పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్ప్రెస్
Published Thu, Jan 26 2017 12:05 PM | Last Updated on Mon, Jul 29 2019 7:35 PM
తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్లో మరో రైలు పట్టాలు తప్పింది. రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్లు దిగిపోయిన తర్వాత యార్డుకు తీసుకెళ్తుండగా ఇంజిన్ వెనుక ఉన్న బోగీ పట్టాలు తప్పింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. ఈ సంఘటనలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గత వారం ఇదే రైల్వేస్టేషన్లో వెంకటాద్రి ఎక్సెప్రెస్ రైలు పట్టాలు తప్పిన విషయం విదితమే. ఈ రోజు మళ్లీ రాయలసీమ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement