రెండు బూత్‌లలో రీ-పోలింగ్ | Re-polling at two poll booths in Delhi | Sakshi
Sakshi News home page

రెండు బూత్‌లలో రీ-పోలింగ్

Published Tue, Feb 10 2015 12:34 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM

Re-polling at two poll booths in Delhi

 సాక్షి, న్యూఢిల్లీ: రోహతాస్‌నగర్, ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని రెండు పోలింగ్ బూత్‌లలో సోమవారం రీ-పోలింగ్ జరిగింది. శనివారం విధానసభ ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున ఈ రెండు పోలింగ్ బూత్‌లలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సరిగ్గా పనిచేయలేదని గుర్తించిన ఎన్నికల అధికారులు అక్కడ రీ-పోలింగ్  జరిపించాలని నిర్ణయించారు. తూర్పు ఢిల్లీలోని రోహతాస్‌నగర్‌లో ఉన్న 132 నంబరు పోలింగ్ బూత్‌లో మాక్ పోలింగ్ డేటాను తొలగించలేదని, ఢిల్లీ కంటోన్మెంట్‌లోని డీఐడీ లైన్స్ ఏరియాలోని 31వ నంబరు పోలింగ్ బూత్‌లో ఓటింగ్ యంత్రంలో సమస్య కారణంగా పరిశీలకుని  నివేదిక సరిగ్గా నమోదుకాలేదని అధికారులు గుర్తించారు. దీంతో ఈ రెండు పోలింగ్ బూత్‌లలో సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు రీ-పోలింగ్ నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement