిగే ప్రిక్వార్టర్స్లో కర్ణాటకకు చెందిన సొనాషి భట్నాగర్తో దేదీప్య తలపడుతుంది. మరో మ్యాచ్లో సహజ యామలపల్లి 6–2, 2–6, 6–2తో మౌలిక రామ్ (తెలంగాణ)ను ఓడించింది. పురుషుల తొలిరౌండ్ మ్యాచ్ల్లో టాప్సీడ్ కృష్ణ తేజ (తెలంగాణ) 7–5, 6–1తో హిమాన్షు మౌర్య (ఛత్తీస్గఢ్)పై గెలుపొందగా... సాయి నిఖిల్ (తెలంగాణ) 4–6, 4–6తో సంసిధ్ (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్లో కవిన్ మసిలమణి (తమిళనాడు) 4–6, 6–3, 6–3తో రోహిత్ కృష్ణ (తెలంగాణ)పై నెగ్గారు. ఇతర మహిళల మ్యాచ్ల ఫలితాలు లక్ష్మీ సాహితి రెడ్డి (ఏపీ) 6–0, 6–2తో సొనాలి జైశ్వాల్ (తెలంగాణ)పై, అనూష కొండవీటి (ఏపీ) 6–3, 6–3తో దీక్ష (తెలంగాణ)పై, ముష్రత్ షేక్ (ఏపీ) 6–3, 6–2తో భక్తి షా (తెలంగాణ)పై, షాజిహా బేగం (తెలంగాణ) 6–2, 7–5తో మాల్విక శుక్లా (మహారాష్ట్ర)పై, లిఖిత (తెలంగాణ) 7–5, 6–4తో ఆకాంక్ష నిట్టూర్ (మహారాష్ట్ర)పై, సంస్కృతి దామెర (తెలంగాణ) 6–3, 7–6 (4), 6–3తో బిపాషా (ఏపీ)పై, సి. శ్రావ్య శివాని (తెలంగాణ) 6–3, 6–1తో విదిషా రెడ్డి (తెలంగాణ)పై, ఎల్. లిఖిత (తెలంగాణ) 6–1, 6–1తో భవిక (మహారాష్ట్ర)పై గెలుపొందారు. -
చాంపియన్ శ్రావ్య–హుమేరా జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) 50కే ప్రైజ్మనీ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రావ్య శివాని సత్తా చాటింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచిన శివాని... సింగిల్స్ కేటగిరీలో రన్నరప్ ట్రోఫీని అందుకుంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్సీడ్ శ్రావ్య శివాని–షేక్ హుమేరా (తెలంగాణ) ద్వయం 6–0, 6–4తో ఆకాంక్ష–ముష్రత్ అంజుమ్ జంటపై గెలుపొందింది. సింగిల్స్ టైటిల్పోరులో సహజ యామలపల్లి (తెలంగాణ) 6–4, 6–4తో శ్రావ్య శివానిని ఓడించి చాంపియన్గా అవతరించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఏపీకి చెందిన బి. సాయి శరణ్ రెడ్డి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో టాప్ సీడ్ పృథ్వీ శేఖర్ (తమిళనాడు) 6–3, 6–0తో సాయి శరణ్ రెడ్డిపై గెలుపొందాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం కోశాధికారి డి. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను బహూకరించారు. -
ఫైనల్లో సంజన, ప్రపూర్ణ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సూపర్ సిరీస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు సంజన సిరిమల్ల, వేదరాజు ప్రపూర్ణ ఫైనల్కు చేరారు. అజీజ్నగర్లోని లేక్వ్యూ టెన్నిస్ అకాడమీలో గురువారం జరిగిన అండర్–16 బాలికల సింగిల్స్ సెమీస్లో టాప్ సీడ్ సంజన 2–6, 7–6, 6–1తో రేష్మ (కర్నాటక)పై గెలుపొందగా, ప్రపూర్ణ 6–3, 1–6, 6–3తో యానా ధమిజ (హరియాణా)ను ఓడించాడు. డబుల్స్ విభాగంలో రెండోసీడ్ అదితి ఆరే (తెలంగాణ)– పావని పాథక్ (మహారాష్ట్ర) జంట 6–1, 6–2తో హర్షాలి– భూమిక (మహారాష్ట్ర) జోడీపై నెగ్గి ఫైనల్కు చేరుకుంది. మరోవైపు అండర్–14 విభాగంలో ఏపీకి చెందిన అనంత్ మణి తుదిపోరుకు అర్హత సాధించాడు. బాలుర సింగిల్స్ సెమీస్లో అనంత్ (ఏపీ) 4–6, 6–2, 6–3తో మోనిల్ లోట్లికార్ (కర్నాటక)ను ఓడించాడు. -
అజయ్, సింధు శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారులు అజయ్ పృథ్విక్, సింధు జనగాం శుభారంభం చేశారు. ఫతేమైదాన్లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీలో సింగిల్స్ విభాగాల్లో వీరిద్దరూ ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో అజయ్ 7–5, 6–1తో అభిషేక్ శుక్లాపై గెలుపొందగా... మహిళల విభాగంలో ఎనిమిదో సీడ్ సింధు 6–1, 6–2తో ఆకాంక్ష (మహారాష్ట్ర)ను చిత్తుగా ఓడించింది. ఇతర మహిళల తొలిరౌండ్ మ్యాచ్ల్లో స్మృతి 6–0, 6–0తో మేఘ ముత్తుకుమారన్ (తమిళనాడు)పై, సహజ (తెలంగాణ) 6–1, 6–3తో మౌలిక రామ్ (తెలంగాణ)పై, లిఖిత కాల్వ (తెలంగాణ) 6–0, 6–0తో శిల్పి స్వరూప దాస్ (ఒడిశా)పై, దీక్ష అజిత్ (ఏపీ) 6–0, 6–1తో వైశాలి ఠాకూర్ (తమిళనాడు)పై, లిఖిత లండా (ఏపీ) 6–0, 6–0తో ప్రియాంక రోడ్రిక్స్ (మహారాష్ట్ర)పై, ప్రతిభ (కర్నాటక) 6–2, 6–2తో అనీశ రాయుడు (ఏపీ)పై విజయం సాధించి రెండోరౌండ్కు చేరుకున్నారు. పురుషుల తొలిరౌండ్ మ్యాచ్ల ఫలితాలు శివదీప్ కొసరాజు (ఏపీ) 6–3, 2–6, 7–6 (5)తో కైవల్య వామనరావు (మహారాష్ట్ర)పై, హేవంత్ కుమార్ (తెలంగాణ) 7–6 (8/6), 6–1తో అమర్ (కర్ణాటక)పై, సాయి శరణ్రెడ్డి (ఏపీ) 6–4, 7–5తో శ్రీనివాస్ (ఏపీ)పై, అనికేత్ వెంకట్ (తెలంగాణ) 6–4, 3–6, 7–5తో అరవింద్ రెడ్డిపై, కృష్ణతేజ (తెలంగాణ) 6–4, 6–2తో సుభాష్పై, టి. వినయ్ కుమార్ (కర్నాటక) 6–3, 3–6, 6–3తో సౌరభ్ కుమార్పై, డి. అఖిల్ కుమార్ 3–6, 6–4, 6–2తో కె. రోహిత్పై, ఆయుశ్ (పంజాబ్)6–2, 6–3తో తరుణ్ కర్రా (తెలంగాణ)పై, పృథ్వీ శేఖర్ (తమిళనాడు) 7–5, 6–2తో దుర్గ హిమకేశ్ (తెలంగాణ)పై గెలుపొందారు. -
విజేతలు సంజన, రెనీశర్మ
హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్షిప్ సిరీస్లో తెలంగాణ క్రీడాకారులు సంజన సిరిమల్ల, రెనీ శర్మ విజేతలుగా నిలిచారు. కొంపల్లిలోని సురేశ్ కృష్ణ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో అండర్–16 విభాగంలో రెనీశర్మ, అండర్–18 విభాగంలో సంజన టైటిళ్లను సాధించారు. శనివారం జరిగిన అండర్–16 బాలికల సింగిల్స్ ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన రాధిక మహాజన్పై రెనీశర్మ విజయం సాధించింది. అండర్–18 కేటగిరీలో తెలంగాణకే చెందిన బిపాసా మోహన్పై సంజన నెగ్గింది. బాలుర విభాగంలో అఖిల్ కుమార్ (తెలంగాణ) విజేతగా నిలవగా, అశ్విన్ భట్ (కర్నాటక) రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టోర్నమెంట్ డైరెక్టర్ కృష్ణం రాజు, స్పాన్సర్ ప్రవీణ్ ముఖ్యఅతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోచ్ సురేశ్కృష్ణ, మేనేజర్ రతన్ రావు పాల్గొన్నారు. -
సంజన శుభారంభం
హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) టోర్నీలో తెలంగాణ క్రీడాకారులు సంజన సిరిమల్ల, రోహన్ కుమార్ శుభారంభం చేశారు. కొంపల్లిలో సోమవారం జరిగిన అండర్–16 బాలుర సింగిల్స్ తొలిరౌండ్లో రోహన్ (తెలంగాణ) 6–1, 6–4తో కుశ్ ఆర్జీ రాయ్ (మధ్యప్రదేశ్)పై గెలుపొందాడు. అండర్–18 బాలికల విభాగంలో సంజన సిరిమల్ల (తెలంగాణ) 6–2, 6–1తో రేచల్ ఏంజిల్స్ (తెలంగాణ)పై నెగ్గింది. ఇతర బాలుర మ్యాచ్ల్లో ప్రసాద్ ఇంగ్లే (మహారాష్ట్ర) 6–1, 6–1తో మోహిత్ సాయిచరణ్ రెడ్డి (తెలంగాణ)పై, హితేశ్ (తెలంగాణ) 6–1, 6–0తో అనీశ్ రెడ్డి (తెలంగాణ)పై, సిద్ధార్థ్ (మహారాష్ట్ర) 6–3, 6–1తో రత్నవ్ (తెలంగాణ) పై గెలుపొందారు. బాలికల మ్యాచ్ల్లో చరిత (తెలంగాణ) 6–3, 6–3తో శ్రేష్ట (తెలంగాణ)పై, అనీష (ఆంధ్రప్రదేశ్) 6–3, 7–6తో రాధిక మహాజన్ (మహారాష్ట్ర)పై విజయం సాధించారు. -
రేపటి నుంచి టెన్నిస్ టోర్నమెంట్
హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్షిప్ రేపటి నుంచి జరుగనుంది. కొంపల్లిలోని జి. బంగారు రాజు కల్చరల్ సొసైటీ వేదికగా అండర్–16, 18 బాలబాలికల విభాగాల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే క్రీడాకారుల కోసం శనివారం క్వాలిఫయింగ్ టోర్నీని నిర్వహించారు. నేటితో క్వాలిఫయింగ్ పోటీలు ముగుస్తాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఐటా టోర్నీకి అర్హత సాధిస్తారు. ఈనెల 15వ తేదీ వరకు ఐటా టోర్నీ జరుగుతుంది. -
వేద వర్షిత డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వేద వర్షిత సత్తా చాటింది. సికింద్రాబాద్లోని వశిష్ట టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నమెంట్లో అండర్–18 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ వేద వర్షిత 4–6, 7–5, 7–5తో టాప్ సీడ్ పావని పాటక్కు షాకిచ్చింది. మూడున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్లో వర్షిత పోరాటం అందర్నీ ఆకట్టుకుంది. మరోవైపు డబుల్స్ టైటిల్ పోరులో రెండో సీడ్ వేద వర్షిత– కుంకుమ్ నీల ద్వయం 7–6 (7/3), 6–4తో టాప్ సీడ్ అభయ– అపూర్వ వేమూరి (తెలంగాణ) జంటపై విజయం సాధించి చాంపియన్గా నిలిచింది. -
రన్నరప్ సింధు జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సింధు జనగాం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. బెంగళూరులో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి శరణ్య శెట్టితో కలిసి డబుల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సింధు (తెలంగాణ)– శరణ్య (మహారాష్ట్ర) జంట 4–6, 6–1, 6–10తో అవిష్క గుప్తా (జార్ఖండ్)–ఎం. ఆర్తి (తమిళనాడు) జోడీ చేతిలో సూపర్ టైబ్రేక్లో పరాజయం పాలైంది. -
లియాండర్ పేస్కు చోటు!
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల చరిత్రలో ఎనిమిది పతకాలు సాధించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరోసారి ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగనున్నాడు. వేర్వేరు కారణాలతో పేస్ 2010, 2014 ఆసియా క్రీడల్లో ఆడలేదు. హైదరాబాద్కు చెందిన డేవిస్ కప్ మాజీ ప్లేయర్ ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సెలక్షన్ కమిటీ ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టును సోమవారం ఎంపిక చేయనుంది. ఇందులో పేస్కు చోటు దక్కడం దాదాపుగా ఖాయమైంది. అయితే సింగిల్స్లో ఇటీవల నిలకడగా రాణిస్తున్న యూకీ బాంబ్రీ మాత్రం యూఎస్ ఓపెన్లో అవకాశం దక్కితే ఆసియా క్రీడలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికి అతని పేరు కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉంది. మరో భారత డబుల్స్ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న కూడా తాను అందుబాటులో ఉంటానని ఇప్పటికే స్పష్టం చేశాడు. యూకీ బాంబ్రీ లేకపోతే పురుషుల సింగిల్స్లో భారత ర్యాంక్ల ప్రకారం తమిళనాడు ఆటగాళ్లు రామ్కుమార్ రామ్నాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ జట్టులోకి వస్తారు. మహిళల సింగిల్స్లో అంకితా రైనా, కర్మన్ కౌర్ థండీలకు అవకాశం ఉంది. 1994 నుంచి 2006 వరకు వరుసగా నాలుగు ఆసియా క్రీడల్లో పాల్గొన్న లియాండర్ పేస్ 5 స్వర్ణాలు, 3 కాంస్యాలు గెలుచుకున్నాడు. -
టైటిల్పోరుకు ప్రణీత్ సింగ్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు ప్రణీత్సింగ్ భాటియా టైటిల్కు అడుగు దూరంలో నిలిచాడు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నీలో అండర్–12 బాలుర సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ప్రణీత్ ఫైనల్కు చేరుకున్నాడు. గురువారం జరిగిన బాలుర సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణీత్ 6–1, 6–1తో రామధనుశ్పై గెలుపొందాడు. మరో సెమీస్లో ఎన్. అనిరుధ్ 6–2, 6–2తో వెంకట్ రిషిని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు. డబుల్స్ సెమీస్లో ప్రణీత్ – అర్నవ్ బిష్ణోయ్ జంట 6–1, 6–3తో ప్రత్యూష్ – రేయాన్ష్ రాజీవ్ జోడీపై నెగ్గి ఫైనల్కు చేరుకుంది. మరో సెమీస్లో వెంకట్ రిషి – అనిరుధ్ జోడీ 6–1, 6–1తో సంజిత్ – అనీశ్ శర్మ జంటపై గెలుపొందింది. -
క్వార్టర్స్లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య ప్రిక్వార్టర్స్కు చేరుకుంది. సోమవారం త్రివేండ్రంలో జరిగిన తొలి రౌండ్లో దేదీప్య 6–4, 6–2తో మేఘ ముత్తుకుమారన్ (తమిళనాడు)పై విజయం సాధించింది. -
రన్నరప్ సింధు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సింధు జనగాం ఆకట్టుకుంది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచింది. శుక్రవారం జరిగిన టైటిల్ పోరులో సింధు (తెలంగాణ)– మహ్రుక్ కోక్ని (మహారాష్ట్ర) ద్వయం 2–6, 4–6తో తీర్థ ఇస్కా (ఏపీ)– ప్రీతి ఉజ్జిని (కర్ణాటక) జోడి చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సింధు–మహ్రుక్ ద్వయం 6–4, 6–2తో ధారణ–నవనీ (ఛత్తీస్గఢ్) జంటపై గెలుపొందింది. -
చాంపియన్ సృజన
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సృజన రాయరాల అండర్–14 బాలికల విభాగంలో టైటిల్ను సాధిం చింది. కోల్కతాలో జరిగిన ఫైనల్లో సృజన 6–3, 6–2తో ప్రేరణ కోయిరాలపై విజయం సాధించింది. అండర్–16 బాలికల ఫైనల్లో సృజన 2–6, 5–7తో సీహెచ్ రితుజ చేతిలో పరాజయం పాలైంది. -
రన్నరప్ సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య ఆకట్టుకుంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రన్నరప్గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో దేదీప్య 6–2, 5–7, 6–7 (5/7)తో హిమాని మోర్ (హరియాణా) చేతిలో పరాజయం పాలైంది. డబుల్స్ టైటిల్ పోరులో సాయిదేదీప్య–ఆర్తి (తమిళనాడు) జంట 3–6, 6–3, 8–10తో హిమాని (హరియాణా)–దక్షిత (మహారాష్ట్ర) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సెమీస్లో సాయిదేదీప్య జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్య డబుల్స్ విభాగంలో సెమీఫైనల్కు చేరుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన సారా యాదవ్తో జతకట్టిన దేదీప్య బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్లో 4–6, 7–6 (7/5), 10–8తో శ్రావ్య శివాని (తెలంగాణ)–యుబ్రాని బెనర్జీ (పశ్చిమ బెంగాల్) జంటపై గెలుపొందింది. సెమీఫైనల్లో దేదీప్య జోడి సోహా (కర్ణాటక)– సృష్టి (మహారాష్ట్ర) జంటతో తలపడుతుంది. -
క్వార్టర్స్లో సింధు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సింధు జనగాం క్వార్టర్స్కు చేరుకుంది. బెంగళూరులో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు (తెలంగాణ) 1–0తో ఆధిక్యంతో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి ప్రీతి ఉజ్జిని (కర్నాటక) గాయం కారణంగా వైదొలిగింది. ఇతర మ్యాచ్ల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మౌలిక రామ్ 4–6, 6–2, 7–5తో ఏపీకి చెందిన మరో క్రీడాకారిణి ఇస్కా తీర్థపై గెలుపొందింది. మరో మ్యాచ్లో సృష్టి దాస్ (మహారాష్ట్ర) 6–0, 6–2తో సొనాలి జైశ్వాల్ (ఏపీ)ని ఓడించింది. -
సెమీస్లో సాయిదేదీప్య జోడీ
‘ఐటా’ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–18 జాతీయ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య జోడీ నిలకడగా రాణిస్తోంది. చెన్నైలో జరుగుతోన్న ఈ టోర్నీలో భక్తి పర్వాని (గుజరాత్)తో జత కట్టిన సాయిదేదీప్య డబుల్స్ విభాగంలో సెమీఫైనల్కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో సాయిదేదీప్య–భక్తి పర్వాని జంట 2–6, 7–6, 12–10తో షేక్ హుమేరా (తెలంగాణ)–ఈశ్వరీ సేత్ (గుజరాత్) జోడీపై గెలుపొందింది. -
సెమీస్లో సాయిదేదీప్య జంట
‘ఐటా’ మహిళల టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన సాయిదేదీప్య–షేక్ హుమేరా జోడీ సెమీఫైనల్లో ప్రవేశించింది. తమిళనాడులోని కోయంబత్తూర్లో జరుగుతోన్న ఈ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్స్లో సాయిదేదీప్య–హుమేరా జంట 6–2, 6–0తో అవిష్క గుప్తా (జార్ఖండ్)–వన్షికా పఠానియా (కర్ణాటక) జోడీపై గెలుపొందింది. నేడు జరిగే సెమీస్లో దేదీప్య జోడీ హర్షసాయి (ఏపీ)– హిమానీ మోర్ (హరియాణా) జంటతో తలపడుతుంది. -
ప్రిక్వార్టర్స్లో దేదీప్య, సింధు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు సాయిదేదీప్య, సింధు జనగాం ముందంజ వేశారు. తమిళనాడులోని కోయంబత్తూర్లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సాయిదేదీప్య 6–3, 1–6, 7–5తో సృష్టి దాస్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా, సింధు 6–3, 6–3తో ప్రియాంక (మహారాష్ట్ర)ను ఓడించింది. ప్రిక్వార్టర్స్లో సాయిదేదీప్య, తమిళనాడుకు చెందిన అద్వైత శరవణన్తో తలపడుతుంది. ఇతర మ్యాచ్ల్లో ఇస్కా తీర్థ 5–7, 1–6తో శ్వేతా రాణా (ఢిల్లీ) చేతిలో, మౌళిక రామ్ 4–6, 3–6తో అవిష్క గుప్తా (జార్ఖండ్) చేతిలో ఓడిపోయారు. -
రోహిత్ జోడీకి టైటిల్
‘ఐటా’ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) టెన్నిస్ చాంపియన్షిప్లో ఏకే రోహిత్ సత్తా చాటాడు. పల్లవి మోడల్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో విజేతగా, సింగిల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచాడు. అండర్–18 బాలుర డబుల్స్ ఫైనల్లో రోహిత్–పి.కుమార్ ద్వయం 6–1, 6–7 (4/7), 10–5తో సీహెచ్ అర్జున్–కర్రా తరుణ్ జంటపై గెలుపొంది టైటిల్ను కైవసం చేసుకుంది. సింగిల్స్ విభాగంలో రోహిత్ 4–6, 3–6తో సీహెచ్ అర్జున్ చేతిలో ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. బాలికల విభాగంలో సంస్కృతి దామెర చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో సంస్కృతి 6–1, 6–4తో ఎస్. సంజనపై గెలుపొందింది. -
సెమీస్లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సం ఘం (ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెం ట్లో హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాయి దేదీప్య సెమీఫైనల్కు చేరుకుంది. చండీగఢ్లో బుధవారం జరిగిన క్వార్టర్ఫైనల్ మ్యా చ్లో దేదీప్య 7–5, 6–2తో రాష్ట్ర క్రీడాకారిణి శ్రావ్య శివానిపై విజయం సాధించింది. నేడు జరిగే సెమీస్లో దేదీప్య ఢిల్లీకి చెందిన శ్వేతారాణాతో పోటీపడుతుంది. -
ప్రిక్వార్టర్స్లో సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య శుభారంభం చేసింది. చండీగఢ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్లో ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సింగిల్స్ తొలిరౌండ్లో సాయి దేదీప్య 6–2, 3–6, 7–6 (7/5)తో యుబ్రానీ బెనర్జీ (పశ్చిమ బెంగాల్)పై విజయం సాధించింది. నేడు (మంగళవారం) జరిగే ప్రిక్వార్టర్స్లో హరియాణాకు చెందిన స్మృతి సింగ్తో సాయి దేదీప్య తలపడుతుంది. -
ప్రిక్వార్టర్స్లో సింధు, సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు సింధు జనగాం, సాయిదేదీప్య శుభారంభం చేశారు. కోయంబత్తూర్లో జరుగుతోన్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిదేదీప్య 6–1, 6–2తో అవిష్క గుప్తాపై గెలుపొందింది. మరో మ్యాచ్లో సింధు 6–3, 6–3తో గాయత్రి శంకర్ (కేరళ)ను ఓడించి ప్రిక్వార్టర్స్కు చేరుకుంది. ఇతర మ్యాచ్ల్లో మౌలిక (ఏపీ) 3–6, 6–2, 7–6 (7/2)తో ఆస్థా (మహారాష్ట్ర)పై, ఇస్కా తీర్థ (ఏపీ) 6–1, 6–2తో ప్రవీణపై, నిధి సూరపనేని 6–0, 6–0తో పూర్వ రెడ్డి, లాస్య పట్నాయక్ 6–2, 7–6తో అద్వైతపై గెలుపొంది తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. -
రోహన్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (అండర్–14) టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ కుమార్ సత్తా చాటాడు. మొయినాబాద్లోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో రోహన్ కుమార్ 4–6, 6–3, 6–1తో జై అర్జున్పై గెలుపొందగా... బాలికల విభాగంలో అపూర్వ వేమూరి 6–3, 6–1తో మలిష్కను ఓడించి చాంపియన్గా నిలిచింది. మరోవైపు బాలుర డబుల్స్ ఫైనల్లో రోహన్ కుమార్– సిద్ధార్థ్ ద్వయం 6–3, 6–3తో వరుస సెట్లలో వరుణ్–కుషాల్ జంటపై నెగ్గి టైటిల్ను దక్కించుకుంది. -
ఫైనల్లో మలిష్క, అపూర్వ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్లో మలిష్క, అపూర్వ ఫైనల్కు చేరుకున్నారు. మొయినాబాద్లోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో మలిష్క 6–3, 6–0తో అమూల్యపై విజయం సాధించింది. మరో మ్యాచ్లో అపూర్వ వేమూరి 6–4, 6–1తో అభయ వేమూరిని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బాలుర సెమీఫైనల్ మ్యాచ్లలో జై అర్జున్ 4–6, 6–2, 6–2తో వరుణ్పై, రోహన్ కుమార్ 6–1, 6–1తో సిద్ధార్థ్ రెడ్డిపై గెలుపొంది ఫైనల్లో ప్రవేశించారు. మరోవైపు బాలుర డబుల్స్ క్వార్టర్స్లో రోహన్ కుమార్– సిద్ధార్థ్ రెడ్డి ద్వయం 6–1, 6–1తో నరైన్ వర్మ– రిషిక్ జంటపై గెలుపొంది సెమీస్కు చేరుకుంది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్ల్లో మోహిత్ సాయి చరణ్– ప్రతినవ్ జంట 2–6, 6–2, 11–9తో సాధిష్ట లింగ– రాజేశ్వర్ రెడ్డి జోడీపై, వర్షిత్ కుమార్– ఆర్యంత్ రెడ్డి జంట 6–4, 6–1తో ఆది కపూర్– శ్రేయస్ శంకర్ జోడీపై, వరుణ్– కుషాల్ జంట 6–4, 2–6, 10–7తో జై అర్జున్– రోహన్ గాంధీ జోడీపై గెలిచాయి. -
భారత ‘నంబర్వన్’గా..
⇒ ‘ఐటా’ అండర్–16 ర్యాంకింగ్స్లో సాయిదేదీప్యకు అగ్రస్థానం సాక్షి, హైదరాబాద్: తెలుగమ్మాయి యెద్దుల సాయిదేదీప్య అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) జూనియర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అండర్– 16 బాలికల సింగిల్స్ విభాగంలో ఆమె 882 పాయింట్లతో టాప్ ర్యాంకులో నిలిచింది. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఈ ఘనతను తన తల్లి జయకు అంకితమిస్తున్నట్లు దేదీప్య చెప్పింది. 2009లో కర్నూలులో జరిగిన టోర్నీ ద్వారా టెన్నిస్ పోటీలకు శ్రీకారం చుట్టిన ఆమె మరుసటి ఏడాదే తొలి టైటిల్ను సాధించింది. ‘ఐటా’ జూనియర్, ర్యాంకింగ్ టోర్నీల్లో ఇప్పటి వరకు 73 టైటిల్స్ను చేజిక్కించుకున్న ఆమె 2014లో ఆసియా అండర్–14 చాంపియన్షిప్లో సింగిల్స్లో విజేతగా నిలిచి తొలి అంతర్జాతీయ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. ‘రోడ్ టు వింబుల్డన్– 2015’ ఈవెంట్లోనూ మెరిసింది. ఇందులో మూడు డబుల్స్ టైటిల్స్ను సాధించింది. తమిళనాడులోని కరూర్లో జరిగిన జాతీయ అండర్–16 సూపర్ సిరీస్ సింగిల్స్లోనూ విజేతగా నిలిచింది. న్యూఢిల్లీలో జరిగిన అండర్–18 సింగిల్స్ విభాగంలో సెమీస్కు చేరిన దేదీప్య, అండర్– 16 డబుల్స్ విభాగంలో రన్నరప్గా తృప్తిపడింది. మహారాష్ట్రలోని పంచగనిలో జరిగిన నేషనల్ సిరీస్ అండర్–16 ఈవెంట్లో సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. సిన్నెట్ టెన్నిస్ అకాడమీలో రవిచందర్రావు దగ్గర ఆమె టెన్నిస్లో ఓనమాలు నేర్చుకుంది. ప్రస్తుతం ఆమె నగరంలోని సరోజినీ నాయుడు వనితా విద్యాలయలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. -
'నన్ను ఎందుకు తప్పించారు?'
న్యూఢిల్లీ:తనను భారత డేవిస్ కప్ జట్టు నుంచి తప్పించడంపై టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు భారత డేవిస్ కప్ జట్టు నుంచి ఎందుకు తప్పించారో వివరణ ఇవ్వాలంటూ ప్రశ్నించాడు. డేవిస్ కప్ కు అఖిల భారత టెన్నిస్ సంఘం(ఏఐటీఏ) సెలక్షన్ తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్న బోపన్న.. ర్యాంకులు ప్రాతిపదికన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. ఐటాకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని ఎంపిక చేసి, మిగతా వారిపై వేటు వేయడం ఎంత వరకూ సమంజసమని నిలదీశాడు. అయితే దీనిపై భారత డేవిస్ కప్ కోచ్, సెలక్షన్ కమిటీ సభ్యుడు జీషన్ అలీ మాత్రం ఇందులో ఎటువంటి తప్పిదం జరగలేదన్నారు. ప్రతీసారి సెలక్టర్లు ర్యాంకులు ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన అవసరం లేదంటూ సర్దుకునే యత్నం చేశారు. న్యూజిలాండ్ తో పోరుకు ఎవరైతే కచ్చితంగా కుదురుతారో వారినే ఎంపిక చేసినట్లు జీషన్ తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన భారత డేవిస్ కప్ జట్టులో రోహన్ బోపన్నకు స్థానం దక్కని సంగతి తెలిసిందే. ఇందులో లియాండర్ పేస్ , సాకేత్ మైనేని, రామ్ నాథన్ రామ్ కుమార్, ప్రజ్ఞేష్ గున్నేశ్వరన్, యుకీ బాంబ్రీలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లతో పాటు, ఇద్దరు డబుల్స్ స్పెషలిస్టులను ఏఐటీఏ ఎంపిక చేసింది. ఇక్కడ వ్యక్తిగత డబుల్స్ ర్యాంకింగ్స్ లో లియాండర్ 59వ ర్యాంకులో ఉండగా, బోపన్న 28వ ర్యాంకులో ఉన్నాడు. డేవిస్ కప్ అర్హతలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు పుణేలో జరిగే ఆసియా ఓసియానియా టోర్నీలో న్యూజిలాండ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
శివదీప్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఆధ్వర్యంలో జరిగిన టీటీసీ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కొసరాజు శివదీప్ సత్తా చాటాడు. సింగిల్స్తో పాటు మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో టైటిల్స్ను దక్కించుకున్నాడు. త్రివేండ్రమ్లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శివదీప్ 6-4, 4-6, 6-4తో విజయ్ కన్నన్ (తమిళనాడు)పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో శివదీప్- సాయి సంహిత (తమిళనాడు) ద్వయం 6-4, 3-6, 10-5తో ఓజోస్- శ్వేత (తమిళనాడు) జంటను ఓడించి విజేతగా నిలిచింది. -
‘ఐటా’ జోక్యంపై తలో మాట!
తాను అడగలేదన్న సానియా * ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా * స్పందించారంటున్న సంఘం న్యూఢిల్లీ: ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)కు సంబంధించిన హ్యాకింగ్లో వీనస్ విలియమ్స్ పేరు బయటపడిన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా)ను సానియా మీర్జా కోరినట్లు వచ్చిన వార్తలపై భిన్నమైన స్పందనలు వచ్చాయి. ముందుగా శుక్రవారం ఉదయం ఈ అంశంపై తాను ఎలాంటి జోక్యం కోరలేదని సానియా ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చింది. ‘ఐటా’ కూడా సానియా గానీ ఆమె తల్లి నసీమా మీర్జా నుంచి గానీ తమకు ఎలాంటి సమాచారం లేదంటూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. సానియా దీనిని ఉటంకిస్తూ అన్ని సందేహాలకు ఇదే సమాధానం అని స్పష్టం చేసింది. అయితే సాయంత్రం ‘ఐటా’ దీనిపై మళ్లీ స్పందించింది. తన ప్రకటనలో తప్పు లేదంటూనే ‘వాడా’ అంశంలో జోక్యం చేసుకోవాలని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా కోరినట్లు ‘ఐటా’ కార్యదర్శి హిరణ్మయి ఛటర్జీ వెల్లడించారు. అరుుతే రాతపూర్వకంగా కాకుండా ఆయన నోటిమాటగానే దీనిని చెప్పారని అన్నారు. దీనిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. -
ఏఐటీఏ ఉపాధ్యక్షుడు రాజా నర్సింహారావు మృతి
హైదరాబాద్: ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఏఐటీఏ) ఉపాధ్యక్షుడు రాజా నర్సింహారావు(రాజాసాబ్) గురువారం కన్నుమూశారు. ఉదయం సికింద్రాబాద్లోని తన నివాసంలో రాజాసాబ్ తుది శ్వాస విడిచారు. సానియా మీర్జాను ఇంటర్నేషనల్ స్టార్ని చేయడంలో రాజాసాబ్ది కీలక పాత్ర. -
క్వార్టర్ ఫైనల్లో కృష్ణ రోహిత్
హైదరాబాద్: చెన్నైలో జరుగుతున్న ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు కృష్ణ రోహిత్ మూడు విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అండర్-16 బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అతను 6-1, 6-3తో అనంత్ (తమిళనాడు)పై గెలుపొం దాడు. అనంతరం జరిగిన అండర్-18 సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కృష్ణ రోహిత్ 6-1, 6-2తో సత్యమారన్ (తమిళనాడు)పై విజయం సాధిం చాడు. అండర్-18 డబుల్స్లో హిమాన్షు మోర్ తో జతకట్టిన అతను 6-0, 6-0తో యశ్వంత్-వివేకానంద్ (కేరళ) జంటను ఓడించాడు. -
సాయి దేదీప్య ‘డబుల్’
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) అండర్-16 సూపర్ సిరీస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యెద్దుల సాయి దేదీప్య ‘డబుల్’ సాధించింది. తమిళనాడులోనూ కరూర్లో శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో సాయి దేదీప్య సింగిల్స్తోపాటు డబుల్స్ విభాగంలోనూ టైటిల్ను సొంతం చేసుకుంది. సింగిల్స్ ఫైనల్లో సాయి దేదీప్య 6-0, 6-2తో సాన్యా సింగ్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా... డబుల్స్ ఫైనల్లో సాయి దేదీప్య-ధరణ ముదలియార్ (ఛత్తీస్గఢ్) ద్వయం 6-4, 6-3తో దివ్యవాణి (తమిళనాడు) -లక్ష్మీ సాహితి (ఆంధ్రప్రదేశ్) జోడీపై విజయం సాధించింది. -
పేస్ కు మరోసారి షాకిచ్చిన బోపన్న!
న్యూఢిల్లీ: భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ కు మరో ప్లేయర్ రోహన్ బోపన్న షాకిచ్చాడు. ప్రస్తుతం ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్ లో టాప్-10 లో ఉన్న బోపన్న.. అఖిల భారత టెన్నిస్ సమాఖ్య(ఏఐటీఏ)కు లేఖ రాశాడు. తాను రియో ఒలింపిక్స్ లో తన భాగస్వామిగా లియాండర్ పేస్ ను ఎంచుకోవడం లేదని, సాకేత్ మైనేనిని తనకు జోడీగా పంపించాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. సెలక్షన్ కమిటీ మీటింగ్ జరిగిన మరుసటి రోజు ఈ లేఖ విషయం బయటపడింది. ప్రస్తుతం పేస్ 46వ ర్యాంకులో ఉండగా, సాకేత్ మాత్రం 125వ ర్యాంకులో కొనసాగుతుండటం గమనార్హం. సెలక్షన్ కమిటీ జూన్ 11న తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది. గతంలోనూ ఇలాగే జరిగింది... నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్ సమయంలో పేస్తో కలిసి ఆడేందుకు రోహన్ బోపన్న నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పేస్ టాప్-10లో ఉండటంతో భారత్కే చెందిన విష్ణువర్ధన్తో కలిసి లండన్ ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. ఏ భారత క్రీడాకారుడూ ఇప్పటివరకు వరుసగా ఏడు ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగలేదు. ప్రస్తుతం భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు మాత్రమే ఈ అవకాశముంది. బోపన్న లేఖతో పేస్ చారిత్రక అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం లోఉన్నాడు. శనివారం సెలక్షన్ కమిటీ నిర్ణయంపైనే పేస్ రియో ఒలింపిక్స్ లో పాల్గొంటాడా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. -
చండీగఢ్లో భారత్, కొరియా డేవిస్ కప్ మ్యాచ్
న్యూఢిల్లీ: ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో భాగంగా భారత్, దక్షిణ కొరియాల మధ్య జరిగే పోటీకి చండీగఢ్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 15 నుంచి 17 వరకు జరిగే ఈ పోటీకి చండీగఢ్ క్లబ్ గ్రాస్ కోర్టులు వేదికగా నిలువనుందని ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) వెల్లడించింది. చివరిసారి 2012లో భారత్, న్యూజిలాండ్ల మధ్య డేవిస్ కప్ మ్యాచ్కు చండీగఢ్ వేదికగా నిలిచింది. -
ఐదేళ్ల తర్వాత వరల్డ్ గ్రూప్లో భారత్
న్యూఢిల్లీ: జూనియర్ డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు రాణించారు. ఐదేళ్ల తర్వాత వరల్డ్ గ్రూప్నకు అర్హత సాధించారు. మూడో స్థానం కోసం శనివారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత్ 2-0 తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. తొలిమ్యాచ్లో సిద్ధాంత్ 6-2, 6-4తో థామస్ జేమ్స్పై గెలుపొందగా, మరో మ్యాచ్లో ఆదిల్ 6-2, 6-4తో అలెగ్జాండర్పై నెగ్గాడు. భారత్తో పాటు చైనా, జపాన్ కూడా వరల్డ్ గ్రూప్నకు అర్హత సాధించాయి. భారత ప్రదర్శనపట్ల అఖిల భారత టెన్నిస్ సంఘం(ఏఐటీఏ) అధ్యక్షుడు అనిల్ ఖన్నా హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు రూ. లక్ష చొప్పున నగదు పురస్కారాన్ని ప్రకటించారు. -
సానియా మీర్జాకు ఖేల్ రత్న ?
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్గాంధీ ఖేల్ రత్న అవార్డుకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును కేంద్ర క్రీడాశాఖ ప్రతిపాదించింది. అయితే ఈ అంశంలో తుది నిర్ణయం మాత్రం అవార్డుల కమిటీ తీసుకుంటుందని వెల్లడించింది. కెరీర్లో తొలిసారి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సాధించిన సానియా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లోనూ నంబర్వన్గా కొనసాగుతోంది. టెన్నిస్లో సానియా సాధించిన గొప్ప విజయాలకు గుర్తుగా క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఆమె పేరును సిఫారసు చేశారని క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ తెలిపారు. ‘ఏఐటీఏ నుంచి మాకు కాస్త ఆలస్యంగా సమాచారం అందింది. అయితే దీన్ని మంత్రి ఆమోదించి అవార్డుల కమిటీకి పంపిం చారు. ఇక తుది నిర్ణయం వాళ్లే తీసుకుంటారు’ అని శరణ్ పేర్కొన్నారు. అవార్డు విషయంలో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ నుంచి సానియాకు గట్టిపోటీ ఎదురుకానుంది. ‘సానియా పేరును ఖేల్ రత్న కోసం ప్రతిపాదించడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఈ స్ఫూర్తితో తను దేశానికి మరింత గౌరవం తెస్తుంది’ -సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఇప్పటి వరకు దేశంలో ఖేల్ రత్న అవార్డు అందుకున్న క్రీడాకారుల సంఖ్య 27. ఈ అవార్డును ప్రవేశపెట్టి 22 సంవత్సరాలయింది.