విజయనగరం: ప్రజా ప్రాతినిద్య చట్టం 1951 ప్రకారం అప్పట్లో అఫిడవిట్ దాఖలు చేసినందుకు అరకు ఎంపీ కొత్తపల్లి గీతను ఎంపీగా అనర్హురాలుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని ఎస్సీ, ఎస్టీ సెల్ న్యాయ సలహాదారు రేగు మహేశ్ చెప్పారు. శుక్రవారం విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై ఎలాంటి కేసులు లేవని తన పేరు మీద భూమి లేదని ఎంపీ గీత అఫిడవిట్లో పేర్కొన్నారని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో సర్వే నెంబర్ 83/2 లో 2008 లో గీత పేరు మీద 53 ఎకరాలు కొనగోలు చేశారని ఆయన ఆరోపించారు. సీసీ 881/2013 లో ఆర్థిక నేరాల కేసులో ఎంపీ గీత మూడో ముద్దాయి' అని అన్నారు.
ఈ రెండెంటిని పేర్కొననందుకు గీతను ఎంపీగా అనర్హురాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 2016 మార్చిలో గీత సోదరుడు ఎస్టీ కాదని డిక్లెరేషన్ ఇచ్చిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్.. ఇప్పుడు అదే కలెక్టర్ 2016 లో జులైలో ఎంపీ గీత ఎస్టీ అని ఎలా డిక్లరేషన్ ఇస్తారని? సూటిగా ప్రశ్నించారు. దీనిపై కూడా తాము హైకోర్టుకు వెళ్తున్నామని రేగు మహేశ్ తెలిపారు.
'ఎంపీ గీతను అనర్హురాలిగా ప్రకటించాలి'
Published Fri, Sep 16 2016 7:48 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- తెలంగాణలోకి మావోయిస్టులు?
- కార్ పూలింగ్.. వేర్వేరు పనివేళలు
- ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిపై మొదటి రైలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటా.. మళ్లీ పాక్ తరపున ఆడుతా: మాలిక్
- నీట్ పేపర్లీక్ సూత్రధారి నితీషే.. తేజస్వియాదవ్
- ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందటే?
- ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన పాక్ బోర్డు!
- అంబానీ ప్రేయసి: ఈ ఒక్క లుక్ విలువ రూ. 1002కోట్లు! నమ్ముతారా?
- స్టార్ హీరో ఒంటరిగా రమ్మని పిలిచాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
- కేజ్రీవాల్ బెయిల్ రద్దు పిటిషన్పై తీర్పు రిజర్వ్
Advertisement