మళ్లీ ఏడు ప్రాంతాలలో బంగారు గొలుసులు చోరీ
ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు
బెంగళూరు : బెంగళూరు నగరంలో మళ్లీ ఏడుగురి మహిళలలో మెడలో బంగారు గొలుసులను దుండగులు లాక్కొని పరారైనారు. బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి గురువారం ఉదయం వరకు ఏడు గంటల లోపు ఈ చైన్స్నాచింగ్లు జరిగాయి. ఒక్క జ్ఞానభారతీ పోలీస్ స్టేషన్లోనే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. వివరాలు..
నాగరబావిలో నివాసముంటున్న విద్యా నవరత్న అనే మహిళ బుధవారం రాత్రి ఒంటరిగా నడిచి వెలుతున్న సమయంలో వెనుక నుండి బైక్లో వెళ్లిన ఇద్దరు నిందితులు ఆమె మెడలో ఉన్న 35 గ్రాముల మంగళసూత్రం లాక్కొని పరారైనారు. 15 నిమిషాల తరువాత నాగరబావి 12వ బ్లాక్లోని నమ్మూరు అంగడి సమీపంలో నడిచి వెలుతున్న మంజుల అనే మహిళ మెడలో 30 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. మరో 20 నిమిషాల వ్యవధిలో నాగరబావి సమీపంలోని కోకోనెట్ గార్డెన్ 12వ క్రాస్లో నడిచి వెలుతున్న స్వర్ణలత అనే మహిళ మెడలో ఉన్న 50 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. తరువాత రావృకష్ణ లేఔట్లో నడిచి వెలుతున్న సునంద అనే మహిళ మెడలో ఉన్న 40 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. ఈ నలుగురు మహిళలు జ్ఞానభారతీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం ఒక గంట వ్యవధిలో ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్లో వెళ్లిన నిందితులు చైన్స్నాచింగ్లు చేసి పరారైనారు. బుధవారం రాత్రి చంద్రాలేఔట్లోని పీఇఎస్ కాలేజ్ సమీపంలో నడిచి వెలుతున్న లలితాబాయి అనే మహిళ మెడలో ఉన్న 35 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. గురువారం ఉదయం చెన్నమ్మనే అచ్చుకట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఇఎస్ కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్ సమీపంలో నడిచి వెలుతున్న యశోధమ్మ అనే మహిళ మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు.
ఇది జరిగిన 20 నిమిషాల తరువాత గిరినగర పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఇఎస్ కాలేజ్ సమీపంలో నడిచి వెలుతున్న గాయిత్రి అనే మహిళ మెడలో ఉన్న 80 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. బాధితుల ఫిర్యాదు మేరకు 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న యువకులు బంగారు గొలుసులు లాక్కొని పారిపోయారని పోలీసులు అంటున్నారు. గతంలో ఇదే విధంగా చైన్స్నాచింగ్లు చేసి మహారాష్ట్ర పారిపోయి చివరికి బెంగళూరు పోలీసులకు పట్టుబడిన ఇరాని గ్యాంగ్ (చైన్స్నాచర్స్) ఫొటోలను బాధితులకు చూపించి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. చైన్స్నాచింగ్లు చేస్తున్న వారిని పట్టుకొవడానికి బెంగళూరు పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
బెంగళూరులో చెలరేగుతున్న చైన్స్నాచర్లు
Published Fri, Dec 26 2014 2:14 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
చూసే కళ్ళు బాగుంటే అందరూ బాగుంటారు.. జడ్జ్ గా చేయడం అంటే
రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ ట్వీట్
ఐస్క్రీమ్లో మనిషి వేలు : కంపెనీ లైసెన్స్ రద్దు
గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం.. నేటి ధరలు ఇవే..!
వెఘొర్స్ 'సూపర్ గోల్'.. నెదర్లాండ్స్ సంచలన విజయం
వామ్మో.. శ్రద్ధా ఇంత అందంగా ఉందేంటి? ఇలా అయితే కష్టమే! (ఫొటోలు)
సంక్షోభంలో శాండల్వుడ్.. తీవ్ర వివాదాల్లో నటీనటులు
సామూహిక వివాహాల్లో 30 జంటలకు ‘మళ్లీ పెళ్లి’
గూడ్స్ రైలును ఢీకొన్న కాంచనజంగ ఎక్స్ ప్రెస్
ఐశ్వర్యా రాజేశ్ మత్తెక్కించే పోజులు.. రోజురోజుకీ అందంగా! (ఫొటోలు)
తప్పక చదవండి
- బంగ్లాదేశ్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల టీ20 వరల్డ్కప్ హిస్టరీలోనే
- హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
- కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
- కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- సిక్ప్యాక్! లుక్ కోసమైతే ఫసక్కే
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
Advertisement