
అప్పటి వరకూ పాత నోట్లు కొనసాగించాలి
కొత్తనోట్లు చెలామణిలోకి వచ్చేవరకు పాత నోట్లను కొనసాగించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
విజయవాడ: కొత్తనోట్లు పూర్తిగా చెలామణిలోకి వచ్చేవరకు పాత రూ.500, రూ.1000 నోట్లను కొనసాగించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో సోమవారం నాయకులు బీసెంట్ రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీఎం నేత దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ... నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.