రూ.100 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత | maharashtra police catches 100 crore value drugs | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

Published Thu, May 25 2017 8:21 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

రూ.100 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత - Sakshi

రూ.100 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

పింప్రి: మహారాష్ట్ర పోలీసులు భారీ మొత్తంలో మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. పుణే జిల్లా దౌండ్‌ తాలూకాలోని కుర్‌కుంభ్‌ ఎంఐడీసీలో సుజలాం కెమికల్స్‌ కంపెనీపై ముంబై క్రైం బ్రాంచ్, మత్తు పదార్థాల నిరోధక సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ. వంద కోట్ల విలువజేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇందులో మెఫెడ్రన్‌ అధిక మొత్తంలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కంపెనీ యజమాని హరిచంద్ర డోరగే ను గురువారం ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. కంపెనీలో తయారైన మత్తు పదార్థాలను పుణేలో గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తుండటంపై పోలీసులు సైతం నోరెళ్లబెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement