యాదాద్రి జిల్లాలో విషాదం | Poisonate kallu: 1 man died in yadadri district | Sakshi
Sakshi News home page

యాదాద్రి జిల్లాలో విషాదం

Published Thu, May 11 2017 11:04 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

Poisonate kallu: 1 man died in yadadri district

- పురుగుల మందు కలిసిన కల్లు తాగి ఒకరి మృతి
- మరొకరి పరిస్థితి విషమం
 
ఆత్మకూరు(యం): యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్లు కుండలపై ఈగలు వాలకుండా చల్లిన పురుగుల మందు కల్లులో కలిసిపోవడంతో.. ఆ కల్లు తాగిన ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అందులో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జిల్లాలోని ఆత్మకూరు(యం) మండలంలోని తుక్కాపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దెయ్యాల పాండు(28), దెయ్యాల నగేశ్‌ ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తమ తాటిచెట్టు గీస్తున్న వ్యక్తి కల్లులో తేనటీగలు పడుతున్నాయని చెప్పడంతో వీరిద్దరు పురుగుల మందు తెచ్చిన కల్లు కుండలపై పోశారు. ప్రమాదవశాత్తు ఆ మందు కుండలోపల పడటంతో.. ఆ కల్లు తాగిన ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం పాండు మృతిచెందగా, నగేశ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement