Electronic Voting Machines (EVM)
-
బ్యాలెట్ రావాలి: అఖిలేశ్
లక్నో: ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం) లపై విశ్వసనీయత సడలుతున్నందున బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం డిమాండ్ చేశారు. ‘జర్మనీ వంటి దేశాలు కూడా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నాయి. భారత్లో మాత్రం అధికార పెద్దలు స్వలాభం కోసం ఈవీఎంలను వాడుతున్నారు. వాటినెవరూ నమ్మడం లేదు. ఎన్నికల్లో గెలిచే వారు సైతం తమకు వాటిపై నమ్మకం లేదంటున్నారు’’ అని చెప్పారు. భారత సంతతికి చెందిన జర్మనీ ఎంపీ రాహుల్కుమార్ కాంబోజ్ కూడా మీడియాతో మాట్లాడారు. ‘‘బ్యాలెట్ పేపర్లు వాడితే పోలింగ్లో తేడాలున్నట్లు అనుమానం వస్తే రీ కౌంటింగ్కు అవకాశముంటుంది. జర్మనీలో దీన్నే అనుసరిస్తున్నారు’’ అని తెలిపారు. -
ఈవీఎంలలో అవకతవకలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదులు
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి మరిన్ని ఫిర్యాదులు చేసింది. దాదాపు 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. ఈ నెల 8న జరిగిన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని ఈవీఎంల బ్యాటరీలు 99 శాతం చార్జింగ్తో ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మిగతా ఈవీఎంల బ్యాటరీల్లో 80 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉందన్నారు. 99 శాతం చార్జింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తమ పార్టీ ఫిర్యాదులపై ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన 20 మంది కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈవీఎంలను తారుమారు చేశారని వారు అనుమానిస్తున్నారు. అందుకే న్యాయం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. -
Lok Sabha Election 2024: పెళ్లిపత్రికలోనూ ఈవీఎంపై వ్యతిరేకత!
లాతూర్: మా పెళ్లికి విచ్చేసి భోజనతాంబూలాదులు స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన. ఇది చాలా పెళ్లిపత్రికల్లో కనిపించే ఒక విన్నపం. కానీ ఇక్కడ ఒక పత్రికలో విజ్ఞాపనకు బదులు ‘వ్యతిరేకత’ కనిపించింది. ‘‘ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను నిషేధించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’’ అంటూ కొటేషన్ను పెట్టాడు ఒక పెళ్లికొడుకు. మహారాష్ట్రలోని ఛాకూర్ తహసీల్ పరిధిలోని అజన్సోందా(ఖుర్ద్) గ్రామానికి చెందిన దీపక్ కుంబ్లే పెళ్లి వచ్చే నెల ఎనిమిదో తేదీన లాతూర్ పట్టణంలో జరగనుంది. కుంబ్లే అందరికీ పంచిన తన వివాహ ఆహా్వన పత్రికలో ఇలా ఈవీఎంలపై తన అసంతృప్తి వెళ్లగక్కాడు. సాధువులు, సంఘ సంస్కర్తలు, స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలను ఆ వెడ్డింగ్ ఇని్వటేషన్ కార్డులో ప్రచురించాడు. తనకు పాఠాలు బోధించిన స్కూలు టీచర్ల ఫోటోలకు ఈ ఆహ్వానపత్రికలో స్థానం కలి్పంచాడు. ఈయన అఖిలభారత వెనకబడిన, మైనారిటీ వర్గాల ఉద్యోగుల సంఘం(బామ్సెఫ్) సభ్యుడు. ‘‘ ఈవీఎంల వ్యతిరేక ఉద్యమం సార్వత్రిక ఎన్నికలకు ముందే ఊపందుకుంది. బంధువులు, స్నేహితుల్లోనూ ఉద్యమంపై మరింత అవగాహన పెంచాలనే ఇలా ఈవీఎంల అంశాన్ని పెళ్లికార్డులో ప్రస్తావించా’ అని కుంబ్లే చెబుతున్నారు. కార్డులో కథాకమామిషు, ఫొటోలను చూసి ముక్కున వేలేసుకున్న వాళ్లూ లేకపోలేదు. కార్డు ఎలాగుంటే మనకెందుకు? పెళ్లికెళ్లి నాలుగు అక్షింతలు వేసి భోంచేసి వచ్చేద్దాం అని ఊళ్లో చాలా మంది డిసైడ్ అయ్యారట! -
One Nation One Election: జమిలి ఎన్నికలకు 30 లక్షల ఈవీఎంలు కావాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే 30 లక్షల ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) అవసరమని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే జమిలి ఎన్నికలకు సన్నాహాలు పూర్తిచేయడానికి దాదాపు ఏడాదిన్నర సమయం కావాలని పేర్కొన్నాయి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశంలో చర్చ జరుగుతోంది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర లా కమిషన్ ప్రస్తుతం జమిలి ఎన్నికల అంశంపై కసరత్తు చేస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు ఎన్నికావాలి? ఎంత సమయం అవసరం? అన్నదానిపై ఎన్నికల సంఘం అధికారులు లా కమిషన్కు కొన్ని నెలల క్రితం సమాచారం ఇచి్చనట్లు తెలుస్తోంది. ఒక్కో ఈవీఎంలో భాగంగా ఒక కంట్రోల్ యూనిట్, ఒక బ్యాలెట్ యూనిట్, ఒక వీవీప్యాట్ ఉంటాయి. జమిలి ఎన్నికలకు 30 లక్షల కంట్రోల్ యూనిట్లు, 43 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 32 లక్షల వీవీప్యాట్లు కావాలని చెబుతున్నారు. కొన్ని బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను రిజర్వ్లో ఉంచాల్సి ఉంటుంది కాబట్టి అదనంగా అవసరమని పేర్కొంటున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహిస్తే కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు కలిపి దాదాపు 35 లక్షల ఓటింగ్ యూనిట్లను కొత్తగా సమకూర్చుకోవాల్సి ఉంటుందని సమాచారం. 12.50 లక్షల పోలింగ్ కేంద్రాలు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పటికీ రెండు ఓట్లు వేర్వేరుగా వేయాల్సి ఉంటుంది. అందుకు రెండు ఈవీఎంలు కావాలి. జమిలి ఎన్నికల్లో ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపర్చడానికి తగిన వసతులు ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొంది. గత లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 12.50 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 15 లక్షల కంట్రోల్ యూనిట్లు, 15 లక్షల వీవీప్యాట్లు, 18 లక్షల బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించారు. అన్నీ కలిపి కోటి యూనిట్లు కొనుగోలు చేయాలంటే రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా. లోక్సభ, రాష్ట్రాల శాసనసభలతోపాటు మున్సిపాల్టీలు, పంచాయతీల ఎన్నికలు నిర్వహించడంపై(ఒక దేశం, ఒకే ఎన్నిక) మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం కొనసాగిస్తోంది. -
ఈవీఎంల కోసం రూ.1,900 కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఈవీఎం) కొనుగోలు చేయడానికోసం కేంద్ర న్యాయశాఖకు ఈ బడ్జెట్లో దాదాపు రూ.1,900 కోట్లను కేటాయించారు. 2024లో రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఈవీఎంలను సమకూర్చుకోవడంతోపాటు వాటికి అనుబంధంగా వాడే ఇతర పరికరాల కొనుగోలు చేయడానికి వీలుగా రూ.1,891.78 కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఇతర పరకరాలను కొనుగోలు చేయడమేకాక పాతవాటిని తుక్కుకింద మార్చడానికి ఈ నిధులను వినియోగిస్తారు. 2024 సంవత్సరంలో రానున్న లోక్సభ ఎన్నికలతోపాటు ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘానికి నిధులు అవసరమవుతాయని కేంద్ర న్యాయశాఖ ప్రతిపాదించడంతో కేంద్ర కేబినెట్ గత నెలలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలకోసం బడ్జెట్లో నిధులను కేటాయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల నుంచి ఈవీఎంలను కొనుగోలు చేయనున్నారు. -
బ్యాలెట్కు వెళ్లే ప్రసక్తే లేదు : సీఈసీ
న్యూఢిల్లీ : బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలను నిర్వహించే ప్రసక్తే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని తెలిపారు. బుధవారం టైమ్స్ నౌ సమిట్లో పాల్గొన్న సునీల్ ఆరోరా ఈ విషయాలను వెల్లడించారు. ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇటువంటి ఆరోపణలను అడ్డుకట్టవేసేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంస్కరణలు, మోడల్ కోడ్పై చర్చించేందుకు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్టు చెప్పారు. కారు, పెన్నులు మెరాయించినట్టు ఈవీఎంలలో కూడా సమస్యలు తలెత్తుత్తాయి.. కానీ వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని సునీల్ ఆరోరా తెలిపారు. 20 ఏళ్లుగా ఈవీఎంలు వాడుకలో ఉన్నాయని.. తిరిగి బ్యాలెట్ పేపర్ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. సుప్రీం కోర్టుతో సహా వివిధ కోర్టులు ఈవీఎంల వాడాకాన్ని సమర్థించాయని గుర్తుచేశారు. కాగా, ఈవీఎంల పనితీరుపై కొన్ని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఓటింగ్ శాతం వెల్లడించం ఆలస్యం కావడంతో ఈవీఎంల పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ శాతం వెల్లడి ఆలస్యం కావడంతో ఆప్ నేతలు విమర్శలు గుప్పించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం ఓటింగ్ శాతం ప్రకటించడానికి సిద్ధంగా లేకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం గంట వ్యవధిలోనే ఓటింగ్ శాతం వెల్లడించిన ఈసీ.. చిన్న రాష్ట్రమైన ఢిల్లీలో పోలింగ్ వివరాలు తెలిపేందుకు ఎందుకు ఇంత సమయం తీసుకుంటుందని ప్రశ్నించారు. -
ఓట్లను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ గురువారం నిర్వహించి ఫలితాలను వెనువెంటనే వెల్లడించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు ఎక్కడ ఫలితాలను తారుమారు చేస్తాయేమో అన్న ఆందోళన ప్రతిపక్ష పార్టీలను పట్టుకు పీకుతోంది. ఆ పార్టీలు గత కొన్నేళ్లుగా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వాటిని పాలకపక్షం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందంటూ గొడవ చేస్తూనే ఉన్నాయి. అసలు ట్యాంపరింగ్ అంటే ఏమిటీ? అందుకు నిజంగా అవకాశాలు ఉన్నాయా? ఉంటే అవి ఎలాంటివి? వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఈవీఎంలు అంటే ఏమిటీ ? అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈవీఎంలు అంటే... భారత పార్లమెంట్కు, రాష్ట్ర అసెంబ్లీలకు గతంలో బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరిగేవి. అది సుదీర్ఘమైన ప్రహసనం. ఓట్లు లెక్కించి పూర్తి ఫలితాలు ప్రకటించేందుకు రెండు రోజులు కూడా పట్టేది. మందీ మార్బలంతో పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకొని రిగ్గింగ్కు పాల్పడే అవకాశం కూడా ఉండేది. ఆ ఎన్నికల ప్రక్రియ స్థానంలో ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)లు వచ్చాయి. ఇందులో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగాన్ని ‘కంట్రోల్ యునిట్’గా వ్యవహరిస్తారు. ఈ యునిట్ ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి వద్ద ఉంటుంది. ఈ యునిట్ ప్రతి ఓటును లెక్కించి తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఇది కరెంట్ఫై ఆధారపడకుండా బ్యాటరీపైనే నడుస్తుంది. ఇక రెండో విభాగాన్ని ‘బ్యాలెటింగ్ యునిట్’ అంటారు. వీటిపై అభ్యర్థుల పేర్లు, వారి పార్టీ గుర్తులుగల బటన్లతో ఓ ప్యానెల్ ఉంటుంది. ఈసారి అభ్యర్థుల ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు. ఈవీఎం ప్యానల్పైనున్న బటన్ను నొక్కి ఓటు వేయడం మూడవ విభాగం. ఓటరు ఏదైనా బటన్ను నొక్కినప్పుడు ఆ బటన్పైనున్న అభ్యర్థి పేరిట ఓటు పడుతుంది. ఇప్పుడు ఓటరు తానేసిన ఓటు ఎవరికి పడిందో తెలుసుకునేందుకు వీలుగా ‘వీవీపీఏటీఎం’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఓటరు బటన్ను నొక్కగానే దానికి అనుసంధానించిన మరో యంత్రం స్క్రీన్ మీద ఆ ఓటు ఎవరికి పడిందో తెలియజేసే ఓ కాగితం ఏడు సెకడ్లపాటు కనిపిస్తుంది. ఆ తర్వాత అది యంత్రం లోపలి బాక్సులో పడిపోతుంది. ఈ మరో యంత్రాన్నే ‘వోటర్ వెరీఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ మెషీన్ (వీవీపీఏటీఎం)’ అని వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత తనిఖీ చేసినప్పుడు ఈవీఎం మొదటి యునిట్లో నిక్షిప్తమైన డేటాతో వీవీపీఏటీఎంలో పడిన స్లిప్పులతో సరిపోవాలి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చా? ఓటింగ్ జరిగినప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమైన డేటాను తారుమారు లేదా తలకిందులు చేయడాన్ని ట్యాంపరింగ్గా పేర్కొనవచ్చు. అంటే ఓడిపోయిన అభ్యర్థిని గెలిచినట్లుగా, గెలిచిన అభ్యర్థిని ఓడిపోయినట్లుగా చూపడం. ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం. ఇంటర్నెట్ ద్వారా డేటాను తారుమారు చేసే అవకాశం ఉంటుంది కనుకనే ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేదు. అయినా ట్యాంపరింగ్ చేయాలంటే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి భౌతికంగా ఈవీఎంలను చేతుల్లోకి తీసుకొని అనుకూలంగా ట్యాంపర్ చేయవచ్చు. అసలు ఓటరుకు బదులు ఇతరులు బటన్ నొక్కి ఓటు వేయవచ్చు. ఎన్నికల సిబ్బంది, సీసీటీవీ కెమేరాలు, వివిధ పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లో ఉంటారు కనుక అలా చేయడం అసాధ్యం. ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను సీల్చేసి గట్టి సెక్యూరిటీ మధ్య వాటిని నిల్వచేసే ‘స్ట్రాంగ్ రూమ్’లకు పంపిస్తారు. మరి ఎలా ట్యాంపర్ చేయవచ్చు? ఈవీఎంలను తరలించే క్రమంలోగానీ, వాటిని స్ట్రాంగ్ రూముల్లో నిల్వ చేసినప్పుడుగానీ వాటిని తస్కరించి వాటి స్థానంలో ముందుగా ట్యాంపరింగ్ చేసిన ఈవీఎంలను ఏర్పాటు చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయవచ్చు. స్ట్రాంగ్ రూమ్లకు తీసుకెళ్లే ఈవీఎంలకు నెంబర్లు, దానికి ఎన్నికల అధికారుల సంతకాలతో కూడిన సీలింగ్ ఉంటుంది. ఓట్లను లెక్కించే సమయంలో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. అక్రమాలకు పాల్పడాలంటే సంతకాల ఫోర్జరీ, సీల్ సరిపోవాలి. పైగా పోలింగ్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూమ్ వరకు గట్టి భద్రత మధ్య వాటిని తరలించడమే కాకుండా అడుగడుగున వాటిపై నిఘా ఉంటుంది. ఈ విషయంలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల కమిషన్ నియమించిన ‘మైక్రో’ పరిశీలకులు సహా పలు రకాల పరిశీలకులు, వీడియో గ్రాఫర్లు తోడుగా ఉంటారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద అభ్యర్థి తాలూకు వ్యక్తి ఒకరు 24 గంటలపాటు కాపలా ఉండేందుకు కూడా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పిస్తోంది. కనుక అదంతా ఈజీ కాదు. పాలకపక్షాలకు అవకాశం ఉంటుందా? స్ట్రాంగ్రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను మార్చే అవకాశం పాలకపక్షాలకు ఉంటుందనేది అన్ని ప్రతిపక్షాల ఆరోపణ. పాలకపక్షం తలచుకుంటే ముందస్తు ప్రణాళికతో ఈవీఎంల నెంబర్లను, ఎన్నికల అధికారులు సూచించే కోడ్లను ముందే తెలుసుకోవచ్చు. అప్పుడు భద్రతా సిబ్బందిని, పలు అభ్యర్థుల నిఘాపరులను ప్రలోభపెట్టి ఈవీఎంలను తారుమారు చేయవచ్చు. అందుకు ఎన్నికల కమిషన్, పోలింగ్ నిర్వహించే ప్రభుత్వ సిబ్బంది, పార్టీల ఏజెంట్లు కుమ్మక్కు కావాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యం. అన్నింటికన్నా ముఖ్యం ఎన్నికలను తారుమారు చేయాలనుకునే వ్యక్తుల వద్ద ఈవీఎంలు ఉండాలి. వాటిని సాధించడం కూడా అంత సులభం కాదు. ఈవీఎంల తయారు చేసే చోటే జరగవచ్చా? ఈవీఎంలను తయారు చేసే చోటే వాటిని ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం ఉంది. ఒకరికి ఓటు వేసేందుకు బటన్ను నొక్కితే మరొకరికి వెళుతుందంటూ ప్రత్యక్షంగా ఈవీఎంలను సవాల్ చేసినవాళ్లు ఉన్నారు. దేశంలో రెండు ప్రభుత్వరంగ సంస్థలు (ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్) మాత్రమే వీటిని తయారు చేస్తున్నాయి. వాటిని తయారు చేస్తున్న ఇంజనీర్లను పట్టుకొని తయారీలోనే ట్యాంపరింగ్ చేయవచ్చు. వాళ్లు తయారు చేసిన ఈవీఎంలు దేశంలో ఏ ప్రాంతానికి వెళతాయో వారికే కాదు. కంపెనీ యజమానులకు కూడా తెలిసే అవకాశం లేదు. నామినేషన్ల గట్టం పూర్తయ్యే వరకు ఏ నియోజకవర్గంలో ఎవరు, ఎంత మంది నిలబడతారో తెలియదు. అలాంటప్పుడు ముందుగా ట్యాంపరింగ్ చేయడం కూడా సాధ్యం కాదు. వీడియోల్లో కనిపించే ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లోకి వెళ్లాల్సిన ఈవీఎంలు దారితప్పాయంటూ మనం పలు వీడియోలను సాక్షంగా చూస్తుంటాం. ఆ ఈవీఎంలు అత్యవసరం కోసం అందుబాటులో ఉంచిన అదనపు లేదా మొరాయించిన ఈవీఎంలని ఎన్నికల కమిషన్ వర్గాలే స్పష్టం చేశాయి. ఎన్నికల మార్గదర్శక సూత్రాల ప్రకారం అదనపు లేదా మొరాయించిన ఈవీఎంలను కూడా గట్టి భద్రత మధ్య స్ట్రాంగ్ రూముల్లోకి తరలించాలి. ఈ విషయంలో ఈసీ వర్గాలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయో అర్థం కాదు. ఈవీఎంలను మార్చడం సాధ్యం కాదు కనుక వాటిని ఎత్తుకు పోవచ్చు. యూపీ, బీహార్, పంజాబ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షల ఈవీఎంలు గల్లంతయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాటిలో నిజానిజాలను ఈసీ వర్గాలే తేల్చాలి. వీవీపీటీఎం పద్ధతే మంచిది ఈవీఎంలలో ఓట్లతోపాటు వీవీపీటీఎంలను లెక్కించడం ద్వారా అవకతవకలను సులభంగానే కనిపెట్టవచ్చు. ప్రతి నియోజకవర్గంలో ఒక్క పోలింగ్ కేంద్రానికి మాత్రమే దీన్ని పరిమితం చేస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొనగా, సుప్రీం కోర్టు ఆ సంఖ్యను ఐదింటికి పెంచింది. ఈ సంఖ్యను 33 నుంచి 50 వరకు పెంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కౌంటింగ్కు కౌంట్డౌన్
-
ప్రజాతీర్పుతో పరిహాసం!
సాక్షి, న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) పనితీరును వివాదాస్పదం చేయడం ద్వారా ఈ అంశాన్ని సజీవంగా ఉంచేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 2014లో ఇవే ఈవీఎంలతో గెలిచిన చంద్రబాబు ఈసారి పరాజయం ఖాయమనే నిర్థారణకు వచ్చి వీటిని సాకుగా చూపేందుకు ఇతర పార్టీలనూ ఇందులోకి లాగుతూ ఈ వివాదంలో భాగస్వాములుగా మార్చే యత్నం చేస్తున్నారు. ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ నియోజకవర్గంలోని మిగతా కేంద్రాల్లోనూ వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న డిమాండ్తో మంగళవారం ఢిల్లీలో విపక్షాల సమావేశం జరిగింది. ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని కలసి వినతిపత్రం సమర్పించడానికి ముందు 22 పార్టీలు సమావేశమయ్యాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు జరిగిన ఈ భేటీకి చంద్రబాబు, ఒకరిద్దరు ప్రధాన నేతలు మినహా విపక్షాల అధినేతలెవరూ హాజరుకాకపోవడం గమనార్హం. తనకు తానే పెద్దన్నగా చెప్పుకుంటూ... టీడీపీ పరాజయం అంచున ఉందని ఎన్నికల షెడ్యూలు కంటే ముందుగానే పలు సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్స్ ద్వారా ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబు తన వైఫల్యాలను ఈవీఎంలపై నెట్టివేసేందుకు మార్గాలను అన్వేషించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురవుతాయంటూ అప్పటి నుంచే ప్రచారాన్ని ఉధృతం చేస్తూ వచ్చారు. మళ్లీ బ్యాలెట్ పద్ధతి తేవాలని ఈసీని డిమాండ్ చేశారు. 2018లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన తరువాత ఈ అంశాన్ని పట్టించుకోని కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడడంతో ఈవీఎంలపై చంద్రబాబు డిమాండ్కు తలొగ్గింది. ఎన్డీయేతర విపక్షాలను ఏకం చేసే ఎజెండాలో ఇదొక భాగమైంది. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు ఐక్య వేదికపైకి వచ్చేందుకు ఇది దోహదపడుతుండడంతో మిగిలిన పక్షాలూ జత కలిశాయి. వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలంటూ ఈ పార్టీలన్నీ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటివరకు నియోజకవర్గానికి ఒక పోలింగ్ స్టేషన్లో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తున్న విధానాన్ని ఐదు పోలింగ్ స్టేషన్లకు వర్తింపజేస్తూ తీర్పు ఇచ్చారు. దీన్ని సమీక్షించాలని మరోసారి రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు మరో కొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. చివరి రౌండ్లో కాకుండా ముందుగానే ఐదు కేంద్రాల్లో వీవీ ప్యాట్లను లెక్కించాలని, ఒకవేళ ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ పత్రాలకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలతోపాటు వీవీప్యాట్ పత్రాలను లెక్కించాలన్నది ఈ డిమాండ్. మే రెండో వారంలో దీనిపై ఈసీని కలిసినా స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్లో పరాజయం అంచున ఉన్న చంద్రబాబు ఈ డిమాండ్ను తనకు అనుకూలంగా వాడుకుంటూ వారం రోజులుగా జాతీయ నేతలను కలుస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నానంటూ తనకు తానే పెద్దన్నగా చెప్పుకుంటున్నారు. ఈసీని కలిసిన అనంతరం బయటకు వస్తున్న చంద్రబాబు, గులాం నబీ ఆజాద్ తదితరులు అధినేతల నుంచి స్పందన కరువు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాక తీవ్ర నైరాశ్యంలో ఉన్న విపక్ష పార్టీలు చంద్రబాబు డిమాండ్లపై పెద్దగా స్పందించడం లేదు. ఎన్నికల సంఘంతో చర్చించాల్సిన అంశాలపై మాట్లాడేందుకు మంగళవారం మధ్యాహ్నం భేటీ కావాలంటూ చంద్రబాబు హడావుడి చేసినా కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ అధినేతలు ఎవరూ హాజరు కాలేదు. ఆయా పార్టీల ప్రతినిధులు మాత్రమే వచ్చారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్, అభిషేక్ సింఘ్వీ, కొప్పుల రాజు, రాజ్బబ్బర్, ఎస్పీ నుంచి రాంగోపాల్ యాదవ్ ఎన్సీపీ నుంచి ప్రఫుల్పటేల్, మజీద్ మెమన్, డీఎంకే నుంచి కనిమొళి, తృణమూల్ నుంచి డెరెక్ ఒబ్రెయిన్, బీఎస్పీ నుంచి సతీష్చంద్ర, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, ఎల్జేడీ నుంచి జావేద్, జేడీ(ఎస్) నుంచి కుపేంద్రరెడ్డి తదితరులు హాజరయ్యారు. ధర్నాపై భిన్నాభిప్రాయాలు.. తమ డిమాండ్లపై సరైన స్పందన రానిపక్షంలో ఈసీ కార్యాలయం ఎదుట ధర్నా ఉంటుందని టీడీపీ వర్గాలు, అనుకూల మీడియా ప్రచారం చేశాయి. అయితే ఈ ప్రతిపాదనపై సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. రాజ్యాంగబద్ధమైన సంస్థ కార్యాలయం ముందు ధర్నా చేయడం సముచితం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. ఒకవేళ ఎన్నికల సంఘం ఈ సమస్యకు పరిష్కారం చూపించకుంటే బుధవారం ఈసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాలని నిర్ణయించినట్లు సమాచారం. నేడు చర్చిస్తామన్న ఈసీ ఈసీతో భేటీ పూర్తయిన వెంటనే మంగళవారం మరోసారి కానిస్టిట్యూషన్ క్లబ్లో విపక్షాల ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విపక్షాల కూటమి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ ‘ఈవీఎంలో పోలైన ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ నియోజకవర్గంలోని మొత్తం పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరాం..’ అని వివరించారు. ‘మేం దీనిపై చాలా రోజులుగా అడుగుతున్నా ఈసీ స్పందించలేదు. ఎట్టకేలకు బుధవారం ఉదయం ఈ అంశంపై చర్చిస్తామని ఈసీ తెలిపింది’ అని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. ‘ప్రజాతీర్పును మార్చడానికి వీల్లేకుండా చూడాలని ఈసీని కోరుతున్నాం..’ అని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు చెప్పారు. బాబు హడావుడి వెనక అసలు కథ? గురువారం వెలువడే ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు తీవ్ర ఆందోళనతో ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాతీర్పును హుందాగా గౌరవించకుండా పరాజయ భారాన్ని ఈవీఎంలపై నెట్టేయడానికి కారణాలను రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పరాజయం పాలైతే జాతీయ రాజకీయాల్లో తనకు ఒక పాత్ర దక్కాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష. ఒకవేళ ఎన్డీయేతర పక్షాలు అధికారంలోకి రాకుంటే విపక్షాల కూటమిని సజీవంగా ఉంచేందుకు వీలుగా కన్వీనర్ లేదా కో కన్వీనర్ లాంటి పదవిని ఆశిస్తున్నారు. ఆ ప్రయత్నాలను ఆయన ఇప్పటికే ముమ్మరం చేశారు. రేపు పరాజయం పాలైతే ఆ భారాన్ని ఈవీఎంలపై గెంటేసేందుకు ఈ ప్రయత్నాలు పనికొస్తాయి. విపక్షాలతో మితృత్వం చంద్రబాబుకు ఎంతో అవసరం. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబు పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది ..’ అని రాజకీయ, మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
రేపే కౌంటింగ్
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఫలితాలు వెల్లడి కావడానికి ఇక గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో క్షణక్షణానికి ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 36 చోట్ల స్ట్రాంగ్రూమ్ల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) భద్రపర్చారు. గురువారం ఓట్ల లెక్కింపు జరగనుంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 6 చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గురువారం స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి, పక్కనే ఉన్న కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 25,000 మందికిపైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు. భద్రత కోసం 25,000 మందికిపైగా పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కేంద్రాల వివరాలివీ... శ్రీశివానీ ఇంజనీరింగ్ కాలేజ్, చిలకపాలెం,శ్రీకాకుళం: పాలకొండ(ఎస్టీ), ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం(ఎస్సీ) ఎంవీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చింతలవలస, విజయనగరం: కురుపాం(ఎస్టీ), పార్వతీపురం(ఎస్సీ), సాలూరు(ఎస్టీ), శృంగవరపుకోట. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్, విశాఖపట్నం: అరకు వ్యాలీ(ఎస్టీ), పాడేరు(ఎస్టీ), భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ, గాజువాక, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట(ఎస్సీ), నర్సీపట్నం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, కాకినాడ: రంపచోడవరం(ఎస్టీ) జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం: బొబ్బిలి, గజపతినగరం లెండి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, జొన్నాడ, విజయనగరం: చీపురుపల్లి, నెల్లిమర్ల పోలీస్ ట్రైయినింగ్ కాలేజ్, కంటోన్మెంట్, విజయనగరం: విజయనగరం జేఎన్టీయూ–కాకినాడ: తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట, ముమ్మిడివరం, మండపేట, రాజానగరం రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ: అమలాపురం(ఎస్సీ), రాజోలు(ఎస్సీ), గన్నవరం(ఎస్సీ), కొత్తపేట డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథార్టీ, కాకినాడ: రామచంద్రాపురం ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్, కాకినాడ: అనపర్తి, రాజమండ్రి సిటీ, రాజమండ్రి గ్రామీణం సర్ సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఏలూరు: కొవ్వూరు(ఎస్సీ), నిడదవోలు, గోపాలపురం(ఎస్సీ) విష్ణు స్కూల్, భీమవరం: నర్సాపురం, భీమవరం విష్ణు డెంటల్ కాలేజ్, భీమవరం: ఆచంట, పాలకొల్లు బి.సీతా పాలిటెక్నిక్, విష్ణు కాలేజ్, భీమవరం: ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏలూరు: ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం(ఎస్టీ), చింతలపూడి(ఎస్సీ) కృష్ణా యూనివర్సిటీ, మచిలీపట్నం: నూజివీడు, కైకలూరు, గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు(ఎస్సి), పెనమలూరు ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీ–గంగూరు: తిరువూరు (ఎస్సీ), విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ(ఎస్సీ), జగ్గయ్యపేట నాగార్జున యూనివర్సిటీ, నంబూరు: తాడికొండ (ఎస్సీ), మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు(ఎస్సీ), గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, వేమూరు(ఎస్సీ), రేపల్లె, బాపట్ల లయోలా పబ్లిక్ స్కూల్, నల్లపాడు: పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల పేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వల్లూరు: పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు(ఎస్సీ) రైజ్ కృష్ణసాయి ప్రకాశం గ్రూపు, వల్లూరు: ఎర్రగొండపాలెం(ఎస్సీ), దర్శి, ఒంగోలు, కొండెపి(ఎస్సీ) రైజ్ కృష్ణసాయి గాంధీ గ్రూపు, వల్లూరు : మార్కాపురం, గిద్దలూరు రైజ్ కృష్ణసాయి పాలిటెక్నిక్, వల్లూరు: కనిగిరి, కందుకూరు రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు: ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు(ఎస్సీ), పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్ రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్నూలు: పత్తికొండ, ఎమ్మిగనూరు జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్, కర్నూలు: కోడుమూరు(ఎస్సీ), కర్నూలు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్, అనంతపురం: రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, శింగనమల(ఎస్సీ), అనంతపురం, కళ్యాణదుర్గం ఎస్కే యూనివర్సిటీ, అనంతపురం: రాప్తాడు, మడకశిర(ఎస్సీ), హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి కేఎల్ఎం ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, కడప: బద్వేలు(ఎస్సీ), కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు(ఎస్సీ), రాయచోటి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్, నెల్లూరు: కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరుగ్రామీణం, ఉదయగిరి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్, నెల్లూరు: సర్వేపల్లి, గూడూరు(ఎస్సీ), సూళ్లూరుపేట(ఎస్సీ), వెంకటగిరి వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, పూతలపట్టు: తిరుపతి, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు ఆర్కేఎం లా కాలేజ్, పూతలపట్టు: శ్రీకాళహస్తి, సత్యవేడు(ఎస్సీ) శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిమ్మసముద్రం: చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు(ఎస్సీ), చిత్తూరు, పూతలపట్టు(ఎస్సీ), పలమనేరు, కుప్పం -
ఈవీఎంలు... అంతా కట్టుదిట్టం!
ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న ఈవీఎంలపై అపోహలు కొత్త కాదు. ఎప్పటి నుంచో ఉన్నవే. ఓడిన ప్రతిసారీ నాయకులు నెపాన్ని యంత్రాలపై నెట్టేస్తున్నారని మాజీ ప్రధాన ఎన్నికల అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు కూడా. అయినా ఈ యంత్రాలపై అసత్య ఆరోపణల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ నేతలు తరచూ వ్యక్తం చేసే అనుమానాలు.. సామాన్యులకు కలిగే సందేహాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేసేందుకు సాక్షి ఒక ప్రయత్నం చేసింది. ఈవీఎంలను తయారు చేసిన కంపెనీల్లో ఒకటైన ఈసీఐఎల్ మాజీ ఉన్నతోద్యోగి, టెలికం డిపార్ట్మెంట్ నుంచి చీఫ్ జనరల్ మేనేజర్గా పదవీ విరమణ చేసిన బి.జగదీశ్కుమార్తో చర్చించింది. ఆ వివరాలు.... ఈవీఎం పాడైతే... ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పనిచేయకుండా పోతే.. దాని స్థానంలో కొత్త ఈవీఎంను ఏర్పాటు చేస్తారు. ఓటింగ్ మధ్యలో యంత్రం పాడైతే.. అప్పటివరకూ నమోదైన ఓట్లన్నీ కంట్రోల్ యూనిట్లో భద్రంగా నిక్షిప్తమై ఉంటాయి. కొత్త ఈవీఎంలతో ఓటింగ్ను కొనసాగించవచ్చు. కౌంటింగ్ రోజు రెండు కంట్రోల్ యూనిట్లలోని ఓట్లను లెక్కిస్తారు. ఒకసారి కంట్రోల్ యూనిట్లో చేరిన సమాచారం (ఓటింగ్ వివరాలు) 15 ఏళ్లపాటు స్టోర్ చేసి ఉంచవచ్చు. ఏ మీట నొక్కినా ఓట్లు ఒకే పార్టీ్టకా? ఈవీఎంలలో వాడే మైక్రోప్రాసెసర్ను ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్ చేయవచ్చు. కొంచెం సింపుల్గా చెప్పాలంటే బండరాయిపై అక్షరాలు చెక్కినట్లు. చెక్కడం వరకూ మన చేతుల్లో ఉంటుందిగానీ.. చెరిపేయడం అస్సలు సాధ్యం కాదు. కాబట్టి ఆ సమాచారానికి మార్పులు చేయడమూ అసాధ్యం. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు కాబట్టి మైక్రోప్రాసెసర్లోని సమాచారాన్ని తెలుసుకోవడం కూడా వీలుపడదు. ఒకవేళ ఎవరైనా... ఏదో ఒక పద్ధతిలో ఇందులో మార్పులు చేస్తే మార్పులు ఏవో జరిగినట్లు ఫస్ట్ లెవల్ చెకింగ్లోనే తెలిసిపోతుంది. ఏ ఈవీఎం ఎక్కడికి వెళుతుందో ముందుగానే తెలుసుకోవచ్చా? అస్సలు సాధ్యం కాదు. బ్యాలెట్ పేపర్పై అభ్యర్థులు ఎవరు? వారి సీరియల్ నంబర్లు ఏవి అన్నది.. నామినేషన్ల పరిశీలన, ఆమోదం తరువాత మాత్రమే స్పష్టమవుతుంది. ఆ తరువాత అక్షర క్రమంలో వివరాలను బ్యాలెట్ యూనిట్లోకి ఎక్కిస్తారు. ముందుగా జాతీయ, రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల పేర్లు, ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వారు.. తరువాత స్వతంత్ర అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో వస్తాయి. ఈవీఎంలను రెండు దశల్లో పూర్తిస్థాయిలో కలగలిపిన తరువాత మాత్రమే వాటిని పోలింగ్ కేంద్రాలకు కేటాయిస్తారు. ర్యాండమైజేషన్ అని పిలిచే ఈ ప్రక్రియ తొలి దశ జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో జరిగితే... రెండోది అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో జరుగుతుంది. మొత్తమ్మీద పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు సాక్షులుగా ఉంటారు. వీవీప్యాట్ స్లిప్పై ఏదైనా తేడా ఉంటే ఫిర్యాదు చేయవచ్చా? తాము ఓటేసిన వారికి బదులు ఇతరులకు ఓటు పడిందని ఓటర్లు ఎవరైనా వీవీప్యాట్ల స్లిప్ సాయంతో ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల నియమావళిలోని 49ఎంఏ ప్రకారం తప్పుడు ఆరోపణలు చేస్తే జరగబోయే పరిణామాలను వివరించిన తరువాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటరు నుంచి రాతపూర్వకమైన ప్రకటన రూపంలో ఫిర్యాదు స్వీకరిస్తారు. ఆ తరువాత ప్రిసైడింగ్ ఆఫీసర్, అభ్యర్థి /పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓటు వేస్తారు. వీవీప్యాట్ ద్వారా వచ్చే ప్రింట్ను పరిశీలిస్తారు. ఓటరు ఆరోపణ నిజమైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ విషయాన్ని వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్కు తెలియజేస్తారు. ఓటింగ్ నిలిపివేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయి. ఒకవేళ ఓటరు ఆరోపణ తప్పు అని రుజువైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫార్మ్ 17ఏలో వివరాలు నమోదు చేస్తారు. ఆ ఓటరు ఏ అభ్యర్థికి, ఏ సీరియల్ నంబరుకు ఓటేసిందీ నమోదు చేస్తారు. దీన్ని ధ్రువీకరిస్తూ ఓటరు నుంచి సంతకాలు సేకరిస్తారు. టెస్ట్ ఓట్లను నమోదు చేయాల్సిన 17సీ ఫార్మ్లోనూ వివరాలు నమోదు చేస్తారు. తయారయ్యే చోటే మారిస్తే...? ఇది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే కఠినాతికఠినమైన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. వేర్వేరు ప్రాంతాల్లో తయారైన ఈవీఎంలను ముందుగా రాష్ట్రాలకు, ఆ తరువాత జిల్లాలకూ పంపుతారు. కొన్నేళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఏ సీరియల్ సంఖ్య ఉంటుందో తెలియదు కాబట్టి.. అందుకు అనుగుణంగా ఫ్యాక్టరీలోనే మార్పులు చేయడమన్న ప్రశ్నే రాదు. ప్రతి ఈవీఎం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేసిన కారణంగా మార్పులుచేర్పులన్నది అసాధ్యం. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమా? అసలు సాధ్యం కాదు. ఎన్నికల కమిషన్ ఇప్పటివరకూ మూడు మోడళ్ల ఈవీఎంలను తయారు చేసింది. 2006 వరకూ తయారైన ఈవీఎంలను మోడల్ 1 అంటారు. నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ వంటివేవీ లేని ప్రోగ్రామబుల్ మైక్రోచిప్లను మాత్రమే ఇందులో వాడారు. టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ సిఫారసుల మేరకు 2006 – 2012 మధ్యకాలంలో తయారైన రెండో మోడల్ ఈవీఎంలలో మాత్రం డైనమిక్ కీ కోడింగ్ను వాడారు. బ్యాలెట్ యూనిట్పై నొక్కిన బటన్కు సంబంధించిన వివరాలు పూర్తిగా సంకేత భాషలో (ఎన్క్రిప్టెడ్) కంట్రోల్ యూనిట్కు వెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా రియల్ టైమ్ సెట్టింగ్ అనే అంశం కారణంగా బ్యాలెట్ యూనిట్పై ఏ క్రమంలో బటన్లు నొక్కారో తెలిసిపోతుంది. కంప్యూటర్ల ద్వారా పనిచేయించకపోవడం, నెట్వర్క్కు అనుసంధానం కాకపోవడం, రేడియో తరంగాలతోపాటు ఏ ఇతర విద్యుదయస్కాంత తరంగాలను పంపేందుకు, స్వీకరించేందుకు ఏర్పాట్లు లేకపోవడం, యూఎస్బీ లాంటివి జత చేసే ఏర్పాట్లూ లేకపోవడం వంటి కారణాల వల్ల ఈవీఎంలను హ్యాక్ చేయడం అస్సలు సాధ్యం కాదు. ఈవీఎంలను కంప్యూటర్ల ద్వారా నియంత్రించరు. ఏ ఇతర పరికరంతోనూ అనుసంధానమై ఉండదు. ఇంటర్నెట్ లేదా నెట్వర్క్ కూడా ఉండదు. ఫలితంగా వీటిని హ్యాక్ చేయడం కుదరదు. ఒక పద్ధతి ప్రకారం బటన్లను నొక్కడం ద్వారా ఈవీఎంలకు ప్రత్యేక సంకేతాలు వెళతాయన్న మాటలోనూ వాస్తవం లేదు. ఎందుకంటే ఓటరు మీట నొక్కినప్పటి నుంచి కంట్రోల్ యూనిట్లో ఆ ఓటు నమోదు అయ్యేంతవరకూ ఇతర బటన్లు ఏవీ పనిచేయవు కాబట్టి!! పాశ్చాత్యదేశాల్లో బ్యాలెట్ పేపర్లను వాడుతున్నారా? అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్ దేశాల్లో వాడే ఈవీఎంలన్నీ కంప్యూటర్ల ద్వారా నియంత్రించగలిగేవి. గతంలో కొన్ని దేశాలు ప్రయోగాత్మకంగా ఇలాంటి ఈవీఎంలను వాడాయి. కంప్యూటర్లతో నియంత్రించడం అంటే.. మార్పులుచేర్పులకు, హ్యాకింగ్కు అవకాశమిచ్చినట్లే అన్నది తెలిసిందే. దీంతో అక్కడ ఓటింగ్ ప్రక్రియపై సందేహాలు చెలరేగాయి. అంతేకాకుండా తగినన్ని భద్రతా ఏర్పాట్లు, చట్టాల్లో మార్పుల్లేకపోవడంతో వీటి వాడకాన్ని నిలిపివేశారు. భారత ఎన్నికల కమిషన్ తయారు చేసిన ఈవీఎంలలో ఈ చిక్కుల్లేవు. బాక్సులు తెరిచి చిప్ మారిస్తే...? సాధ్యం కాదు. 2013 తరువాత తయారైన ఎం3 మోడల్లో ఈవీఎం బాక్సులను బలవంతంగా తెరిచే ప్రయత్నాలను గుర్తించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ట్యాంపర్ డిటెక్షన్ అని పిలిచే ఈ ఫీచర్ వల్ల ఒకసారి ఎవరైనా బాక్సును బలవంతంగా తెరిచే ప్రయత్నం చేస్తే ఈవీఎం పనిచేయకుండా పోతుంది. మైక్రో ప్రాసెసర్ స్థాయిలో మార్పులను పసిగట్టేందుకు సెల్ఫ్ డయాగ్నస్టిక్స్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్లలో ఏవైనా మార్పులు జరిగితే ఆ విషయాన్ని వెంటనే గుర్తిస్తుంది ఇది. ఈవీఎంలను ఆన్ చేసిన ప్రతిసారీ ఈ సెల్ఫ్ డయాగ్నస్టిక్స్ ఫీచర్ పనిచేయడం మొదలవుతుంది. -
ఎన్నికలు ఓ ఫార్సు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఓ ఫార్సు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ చేశారని, అందులోని చిప్లను మార్చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) స్థానంలో అనిల్చంద్ర పునేఠాను మార్చి ఒక కోవర్టును నియమించారని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి కేసుల్లో సహ నిందితుడైన వ్యక్తిని సీఎస్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని ప్రజావేదికలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ రోజు సీఎస్.. డీజీపీ కార్యాలయానికి వెళ్లడం ఏమిటని ఆక్షేపించారు. ఇలా ఎప్పుడైనా జరిగిందా? అని నిలదీశారు. సీఎస్ తనకు నచ్చని పనులు ఎలా చేస్తారని అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం(ఈసీ) పూర్తిగా విఫలమైందని, తన జీవితంలో ఇంత పనికిమాలిన ఎన్నికల సంఘాన్ని చూడలేదని విమర్శించారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘ఆంధ్రప్రదేశ్లో ఎవరి ఊహకూ అందనంత సైలెంట్ వేవ్ ఉంది. అది జగన్మోహన్రెడ్డి కోసం ఉంటుందా? సాధారణంగా పోలింగ్ మొదట్లో మందకొడిగా సాగి, ఆ తర్వాత పుంజుకుంటుంది కానీ, ఈసారి దీనికి భిన్నంగా ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. 31 శాతం ఈవీఎంలు పనిచేయలేదు. ఈవీఎంలను సరిచేసిన తర్వాత హింసను ప్రేరేపించారు. ఈవీఎంలు రిపేర్ చేస్తామని వచ్చిన వాళ్లు రిపేర్లు చేశారా? లేక ట్యాంపరింగ్ చేశారా? ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైనా జగన్మోహన్రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు జరిగింది ఎన్నిక కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. నరేంద్ర మోదీ, జగన్, కేసీఆర్ వంటి వారితో పోరాడాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని చాలాచోట్ల దాడులకు పాల్పడ్డారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇవన్నీ జరిగాయి. తెలంగాణ నుంచి వచ్చే ఏపీకి బస్సులను ఆపేశారు. పోలింగ్లో కుట్ర చేశారు ఓటు వేసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చారు. పూణే నుంచి వచ్చి ఓటు కోసం పోలింగ్ కేంద్రాల్లో గొడవపడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే నుంచి ఓటు వేసేందుకు వస్తే, వారిని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. పోలింగ్లో కుట్ర చేశారు. ఉదయం ఓటేద్దామని పోలింగ్ కేంద్రాలకు వెళితే ఈవీఎంలు పనిచేయలేదు. అందరితో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నాను. ఒక పథకం ప్రకారమే ఇదంతా చేశారు. ఎన్నికల సంఘానికి మేము ముందే చెప్పినా వినకుండా సీనియర్ అధికారులందరినీ మార్చేశారు. కడప జిల్లా ఎస్పీని కూడా మార్చారు. ఎన్నికల సంఘం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ల ప్రధాన ఎన్నికల అధికారియే(సీఈవో) ఓటేయలేక వెనక్కి వచ్చేశారు. ఎన్నికల సంఘం సీఈవోనే ఓటేయలేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఈవీఎంలను మార్చి కొత్తవి పెట్టారు. ప్రజాస్వామ్య భవిష్యత్తును ఒక యంత్రం మీద వదిలి పెట్టారు. కరెంటు లేకపోతే ఈవీఎం పనిచేయలేదు. చాలాచోట్ల మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ప్రారంభించి సాయంత్రం ఆరు గంటలకే ముగించారు. శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పుడైనా రౌడీయిజం ఉందా? పోలింగ్ రోజు అక్కడ గూండాల్ని దింపి అల్లకల్లోలం సృష్టించారు. ఎన్నికలను రౌడీలకు అప్పగించారు దేశంలో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ బ్రాంచ్ ఆఫీసులా మార్చేశారు. పోలీసులపై దాడులు చేసి, ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల సమస్య ఏపీలో పెద్ద సమస్యే కాదని ఎన్నికల అధికారి చెబుతున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా పనిచేసిన ఎన్నికల సంఘాన్ని ఇంతవరకు నేను చూడలేదు. పోలీస్ బలగాలు కూడా లేకుండా చేసి రౌడీలకు అప్పజెప్పాలని చూశారు. ఎన్నికల సంఘం వైఫల్యాలపై జగన్మోహన్రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన లోటస్పాండ్ నుంచే రాష్ట్రాన్ని పరిపాలిస్తారా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చెబితే ఎన్నికల సంఘం దాన్ని పాటించే పరిస్థితి ఉంది. ప్రతిపక్షానికి ఇన్ని రూ.వేల కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి? ఈవీఎంల ఊతంతో ఎన్నికల తతంగాన్ని ఒక ఫార్సుగా మార్చేశారు. ఎమ్మెల్యే పదవిని మార్కెట్లో సరుకులా మార్చారు. వీవీ ప్యాట్లను లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందని కబుర్లు చెబుతున్నారు. ఈవీఎంలపై నమ్మకం ఉంటుందా? పోలింగ్ రోజు పరిస్థితులను చూశాక దేశంలో ఎవరికైనా ఈవీఎంలపై నమ్మకం ఉంటుందా? నేను వేసిన ఓటు మా పార్టీకే పడిందో లేదో తెలియలేదు. ఈవీఎంలను రిపేర్లు చేస్తున్నారో, ఏమారుస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కంప్యూటర్ ఆపరేటర్ మీద, ప్రోగ్రామర్ మీద, చిప్ మీద ప్రజాస్వామ్యం ఆధారపడే పరిస్థితి ఉంది. ఈవీఎంలలో చిప్లు మార్చేశారు. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టం. మంత్రులు, ఎంపీలతో కలిసి శనివారం ఢిల్లీకి వెళ్లి, ఎన్నికల సంఘాన్ని కలుస్తా. అవసరమైతే ధర్నా చేస్తా. ఈవీంఎలపై న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తాం. ఎన్నికల సంఘం సీఈవోనే ఓటేసుకోలేకపోయాడంటే ఇది వాళ్ల చేతకానితనం కాదా? ఏపీలో గత ఎన్నికలను చివరి విడతలో నిర్వహించి, ఈసారి తొలి విడతలో ఎందుకు పెట్టారు? మోదీ చెప్పడం వల్లే మన రాష్ట్రంలో మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించారు. ఎవరితోనూ చర్చించకుండా ఎన్నికలు నిర్వహించడం దారుణం’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. మీడియాతో చాలాసేపు మాట్లాడిన చంద్రబాబు ఎన్నికల ఫలితాలపై మాత్రం స్పందించలేదు. ఎవరు గెలుస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... తామే గెలుస్తున్నామని బదులిచ్చారు. -
మే మొదటి వారంలో పరిషత్ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్లకు మే నెల మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తొలిదశలోనే (ఏప్రిల్ 11) తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతోంది. లోక్సభ ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ రెండో నోటిఫికేషన్ ఇచ్చి.. దీనికి అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోడ్ అమలు గడువు ముగిసేలోపు (మే 25) జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ముగించేలా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబరులో అసెంబ్లీ, జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇలా వరుస ఎన్నికల నేపథ్యంలో నెలల తరబడి ఎన్నికల నియమావళి అమల్లో ఉంటోంది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల పురోగతి ఉండటంలేదు. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను త్వరగా ముగించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈవీఎంలతో పరిషత్ ఎన్నికల్లో ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలు (ఈవీఎం) ఉపయోగించాలనే ఆలోచనలో ఎస్ఈసీ ఉంది. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై టీఆర్ఎస్, తదితర పార్టీల నుంచి సానుకూలత వ్యక్తమైనట్టు సమాచారం. ఈ ఎన్నికలు రెండువిడతల్లో నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తోంది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలను ఉపయోగించాలనే ఆలోచనతో ఎస్ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కూడా అన్ని పార్టీలనుంచి ఆమోదం వచ్చినట్లు సమాచారం. వేగంగా ఏర్పాట్లు పరిషత్ ఎన్నికలకోసం ఎస్ఈసీ ఏర్పాట్లును వేగవంతం చేసింది. వచ్చే జూలై 4న కొత్త జడ్పీలు, ఎంపీపీ పాలకవర్గాలు ఏర్పడేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలోని పాత 9 జడ్పీల స్థానంలో 32 జడ్పీల చైర్పర్సన్లు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాల పరిధిలో ఎంపీపీ అధ్యక్ష స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. కొత్త జడ్పీలు, ఎంపీపీల పరిధిలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కూడా పూర్తయింది. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సరిహద్దులు ఖరారయ్యాయి. 32 జడ్పీలు, 535 ఎంపీపీలు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ ప్రక్రియను పూర్తిచేయడంలో భాగంగా ఇప్పటికే పాత 9 జడ్పీల స్థానంలో జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా 32 జడ్పీలు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాలను ఎంపీపీలుగా పునర్విభజన పూర్తిచేశారు. 32 జడ్పీ చైర్పర్సన్లు, 535 ఎంపీపీలకు సంబంధించి ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో మొత్తం 5,984 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్టు సమాచారం. కొత్తగా 68 మున్సిపాటిలీలు ఏర్పడిన నేప థ్యంలో ఆయా మండలాల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీలను వాటిలో విలీనం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 489 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 27న ఓటర్ల తుది జాబితా ఈ నెల 27న రాష్ట్రంలో గ్రామపంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఎస్ఈసీ ఇదివరకే ఆదేశించింది. తుది జాబితా సిద్ధం చేసి మార్చి 27న ప్రచురించాలని గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సూచించిన మేరకు వార్డుల విభజన పూర్తిచేయాలని ఆదేశాలొచ్చాయి. ఈ నెల 16న వార్డుల వారీగా విభజించిన గ్రామపంచాయతీ ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ జాబితాలపై వివిధ ప్రక్రియలను నిర్వహించాక 27న డీపీవో చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా గ్రామపంచాయతీ ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రచురించాలి. -
వచ్చేసింది.. ఓట్ల పండుగ
పేరు చెప్పడానికీ సిగ్గుపడే దశ నుంచి... ఓటు మా హక్కు అని మహిళలు గొంతెత్తే వరకూ... నా ఒక్క ఓటేయకపోతే పోయేదేముందిలే అనుకునే దగ్గర్నుంచి... బాధ్యతగా చేసుకున్న మిలినియల్స్ వరకూ.. గల్లీ గల్లీ తిరిగి కరపత్రాలు పంచి ప్రచారం చేసే స్థాయి నుంచి... కాక రేపే ఫేస్బుక్ పోస్టు ఒక్కటి చాలని అనుకునే వరకు... గెలిచింది ఎవరో తెలిసేందుకు రోజులు పట్టే కాలం నుంచి.. గంటల్లో విజేతలను నిర్ణయించే దశ వరకూ... ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం.. మన భారతీయంలో వింతలు విశేషాలు.. అన్నీ ఇన్నీ కావు! సామాన్యుడు.. దేవుడయ్యే సమయం దగ్గరకొచ్చింది! ఎడమచేతి చూపుడువేలిపై సిరా గుర్తు పడే రోజు వచ్చేస్తోంది! ఏడు దశాబ్దాల ఎన్నికల పండుగ ప్రజాస్వామ్య ప్రస్థానం సాగింది ఇలా... అభ్యర్థికో బాక్స్ నుంచి ఈవీఎంల వరకు మన ఎన్నికల ప్రక్రియ అభ్యర్థికో బాక్స్ నుంచి బ్యాలెట్ పత్రం దిశగా వెళుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు చేరుకుంది. తొలి ఎన్నికల్లో ప్రతీ అభ్యర్థికి వేర్వేరు రంగుల్లో ఉన్న ఒక్కో బ్యాలెట్ బాక్స్ని కేటాయించారు. ఆ బాక్స్పై వారి పేరు, ఎన్నికల గుర్తుని పెయింట్ చేశారు. ప్రతీ పోలింగ్ బూత్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఒక్కొక్కరికీ ఒక బ్యాలెట్ బాక్స్ అన్నమాట. నచ్చిన అభ్యర్థి బ్యాలెట్ బాక్స్లో ఓటరు బ్యాలెట్ పేపర్ను వేస్తే సరిపోతుంది. అప్పట్లో ఈ బ్యాలెట్ బాక్స్లను గోద్రేజ్ కంపెనీ బొంబాయిలోని విఖ్రోలి ప్రాంతంలో తయారు చేసింది. 1957 ఎన్నికల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించారు. మూడవ సార్వత్రిక ఎన్నికల (1962)లో బరిలో ఉన్న అభ్యర్థులు, గుర్తులను ఒకే బ్యాలెట్ పేపర్పై ముద్రించారు. ఇరవైఏళ్లపాటు ఇదే పద్ధతి కొనసాగగా.. 1982లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) వాడారు. అయితే అప్పట్లో పరూరు నియోజకవర్గంలోని 50 పోలింగ్ స్టేషన్లకే వీటిని పరిమితం చేశారు. 1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాల్లో వీటిని మరోసారి పరీక్షించారు. ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వడంతో 2004లో తొలిసారి మొత్తం లోక్సభ నియోజకవర్గాల్లో ఈవీఎంల వాడకం మొదలుపెట్టారు. అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో ఓటింగ్ ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు 2010లో ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీప్యాట్)లను ప్రవేశపెట్టారు. ఈవీఎంల వాడకంతో ఓటింగ్ ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా, ఫలితాల ప్రకటన కూడా వేగవంతమైంది. పోలింగ్ కేంద్రాల్లో జరిగే రిగ్గింగ్, ఆక్రమణ వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమైంది. తక్కువ బరువు ఉండటం వల్ల ఈవీఎల రవాణ కూడా సులభం. ఒక్కో ఈవీఎం ఖరీదు ఐదారు వేలు ఉంటుంది. పదిహేనేళ్ల పాటు పని చేస్తుంది. ఇన్ని లాభాలున్నా.. ఈవీఎంలలో లోపాలున్నాయన్న ఆరోపణలు రావడం సాధారణమైపోయింది. కాలినడక, పడవల్లో, ఏనుగులపై ప్రయాణాలు ఒకప్పుడు ప్రయాణ సాధనాలు అంతగా లేవు. సరైన రహదారి సౌకర్యాలు ఉండేవి కావు. కొండ ప్రాంతాల్లోనూ, నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, ఎడారుల్లోనూ, సముద్రం మధ్య ద్వీపాల్లోనూ ఓటింగ్ నిర్వహణ దుర్లభంగా ఉండేది. ఎన్నికల కమిషన్ సభ్యులు నానా పాట్లు పడేవారు. ఎన్నికల సామగ్రి మోసుకుంటూ మైళ్లకి మైళ్లు నడిచే పరిస్థితి. ఇఅదీ ప్రజాస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం. హిందూమహాసముద్రం ద్వీపాల్లో ఎన్నికల కోసం ఏకంగా నేవీ అధికారుల సాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని చేర్చడానికి హెలికాప్టర్ సాయం తీసుకునే వారు. ఇప్పుడు ప్రయాణ సాధనాలు మెరుగు పడినప్పటికీ అటవీ ప్రాంత పోలింగ్ స్టేషన్లకి వెళ్లాలంటే కాలినడకే మార్గం. ఇక ప్రత్యేక వాహనాలు, రైళ్లు, హెలికాప్టర్లు, బోట్లలో కూడా సిబ్బందని తరలిస్తారు. కొన్నిసార్లు పోలింగ్ స్టేషన్ చేరుకోవడానికి ఏనుగులు వాడిన సందర్భాలూ లేకపోలేదు. రాజస్థాన్ వంటి ఎడారుల్లో ఒంటెలే సాధనం. దేశం మొత్తమ్మీద దాదాపుగా 80 వేల పోలింగ్ కేంద్రాల వద్ద మోబైల్ఫోన్ సౌకర్యం కూడా లేదు. ఇంకో ఇరవై వేల పోలింగ్ స్టేషన్లు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కడున్నాడు! ఒక్క ఓటు. ఒకే ఒక్క ఓటు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది కూడా ఎంతో కీలకం. అందుకే ఎన్నికల సంఘం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మరీ గుజరాత్లో దట్టమైన గిర్ అడవుల్లోకి కాలినడకన వెళుతుంది. ఆ ఒక్కడి కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అతని పేరు మహంత్ భరత్దాస్ దర్శన్ దాస్. ఆలయపూజారి. ఆయన ప్రతీ ఏడాది తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సిబ్బంది గిర్ అడవుల్లోని బనేజ్కు ఏకంగా 35 కి.మీ. ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణంలో వారిని సింహాలు భయపెడతాయి. అడవి జంతువులు ఎదురవుతాయి. అయినా ప్రాణాలకు తెగించి మరీ ఆ ఒక్క ఓటు నమోదు కోసమే అధికారులు వెళతారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ పౌరుడు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 2 కి.మీ.దూరానికి మించి ప్రయాణించకూడదు. అందుకే తాము భరత్దాస్ దగ్గరకి వెళతామని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఆ ప్రాంతంలో ఫోన్లు పని చెయ్యవు. టీవీ రాదు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అయినప్పటికీ దర్శన్దాస్ శివుడిపై అపారమైన భక్తితో ఆ ప్రాంతంలోనే చాలా ఏళ్లుగా ఉంటున్నారు. చూడడానికి కాస్త ఆధునికంగానే కనిపిస్తారు. 60 ఏళ్లు దాటిన దర్శన్ దాస్ నల్ల కళ్లద్దాలు,తెల్ల గడ్డం, తలకి టోపీతో అందరినీ ఆకర్షిస్తుంటారు. ఆయనపై నమ్మకంతో ఆ అడవిలో వెళ్లేవారికి ఆధ్యాత్మిక బోధనలు చేస్తారు. పౌర సమాజానికి దూరంగా విసిరేసి ఉన్నప్పటికీ ఆయనకు ఓటు విలువ గురించి బాగా తెలుసు. ‘‘నా ఓటు ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. వాజపేయి సర్కార్ కేవలం ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిపోయింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని ఎన్నికల సిబ్బంది ఇంత దూరం వస్తున్నందుకు వారిని ఎంతో గౌరవిస్తాను. నా ఓటు ఎంత విలువైనదో తెలుసుకొని గర్విస్తాను‘‘ అని అంటారు. ఒక్క వ్యక్తి కోసం పోలింగ్ బూల్ ఏర్పాటు చేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చాక ఎందరో జర్నలిస్టులు గిర్ అడవుల్లోకి వెళ్లి భరత్దాస్తో మాట్లాడారు. అతని ప్రత్యేకతను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. శభాష్ శరణ్.. ఆయనకు ఓటంటే బాధ్యత శ్యామ్ శరణ్ నేగి. ఆయన వయసు 102 సంవత్సరాలు. మన దేశంలో అతి పెద్ద వయసున్న ఓటరు ఆయనే. స్వాతంత్య్ర సమర సంగ్రామంలో పాల్గొన్న నేగికు ఓటు అంటే హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. అందుకే ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్న ఏకైక ఓటరుగా ఆయన రికార్డులకెక్కారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కల్పా అనే చిన్న గ్రామంలో ఉంటారు. కిన్నెర కైలాస్ పర్వత శ్రేణుల్లో ఉండే ఆ గ్రామంలో నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయరు. మొదటి ఓటు తనే వేయాలనుకుంటారు. దీనికి గ్రామస్తులు కూడా సహకరిస్తారు. పొద్దున్నే ఇంకా ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్ తెరవక ముందే ఉన్ని కోటు వేసుకొని ఆయన వస్తారు. గ్రామస్తులందరూ కూడా ఆయనకు గౌరవాన్ని ఇచ్చి దారి విడిచిపెడతారు. 1951–52లో జరిగే మొదటి ఎన్నికల్లో కూడా నేగి తొలి ఓటును వేసి ప్రజాస్వామ్య భారతంలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తిగా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. అప్పట్నుంచి వేగి ప్రతీసారి ఎన్నికల్లో తన ఓటు హక్కుని వినియోగించుకుంటూనే ఉన్నారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వ్యక్తిగా మహాత్మగాంధీ సిద్ధాంతాలను ఆయన బాగా ఒంట బట్టించుకున్నారు. నూలు ఒడికి ఖాదీ వస్త్రాలు ధరించేవారు. ఒకప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పలేనంత ఇష్టం ఉండేది. దేశానికి స్వాతంత్య్రం సాధించిన పార్టీగా ఆయనకు కాంగ్రెస్ పట్ల దేశభక్తి పొంగిపొర్లేది. కానీ కాలంతోపాటు ఆయన అభిప్రాయాలూ మారిపోయాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అత్యంత ఇష్టమైన నాయకుడు. ‘‘ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్ కాదు. ఎన్నో కుంభకోణాలకు పాల్పడింది. ఇప్పుడున్న నేతల్లో మోదీనే అభిమానిస్తాను. అవినీతిని అంతమొందించడానికి ఆయన తనకు చేతనైంది చేస్తున్నారు‘‘ అంటూ ప్రశంసిస్తారు. 17వ లోక్సభ ఎన్నికల్లో మరోసారి ఓటేసేందుకు ఆయన అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తొలి అడుగు.. సుకుమార్ సేన్ చుట్టూ చీకటి. ముందున్న దారి కనిపించదు. అడుగు ఎలా వెయ్యాలో తెలీదు. కానీ వెయ్యాలి. ఎవరో ఒకరు ముందుగా నడవాలి. అలా నడిచి మన ఎన్నికల వ్యవస్థని ఒక గాడిలో పెట్టింది మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్సేన్. ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసీఎస్) అధికారిగా, న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియకు తొలిసారిగా వేసిన బాట మరువలేనిది. ఎన్నికల నిర్వహణకు ముందు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల జాబితా రూపకల్పనలో సుకుమార్ సేన్ బృందానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఓటర్లలో 70 శాతం నిరక్షరాస్యులు కావడం, మహిళా ఓటర్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో ఓటర్ల జాబితా రూపొందించడమే కష్టసాధ్యమైంది. దీంతో చాలా మంది ఓటు హక్కు పొందలేకపోయారు. 17 కోట్ల మంది ఓట్లతో తొలి జాబితా రూపొందింది. ఎన్నికల్లో బూత్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బ్యాక్స్లు రూపొందించడం వంటివన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసి సుకుమార్ సేన్ బృందం విజయవంతమైంది. తొలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలల పాటు జరిగింది. ఒకసారి వేటు వేసిన వాళ్లు మళ్లీ ఓటు వెయ్యకుండా చూపుడు వేలి మీద ఇంకు గుర్తు వేయడం తొలి ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. నేపాల్, ఇండోనేసియా, సూడాన్ వంటి దేశాలు భారత్ ఎన్నికల నిర్వహణను దగ్గరుండి పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్లో తొలి ఎన్నికల నిర్వహణను శెభాష్ అంటూ ప్రశంసించింది. సూడాన్ దేశం కూడా తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతను సుకుమార్ సేన్ చేతుల్లోనే పెట్టింది. కానీ ఆయనకు రావల్సిన గుర్తింపు రాలేదని రామచంద్రగుహ వంటి చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. భారతరత్న పురస్కారం ఇవ్వదగిన వ్యక్తిని చరిత్ర మరచిపోయిందన్నది ఆయన అభిప్రాయం. ఎన్నికల సిత్రాలు అనామకుడి చేతిలో ఓడిన అంబేడ్కర్... రాజ్యాంగ నిర్మాత, భారత తొలి న్యాయశాఖా మంత్రి, తరతరాలుగా అణచివేతకు గురవుతోన్న అట్టడుగు వర్గాలైన దళిత, ఆదివాసీలకు ప్రత్యేక నియోజవకర్గాలకోసం అహరహం కృషిచేసి రిజర్వుడు నియోజకవర్గాలను తీసుకువచ్చిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజకీయవేత్త. అయినప్పటికీ ఒక అనామకుడి చేతిలో, అది కూడా రిజర్వుడు నియోజకవర్గంనుంచి ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ అంబేడ్కర్ బొంబాయి(నార్త్ సెంట్రల్) రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఆల్ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తరఫున పోటీ చేసి ఓ అనామకుడి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ వ్యక్తి పేరు నారాయణ్ నడోబా కజ్రోల్కర్. నడోబా కజ్రోల్కర్కి 1,38,137 ఓట్లు వస్తే, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్కి 1,23,576 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత అంబేడ్కర్ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. మళ్ళీ 1954లో భన్దారా లోక్సభ ఉప ఎన్నికలో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బోర్కర్ చేతిలో మళ్ళీ ఓటమిపాలయ్యారు. జేబీ కృపలానీ – సుచేతా కృపలానీ... అతను ఓడినా ఆమె గెలిచారు... బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని సాధించుకునే సమయానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆచార్య జేబీ కృపలానీ ఉన్నారు. పూర్తి పేరు జీవత్రామ్ భగవాన్దాస్ కృపలానీ. స్వాతంత్య్రానికి పూర్వమూ, స్వాతంత్య్రానంతరమూ భారత రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్లోని ఫైజాబాద్ కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మన్మోహినీ సెహెగల్ ని ఢిల్లీలో ఆచార్యకృపలానీ భార్య సుచేతా కృపలానీ ఓడించారు. 1957లోనే పోలింగ్ బూత్ల ఆక్రమణ.... పోలింగ్ బూత్లను ఆక్రమించుకొని పోలైన ఓట్లను «ధ్వంసం చేయడం, తాము గెలవమనుకున్న చోట్ల బ్యాలెట్ బాక్స్లను ఎత్తుకెళ్ళడం, లేదా బ్యాలెట్ బాక్సుల్లో ఇంకుపోసి ఓట్లు చెల్లకుండా చేయడం లాంటి దుశ్చర్యలు 1957 సార్వత్రిక ఎన్నికల నుంచి ప్రారంభం అయ్యాయి. బీహార్లోని బేగుసరాయ్ జిల్లాలోని రచియాహిలోని మటిహాని అసెంబ్లీ నియోజకవర్గంలో 1957లో జరిగిన ఎన్నికల్లో తొలి పోలింగ్ బూత్ల ఆక్రమణ జరిగింది. పోటీ చేసే అభ్యర్థులూ, పార్టీల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగి, పోటీ పెరిగిపోవడంతో 1970–80 వ దశకం చివర్లో బూత్ల ఆక్రమణ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పార్టీలు బూత్లను ఆక్రమించుకోవడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం మొదలయ్యింది. పోలింగ్ బూత్ల ఆక్రమణని సైతం శిక్షార్హమైన నేరంగా పరిగణించి, బూత్ల ఆక్రమణ జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు రద్దు చేయడం, లేదా అక్కడ ఎన్నికలు వాయిదా వేసేలా ప్రజాప్రాతినిధ్య(1951) చట్టానికి 1989లో మార్పులు చేసారు. 13 రోజుల ప్రధాని... గుల్జారీలాల్ నందా మొత్తం రెండు సార్లు ప్రధాని అయ్యారు. అయితే రెండు సందర్భాల్లోనూ 13 రోజులు, 13 రోజులే ప్రధాని పదవిలో ఉండడం ఒక విశేషం అయితే, రెండు సార్లూ పదవిలో ఉన్న ప్రధానమంత్రులు మరణించడంతో ఈయనకు ఆ అవకాశం లభించింది. ఒకటి జవహర్ లాల్ నెహ్రూ మరణం అయితే, మరొకరు లాల్బహదూర్ శాస్త్రి మరణంతో గుల్జారీలాల్కి ఈ అవకాశం దక్కింది. రెండుసార్లూ కలుపుకొని మొత్తం 26 రోజులు పాటు గుల్జారీలాల్ నందా ప్రధానిగా పనిచేశారు. రెండవ లోక్సభ(ఏప్రిల్ 2, 1962 – మార్చి 3 1967)నుంచి 1964, మే 27 జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. మే 27, 1964 జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత తొలిసారి గుల్జారీలాల్ తాత్కాలిక ప్రధాని అయ్యారు. మే 27 నుంచి జూన్ 9, 1964న లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా ఉన్నారు. రెండవసారి 1966 జనవరి 11న లాల్బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత మళ్ళీ 13 రోజుల పాటు గుల్జారీలాల్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. శాస్త్రి మరణానంతరం ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఇందిరాగాంధీ 1966 జనవరి 24న ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా కొనసాగారు. ఆపరేషన్ దుర్యోధన... 2005, డిసెంబర్ 12 న స్టార్ టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన స్టింగ్ ఆపరేషన్, ఆపరేషన్ దుర్యోధనతో 11 మంది పార్లమెంటు సభ్యులు స్వయంగా డబ్బులు తీసుకుంటున్న విజువల్స్ బయటపెట్టారు. దీనిపై పార్లమెంటులో దుమారం రేగడంతో రాజ్యసభలోని ఎథిక్స్ కమిటీ, లోక్ సభ ప్రత్యేక కమిటీ విచారణలో వీరిని దోషులుగా నిర్ధారించడంతో 10 మంది లోక్ సభ సభ్యులూ, ఒక రాజ్య సభ సభ్యుడిని ఆయా సభల నుంచి తొలగించారు. -
వీవీ ప్యాట్లపై హైకోర్టుకు!
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తారుమారు చేశారనే అనుమానంతో వీవీ ప్యాట్లతో అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజాకూటమి.. ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి కాంగ్రెస్ పార్టీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, కూటమి పక్షాన కలిసి కోర్టును ఆశ్రయించాలని కూటమి నేతలు యోచిస్తున్నారు. దీనిపై బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఓటర్ల జాబితా అవకతవకల నుంచి ఈవీఎం యంత్రాల నిర్వహణ వరకు ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనుమానాలున్నాయని మొదటి నుంచి చెబుతున్నామని, దీనిపై ఈసీ స్పందన కూడా అనేక అనుమానాలకు తావిస్తోందని టీపీసీసీకి చెందిన ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే సరైన మార్గమని భావిస్తున్నామని చెప్పారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఇప్పటికే న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రక్రియ వీవీ ప్యాట్ల ద్వారా కొనసాగేంత వరకు కోర్టులో పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. కోర్టుకు ఎప్పుడు వెళ్లాలన్నది కూటమి నేతలంతా కలిసి నిర్ణయిస్తారని తెలిపారు. 15 లేదా 16న సీఎల్పీ సమావేశం.. కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ఈ నెల 15 లేదా 16 తేదీల్లో జరగనుంది. తెలంగాణతోపాటు ఎన్నికలు జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. దీంతోపాటు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నందున పార్లమెంటుకు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో కాంగ్రెస్ అధిష్టానం నుంచి నేతలు వచ్చి సీఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. సీఎల్పీ నేతగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి లేదా ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కలలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ పదవీ కాలం ఈ నెలలోనే నాలుగేళ్లు అవుతున్నందున ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలనుకుంటే సీఎల్పీ నేతగా అవకాశమివ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. లేదంటే ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో ఎన్నికలను ఎదుర్కొన్న భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద ఉత్తమ్, భట్టిలలో ఒకరు టీపీసీసీ అధ్యక్షుడు, మరొకరు సీఎల్పీ నేతగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఈసీ స్పందించకపోతే కోర్టుకు: కుంతియా వీవీ ప్యాట్లపై కోర్టుకు వెళ్లే విషయమై ఉత్తమ్తోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా స్పందించారు. ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారుల సహకారం, డబ్బు బలంతోనే కేసీఆర్ విజయం సాధించారని, ఈవీఎంలను తారుమారు చేశారని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, సీఈసీ తమ ఫిర్యాదుపై స్పందించని పక్షంలో కోర్టుకు వెళతామని చెప్పారు. -
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల్లో నిక్షిప్తమైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసే సమయానికి రాష్ట్రంలో సుమారుగా 67.7% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. కచ్చిత మైన గణాంకాలను శనివారం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్కుమార్ పేర్కొన్నారు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 69.5 % పోలింగ్ నమోదుకాగా ఈసారి కూడా అంతే స్థాయిలో పోలింగ్ నమోదు కావచ్చునన్నారు. 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియగా మిగిలిన 106 స్థానాల్లో 5 గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని లైన్లలో నిలబడిన ఓటర్లకు అదనపు సమయంలో ఓటేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 11న ఫలితాలను ప్రకటించనున్నారు. గంట ఆలస్యంగా ప్రారంభం... షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుంచి సా యంత్రం 4 లేదా 5 గంటల వరకు పోలింగ్ జరగా ల్సి ఉండగా ఈవీఎంలు మొరాయించడంతో చాలా ప్రాంతాల్లో దాదాపు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేం ద్రాల్లో ఉదయం 6 నుంచి 6.45 గంటల మధ్య మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరును పరీక్షించిన అనంతరం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. మాక్ పోలింగ్లో ఈవీ ఎంలతోపాటు ఓటర్ వెరిఫయబుల్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) యంత్రాలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. చెదురుమదురు ఘటనలు మినహా... చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నాలుగైదు చోట్ల స్వల్ప ఘర్షణలతో ఉద్రిక్తత ఏర్పడినా పోలీసులు సకాలంలో రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. దీంతో ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. పోలింగ్ ముగిసే సమయానికి లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు కల్పించేందుకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం6 గంటల వరకు పోలింగ్ కొనసాగించారు. పోలింగ్ విధుల్లో 37,594 మంది ప్రిసైడింగ్ అధికారులు, 37,556 మంది సహాయక ప్రిసైడింగ్ అధికారులు, 74,873 మంది ఇతర పోలింగ్ అధికారులు కలిపి మొత్తం 1,50,023 మం ది సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ ముగిసిన అనంత రం పోలింగ్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత మ« ధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. భారీగా ఓట్లు గల్లంతు! ఓటర్ల జాబితాలో అడ్డగోలుగా పేర్లను తొలగించడంతో శాసనసభ ఎన్నికల్లో లక్షల మంది పౌరు లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఓటరు గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రజలకు ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవని అధికారులు చెప్పడంతో తీవ్ర నిరసన తెలియజేశారు. ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతయ్యాయని ఫిర్యాదులొచ్చాయి. ఓటర్ల జాబితాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడానికి 2015లో నిర్వహించిన ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ (ఐఆర్ఈఆర్) కార్యక్రమంలో భాగంగా బోగస్ ఓటర్ల పేరుతో దాదాపు 20 లక్షల మంది పేర్లను తొలగించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఓటర్ల పేర్ల తొలగింపులో పొరపాట్లు జరిగాయని సీఈఓ రజత్కుమార్ అంగీకరించారు. ఓటు హక్కు వియోగించుకున్న ప్రముఖులు -
మళ్లీ రంగు మారె!
(సవ్యసాచి) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి రాజకీయ బంధాలెంత బలంగా ఉంటాయో, బలహీనంగా ఉంటాయో తెలంగాణ ఎన్నికలతో మరింత తేటతెల్లమౌతోంది. కమ్యూనిస్టులు, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ తదితర పార్టీలతో లోగడ పొత్తో, కూటమో కట్టిన ఆయన.. ఇలా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్తో బంధం అల్లుతున్నారు. ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నికకు వచ్చేసరికి ఆయన ఎటు నుంచి ఎటు మారతారో అంచనాలకు అందని పరిస్థితి. ఈ శిబిరాలు మార్చడం సంగతెలా ఉన్నా ఒక మూల సూత్రం మాత్రం అన్ని వేళలా కచ్చితంగా ఉంటుంది. అదేంటంటే, అధికారమే ఆయనకు పరమావధి!. ఎటుతిరిగి, ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడమో, లేని అధికారాన్ని కైవసం చేసుకోవడమో లక్ష్యంగానే ఆయన ఎత్తులు–ఎత్తుగడలు సాగుతాయి. అందుకు, ఏది పనికి వస్తుందనుకుంటే నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా అదే చేస్తారాయన!. ‘నలుగురేమనుకుంటారో! నవ్విపోతారేమో!!’ అన్న మీమాంసే ఉండదు. ‘‘ప్రజలకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ, దాన్నే నమ్ముకొని తిమ్మిని బమ్మిని–బమ్మిని తిమ్మిని చేసి జనాన్ని నమ్మించి బోల్తాకొట్టే ‘అనుకూల మీడియా’ సహకారముంటే చాలు! ఇక ఏమైనా చేయొచ్చు!’’ అన్నదే ఆయన నమ్మే రాజకీయ విధానం. తన మీద తనకు నమ్మకం లేకపోయినా, ఈ సమీకరణం మీద ఆయనకు ఎక్కడ లేని విశ్వాసం! ఇక నైతిక విలువలు! సిద్ధాంతమంటారా? అవి ఆయన డిక్షనరీలోనే లేవన్నది అందరికీ తెలుసు. తాజా రాజకీయ సమీకరణమే అందుకు సరిపోయే ఉదాహరణ! ‘నలభయ్యేళ్ల ఇండస్ట్రీ’, ‘దేశంలో నేనే సీనియర్ నాయకుడ్ని’ అని కాలర్ ఎగరేసే ఆయన ఈ మధ్య ఓ చిత్రమైన వ్యాఖ్య చేశారు. ‘నిజానికి నేనసలు టీఆరెస్తోనే పొత్తు పెట్టుకుందామనుకున్నాను. అందుకు ప్రయత్నించాను, కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కానీయకుండా అడ్డుతగిలార’ని తమ పార్టీ నాయకుల సమావేశంలో వెల్లడించారు. బయట కూడా, మోదీని విమర్శించే ఓ సందర్భంలో, ఆయన మీద అభియోగం లాగా ఇదే మాట మరో రూపంలో చెప్పారు చంద్రబాబు. అధికార పక్షమైన టీఆరెస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలనుకున్నారాయన. కానీ, ఇతరేతర కారణాల వల్ల వీలుపడనందున, వారి ప్రత్యర్థులైన కాంగ్రెస్తో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటూ... అవే ఎన్నికల్లో, అదే టీఆరెస్పై పోటీ చేస్తున్నారు! అంటే, ఏమిటి అర్థం? ‘ఎవరితోనైనా చేతులు కలిపి ఎవరిపైనైనా పోరాడుతాం, మాకు కావాల్సిందల్లా ‘అధికారం’ అనేగా! అదే చేస్తున్నారిప్పుడు. తన తప్పుడు నిర్వాకాల వల్ల సొంతంగా ఏ ఎన్నికా గెలవలేనని ఆయనకు తెలుసు. అందుకే, ఆయన ఎప్పుడూ ఆ సాహసం చేయలేదు. 1995లో తాను సీఎం అయిందీ, 1994లో తన మామ ఎన్టీరామారావు (తెలుగుదేశం)కు తెలుగు ప్రజలు కట్టిన పట్టం, దాన్ని వెన్నుపోటుతో తాను లాక్కున్న ఫలం! ఆ అధికారాన్ని 1999 ఎన్నికల్లో నిలబెట్టుకున్నది, ‘ఒక ఓటుతో ప్రభుత్వం పోగొట్టుకున్నార’ని ప్రజల సానుభూతి పొందిన వాజ్పేయి చలువతోనే! పరిస్థితి గమనించి, బీజేపీ చంకలో చేరిన బాబు, వాజ్పేయి నేతృత్వపు బీజేపీతోనే (1999) అభివృద్ధి సాధ్యమన్నారు. పదేళ్ల టీడీపీ పాలనకు ( 2004లో) ప్రజలు ఛీకొట్టారు. అప్పుడు ‘మిత్రు’లపైన నెపం నెట్టడానికి, ‘బీజేపీ మసీదులు కూల్చే పార్టీ–వారితో కలవడం మా తప్పు’ అని (2009) లెంపలేసుకున్నారు. కాంగ్రెసేతర పార్టీలతో ‘మహాకూటమి’ కట్టి పోరినా... ప్రజలకు ఆయనపై నమ్మకం ఏర్పడలేదు. ఫలితంగా టీడీపీ మళ్లీ విపక్షానికే పరిమితమైంది. ‘కాంగ్రెస్, అది నేతృత్వం వహించే యూపీయే కూటమి దేశానికి అరిష్టం, మోదీయే వెలుగురేఖ, అభివృద్ధి మంత్ర (2014)’ అని నాటకీయంగా మాట మార్చి బాబు మళ్లీ బీజేపీ పంచన చేరారు. ఇప్పుడు, మరోమారు గొంతు మార్చి.. మోదీ ద్రోహి, బీజేపీ అన్నింటా విఫలమైంది, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ‘కాంగ్రెస్తో చేతులు కలపడం ఒక రాజకీయ అనివార్యత’ అని కొత్త ‘రా(హుల్)గా(ంధీ’)న్నందుకున్నారు. నిన్నటివరకు కలిసున్న పార్టీలను నేడు తిట్టడం, నేటి నుంచి కొత్తగా సఖ్యత కూరిన పార్టీలను పొగడటం.. రేపేమయినా అయితే వారికి జెల్ల కొట్టి కొత్త వారి చంకన చేరడం.. ఇదీ వరుస!’ ఏ ఎన్నికయినా, ఎవరో ఒకరి పంచన చేరి లబ్ధిపొందడానికి యత్నించడం, ఏ రోటి కాడ ఆ పాట పాడి, ప్రజల్ని బోల్తాకొట్టించి ఓట్లతో తన బొచ్చె నింపుకో చూడటం, ఇది తప్పని ఎవరైనా ఎత్తి చూపితే వారి నోరు కొట్టి మాట్లాడటం, తానే పెద్ద నోరు చేసుకొని అరిచి గీపెట్టడం’ ఇదే మన బాబుకు తెలిసిన మహా విద్య!. ఇదంతా తెలుసుకొని నడుచుకోవాల్సింది ప్రజలే.! ఒక్కో ఈవీఎంలో గరిష్టంగా నమోదయ్యే ఓట్ల సంఖ్య 3,840 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషీన్ (ఈవీఎం) రాకతో ఎన్నికల నిర్వహణ సులభతరమైంది. పనితీరు విషయానికొస్తే.. ఒక్కో ఈవీఎం 3,840 ఓట్లను నమోదు చేయగలదు. మన దేశంలో జరిగే ఎన్నికల్లో 1,400 మంది ఓటర్లకు ఒక ఈవీఎం చొప్పున కేటాయిస్తున్నారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో వీటిని పాక్షికంగా వినియోగించగా, 2004 ఎన్నికల నుంచి పూర్తి స్థాయిలో వాడుకలోకి తెచ్చారు. -
ముందస్తుకు వీవీ–పాట్ ఈవీఎంలు
సాక్షి, మెదక్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికల కమిషన్ తెలంగాణలో వీవీ పాట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వాడకంపై కాంగ్రెస్ సహా పలు పార్టీ అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీ–పీఏటీ) యంత్రాల వాడకం ద్వారా ఓటర్లు, రాజకీయ పార్టీల్లో ఈవీఎంల వాడకంపై మరింత నమ్మకం పెరిగేలా చూడాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, డీఆర్ఓ స్థాయి అధికారులకు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ–పీఏటీ) ఈవీఎంల వాడకంపై శిక్షణ ఇచ్చింది. హైదరాబాద్లోని ఈసీఐఎల్లో నిర్వహించిన ఈ శిక్షణ తరగతులకు రాష్ట్రం లోని అన్ని జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంకేతిక నిపుణులు వాటి ఉపయోగంపై శిక్షణ ఇచ్చారు. వీవీ–పీఏటీ యంత్రాల పనితీరుపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తు ఎన్నికలు జరిగిన పక్షంలో ఈ రకమైన కొత్త ఈవీఎంలు వాడే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఎన్ని అవసరం అవుతాయో జిల్లాల వారీగా ఈసీ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. వీవీ–పీఏటీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తయారీ బాధ్యతను ఈసీఐఎల్కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈవీఎంలపై నమ్మకం పెరిగేలా చర్యలు.. ఈవీఎంలపై ఓటర్లకు, రాజకీయపార్టీలకు మరింత నమ్మకం పెరిగేలా ఈసీ చర్యలు చేపట్టింది. ఈవీఎంలు హ్యాక్ చేయకుండా చర్యలు తీసుకుంది. ఈవీఎంలకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నష్టంచేయాలని ప్రయత్నిస్తే ఈవీఎం ఆటోమేటిక్గా సేఫ్ మోడ్లకు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంది. ఓటర్లు తాము ఎవరికి ఓటు వేసింది స్పష్టంగా తెలుసుకునేందుకు వీవీ–పీఏటీని ఈసీ రూపొందించింది. బ్యాలెట్ యూనిట్లో ఓటు వేసిన వెంటనే ఓటరు ఏ అభ్యర్థికి, ఏ గుర్తుకు ఓటు వేసింది వీవీ–పాట్ యంత్రం ఓటింగ్ స్లిప్ను ముద్రిస్తుంది. ఈ స్లిప్ని వీవీ–పాట్ యంత్రంలోని గ్లాస్ డిస్ప్లేలో ఓటరు స్పష్టంగా చూడవచ్చు. ఓటింగ్ స్లిప్ ఏడు సెకండ్లపాటు మాత్రమే ఉంటుంది. ఓటును ఈవీఎం ద్వారా టాంపరింగ్ చేసేందుకు వీలు పడదు. -
పెరగనున్న పోలింగ్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ విషయంలో అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ జరుగుతోంది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 30,518 పోలింగ్ కేంద్రాలున్నాయి. తాజాగా దాదాపు 1,686 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా వచ్చే సాధారణ ఎన్నికలకు 32,204 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఓ పోలింగ్ బూత్ ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అనివార్య పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 1,200 ఉండనుంది. పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 1,500 మందికి ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. 85 వేల ఈవీఎంలు: సాధారణ ఎన్నికలకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల సేకరణను రాష్ట్ర ఎన్నికల కార్యాలయం చేపడుతోంది. లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే 85 వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. షెడ్యూ ల్ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 4న ఓటర్ల తుది జాబితా సిద్ధం కానుంది. -
ఈవీఎంలపై గళమెత్తిన మరో ముఖ్యమంత్రి!
ఈవీఎంలపై గళమెత్తిన మరో సీఎం కోల్కతా: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎంలు) ట్యాంపరింగ్కు గురయ్యాయంటూ ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణాస్త్రాలు సంధిస్తుండగా.. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ విషయమై గళమెత్తారు. ఈవీఎంలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అన్నిపార్టీలతో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయవచ్చునంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్న వీడియోక్లిప్ గురించి ఆమె తాజాగా స్పందించారు. 'ఇది నేను చెప్పిన విషయం కాదు. చట్టబద్ధంగా ప్రసిద్ధుడైన సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. ఆయన చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకొని.. విచారణ జరపాలి' అని ఆమె అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమంటూ ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను తాను చూశానని, అయితే, వాటిని ట్యాంపరింగ్ చేయవచ్చునంటూ సుబ్రహ్యణ్యస్వామి పేర్కొంటున్నారని, కాబట్టి ఈ అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆమె కోరారు. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలు గోల్మాల్ చేశాయని, ఈ అంశంపై విచారణ నిర్వహించాలని మాయావతి, అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
14 లక్షల కొత్త ఈవీఎంల కొనుగోలు
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ప్రతిపాదనల మేరకు 2019 సార్వత్రిక ఎన్నికలకోసం 14 లక్షల కొత్త ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు)లను కొనాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి ఆ బృందం సిఫార్సులు చేసింది. వీటికోసం రూ.5,000 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టనున్నారు. ఈ మంత్రుల బృందానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వం వహించారు. 2015-16 నుంచి 2018-19 మధ్య దశలవారీగా వీటిని కొంటారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్నవాటిలో 9 లక్షలకు పైగా ఈవీఎంలు 2019 ఎన్నికల నాటికి పనికిరావు. ఈవీఎంలను బెంగళూరులోని బీఈఎల్, హైదరాబాద్లోని ఈసీఐఎల్లు తయారుచేస్తాయి. -
‘వీవీప్యాట్’ను రూపొందించిన ఈసీఐఎల్
* ఈవీఎంలతో పాటు పక్కనే వీవీప్యాట్ పరికరాల ఏర్పాటు * ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వినియోగం * ఓటింగ్లో పారదర్శకత దిశగా ఈసీ తొలిమెట్టు * వీవీప్యాట్ పనితీరును వివరించిన ఈసీఐఎల్ సీఎండీ సుధాకర్ హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి పారదర్శకంగా, విశ్వసనీయంగా ఎన్నికల ప్రకియ జరిగేలా.. ఓటరు సంతృప్తి చెందేలా ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్) ప్రింటింగ్ యంత్రాన్ని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) రూపొందించింది. శుక్రవారం ఈసీఐఎల్ కార్యాలయంలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పి.సుధాకర్ వీవీప్యాట్ పనితీరును మీడియాకు వివరించారు. ఇటీవల ఓటర్లు తాను ఓటు వేసిన అభ్యర్థికే ఓటు నమోదైందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, వీటిని నివృత్తి చేసేందుకే వీవీప్యాట్ను రూపొందించామని తెలిపారు. దీనిని ఓటింగ్ యంత్రంతో పాటు ఉంచుతామని, ఓటరు ఓటు వేసిన వెంటనే తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరు, గుర్తు వీవీప్యాట్ పరికరంలోని స్క్రీన్పై కొన్ని క్షణాల పాటు కనిపిస్తుందని, ఆ వివరాలు ప్రింట్ మాదిరిగా అందులోనే నిక్షిప్తమవుతాయని వివరించారు. దీనివల్ల ఓటరుకు తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థికే ఓటు వేశానన్న సంతృప్తి కలగడంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తినా మ్యానువల్గా ఓట్లను లెక్కించే సౌలభ్యం ఉంటుందన్నారు. ఒక్కో యంత్రం లో 1,500 ఓట్లను నమోదు చేసే సామర్థ్యం ఉంటుందన్నారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల.. బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా వినియోగించినట్లు తెలిపారు. తాజాగా వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో వీటిని వినియోగించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని, ఇప్పటికే 40కిపైగా వీవీప్యాట్ యంత్రాలను ఖమ్మం పంపించామని చెప్పా రు. 2019 సాధారణ ఎన్నికలకల్లా దేశవ్యాప్తంగా వీటిని వినియోగంలోకి తీసుకువచ్చేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశాలు లేవని, కొన్ని పరికరాలను అమర్చితే ట్యాంపరింగ్ చేయవచ్చనేది అపోహ మాత్రమే అని సుధాకర్ స్పష్టం చేశారు. అనేక రకాల సందేహాలు తమ దృష్టికి వచ్చిన సందర్భంలో వాటిని నివృత్తి చేస్తూ వస్తున్నామని, ఇక భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా వీవీప్యాట్ దోహదపడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరక్టర్ ఫైనాన్స్ కిశోర్ రుంగ్టా, డైరక్టర్ పర్సనల్ వీఎస్ బంగారుబాబు, ఈవీఎం డివిజన్ హెడ్ మహేంద్రన్, ఇన్స్ట్రుమెంట్ డివిజన్ జీఎం అనురాగ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లు
హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల పనితీరుకు సంబంధించి పలు అనుమానాలు, ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపధ్యంలో ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ప్రయోగాత్మకంగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో 35 డివిజన్లలో ప్రింటర్లతో కూడిన ఏవీఎంల ద్వారా ఓటింగ్ అమలు చేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఈవీఎంలలో ఓటర్లు ఓటు వేయగానే రశీదులు వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. -
ఈవీఎంలు సిద్ధం
కుషాయిగూడ: గ్రేటర్ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్(ఈవీఎం)లను సిద్ధం చేసినట్లు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 2న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్న విషయం విదితమే. 7,790 పోలింగ్ కేంద్రాలకు గాను 9,370 ఈవీఎంలు సిద్ధం చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల పరీక్షలు ఇప్పటికే పూర్తైట్లు తెలిపారు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణుల బృందాన్ని అందుబాటులో ఉంచామన్నారు. ఆపేక్స్ లెవల్ అధికారితో పాటు అనుభవం ఉన్న ఆఫీసర్, ఐదు సర్కిళ్ల చొప్పున ఒక సీనియర్ అధికారి, ప్రతి డివిజన్కు అనుభవజ్ఞులైన ఇద్దరు ఇంజినీర్లను నియమించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. ఈసీఐఎల్ ప్రస్థానంలో ఈవీఎంల రూపకల్పన మైలురాయిగా మిగిలిపోతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. -
‘స్థానికం’లోనూ ఈవీఎంలు
మొదటిసారి ప్రయోగాత్మకంగా అమలుకు కసరత్తు వచ్చే నెల జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ, డీపీఓ సమావేశం నల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి సారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) వినియోగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన సర్పంచ్ స్థానాలు-13, జెడ్పీటీసీ-1, ఎంపీటీసీ-1, వార్డులు-46 ఉన్నాయి. దీంట్లో నకిరేకల్ పంచాయతీ రిజర్వేషన్ ఎటూ తేలకపోవడంతో ఎన్నికల జాబితాలో ఆ గ్రామ పంచాయతీని చేర్చలేదు. అదే విధంగా బొమ్మలరామారం మండలం కంచల్ తండాలో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ ఉంటుంది. ఈ రెండు మినహా మిగిలిన 11 సర్పంచ్ స్థానాలకు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండు స్థానాలకు ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న ఈవీఎంల వాడకం ఈ ఎన్నికల్లో విజయవంతమైతే రా బోయే రోజుల్లో ఈవీఎంల సహాయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒక్కో ఈవీఎం సామర్థ్యం 12 వందల ఓట్లుకాగా.. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నందున 650 ఓట్లకు ఒక ఈవీఎం చొప్పున ఏర్పాటు చేయనున్నారు. సర్పంచ్ స్థానాలకు 33 ఈవీఎంలు అవసరంగా కాగా అదనంగా మరో 18 ఈవీఎంలను అందుబాటులో ఉంచనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 42 ఈవీఎంలు అవసరం కాగా.. అదనంగా 18 ఈవీఎంలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవీఎంల పనితీరును పరిశీలించేందుకు జూన్ మొదటి వారంలో ఈసీఎల్ కంపెనీకి చెందిన సాంకేతి నిపుణులు జిల్లాకు రానున్నారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగానే బ్యాలెట్ పత్రాలను ముద్రించేందుకు ఆర్డర్లు ఇవ్వనున్నారు. -
రెండు బూత్లలో రీ-పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రోహతాస్నగర్, ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని రెండు పోలింగ్ బూత్లలో సోమవారం రీ-పోలింగ్ జరిగింది. శనివారం విధానసభ ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున ఈ రెండు పోలింగ్ బూత్లలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సరిగ్గా పనిచేయలేదని గుర్తించిన ఎన్నికల అధికారులు అక్కడ రీ-పోలింగ్ జరిపించాలని నిర్ణయించారు. తూర్పు ఢిల్లీలోని రోహతాస్నగర్లో ఉన్న 132 నంబరు పోలింగ్ బూత్లో మాక్ పోలింగ్ డేటాను తొలగించలేదని, ఢిల్లీ కంటోన్మెంట్లోని డీఐడీ లైన్స్ ఏరియాలోని 31వ నంబరు పోలింగ్ బూత్లో ఓటింగ్ యంత్రంలో సమస్య కారణంగా పరిశీలకుని నివేదిక సరిగ్గా నమోదుకాలేదని అధికారులు గుర్తించారు. దీంతో ఈ రెండు పోలింగ్ బూత్లలో సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు రీ-పోలింగ్ నిర్వహించారు. -
ముండ్లమూరు తహశీల్దార్ సస్పెన్షన్
సోదరుడి ఇంట్లో ఎన్నికల సామాగ్రి ఉంచిన వైనం సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ముండ్లమూరు తహశీల్దార్ జిలానీ బాషాను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి కంట్రోల్ యూనిట్కు అనుసంధానమై ఉండే ప్రింటర్ కం ఆక్సిలరీ డిస్ప్లే(పాడు) యూనిట్ లను నిర్దేశించిన కార్యాలయాలు, గోడౌన్లలో మాత్రమే ఉంచాలి. అందుకు విరుద్ధంగా దర్శి నియోజకవర్గం పరిధిలోని ముండ్లమూరుకు చెందిన 30 పాడులను జిలానీ బాషా ఒంగోలు బండ్లమిట్టలోని తన సోదరుడి ఇంట్లో ఉంచారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయకుమార్ వాటిని సీజ్ చేయించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహశీల్దార్ను సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు సీజ్ చేసిన పాడుల స్థానంలో మరో 30 యూనిట్లు కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విచారణకు వైఎస్సార్ సీపీ వినతి సాక్షి, హైదరాబాద్: దర్శి అసెంబ్లీ నియోజకవర్గం, ఒంగోలు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల సామగ్రిని స్ట్రాంగ్ రూంలో కాకుండా బయట ఉంచిన సంఘటనపై తక్షణం విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. పార్టీ సంస్థాగత వ్యవహారాల కో-ఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్ గురువారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్కు ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. -
మరికొన్ని గంటల్లో వెల్లడికానున్న ‘సార్వత్రిక’ ఫలితాలు
సాక్షి, సంగారెడ్డి: పక్షం రోజుల ఉత్కంఠత.. ఉద్విగ్నతకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈవీఎంలో నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకం నేడు బయటపడనుంది. నువ్వా, నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరం ఫలితాల వెల్లడికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏప్రిల్ 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలకు 23 మంది, 10 అసెంబ్లీ స్థానాలకు 105 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓటర్లు సైతం ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో జిల్లాలో 76.83 శాతం పోలింగ్ నమోదైంది. అభ్యర్థుల తలరాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నిక్షిప్తమై ఉం ది. శుక్రవారం ఈ ఈవీఎంలను క్రోడీకరించడం ద్వారా ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. అందరి దృష్టీ జిల్లాపైనే ఒకేసారి వచ్చినపడిన సార్వత్రిక, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పై చెయ్యి సాధించగా.. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సైతం మన జిల్లా నుంచే పోటీ చేస్తుండడంతో అందరి చూపు ఇక్కడి ఫలితాలపైనే కేంద్రీకృతమై ఉంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీతో పాటు మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. మెదక్ లోక్సభలో ఆయన గెలుపు సునాయసనమే అయినా.. గజ్వేల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి తన సొంత బలంతో అమీతుమీకి దిగి కేసీఆర్కు గట్టి పోటీ ఇచ్చారు. అదే విధంగా కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డిలకు సైతం ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు ముచ్చెమటలు పట్టించారు. వీరి భవితవ్యంపై ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. లెక్కింపు కేంద్రాలు ఇవే.. జిల్లావ్యాప్తంగా 2,678 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణ కోసం 6 వేల ఈవీఎంలను వినియోగించారు. అనంతరం ఈ యంత్రాలను..సంగారెడ్డి, పటాన్చెరు మండలాల పరిధిలోని మూడు ప్రైవేటు విద్యా సంస్థల్లో స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేసి భద్రపరిచారు. డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల: జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జహీరాబాద్, నారాయణ్ఖేడ్, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును సంగారెడ్డి మండలం కాశీపూర్లోని డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఇదే కళాశాలలో భద్రపరిచారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓట్ల క్రోడీకరణ, ఫలితాల ప్రకటన డీవీఆర్ కళాశాలలోనే జరపనున్నారు. ఎంఎన్ఆర్ వైద్య కళాశాల: మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో నిర్వహించనున్నారు. గీతం విశ్వవిద్యాలయం: మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును పటాన్చెరు మండలం రుద్రారం పరిధిలో గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గ ఓట్ల క్రోడీకరణ, ఫలితాల ప్రకటన సైతం గీతం యూనివర్శిటీలోనే జరుపుతారు. -
సర్వత్రా ఉత్కంఠ
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల విడుదలకు వేళయింది. నెలన్నరగా కొనసాగుతున్న నిరీక్షణ సోమవారం మధ్యాహ్నానికల్లా వీడిపోనుంది. మార్చి 30న జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీల పరిధిలో 100 డివిజన్లు, 226 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీలు నువ్వా... నేనా అన్నట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈవీఎంలలో నిక్షిప్తమైన 2,166 మంది భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. వీరిలో 326 మంది అదృష్టవంతులెవరనేది తెలిసిపోనుంది. కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్లైన్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల ద్వారా ఎన్నికలు నిర్వహించడంతో ఫలితాలు రెండు గంటల్లోనే తేలనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవు తుంది. గరిష్టంగా రెండు గంటల్లో అన్ని వార్డులు/డివి జన్ల ఫలితాలు తేలుతాయి. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బంది కి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. చివరి నిమిషంలో లాటరీ తీసి ఏ ఈవీఎం ఎవరు లెక్కించాలనేది నిర్ణయిస్తారు. కౌంటింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరిస్తారు. లెక్కింపునకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే కార్యకర్తలు ఉండేలా చర్యలు చేపట్టారు. పాస్లు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదివారం సాయంత్రం వెల్లడించారు. మేయర్, చైర్మన్ ఎన్నికపై సందిగ్ధం వార్డులు, డివిజన్ల ఫలితాలు వెలువడ్డప్పటికీ పరోక్ష పద్ధతిలో జరిగే కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఎక్స్అఫిషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశాక గానీ ఎన్నిక జరిగే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే అయిన జూన్ 2వరకు ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేనందున ఆ తర్వాతే మేయర్, చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశముంది. అప్పటివరకు పీఠంపై గురిపెట్టిన వారు సొంతపార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్రులను చేజారకుండా క్యాంపులు నిర్వహించకతప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితాలు వెలువడ్డ వెంటనే క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పదవి కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. -
ఓటర్ల తీర్పు పదిలం
సాక్షి, కాకినాడ : ఎన్నికల యజ్ఞం ముగిసింది. అన్నివర్గాలు... ఓటర్ల తీర్పు ఎలా వుంటుందోనన్న ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. జిల్లాలో బుధవారం ఎన్నికలు జరుగగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అర్ధరాత్రికి కాకినాడ చేరుకున్నాయి. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 4056 పోలింగు స్టేషన్ల పరిధిలోని 37 లక్షల 73 వేల 332 మంది ఓటర్ల తీర్పు వీటిలో నిక్షిప్తమై ఉంది. పార్లమెంట్ నియోజవర్గాల వారీగా కేటాయించిన ప్రాంతాల్లో వీటిని ఉంచారు. ఈవీఎంలు దాచిన మూడుచోట్లా అత్యంత కట్టుదిట్టమైన మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. షిప్టుల వారీగా ఆర్ముడు ఫోర్సును విధుల్లో వుంచారు. తరలివచ్చిన ఈవీఎంలను కాకినాడ జేఎన్టీయూకే ఆవరణలో బుధవారం రాత్రి ఎన్నికల పరిశీలకులు గౌతమ్ఘోష్తో కలసి జిల్లా ఎన్నికల అధికారి నీతూప్రసాద్ పరిశీలించారు. కాకినాడ లోక్సభ స్థానానికి జేఎన్టీయూకే ఆవరణలో కాకినాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 1491 పోలింగుస్టేషన్లకు చెందిన 14 లక్షల 17 వేల 977 మంది ఓటర్లున్నారు. వీటిలో తుని, పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, జగ్గంపేట, కాకినాడ రూరల్ అసెంబ్లీల ఈవీఎంలు కాకినాడ జేఎన్టీయూకే ఆవరణలోని డిపార్టుమెంటు ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగు బ్లాక్, స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ బ్లాక్లోని హాల్స్లో భద్రపరిచారు. వాటికి ఆనుకుని వున్న గదుల్లోనే ఈ నెల 16 వ తేదీనపై ఏడు అసెంబ్లీల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటిగంట లోపు ఫలితాలు వెల్లడించే అవకాశం వుంది. విద్యుత్నగర్ ఐడియల్ ఇంజనీరింగ్లో అమలాపురం కౌంటింగ్ అమలాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 1500 పోలింగు స్టేషన్లకు చెందిన 13 లక్షల 57 475 మంది ఓటర్లున్నారు. వీటిలో రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీల ఈవీఎంలు కాకినాడ విద్యుత్ నగర్లోని ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఆవరణలో భద్రపరిచారు. విశాఖ జిల్లా అరకు పార్లమెంటు పరిధిలో వుండి మన జిల్లాలో వున్న రంపచోడవరం అసెంబ్లీ పరిధిలో 212 పోలింగ్ స్టేషన్లుండగా లక్షా యాభై వేల 830 మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గ ఈవీఎంలు సైతం ఇక్కడే భద్రపరిచారు. వాటిని సివిల్ బ్లాక్కు చెందిన ఫస్టు ఫ్లోర్లోని ఎడమవైపున్న 14,16 నెంబర్ గదుల్లో భద్రపరిచారు. కుడివైపున్న 13 వ నెంబర్ రూమ్లో ఓట్లు లెక్కించి ఫలితాన్ని విశాఖ పంపుతారు. రాజమండ్రి లోక్సభ స్థానానికి ఆర్ఎంసీ ఆవరణలో... ఇక రాజమండ్రి పరిధిలోని 853 పోలింగు స్టేషన్లకు చెందిన 8 లక్షల 47 వేల 40 మంది ఓటర్లున్నారు. వీటిలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల ఆవరణలోని డిపార్టుమెంట్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీ, అనాటమీ, పరీక్షా కేంద్రాలలో లెక్కిస్తారు, వీటిని చేర్చివున్న విభాగాల్లోని గరల్స్, బాయిస్ వెయిటింగు రూమ్స్ తదితర చోట్ల ఆయా నియోజక వర్గాల ఈవీఎంలు భద్రపరిచారు. పశ్చిమగోదావరిలో వున్న మిగిలిన మూడు నియోజవర్గాలు గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు అసెంబ్లీల ఓట్ల లెక్కింపు ఆ జిల్లాలో పూర్తిచేసి ఫలితాలు అందించాక పార్లమెంటు ఫలితం మొత్తంగా ప్రకటిస్తారు. -
భారీగా పోలింగ్
ఓటర్లు చైతన్యమయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా ఓటు వేశారు. జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 80.66శాతం మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇది తెలంగాణ జిల్లాల్లోనే అత్యధికం. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవడానికి ముందుకు రాకపోవడంపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఓటర్లందరినీ పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలా చైతన్యం కల్పించింది. గ్రామాలు, పట్టణాల్లో వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజాసంఘాలు చైతన్యసమావేశాలు నిర్వహించాయి. ర్యాలీల ద్వారా ఓటుహక్కు ఆవశ్యకతను వివరించాయి. దీంతో ఓటర్లు ఓటు వేసేందుకు బుధవారం పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు. సాక్షిప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. 41డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండ వేడి అదరగొట్టినా లెక్కచేయకుండా ఓటర్లు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) మొరాయించాయి. దీంతో ఉదయం ఏడు గంటలకే మొదలు కావాల్సిన పోలింగ్ కొన్నిచోట్ల రెండు గంటలు ఆలస్యంగా 9 గంటలకు మొదలైంది. పోలింగ్ జరుగుతుండగా కూడా అక్కడక్కడా మధ్యలో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పోలింగ్ నిలిపివేసి సరిచేశారు. చిన్నా, చితక సంఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలూ చోటు చేసుకోలేదు. నల్లగొండ నల్లగొండ నియోజకవర్గం పరిధి తిప్పర్తి మండలం పెద్ద సూరారంలోని పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, కాంగ్రెస్వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. వృద్ధ ఓటర్లను కేంద్రంలోకి తీసుకెళ్లే క్రమంలో ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. దీంతో కేంద్రం బయట ఇరు పార్టీ కార్యకర్తల నడుమ వాగ్వాదం జరిగింది. ఆరెగూడెం, ఎల్లమ్మగూడెంలో అంగన్వాడీ వర్కర్లు పోల్ చిట్టీలు పంపిణీ చేయడంతో పాటు ప్రచారం చేయడంతో గొడవకు దిగారు. నల్లగొండ మండలం మర్రిగూడెం పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్త అదేపనిగా పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అతనిపై లాఠీచార్జీ చేశారు. కనగల్ మండలం దర్వేశిపురం, ఎం.గౌరారంలో ఈవీఎంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఈ రెండు పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ గంట ఆలస్యంగా మొదలైంది. ఆలేరు ఆలేరు నియోజకవర్గంలో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలింగ్ పూర్తయిన తర్వాత వదిలిపెట్టారు. రాజపేట మండలం చల్లూరులో గొడవ సృష్టిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుర్కపల్లి మండలం గొల్లగూడెంలో ఈవీఎం మొరాయించి అరగంట సేపు పోలింగ్ ఆగిపోయింది. గొల్లగూడెంలో ఇరువ ర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. భువనగిరి భువనగిరి నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. భూదాన్పోచంపల్లి మండలం దంతూరు, కప్రాయపల్లి, బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి, రాయరావుపేటల పోలింగ్ బూత్ల వద్ద ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి. అరగంట తర్వాత సరిచేశారు. వలిగొండ మండలం పులిగిల్లలో ఓట్లు రాలేదని కొందరు గొడవకు దిగారు. సాయంత్రం ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. యువకులు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలో పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పార్టీ జెండాలను పోలీ సులు తొల గించారు. గుంపులు గుంపులుగా ఉన్న వారిని అక్కడి నుంచి తరిమివేశారు. మునుగోడు మునుగోడు మండలం చీకటిమామిడి, చండూరు మండలం నెర్మట, బంగారిగడ్డ, చండూరు, కొండాపురం, నాంపల్లి మండలం లింగోటం, తుమ్మలపల్లి, వడ్డెపల్లి, నాంపల్లి గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో సుమారు గంటపాటు ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. డీఐజీ శశిధర్రెడ్డి చౌటుప్పల్లో పోలీసు బందోబస్తును, పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. నాంపల్లి మండలం అడవితుమ్మలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఓ వర్గం మద్యం పంచుతోందని పోలీసులకు సమాచారమివ్వడంతో కానిస్టేబుళ్లు వచ్చి గ్రామస్తులను చితకబాదారు. మాజీ సర్పంచి దంటిక వెంకటయ్య, గుమ్మడపు నర్సింహారావులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బుధవారం ఉదయం గ్రామస్తులెవరూ ఓటేసేందుకు ముందుకు రాలేదు. సదరు కానిస్టేబుళ్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాంపల్లి సీఐ వెంకట్రెడ్డి వచ్చి కానిస్టేబుళ్లపై చర్య తీసుకుంటానని, క్షమాపణ కోరడంతో, 8.15గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దేవరకొండ చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాం తంగా ముగిసింది. నియోజకవర్గవ్యాప్తంగా 264 పోలింగ్ బూత్లుండగా అధికారులు సౌకర్యాలను సమకూర్చడంలో విఫలమవ్వడంతో ఓటర్లు కొంత అసౌకర్యానికి గురయ్యారు. చందంపేట మండలంలోని నేరడుగొమ్ము గ్రామపంచాయతీ పరిధిలోని చర్లతండాలో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఇరువర్గాల మధ్య చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. గువ్వలగుట్టలో కూడా టీడీపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. డిండి మండలం బొల్లనపల్లిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కోదాడ నడిగూడెం మండలం సిరిపురంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. కోదాడ పట్టణంతో పాటు ఐదు మండలాల్లో పోలింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. మునగాల, చిలుకూరు, కోదాడ మండలాల్లోని నాలుగు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించగా, ఆ తర్వాత వాటిని సరిచేసి ఓటింగ్ను నిర్వహించారు. వేనేపల్లి చందర్రావు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎర్నేనిబాబు, బొల్లం మల్లయ్యయాదవ్, పద్మావతి, జుట్టుకొండ బసవయ్యలు పట్టణంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. తుంగతుర్తి తుంగతుర్తి నియోజకవర్గంలో ఉదయం 7గంటలకే పొలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. మోత్కూరు మండలం ఆరెగూడెం, మోత్కూరు, శాలిగౌరారం మండలం చిత్తలూరు, పెర్కకొండారం, మాదారం, తుంగతుర్తి మం డలం బండరామారం, తుంగతుర్తిలలోని పోలింగ్ బూత్లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్న సమయంలో ఎండా వేడి ఉండటంతో కేంద్రాలకు ఓటర్లు రాలేదు. 4 గంటల తర్వాత కొంతమంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. నకిరేకల్ నకిరేకల్, కేతేపల్లి, నార్కట్పల్లి, రామన్నపేట, కట్టంగూర్, చిట్యాల మండలాలలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7గంటల నుంచే ఓటర్లు బారులుదీరారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. నకిరేకల్ మండలం గోరెంకలపల్లి, మోదినిగూడెం, మంగళపల్లి నకిరేకల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కేతేపల్లి మండల కేంద్రంలో 265 బూత్ వద్ద ఈవీఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం అయ్యింది. కట్టంగూర్ మండలం అయిటిపాములలో 2గంటలు ఈవీఎంలు మొరాయించాయి. చిట్యాల మండలం ఆరెగూడెం, వనిపాకల, ఉరుమడ్లలో ఈవీఎంలు మోరాయించడంతో పోలింగ్ ఆలస్యం జరిగింది. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల అమ్మనబోలు గ్రామాలలో కూడా ఈవీఎంలు మొరాయించాయి. మొరాయించిన ఈవీఎంల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి పోలింగ్ను ప్రారంభించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఈవీఎంలపై అవగాహన లేకపోవడంతో కొంత అయోమయానికి గురయ్యారు. పోల్ చిట్టీలు కూడా పూర్తి స్థాయిలో ఓటర్లకు చేరలేదు. సూర్యాపేట సూర్యాపేటలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సరైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఎండ ఎక్కువగా ఉండడంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఎండలోనే నిలబడే ఓటుహక్కును వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలమర్రి గ్రామంలో ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు కొంత ఇబ్బంది పడ్డారు. పెన్పహాడ్ మండలంలోని చీదెళ్ల, అనంతారం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అధికారుల అలసత్వం వల్ల అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. చివ్వెంల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో గంటన్నర సేపు ఈవీఎం మొరాయించింది. నాగార్జునసాగర్ చెదురుమదురు సంఘటనల మినహా నియోజకవర్గంలో పొలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వ్యవసాయం, ఉపాధి హామీ పనుల కారణంగా ఉదయం పోలింగ్ మదకొడిగా సాగినా మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది. నాగార్జునసాగర్ హిల్కాలనీలో రెండు చోట్ల, గుర్రంపోడు మండలం కోప్పోలు, తానేదార్పల్లి పెద్దవూర మండలం రామన్నగూడెం, ఏనేమిదిగూడెం, చింతపల్లి, బట్టుగూడెం, కొత్తలూరు, నిడమనూరు మండలం నారమ్మగూడెం, నిడమనూరులోని ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంలు మొరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైనది. హాలియా మండలం తిరుమలగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థి తరఫున పోలింగ్ ఏజెంట్గా కూర్చున్న చింతమళ్ల శ్రీనివాస్పై, పేరూరులో టీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్ రామలింగయ్యపై కాంగ్రెస్ కార్యక ర్తలు దాడి చేశారు. మండలంలోని బోయగూడెం, అనుముల గ్రామాల్లోని పోలింగ్ బూత్లలో కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. గుర్రంపోడు మండలం చామలేడులో కాంగ్రెస్లోని రెండువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. నిడమనూరు మండలం గోపాలపురం, ముకుందపురం గ్రామాల్లో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. హుజూర్నగర్ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఒకచోట ఇరువర్గాల ఘర్షణ మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఈవీఎంల మొరాయింపులతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యమైంది. హుజూర్నగర్ మండలంలోని గోపాలపురం, అమరవరం, నేరేడుచర్ల మండలంలోని నేరేడుచర్ల, బొత్తలపాలెం, మేళ్లచెరువు మండలంలోని తమ్మవరం, మేళ్లచెరువు, మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం, హనుమంతులగూడెంలలో పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఈవీఎంలు మొరాయించి సుమారు గంట సేపు పోలింగ్ నిలిచింది. ఈవీఎంలను సరిచేసి పోలింగ్ నిర్వహించారు. మేళ్లచెరువు మండలం పీక్లానాయక్ తండా పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ల విషయంలో టీడీపీ, కాంగ్రెస్ వర్గీయులు ఘర్షణ పడి రాళ్లు రువ్వుకోగా ఇరువర్గాలకు చెందిన వారికి గాయాలయ్యాయి. మిర్యాలగూడ మిర్యాలగూడ పట్టణంలో సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్పంగా తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పట్టణంలోని రెడ్డి కాలనీ, ఎన్ఎస్పీ క్యాంపు, మిర్యాలగూడ మండలంలోని సుబ్బారెడ్డిగూడెం, చింతపల్లిలో ఈవీఎంలు మోరాయించడంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దామరచర్ల మండలంలోని వీర్లపాలెంలో 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తెట్టెకుంటలో 8.30 గంటల సమయంలో ఈవీఎం కంట్రోల్ యూనిట్ మొరాయించడంతో 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిపివేశారు. దామరచర్లలో 11.30గంటల సమయంతో ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 15 నిమిషాల పాటు పోలింగ్ నిలిపి వేశారు. వేములపల్లి మండలంలోని ఆమనగల్లులో ఈవీఎంలు మొరాయించడంతో 9గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. -
ఈవీఎంల మొరాయింపు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం)లు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. సుమారు వందకుపైగా కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్కు అంతరాయం కలిగింది. అనేక చోట్ల ప్రారంభంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తగా, కొన్ని కేంద్రాల్లో మధ్యలో సమస్య రావడంతో అధికారులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే వాటిని సరి చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లు గంటల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో సుమారు 28 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఆదిలాబాద్ మండలం ఖండాలలో మధ్యాహ్నం 12గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, వాగాపూర్లో రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. బేల మండలం సైద్పూర్, సోన్కాస్, చప్రాలలో, జైనథ్ మండలం కూర, సాంగ్విలలో ఈవీఎంలు మొరాయిం చాయి. పిట్టలవాడలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. చెన్నూర్ నియోజకవర్గంలో.. జైపూర్ మండలంలోని భీమారం, పెగడపల్లి, నర్సింగాపూర్, చెన్నూర్ పట్టణంలోని 166, 173 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈవీ ఎంలు మొరాయించడంతో పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. కోటపల్లి మం డలం దేవులవాడ, సిర్స, మందమర్రి మం డలం రామకృష్ణాపూర్, అమర్వాదిలలో పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. మందమర్రి మండలం అందుగులపేటలో కొన్ని సంఘాలకు డబ్బులిచ్చి తమకు ఇవ్వలేదని కొన్ని గ్రూపులు ఆందోళనకుదిగాయి. డబ్బులిస్తేనే ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. కోటపల్లి మండలం దేవులవాడ, చెన్నూర్లలో పోల్ చిట్టీలు అందక, పోలింగ్ కేంద్రా లు దొరకక ఓటర్లు వెనుదిరిగారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఈవీఎంల మొరాయింపు ఇబ్బందులకు గురి చేసింది. జన్నారం మండలం బాదంపల్లి అరగంట, చింతగూడలో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కవ్వాల్లో సాయంత్రం అరగంటపాటు ఈవీఎం పని చేయలేదు. ఉ ట్నూర్ మండలం లక్షెటిపెట్లో అర్ధగంటపా టు, మధ్యాహ్నం అర్ధగంటపాటు ఈవీఎం పని చేయలేదు. ఖానాపూర్ మండల కేంద్రంలోని 143 బత్లో ఏజెంట్ రాలేదని అర్ధ గంట అలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. తాటిగూడ, సూర్జాపూర్, ఖానాపూర్ కేంద్రంలోని 170 బూత్, మస్కాపూర్ కేంద్రాల్లో ఈవీఎంల మొరయింపుతోఉదయం గంట అలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం పెంబిలో ఈవీఎం మొరాయించింది. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని 19 బూత్లో 45 నిమిషాలు, దన్నోర(బీ) గంట 15 నిమిషాలు, అలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన మహిళలు గొడవకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో సద్దుమణిగింది. ఊట్నూర్ మండలం పెర్కగూడలో వ్యవసాయ కూలీ ఓటు ఉద్యోగుల మాదిరిగా పోస్టల్ ఓటుగా నమోదైంది. దీంతో ఆమె నిరాశతో వెనుదిరిగారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో.. ఆసిఫాబాద్ పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఈవీఎం 20 నిమిషాలు మొరాయించింది. నార్నూర్ మండలం అజ్ఞాన్, పునికాస, కెరమెరి మండలం రాంజిగూడ, సుర్దాపూర్ గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో గంట సేపు పోలింగ్ నిలి చింది. రెబ్బెన మండలం గోలేటిలో ఈవీ ఎంలు మొరాయించడంతో అర్ధగంట ఆల స్యంగా ప్రారంభమైంది. కిష్టాపూర్లో అర్ధగంట పోలింగ్ నిలిచింది. ఎన్నికల పరిశీలకులు సంజయ్కుమార్ సక్సేనా ఆసిఫాబాద్, నార్నూర్ మండలాల్లోని పోలింగ్ స్టేషన్లు తనిఖీ చేశారు. సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ మండలంలోని పోలింగ్ స్టేషన్లు తనిఖీ చేశారు. ఉట్నూర్ ఏఎస్పీ అహ్మదొద్దీన్ అహ్మద్ జైనూర్ పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో.. కన్నాలబస్తీలో ఈవీఎం గంటపాటు స్తంభించింది. బెల్లంపల్లిలోని బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 20 నిమిషాల వరకు ఈవీఎంలు మొరాయించాయి. చొప్పరిపల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో 20 నిమిషాల పాటు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. నెన్నెలలోని జెండా వెంకటాపూర్లో 40 నిమిషాలు, భీమిని మండ లం లక్ష్మీపూర్లో పోలింగ్ కేంద్రంలో అరగంటపాటు ఈవీఎంలు సతాయించాయి. వేమనపల్లి మండలం జక్కెపల్లిలో ఈవీఎం పని చేయలేదు. తాండూర్ మండలం కొత్తపల్లి, మాదారంటౌన్షిప్ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పని చేయలేదు. మాదారం, బెజ్జాల, రేపల్లెవాడ, చౌటపల్లి, అచ్చలాపూర్ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సరిగా పని చేయకపోవడంతో ఉదయం ఓట వేయడానికి ఓటర్లు ఇక్కట్లు పడాల్సి వచ్చింది. సిర్పూర్ నియోజకవర్గంలో.. సిర్పూర్ (టి), కాగజ్నగర్ పట్టణంలోని బాలాజీనగర్, బె జ్జూర్ మండల కేంద్రంతోపాటు కమ్మర్గాం, కౌటాల, నాగెపల్లి, బాబాసాగర్ గ్రామాల్లోని ఈవీఎంలు మొరాయించడంతో గంటపాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కాగజ్నగర్ పట్టణంలోని సంజీవయ కాలనీ లో బీఎస్పీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వా గ్వాదం జరిగింది. పోచమ్మ బస్తీలో పలువురి ఓట్లు గల్లంతయ్యాయి. నిర్మల్ నియోజకవర్గం.. అంజనీతాండలో ఉదయం 40 ఓట్లు పోలైన తర్వాత ఈవీఎం మొరాయించింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా అధికారులు పునరుద్ధరించలేదు. కాల్వ పోలింగ్ కేంద్రంలో పది ఓట్లు పడగానే ఈవీఎం మొరాయించింది. దాన్ని 9గంటలకు పునరుద్ధరించారు. నిర్మల్ మండలం పాక్పట్లలో ఏ మీట నొక్కినా ఒకే అభ్యర్థికి ఓట్లు పడుతుండడంతో ఓటర్లు అధికారులను ప్రశ్నించారు. దీంతో సుమారు 60 మంది ఓటర్లను తిరిగి రీపోలింగ్ చేపట్టారు. బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈవీఎంలు మొరాయించాయి. గుడిహత్నూర్ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నగేష్ తన అనుచరులతో వెళ్లేందుకు ప్రయత్నించగా టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో.. లక్సెట్టిపేట మండలం హన్మాన్పల్లి, మోదెల, దేడేపల్లి, దండెపల్లి మండలం గూడెం, మేదర్పేట్, గుడిరేవు, చింతపల్లి, మంచిర్యాల మండలం తాళ్లపల్లి, సీసీసీ, పర్తనపల్లి, గుడిపేటలోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. మంచిర్యాల పట్టణంలోని ఎడ్లవాడ, గోపాల్వాడ, ఆర్బీహెచ్వీ, పాతమంచిర్యాల పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈవీఎం సమస్య తలెత్తింది. ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. -
ఒక్క ఓటు వేస్తే...మూడు సార్లు ప్రెస్
-
ఒక్కసారి ఓటు వేస్తే మూడు సార్లు వేసినట్లే...
ఒక్కసారి ఈవీఎంలో ఓటు వేస్తే మూడు సార్లు ఓటు వేసినట్లు కనిపించడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు. అదే విషయాన్ని పోలింగ్ బూత్ సిబ్బందికి వెల్లడించారు. దాంతో వారు ఈవీఎంలను పరిశీలించారు. ఈవీఎంలో సాంకేతిక లోపం ఏర్పడటం వల్ల అలా జరిగిందని వారు వెల్లడించారు. దాంతో పోలింగ్ నిలిపివేసి....సమాచారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కొత్త ఈవీఎంలు తక్షణమే ఏర్పాటు చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ ఘటన మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ తాలుకా ఐజ మండలం బూమ్పురంలో బుధవారం చోటు చేసుకుంది. -
'ఏ పార్టీకి ఓటేసినా ఒకే పార్టీకి ఓట్లు'
ఏ పార్టీకి ఓటేసినా ఒకే పార్టీకి ఓటు పడుతున్నాయి... దాంతో ఓటు వేసి బయటకు వచ్చిన ఓటర్లు బిత్తరపోయారు. స్థానిక ఎన్నికల అధికారులకు ఓటర్లు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికల అధికారులకు సదరు ఈవీఎంను పరీక్షించారు. ఈవీఎంలో సాంకేతిక లోపం కారణంగానే అలా జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఆ ఈవీఎంను తొలగించి... ఆ స్థానంలో కొత్త ఈవీఎంను అధికారులు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలోని మనూర్ మండలం దాన్వార్లో బుధవారం ఆ సంఘటన చోటు చేసుకుంది. -
పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు
తెలంగాణ ప్రాంతంలోని 119 అసెంబ్లీ, 17 లోక్సభ నియోజకవర్గాలకు బుధవారం ఉదయం 7. గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అయితే వివిధ ప్రాంతాలలోని పోలింగ్ బూత్లలో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో పోలింగ్బూత్ వద్ద క్యూ లైన్లు పెరుగుతున్నాయి. ఎన్నికల ఏర్పాట్లు విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా... ఈవీఎంలను సరిచేసేందుకు ఎన్నికల సిబ్బంది తంటాలు పడుతున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంను ఎన్నికల సిబ్బంది సరి చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలోని పోలింగ్ బూత్లలో ఈవీఎంలు మొరాయించాయి. వాటి వివరాలు. హైదరాబాద్: హబ్సీగూడ పోలింగ్ బూత్ నెం 181తోపాటు తుకారంగేటులోని బూత్ నెం. 6...కూకట్పల్లిలోని బూత్ నెం.46...ఎల్బీనగర్ 82/A...ఖైరతాబాద్ ఆనంద్నగర్ 83 బూత్లలోని ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ఓటింగ్ వేసేందుకు వచ్చిన ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చైతన్యపూరిలో కూడా ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ఓటర్లు వెనుదిరిగారు. ఆదిలాబాద్ జిల్లా: మందమర్రి రామకృష్ణాపూర్లోని....68, 69 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ప్రారంభం కానీ పోలింగ్. ఖమ్మం జిల్లా: కొణిజర్ల పెద్దమునగాలలో పనిచేయని ఈవీఎంలు. భద్రాచలం నన్నపనేని హైస్కూల్లో పనిచేయని ఈవీఎం పినపాక కరకగూడెంలో పనిచేయని ఈవీఎం అశ్వరావుపేట, దమ్మపేటలో ఈవీఎంలు మొరాయింపు కొత్తగూడెం రేజర్లలో పనిచేయని ఈవీఎంలు మహబూబ్నగర్ జిల్లా : నాగర్కర్నూల్లో..87, 88 పోలింగ్ కేంద్రాల్లో పనిచేయని ఈవీఎంలు. వీపనగండ్లలో 148 బూత్లోని ఈవీఎం. పెద్దకొత్తపల్లి మండలం కల్వకొల్లులో 47బూత్లో..పనిచేయని ఈవీఎంలు మెదక్ జిల్లా : 104 పోలింగ్ కేంద్రంలో పనిచేయని ఈవీఎం. చినమండవ, మక్కేపల్లి గ్రామాలలో మొరాయించిన ఈవీఎంలు. మంగల్పేటలోలోని 141బూత్లో ఈవీఎం మొరాయింపు పెబ్బేరు మండలం శ్రీరంగపూర్లో మొరాయించిన ఈవీఎం నల్గొండ జిల్లా: నాంపల్లి 247పోలింగ్ బూత్లో...పనిచేయని ఈవీఎం. నాగార్జునసాగర్ హిల్కాలనీలో ఈవీఎంలు మోరాయింపు పెన్పహాడ్ మండలం చీవెళ్లలో పనిచేయని ఈవీఎం మునగాల, చిలుకూరులో మొరాయించిన ఈవీఎం నకిరేకల్ బూత్నెం.1లో మొరాయించిన ఈవీఎం మిర్యాలగూడ నియోజకవర్గంలోని రాయలపెంట, గాంధీనగర్లో ఈవీఎంల మొరాయింపు రంగారెడ్డి జిల్లా: వికారాబాద్ ఆలంపల్లిలో పనిచేయని ఈవీఎం. పెద్దేముల్ మండలం హనుమాపూర్లో పనిచేయని ఈవీఎంలు ధారూర్ కుక్కిందలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలలో సాంకేతికలోపం... గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం వరంగల్ జిల్లా: జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పనిచేయని ఈవీఎంలు భూపాలపల్లి మండలం నాగారంలో పనిచేయని ఈవీఎంలు రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామంలో ఈవీఎం మొరాయింపు కరీంనగర్ జిల్లా: సిరిసిల్ల 123 పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవిఎం మల్యాల మండల కేంద్రంలోని 4 పోలింగ్ కేంద్రాలలో మొరాయించిన ఈవిఎంలు, ప్రారంభంకాని పోలింగ్ ముస్తాబాద్ లోని 208 పోలింగ్ కేంద్రంలో నిలిచిపోయిన పోలింగ్ , ఓటర్ల ఆందోళన -
నేడు..‘నిర్ణయం’
ఆ క్షణాలు వచ్చేశాయి. అన్ని పక్షాలూ ఇప్పుడు ఉత్కంఠతో ఓటరు తీర్పు ఎలా ఉంటుందా అని ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్నికలకు కావల్సిన అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం పటిష్టంగా చేసింది. సిబ్బంది తమకు కేటాయించిన పోలింగు కేంద్రాలకు మంగళవారం సాయంత్రానికే చేరుకున్నారు. నేతలు పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అంతర్గత ప్రణాళికలు రచించి నమ్మకస్తుల ద్వారా అమలు పరుస్తున్నారు. తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యంత కీలక ఘట్టం బుధవారం ఉదయం ఏడు గంటలకే ప్రారంభం కానుంది. జిల్లాలోని రెండు లోక్సభ, 14 అసెంబ్లీ స్థానాల పరిధిలోని 28.94లక్షల మంది ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో తమ తీర్పును నిక్షిప్తం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో జరుగుతున్న ప్రస్తుత ఎన్నికల్లో విజయం కోసం సర్వ శక్తులూ ఒడ్డిన పార్టీలు, అభ్యర్థులు ఉత్కంఠ ఎదుర్కొంటున్నారు. పోలింగ్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కంటి మీద కునుకులేకుండా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో శిక్షణ పూర్తి చేసుకున్న పోలింగ్ సిబ్బంది మంగళవారం నియోజకవర్గ కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్నారు. ర్యాండమైజేషన్లో కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఇతర పోలింగ్ సామగ్రిని సరిచూసుకున్నారు. అధికారులు సమకూర్చిన ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి బుధవారం ఉదయం జరిగే పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతం అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. ఇతర నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. సుమారు 24, 806 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. బందోబస్తులో భా గంగా 16వేలకు పైగా పోలీసు సిబ్బంది వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను ప్రత్యేక బందోబస్తు నడుమ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు. ప్రలోభాల పర్వంలో పార్టీలు బిజీ కొద్ది గంటల్లో పోలింగ్ మొదలు కానుండటంతో పార్టీలు, అభ్యర్థులు గెలుపు కోసం చివరి ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. ఎన్నికల సంఘం కళ్లుగప్పి గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా మద్యం, నగదు ప్రవాహం జోరుగా సాగుతోంది. సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన వెంటనే అభ్యర్థులు ప్రలోభాల పర్వంపై దృష్టి సారించారు. అభ్యర్థులు ఎవరికి చిక్కకుండా గ్రామాల్లో పర్యటిస్తూ కుల సంఘాలు, యువజన సంఘాలు లక్ష్యంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎదుటి పార్టీ ముఖ్య నేతలు, కేడర్, పోలింగ్ ఏజెంట్లను ప్రలోభాలకు గురి చేస్తూ ఓటింగ్ను అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. పలు చోట్ల మద్యం నిల్వలు పట్టుబడగా, స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి. ఎదుటి పార్టీలు ప్రలోభాలకు ప్రయత్నిస్తోందంటూ అందుతున్న పిర్యాదుతో అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతోంది. -
నేడే పోలింగ్ అంతా సిద్ధం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి నేటి తో తెరపడనుంది. సుమారు 14 రోజుల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియగా, బుధవారం పోలింగ్ జరగనుంది. నా మినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ మొదలు కుని ఎన్నికల ప్రచారం ముగింపు వరకు ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీ య ఘటనలకు తావు లేకుండా అధికారయంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని రెండు లోక్సభ, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో 18,52,970 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. 2,057 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరగనుండగా, ఇందుకోసం 5,332 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)లను ఏర్పాటు చేశారు. 25 మంది ప్రిసైడింగ్, 28 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు 15,886 మంది సిబ్బందిని నియమించారు. నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ బరిలో 26 మంది, తొమ్మిది అసెంబ్లీ స్థానాల నుంచి 101 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2009.. 2014 ఎన్నికల షెడ్యూలులో తేడా 2009 సార్వత్రిక ఎన్నికలతో 2014 ఎన్నికల షెడ్యూల్ ను పోలిస్తే తేదీలు అటు ఇటుగా ఉండగా, ఓట్ల లెక్కిం పు మాత్రం ఒకే తేదీన జరగనుంది. 2009లో ఎన్నికల షెడ్యూల్ను మార్చి రెండున విడుదల చేస్తే, ఈ సారి ఐదున ప్రకటించారు. 2009లో నోటిఫికేషన్ మార్చి 23న జారీ కాగా ఈసారి పది రోజులు ఆలస్యంగా ఏప్రిల్ రెండు జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన తేదీలలోనూ కొంత తేడా ఉంది. గత ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 16న జరిగితే, ఈసారి ఏప్రిల్ 30న జరగనుంది. అయితే, 2009, 2014 ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 16 కావడం విశేషం. ఇదీ పరిస్థితి మొత్తం ఓటర్లు : 18,53,288 పురుషులు : 8,97,062 మహిళలు : 9,55,798 ఇతరులు : 110 సైనికులు : 318 పోలింగ్ కేంద్రాలు : 2,057 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు : 5,332 ప్రిసైడింగ్ అధికారులు : 2,528 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు : 2,525 పోలింగ్ సిబ్బంది : 10,832 మొత్తం సిబ్బంది : 15,885 -
తెలంగాణ ప్రాంత ఎన్నికలకు సర్వం సిద్దం
-
శోభమ్మకు ఓటుతో నివాళి
సిద్ధమవుతున్న ఆళ్లగడ్డ ప్రజలు - ఎన్నికపై నెలకొన్న సస్పెన్స్కు తెర - ఆమె గెలిస్తే ఉప ఎన్నిక నిర్వహణ - ఈసీ నిర్ణయంతో అభిమానులకు ఊరటకుదుటపడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆపదలో కొండంత అండ. ఎలాంటి సమయంలోనైనా నేనున్నాననే భరోసా. పార్టీలకు అతీతంగా.. వర్గాలకు తావివ్వక చిరునవ్వుతో ప్రజల హృదయాలను గెలిచిన శోభమ్మ మృతి జిల్లా ప్రజలను కలచివేసింది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ ప్రజలకు తీరని దుఃఖం మిగిల్చింది. ఇక గెలుపు లాంఛనమేనన్న పరిస్థితుల్లో ఆమె అకాలమరణంతో ఎన్నో ప్రశ్నలు తెరపైకొచ్చాయి. ఈవీఎంలలో ఆమె పేరును తొలగిస్తారని.. ఓటు వేసినా చెల్లదని.. గెలిచినా పరిగణనలోకి తీసుకోరనే ప్రచారం గందరగోళానికి తావిచ్చింది. ఎట్టకేలకు ఈ సస్పెన్స్కు ఎన్నికల కమిషన్ తెరదించింది. శోభా నాగిరెడ్డికి వేసే ఓట్లు చెల్లుబాటు అవుతాయని.. ఒకవేళ ఆమె గెలిస్తే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పట్ల ఆమె అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆళ్లగడ్డ అసెంబ్లీ బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈనెల 24న మరణించిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఎన్నిక నిర్వహణపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. ఆడపడచులా భావించిన నియోజకవర్గ ప్రజలు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆదివారం ఎన్నికల అధికారి భన్వర్లాల్ ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డికి ఓటేస్తే చెల్లదని ప్రకటించారు. పారదర్శక పాలనతో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఆమెకు ఓటుతో నివాళి అర్పించాలనుకున్న ప్రజలకు ఆ ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. దీంతో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి.. జిల్లా కలెక్టర్, జేసీలతో సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా సోమవారం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ అధికారులతో మాట్లాడి ఆళ్లగడ్డ ఎన్నికపై స్పష్టత కోరారు. ఆర్టికల్ 52 ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం ఆళ్లగడ్డ ఎన్నికకు ఎలాంటి అభ్యంతరం లేదని.. మెజార్టీ ప్రజలు ఎవరికి అధికంగా ఓట్లు వేస్తారో వారినే ఎమ్మెల్యేగా ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు. అయితే గెలిచిన అభ్యర్థి అప్పటికే మృతి చెందినట్లయితే ఉప ఎన్నిక నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఎట్టకేలకు నిర్ణయం వెలువడటంతో ఊపిరి పీల్చుకున్న అధికారయంత్రాంగం సోమవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై బ్యాలెట్ యూనిట్ను అమర్చే కార్యక్రమం పూర్తి చేశారు. -
ఈవీఎంల కేటాయింపు
సాక్షి, కాకినాడ : వచ్చే నెల ఏడో తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 4056 పోలింగ్ స్టేషన్లకు 11 వేల 204 బ్యాలట్ యూనిట్లు, 8914 కంట్రోల్ యూనిట్లను కేటాయించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ చెప్పారు. కలెక్టరేట్ కోర్టుహాల్లో శుక్రవారం ఎలక్ట్రానిక్ ఓటింగు మెషీన్ల ప్రథమ ర్యాండమైజేషన్ నిర్వహణ నీతూప్రసాద్ సారధ్యంలో జరిగింది. ఈ సందర్భంగా 294 యూనిట్లు శిక్షణ, అవగాహన నిమిత్తం కేటాయింపులు చేశారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపడుతున్నట్టు ముందుగా అభ్యర్థులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారినుంచి పెద్దగా స్పందన లేకపోవడం విశేషం. కాకినాడ పార్లమెంట్కు 1491 పోలింగ్ స్టేషన్లుండగా 2982 కంట్రోల్ యూనిట్లు, 289 రిజర్వు నిమిత్తం కేటాయించారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి 853 పోలింగ్ కేంద్రాలకు గాను 1706 కంట్రోల్ యూనిట్లు కేటాయించారు. అమలాపురం పార్లమెంటుకయితే 1500 పోలింగ్ కేంద్రాలకు గాను కంట్రోల్ యూనిట్లు మూడు వేలు,రిజర్వు 301 వెరసి 3301 కేటాయించగా బ్యాలట్ నిమిత్తం 3213 యూనిట్లు,రిజర్వుకి 161 యూనిట్లు కేటాయించారు. ఇదిలా వుండగా విశాఖ జిల్లా అరకు పార్లమెంట్ పరిధిలో వున్న రంపచోడవరం అసెంబ్లీలో 212 పోలింగ్ కేంద్రాలుండగా 424 కంట్రోలింగ్ యూనిట్లు, 42 రిజర్వు యూనిట్లు కేటాయించారు. అలాగే బ్యాలట్ కోసం 424 యూనిట్లు,రిజర్వు నిమిత్తం 21యూనిట్లు కేటాయించారు. కార్యక్రమంలో పరిశీలకులు గౌతమ్ ఘోష్, వీరేంద్రకుమార్ సింగ్, ట్రైనీ కలెక్టర్ కన్నన్, డ్వామా పీడీ సంపత్ కుమార్, రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
భద్రత డొల నీళ్లలో ఈవీఎంలు
వికారాబాద్, న్యూస్లైన్: ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు)ల భద్రత డొల్లేనని తేలింది. అధికారుల నిర్లక్ష్యానికి వికారాబాద్ స్ట్రాంగ్రూం ఘటన నిలువుటద్దంగా నిలిచింది. బుధవారం కురిసిన ఆకాల వర్షానికి అందులోని ఓటింగ్ యంత్రాలు తడిసిముద్దయ్యాయి. మోకాల్లోతు నీరు గది లోపలికి చేరడంతో ఈవీఎంలు నీటిలో మునిగాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు తాపీగా అక్కడకు చేరుకొని.. తడిసిన ఈవీఎంలను అరబెట్టడం కొసమెరుపు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్లోని మహావీర్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపరిచారు. వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 580 బ్యాలెట్ యూనిట్లు, 520 కంట్రోల్ యూనిట్లను ఇక్కడి గదుల్లో ఉంచారు. వీటిని కంటికిరెప్పలా కాపాడేందుకు సాయుధ పోలీసులు, అసిస్టెంట్ రిటర్నింగ్ స్థాయి అధికారిని నియమించారు. అయితే, భారీ వర్షం కురిసిన సమయంలో ఇక్కడ వీరెవ్వరూ లేనట్లు ఉన్నతాధికారుల విచారణలో స్పష్టమైంది. తాపీగా వచ్చారు.. బుధవారం సాయంత్రం ఎడతెరిపిలేకుండా వాన కురిసింది. గాలి కూడా తోడుకావడంతో వాన ఉధృతి పెరిగింది. ఈ క్రమంలోనే ఈవీఎంలను భద్రపరిచిన మహావీర్ ఆస్పత్రి గదుల ను వర్షపు నీరు ముంచెత్తింది. స్ట్రాంగ్ రూంలోకి నీరొచ్చిన విషయాన్ని అర్ధరాత్రి తెలుసుకున్న సబ్కలెక్టర్/ రిటర్నింగ్ అధికారి ఆమ్రపాలి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తడిసిన ఈవీఎంలను ఆమెతో సహా ఎన్నికల సిబ్బంది శుభ్రపరిచారు. గురువారం మధ్యాహ్నం వరకు అక్కడే తిష్టవేసిన ఆమ్రపాలి ఈవీఎంలను అరబెట్టడాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదిలావుండగా, స్ట్రాంగ్రూంలకు కాపలా ఉండాల్సిన పోలీసులు/ ఏఆర్ఓ సకాలంలో సమాచారం ఇవ్వకపోవడంతో ఈవీఎంలు నీటమునిగినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. సాయంత్రం వర్షంకురిస్తే అర్ధరాత్రి ఒంటి గంటవరకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. వర్షంపడే సమయంలో వీరు అక్కడలేకపోవడంతో సమాచారం చేరవేయలేదని, ఈవీఎంల భద్రతను చూడాల్సిన సిబ్బంది నిర్లిప్తంగా వ్యవహరించినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని రిట ర్నింగ్ అధికారిని ఆదేశించినట్లు తెలిసింది. -
ఈసీఐఎల్.. ఈవీఎం సృష్టికర్త
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రగామి సంస్థ. నాలుగున్నర దశాబ్దాలుగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, ఎలక్ట్రానిక్స్ యంత్రాల తయారీలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన సంస్థ అది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పరిచయం చేసిన ఈసీఐఎల్.. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలోనే 48వ సంవత్సరంలోకి ప్రవేశించడం సందర్భోచితం. ఏప్రిల్ 11న ఈసీఐఎల్ ఆవిర్భావ దినం. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ఈవీఎంల తయారీలో రికార్డ్ పారదర్శకతకు ప్రతిబింబంగా నిలిచే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రూపొందించిన ఈసీఐఎల్.. ఈ ఏడాది లక్షా 87 వేల యంత్రాలను అందజేసి చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. దశాబ్ద కాలంగా మొత్తం 7.4 లక్షల ఈవీఎంలను తయారుచేసి అగ్రగామి సంస్థగా నిలిచింది. గతంలో జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోను ఈసీఐఎల్ తయారు చేసిన ఓటింగ్ యంత్రాలనే వినియోగించారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ ఈ సంస్థ తయారుచేసిన ఓటింగ్ యంత్రాలనే వినియోగిస్తున్నారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంల వినియోగం మరింత పెరగనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్, ఆక్సిలరీ డిస్ప్లే యూనిట్(ఏడీయు), డిటాచబుల్ మెమొరీ మాడ్యుల్ (డీఎంఎం) వంటి పరికరాలతో రూపొందించే ఈవీఎంలు ఓటరు తీర్పును సురక్షితంగా కాపాడతాయి. ఈసారి ఈ యంత్రాలలో ‘పైవారు ఎవరూ కాదు’ (నోటా-నన్ ఆఫ్ ద ఎబోవ్) అనే మీటను కూడా తాజాగా ఏర్పాటు చేసింది. వీటిలో లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతోందీ సంస్థ. ఇందుకోసం చర్లపల్లిలో ఒక ప్రత్యేక కేంద్రాన్నే ఏర్పాటు చేశారు. ఈవీఎంల సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (ఈటీడీసీ) కూడా ఈసీఐఎల్కు అనుబంధంగా పని చేస్తోంది. -
స్ట్రాంగ్ రూంలకు ‘మున్సిపల్’ ఈవీఎంలు
* భారీ భద్రత మధ్య తరలించాలని ఈసీ ఆదేశం * లెక్కింపు కేంద్రాల నుంచి తరలించే సమయంలో అభ్యర్థులు వెంట ఉండొచ్చు * బాక్సులు భద్రపర్చిన ప్రదేశంలో అభ్యర్థుల అనుచరులూ ఉండేందుకు అవకాశం సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల లెక్కింపు, ఫలితాలు మే రెండో వారం వరకు వాయిదాపడడంతో... మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) స్ట్రాంగ్ రూంలలో భద్రపరచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించింది. గత నెల 30న రాష్ట్రంలోని పది మున్సిపల్ కార్పొరేషన్లు, 145 మున్సిపాలిటీలకు ఈవీ ఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపునకు వీలుగా ఈవీఎంలను ఇప్పటివర కు లెక్కింపు కేం ద్రాల్లో ఉంచారు. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో వీటిని జిల్లా కలెక్టర్, ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లతో సంప్రదించి స్ట్రాంగ్రూంలకు తరలించాలని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు. ఈవీఎంలను లెక్కింపుకేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూంలకు తరలించే సమయంలో ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమతమ వాహనాల్లో వెనుక రావడానికి అనుమతించారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూంల వద్ద అభ్యర్థుల అనుచరులు ఉండడానికి వీలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఇదిలాఉండగా, మున్సిపల్ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలు, పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్లను కూడా జిల్లా కేంద్రంలో ఒకే దగ్గర భద్రపరచనున్నట్లు సమాచారం. స్ట్రాంగ్ రూంలలో లైటింగ్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చూడాలని నవీన్మిట్టల్ సూచించారు. ఒక మున్సిపాలిటీ ఈవీఎంలను ఇతర మున్సిపాలిటీలతో కలపకుండా జాగ్రత్తపడాలని, 24 గంటలపాటు స్ట్రాంగ్ రూంల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధం
అనంతపురం కలెక్టరేట్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 3,310 పోలింగ్ కేంద్రాలుండగా, 7 వేల కంట్రోల్ యూనిట్లు, 8,200 బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన వీటిని వారం రోజుల క్రితం బెంగళూ రు నుంచి తెప్పించారు. ప్రస్తుతం స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని గోదాములో వీటిని భద్రపరిచారు. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో గరిష్టంగా 16 మంది దాకా అభ్యర్థులకు చోటు కల్పించనున్నారు. ఇంకా అభ్యర్థులున్నట్లయితే మరో బ్యాలెట్ యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తొలిసారిగా నోటా బటన్ మే 7న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా నోటా (నన్ ఆఫ్ అబౌ) బటన్ ఆప్షన్ వినియోగించేలా ఎన్నికల కమిషన్ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. పాత ఈవీఎంలలో ఓటు (నోటా)తిరస్కరణ బటన్ ఉండేది కాదు. ప్రస్తుతం ఈ ఏడాది నుంచి ఈవీఎంలలో కొత్తగా నో టా బటన్ ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులందరి పేర్ల తర్వాత చివరలో నోటా బటన్ ఉంటుంది. ఓట్ కన్ఫర్మేషన్ మెథడ్ మనం వేసే ఓటు ఎవరికి పడిందనేది తెలుసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం ఈ పర్యాయం కల్పించింది. ఈవీఎంలో ఓటు వేసిన తరువాత ఆ ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవాలంటే పోలింగ్ అధికారిని సంప్రదించాలి. పోలింగ్ అధికారి ఈవీఎంలో ఓటు కన్ఫర్మేషన్ బటన్ను నొక్కుతారు. అప్పుడు ఈవీఎం స్క్రీన్ ముందు పది సెకన్ల పాటు ఓటరు నిల్చోవాలి. ఈవీఎం స్క్రీన్లో ఓటు ఎవరికి పడిందనేది డిస్ప్లే అవుతుంది. అప్పటికీ ఓటరుకు నమ్మకం కుదరకపోతే అందుకు సంబంధించిన స్లిప్ కావాలని కూడా అడగవచ్చు. ఇందుకు సంబంధించిన స్లిప్ను పోలింగ్ అధికారి తీసి ఓటరుకు చూపిస్తారు. కానీ ఆ స్లిప్ను బయటకు ఇవ్వరు. ఆ స్లిప్ను ఈవీఎంకు పక్కనే ఉంచిన సీల్డ్ పెట్టెలో వేస్తారు. దీన్నే ఓట్ కన్ఫర్మేషన్ పద్ధతి అంటారు. ఈ విధానాన్ని మన జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్ట్గా ఎన్నికల సంఘం చేపట్టనుండడం గమనార్హం. ఈవీఎంలపై అధికారులకు అవగాహన కల్పించిన కలెక్టర్ బెంగళూరు నుంచి కొత్తగా తెప్పించిన ఈవీఎంలపై కలెక్టర్ లోకేష్కుమార్ అధికారులకు అవగాహన కల్పించారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, డీఆర్వో హేమసాగర్, రిటర్నింగ్ అధికారులతో కలిసి స్థానిక ఈవీఎం గోదాములో ఈవీఎంలను పరిశీలించారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లను ఎలా వినియోగించాలనే విధానంపై కూలంకుషంగా వివరించారు. -
ఈవీఎంలలో అభ్యర్థుల భవిష్యత్
మెదక్, న్యూస్లైన్: ఇరవై రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రహసనం ఆదివారంతో ముగిసింది. అభ్యర్థుల భవిష్యత్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లలో నిక్షిప్తమై ఉంది. ఆదివారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు ఈవీఎంలను మెదక్ పట్టణంలోని గోల్బంగ్లాకు తరలించారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్రూంలో భద్రం చేశారు. ఇక పోలింగ్ ముగిసిన వెంటనే అభ్యర్థులు తమ కార్యకర్తలతో సమావేశమై కూడికలు, తీసివేతలతో విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. ఓటింగ్ సరళిని పరిశీలన చేస్తూ..గెలుపోటములపై అంచనాలకు వస్తున్నారు. ఏప్రిల్ 2న కౌటింగ్ జరపాల్సి ఉన్నప్పటికీ మంగళవారం నాటి హైకోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఓట్ల లెక్కింపు 2న జరుగుతుందా? లేక వాయిదా పడుతుందా? అన్న టెన్షన్ అభ్యర్థులు, ప్రజల్లో నెలకొంది. సోమవారం పట్టణంలో ఎక్కడ చూసినా ఎన్నికల జయాపజయాలపైనే చర్చించుకోవడం కనిపించింది. సోమవారం ఉగాది పర్వదినం కావడంతో అ భ్యర్థులు సాయంత్రం వేళలో జరిగిన ప ంచాం గ శ్రవణానికి హాజరై తమ భవిష్యత్ జాతకాన్ని పండితుల ద్వారా చెప్పించుకున్నారు. అధికారులు మాత్రం ఏ క్షణంలోనైనా కౌటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. -
‘పుర’ పోరు ప్రశాంతం
సాక్షి, హన్మకొండ : చెదురుమదురు ఘటనలు మినహా... జిల్లావ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని మహబూబాబాద్, జనగామ మునిసిపాలిటీలతోపాటు భూపాలపల్లి, నర్సంపేట, పరకాల నగర పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. మొత్తంగా 78.69 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా నర్సంపేటలో 85.52 శాతం పోలింగ్ జరగగా... అత్యల్పంగా భూపాలపల్లిలో 70.55 శాతం నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్తోపాటు జాయింట్ కలెక్టర్ పాసుమిబసు, డీఐజీ కాంతారావు, రూరల్ ఎస్పీ కాళిదాసు పోలింగ్ సరళిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా ఓటర్లు బారులుదీరడంతో నర్సంపేటలో ఏడు గంటల వరకు... జనగామలో రాత్రి తొమ్మిది గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆలస్యంగా ప్రారంభం పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మొరాయించడంతో పరకాలలోని 19వ వార్డులో గంట ఆల స్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. అదేవిధంగా... భూపాలపల్లి పదో వార్డులో 15 నిమిషాలపాటు ఆలస్యమైంది. జనగామలోని 18, 28వ వార్డుల్లో ఈవీఎం వినియోగంపై ఓటర్లకు అవగాహన లేక ఇబ్బంది పడ్డా రు. దీంతో అధికారులు మాక్పోలింగ్తో వారికి అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో ఉదయం ఏడు గంట లకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ అరగంట ఆలస్యం గా మొదలైంది. మరోవైపు ఇదే పట్టణంలోని 21 వార్డులో పోలింగ్ ఏజెంట్ అభ్యంతరం చెప్పడంతో అధికారులు 61 మందిని ఓటేసేందుకు అనుమతించలేదు. వారు పోలింగ్ కేంద్రంలో ఆందోళనకు దిగడంతో అధికారులు మరోసారి రికార్డులు పరిశీలించారు. వారు అదే వార్డు ఓటర్లు అని తేలడంతో ఓటేసేందుకు అనుమతించగా... వివాదం సద్దుమణిగింది. ఐదు గంటల తర్వాత కూడా క్యూ వేసవి కావడంతో ఎక్కువ మంది ఓటర్లు సాయంత్రం మూడు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం ఐదు గం టల వరకు క్యూలో ఉన్న వారిని మాత్రమే ఓటేసేందు కు అనుమతించారు. జనగామ మునిసిపాలిటీ పరిధిలో పరిశీలిస్లే ఐదు వార్డుల్లో సాయంత్రం ఐదు గంటల త ర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. 24, 28వ వార్డుల్లో సాయంత్రం 6:30 గంటల వరకు... 11, 12వ వార్డుల్లో రాత్రి ఎనిమిది గంటల వరకు... తొమ్మిదో వార్డులో తొమ్మిది గంటల వరకు పోలింగ్ జరిగింది. 1,400 మంది ఓటర్లు దాటిన పోలింగ్ బూత్లలో స్త్రీ, పురుషులకు వేర్వేరు ఈవీఎంలు ఏర్పాటు చేయకపోవడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. సాయంత్రం వేళ పలు పోలింగ్ కేంద్రాల్లో సరైన వెలుతురు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పరకాల 12వ వార్డులో 5.30 గంటల వరకు, నర్సంపేట 4, 5, 13వ వార్డుల్లో ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మహబూబాబాద్, భూపాలపల్లిలో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ముగిసింది. పరకాలలో కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం పరకాల నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మంద రాంచందర్కు ఎన్నికల అధికారులు మొదట గ్యాస్ పొయ్యి గుర్తు కేటాయించారు. పోలింగ్ బూత్ బయట డిస్ప్లేలో గ్యా స్పొయ్యికి బదులు సిలిండర్ గుర్తు ఉండడంతో ఆయ న అవాక్కయ్యారు. తనపై కుట్రతోనే గుర్తు మార్చారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయకపోతే.. ఇక్కడే చచ్చిపోతానని పురుగుల మందు డబ్బాతో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. వెంటనే స్పం దించిన ఎన్నికల అధికారులు గ్యాస్ పొయ్యి గుర్తును ఏర్పాటు చేశారు. మానుకోటలో వడదెబ్బతో వృద్ధురాలి మృతి మహబూబాబాద్లో వేల్పుల సత్యంనగర్కు చెందిన వృద్ధురాలు పోతరాజు పిచ్చమ్మ (86) రెండో వార్డుకు సంబంధించి గుమ్ముడూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటేసేందుకు ఉదయం 11 గంటలకు వచ్చింది. ఓటేసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిన కాసేపటికే అస్వస్థతకు గురై మృతి చెందింది. వడదెబ్బ వల్లే మృతి చెందినట్లుగా కుటుం బీ కులు తెలిపారు. అదేవిధంగా పరకాల ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మడికొండ సంపత్కుమార్ తల్లి సంతోషమ్మ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందింది. దీంతో ఈ వార్డు లో విషాదఛాయలు అలుముకున్నాయి. పది మంది అరెస్ట్ పోలింగ్ సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ.. ప్రలోభాలకు గురిచేస్తున్న పదిమందిని పోలీసులు అ రెస్టు చేశారు. మహబూబాబాద్ 11వ వార్డులో వంగ సీతయ్య, నాలుగో వార్డులో బోడ సేవ్యా, ఐదో వార్డు లో రేణికుంట్ల శంకర్ డబ్బులు పంపిణీ చేస్తూ పోలీసులకు చిక్కారు. నర్సంపేటలో స్వత్రంత అభ్యర్థి తరఫున డబ్బులు పంచుతున్న తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే పట్టణంలో పోలింగ్బూత్ సమీపంలో ప్రచారం చేస్తున్న బండి ప్రవీణ్, రుద్ర ఓంప్రకాశ్, కె.శ్రీనివాస్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరకాలలో తమ అభ్యర్థికే ఓటు వేయాలని ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న పోరండ్ల సంతోష్, బొచ్చు వెంకట్, వి.సారయ్యను పోలీసులు అరెస్టు చేశారు. భూపాలపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారమ్లు జారీ చేసిన ఆ పార్టీ నేత మధుసూధనాచారికి నిబంధనలకు విరుద్ధంగా ఏజెంటు పాసు ఇచ్చారంటూ ప్రత్యర్థి పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. -
నేడు ‘పుర’ పోరు
సాక్షి, గుంటూరు,జిల్లాలోని 12 పురపాలక సంఘాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని పురపాలక సంఘాల్లో కలిపి 371 వార్డులు కాగా, మాచర్లలో రెండు వార్డులకు ఎన్నిక నిలిచిపోయింది. మరో వార్డు ఏకగ్రీవమైంది. ఫలితంగా 368 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1456 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 6,08,972 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం మొత్తం 654 పోలింగ్బూత్లు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లను వినియోగిస్తున్నారు. ఈ ఎన్నికలకు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాకు పరిశీలకులుగా అనితా రాజేంద్ర, లక్ష్మినరసింహ నియమితులయ్యారు.ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో సూపర్వైజరీ అధికారిని నియమించి పకడ్బందీగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు.12 మున్సిపాలిటీలకు 3,500 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని పంపారు.సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వీడియోగ్రాఫర్లతో పాటు వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి కొత్త వ్యక్తులు పట్టణాల్లోకి రాకుండా, డబ్బు, మద్యం తరలించకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పోలింగ్ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఆరు అంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. 368 వార్డులు...1456 మంది అభ్యర్థులు 12 పురపాలకసంఘాల పరిధిలో 371 వార్డులకు మాచర్లలోని 21, 22 వార్డులకు ఎన్నిక నిలిచిపోయాయి. 28వ వార్డు టీడీపీకి ఏకగ్రీవమైంది. మిగిలిన 368 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1456 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.అత్యధికంగా నరసరావుపేటలో 34 వార్డులకు 203 మంది బరిలో ఉన్నారు.అత్యల్పంగా మాచర్లలో 26 వార్డులకు 70 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు 419 మంది ఉండటం గమనార్హం. వర్గపోరుతో సతమతమవుతున్న టీడీపీ పురపాలక ఎన్నికల్లో టీడీపీ వర్గపోరుతో సతమతమవుతోంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటమి పాలైతే ఇన్చార్జిలకు టికెట్లు ఉండవని భావించిన వ్యతిరేక వర్గీయులు టీడీపీ అభ్యర్థుల ఓటమికి పథక రచన చేస్తున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, బాపట్ల, రేపల్లె, మంగళగిరి, పిడుగురాళ్ళ, మాచర్ల మున్సిపాలిటీల్లో టీడీపీకి ఇంటిపోరు తీవ్ర తలనొప్పిగా మారింది. వైఎస్సార్ సీపీ ధాటిని తట్టుకోలేక ఏకమైన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని తట్టుకోలేక అన్ని పార్టీలు ఏకమై పోటీకి దిగాయి.మంగళగిరి, వినుకొండ, నరసరావుపేట, మాచర్ల, చిలకలూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంలు ఒక్కోచోట ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుని వైఎస్సార్ సీపీని ఎదుర్కోవాలని చూస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉండటంతో ప్రత్యర్థుల ఎత్తులు పారే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నేడే మున్సిపోల్స్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మూడు మున్సిపాలిటీలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు జరిగే పోలింగ్తో అభ్యర్థుల భవితవ్యం నిర్ణయమై పోతుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడగా, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించుకునేందుకు శనివారం పడరాని పాట్లు పడ్డారు. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలలో 3,91,886 మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల ద్వారా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనుండగా.. మొత్తం 397 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 126 సమస్యాత్మక, 119 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు.ఈ కేంద్రాలలో పోలింగ్పై ప్రత్యేక నిఘా, బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,183 మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది శనివారం సాయంత్రమే పోలింగు కేంద్రాలకు చేరుకున్నారు. జోరుగా సాగిన ప్రచారం పన్నెండు రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం సాగింది. అఖరిరోజు అన్ని పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరులలో ఆయా పార్టీల సీనియర్లు, ప్రముఖులు మకాం వేసి మెజార్టీ సభ్యుల గెలుపే లక్ష్యంగా మంత్రాంగం నిర్వహించారు. కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలకు మొత్తం 1,056 మంది వివిధ పార్టీల లనుంచి బరిలో నిలి చారు. నిజామాబాద్లో 50 డివిజన్లకు 414 మంది పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో 33 వార్డులకు 184 మంది,ఆర్మూరులో 23 వార్డులకు 141 మంది, బోధన్లో 35 వార్డులకు 317 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడ ం కోసం నేతలు భారీగా ప్రచారం చేసినప్పటికీ గెలుపు ఓటములపై ఖచ్చితమైన అంచనాలకు రాలేకపోతున్నారు. బయటకు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకమే ‘మున్సిపల్’ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు మహ్మద్ షబ్బీర్అలీ, పి.సుదర్శన్రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డి తదితర సీని యర్ నేతలు ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ నుంచి నిజామాబాద్లో ఆ పార్టీ అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, కామారెడ్డిలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఆర్మూర్లో పార్టీ ఇన్చార్జి ఎ.జీవన్రెడ్డి, అన్ని మున్సిపాలిటీలలో తెలంగాణ జాగృ తి అధ్యక్షురాలు కె.కవితప్రచారం చేశారు. వైఎస్ఆర్ సీపీ ఎన్నికల పరిశీలకులు నాయుడు ప్రకాశ్, జిల్లా నాయకులు అంతిరెడ్డి శ్రీధర్రెడ్డి, సింగిరెడ్డి రవీందర్ రెడ్డితోపాటు పలువురు నాయకులు కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర్రావు, ఏలేటి అన్నపూర్ణమ్మ, జిల్లా అధ్యక్షుడు వీజీ గౌడ్ తదిరులు ప్రచారం చేశారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ కార్పొరేషన్ ప్రచార బాధ్యతలను మీదేసుకున్నారు. -
మున్సి‘పోల్’కు సిద్ధం
ఎనిమిది పురపాలక సంఘాల్లో నేడు పోలింగ్ సాక్షి, కర్నూలు: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని నంద్యాల, ఆదోని, డోన్, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలతో పాటు ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, గూడూరు నగర పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల విధుల్లో 3,061 మంది సిబ్బంది పాల్పంచుకోనున్నారు. మొత్తం నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల పరిధిలో 5,20,703 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 486 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు 609 మంది పోలింగ్ అధికారులు, మరో 609 మంది సహాయ పోలింగ్ అధికారులు.. 1843 మంది సిబ్బందిని నియమించారు. వీరితో పాటు ఎక్కడికక్కడ పట్టణ పరిధిని బట్టి జోనల్ అధికారులు, రూట్ అధికారులను ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజున 486 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) వినియోగిస్తుండగా.. మరో 154 యంత్రాలను రిజర్వులో ఉంచారు. ఇప్పటికే వీటిని పోలింగ్ కేంద్రాలకు చేరవేయగా శనివారం రోజున సిబ్బందికి శిక్షణనిచ్చారు. ఎన్నికల సంఘం ఈసీఐఎల్ నుంచి నిపుణులైన ఇంజనీర్లు ఎనిమిది మందిని జిల్లాకు కేటాయించింది. వీరు కేటాయించిన పట్టణాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 229 వెబ్ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ నిఘా బృందాలతో పాటు 90 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. నాలుగు పట్టణాల్లో 195 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.. 229 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. వీటన్నింటిపైనా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియనంతటినీ వీడియో కవరేజీ చేయనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 5 గంటల్లోపు క్యూలో ఉన్న ఓటర్లకు ఎంత ఆలస్యమైనా ఓటింగ్కు అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి ఎన్నికలు కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. -
‘పుర’ పోలింగ్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ప్రధాన ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఆరు బల్దియాల్లో 189 వార్డులు ఉండగా, ఆదిలాబాద్లోని 34వ వార్డు, భైంసాలో మూడో వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 187 వార్డులకు ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరు పట్టణాల్లో 3.57 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 325 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యవేక్షక అధికారులతో పాటు, ప్రత్యేక అధికారులను నియమించారు. ఎన్నికల సిబ్బంది శనివారం సాయంత్రానికే ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలించింది. 1,095 అభ్యర్థుల్లో అదృష్టవంతులెవరో.. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం 2010 సెప్టెంబర్లో ముగిసింది. సుమారు నాలుగేళ్లుగా బల్దియాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఎట్టకేలకు ఈనెల 3న మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 10 నుంచి 14 వరకు నామినేషన్లు స్వీకరించారు. ప్రధాన, ప్రధానేతర పార్టీలతోపాటు, స్వతంత్రులు కౌన్సిలర్ పదవులకు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఈనెల 15న నామినేషన్ల పరిశీలన పూర్తవగా, చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈనెల 18న బరిలో ఉండే 1095 అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ అభ్యర్థులు పది రోజులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్రారంభంలో హంగు, ఆర్భాటం లేకుండా సాగిన ప్రచారం, చివరిరోజు శుక్రవారం మాత్రం హోరెత్తింది. శనివారం అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. డబ్బు, మద్యం పంపకాలతో ఓటర్లను ప్రలోభపెట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎన్నికల సంఘంతోపాటు, పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రచారం నిర్వహించాయి. భారీ బందోబస్తు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. పోలింగ్ జరుగుతున్న ఆరు మున్సిపాలిటీల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. భైంసా, నిర్మల్ మున్సిపాలిటీల్లో 43 అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలు మోహరించాయి. ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్ కంపెనీలను దించారు. ఆరు మున్సిపాలిటీల్లో 326 పోలింగ్ కేంద్రాలుండగా, 136 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా పోలీసు శాఖ గుర్తించింది. 165 సమస్యాత్మక కేంద్రాలుగా భావిస్తోంది. జిల్లా ఎస్పీ గజరావు భూపాల్తోపాటు, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 70 ఏఎస్సైలు ఎన్నికల బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. జిల్లా పోలీసు సిబ్బంది.. 220 హెడ్కానిస్టేబుళ్లు, 1,200 మంది కానిస్టేబుళ్లు, 80 మంది హోంగార్డులు, 40 మంది మహిళా కానిస్టేబుళ్లు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. ఏపీఎస్పీ నాలుగు కంపెనీలు, ఒక సీఆర్పీఎఫ్ కంపెనీల బలగాలను పట్టణాల్లో మోహరించారు. -
‘పుర’పోరుకుసర్వం సిద్ధం
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ 532 పోలింగ్ స్టేషన్లు... 608 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మునిసిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 5,72,115 మంది అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 128 2,089 మందితో భారీ పోలీస్ బందోబస్తు సాక్షి ప్రతినిధి, ఏలూరు : మునిసిపల్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించేందుకు ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, పాల కొల్లు, నరసాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో అధికారులు విసృ్తత ఏర్పాట్లు చేశారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లు, మిగిలిన పట్టణాల్లో 291 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. మొ త్తంగా 291 స్థానాల్లో 946 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 143 మంది మహిళా అభ్యర్థులు. 5,72,115 మంది ఓటర్లు ఏలూరు నగరపాలక సంస్థ, 8 పట్టణాల్లో మొత్తంగా 5,72,115మంది ఓటర్లు ఉన్నారు. ఏలూరులో 1,39,363 మంది, పాలకొల్లులో 44,518 మంది, భీమవరంలో 1,02,725, నిడదవోలులో 32,303 మంది, తణుకులో 72,462 మంది, కొవ్వూరులో 28,739 మంది, తాడేపల్లిగూడెంలో 72,251 మంది, నరసాపురంలో 42,566, జంగారెడ్డిగూడెంలో 37,188 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉం ది. వీటిలో 585 పోస్టల్ బ్యాలెట్లు, 112 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తంగా 539 పోలింగ్ కేంద్రాలు నెలకొల్పారు. 608 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేశారు. జిల్లాలో 135 సమస్యాత్మకమైనవికాగా, 128 ఘర్షణలు జరగడానికి అవకాశం ఉండే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వెబ్ కెమెరాల ఏర్పాటు పోలింగ్ జరిగే ప్రాంతాలను 38 జోన్లు, 56 రూట్లుగా విభజించా రు. పోలింగ్ కేంద్రాలతోపాటు ఇతర చోట్ల 197 వెబ్ కెమెరాలను అమర్చారు. ఏ పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుందనేది ఈ వెబ్కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు వీక్షించే ఏర్పాట్లు చేశారు. 34 మంది వీడియోగ్రాఫర్లను సిద్ధం చేశారు. పోలింగ్ను పర్యవేక్షించేందుకు 121 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. 595మంది పోలింగ్ అధికారులు, మరో 595 మంది సహాయ పోలింగ్ అధికారులు, 1,785 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 19 షాడో బృందాలను రంగంలోకి దింపారు. 2,089 మందితో బందోబస్తు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరిగే 9 పట్టణాల్లో 2,089 మంది సిబ్బందిని నియమించారు. 10 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 94 మంది ఎస్సైలు, 96 మంది ఏఎస్సైలు, 109 మంది హెడ్కానిస్టేబుళ్లు, 1,230 మంది కానిస్టేబుళ్లు, 493 మంది హోంగార్డులు, 32మంది ఆర్మ్డ్ రిజర్వు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. ఓటరు స్లిప్ల పంపిణీ.. ఈసారి ఓటరు స్లిప్పులను అధికార యంత్రాంగమే పంపిణీ చేయాలని నిర్ణయించి కొంతమేరకు చేయగలిగింది. కొన్నిచోట్ల రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుని స్లిప్పులను పంపిణీ చేశాయి. వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే పోటీ మునిసిపాలిటీల్లో ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో నామమాత్రంగా ఉంది. వామపక్షాలు అక్కడక్కడా బరిలో ఉండగా, టీడీపీ పొత్తుతో బీజేపీ కొన్నిచోట్ల పోటీకి దిగింది. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు చాలామంది రంగంలో ఉన్నా రు. పోటీ మాత్రం వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్యే ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్ల విసృ్తతంగా ప్రచారం చేసింది. ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్ల రూపంలో మలచుకునేందుకు ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ ప్రచారంతోపాటు రకరకాల ఊహాగానాలు, దుష్ర్పచారాలకు తెరలేపి ఓటర్లను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేసింది. అయినా జనంలో వైఎస్సార్ సీపీకి ఆదరణ కన్పిస్తోంది. -
అభ్యర్థుల సమక్షంలో మాక్పోల్ నిర్వహించాలి
సదాశివపేట, న్యూస్లైన్:మున్సిపల్ పోలింగ్కు గంట ముందుగా పోలింగ్ కేంద్రంలో అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో మాక్పోల్ నిర్వహించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై అనుమానాలను నివృత్తి చేయాలని ఎన్నికల కమిటీ రాష్ట్ర పరిశీలకుడు హరిప్రీత్సింగ్ ఎన్నికల అధికారులకు సూచించారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలతో పాటు ఎన్నికల సామగ్రిని అందజేశారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చిన హరిప్రీత్సింగ్ ఎన్నికల సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓటుహక్కు కలిగినవారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించాలన్నారు. దొంగ ఓట్లు పడకుండా ఎన్నికల సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలనీ, రెండు శాతం టెండర్ ఓట్లు పోలైతే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయానికి సమాచారం అందిస్తే ఆ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లు, అభ్యర్థులు కాకుండా ఇతర ప్రజాప్రతినిధులు ప్రవేశించి ఇబ్బంది పెడితే ఎన్నికల నిబంధనల ప్రకారం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. పోలింగ్ సిబ్బంది నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని, ఇతరులకు అనుకూలంగా వ్యవహరించిన పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్నాయుడు, ఎన్నికల అధికారి లింబాద్రిలతో ప్రత్యేకంగా సమావేశమై పట్టణంలో ఎన్నికల నిర్వహణ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో 28 పోలింగ్ కేంద్రాల్లో 17 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్నాయుడు హరిప్రిత్సింగ్కు వివరించారు. అనంతరం జేసీ శరత్ పోలింగ్ ఏర్పాట్లు పరిశీలించి, ఎన్నికల సిబ్బందికి సలహాలు సూచనలు చేశారు. -
పోలింగ్ శాతం పెంచుతాం
సాక్షి, రాజమండ్రి : ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే కాక, పోలింగ్ శాతాన్ని కూడా గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాజమండ్రి లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గంధం చంద్రుడు తెలిపారు. సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై ఆయన రాజమండ్రి ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో 72 శాతం పోలింగ్ నమోదైందని, దానిని 85 శాతానికి పెంచే దిశగా ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. స్టిమేటిక్ ఓటర్ ఎన్రోల్మెంట్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్(స్వీప్) అనే కార్యక్రమం చేపట్టి యువత, మహిళలు, ఉద్యోగులను భాగస్వాములను చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఏర్పాట్లు ఇలా.. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాలు, అనపర్తి, రాజానగరం నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోకి వస్తాయి. వీటి పరిధిలో 2014 లెక్కల ప్రకారం 13.70 లక్షల ఓటర్లున్నారు. ప్రస్తుతానికి 1,424 పోలింగ్ కేంద్రాలుండగా, కొత్తగా 77 ప్రతిపాదించారు. ఎన్నికల లోగా కొత్త కేంద్రాలకు అనుమతులు వస్తాయి. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 372 వివిధ బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో స్టేటిక్ సర్వేలెన్స్ బృందాలు 111, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిశీలక బృందాలు 79, అభ్యర్థుల ఖర్చు సహాయ పరిశీలకులు 7, అకౌంటింగ్ బృందాలు 10, ఫ్లయింగ్ స్క్వాడ్లు 124, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 24, వీడియో వీక్షక బృందాలు 17 ఉంటాయి. ఇవికాకుండా చెక్పోస్టులు 24 పనిచేస్తాయి. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకరు వంతున ఏడుగురు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షిస్తారు. వీరి పరిధిలో సహాయ రిటర్నింగ్ అధికారులు 20 మంది, సెక్టోరల్ అధికారులు 121 మంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తారు. పార్లమెంట్ నియోజక వర్గ కేంద్రంలో అదనంగా ఒకటి, ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకొక్కటి వంతున ఏడు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఉంటాయి. సాధారణ ఎన్నికల పరిశీలకులు పూర్తి ఎన్నికల తతంగాన్ని పరిశీలిస్తారు. ఆయన పరిధిలో అభ్యర్థుల ఖర్చు పరిశీలకులు, పోలీసు శాఖకు చెందిన భద్రత వ్యవహారాల పరిశీలకులు విధులు నిర్వర్తిస్తారు. ఈవీఎంలు సిద్ధం జిల్లాలో మొత్తం 8,900 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తొలి విడత ఎన్నికల అనంతరం రాజమండ్రికి కావాల్సిన సుమారు 1505 తో పాటు మరిన్ని ఈవీఎంలు రప్పిస్తారు. మొత్తం 1500కు పైగా పోలింగ్ కేంద్రాల్లో గతేడాది 800కు పైగా పీఎస్ల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు గుర్తించామని ఆర్ఓ తెలిపారు. వాటి పరిధిలో భద్రత మరింత కట్టుదిట్టం చేస్తున్నట్టు చెప్పారు. ధన ప్రవాహానికి అడ్డుకట్ట గ్రామ స్థాయిలో విలేజ్ లెవల్ అవేర్నెస్ బృందాలు, వార్డు స్థాయిలో వార్డు లెవల్ అవేర్నెస్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఇద్దరు మహిళలతో పాటు రాజకీయేతర స్వచ్ఛంద సేవా దృక్పథం కలిగిన 8 నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. వీరు గ్రామాల్లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై నిఘా ఉంచుతారు. ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు దోహదపడతారని ఆర్ఓ వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎవరైనా తగిన లెక్కలు చూపి, రూ. 2.5 లక్షల వరకు నగదు తీసుకువెళ్లవచ్చని స్పష్టం చేశారు. షెడ్యూల్ ఇలా.. ఏప్రిల్ 12న ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తారు. 19న నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు. 21న నామినేషన్ల పరిశీలన అనంతరం 23న ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. మే 7న పోలింగ్, 16న కౌంటింగ్ జరుగుతుంది. అభ్యర్థుల ఖర్చు పరిధిని అసెంబ్లీకి రూ.40 లక్షలు, పార్లమెంట్కు రూ.70 లక్షలకు పెంచినట్టు ఆర్ఓ వివరించారు. -
ఈవీ‘ఏం చేస్తాయో’!
సాక్షి, సంగారెడ్డి: నచ్చిన అభ్యర్థికి ఓటేయడమే కాదు..బరిలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ‘నోటా’ మీటను నొక్కి అందరినీ తిరస్కరించే హక్కు ఈ సారి ఓటర్లకు సంక్రమించనుంది. ఇదొక్కటే కాదు..తమ ఓటు సరిగ్గా నమోదైందా లేదా తెలుసుకునేలా ప్రతి ఓటరు చేతికీ ఓ రసీదు సైతం అందనుంది. నోటా(నన్ ఆఫ్ దీ ఎబవ్), వీవీ పాట్(ఓటర్ వెరిఫైయబుల్ ప్రింట్ ఆడిట్ ట్రయల్) పేర్లతో ఈ సార్వత్రిక ఎన్నికల ద్వారా ఓటర్లకు పరిచయమవుతున్న ఈ రెండు కొత్త వెసుబాట్లపై ఎంత మంది అవగాహన కలిగి ఉంటారు?... ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టడం కష్టమే. ఎందుకంటే..ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఈవీఎం) బ్యాలెట్ యూనిట్పై ఉండే ఏదో ఒక మీటను నొక్కి నచ్చిన అభ్యర్థికి ఓటేయడమే ఇప్పటి వరకు ఓటర్లకు తెలుసు. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలతో తొలిసారిగా అమలవుతున్న తిరస్కరణ ఓటు, ఓటు రసీదుపై ఓటర్లకు విస్తృతంగా ప్రచారం కల్పించడానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామ, మండల స్థాయి సంగతి ఏమో కానీ..కనీసం జిల్లా కేంద్రంలో సైతం ఓటర్లకు అవగాహన కల్పించిన దాఖలాల్లేవు. ప్రధానంగా పల్లె ఓటర్లకు అవగాహన కల్పించకపోతే పోలింగ్ రోజు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఓటు రసీదు..ఇస్తారో లేదో.. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,407 పోలింగ్ బూత్లుంటే..6,700 బ్యాలెట్ యూనిట్లు, 6,500 కంట్రోల్ యూనిట్లను కేటాయించారు. ఇప్పటివరకు 5,500 బ్యాలెట్ యూనిట్లు, 5,500 కంట్రోల్ యూనిట్లు జిల్లాకు చేరాయి. ప్రతి ఈవీఎంలో బ్యాలెట్, కంట్రో ల్ యూనిట్ల పేరుతో రెండు విడి భాగాలుంటాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన ఈ సరికొత్త ఈవీఎంల పనితీరును బీహెచ్ఈఎల్ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ నిపుణులు గత రెండు వారాలుగా పరిశీలించి చూస్తున్నారు. వీటిపై ఉండే ‘నోటా’ మీటను నొక్కి అభ్యర్థులందరినీ తిరస్కరించే వెసులుబాటు ఓటర్లకు ఈ కొత్త యంత్రాలు కల్పించనున్నాయి. అదే విధంగా ఓటేసిన తర్వాత చేతికి రసీదును సైతం అందించాల్సి ఉంటుంది. ఏ అభ్యర్థికి ఓటేశారో ఈ రసీదులో ఉండనుంది. జిల్లా ఓటర్లకు మాత్రం ఈ ఎన్నికల్లో ‘వీవీ పాట్’ను పరిచయం చేయడం లేదని..దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం జిల్లాకు చేరలేదని ఓ అధికారి తెలిపారు. ‘మాక్’ తెల్వదే ! ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై గతంలో పలు రాజకీయ పక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈవీఎంలను టాంపర్ చేసి ఫలితాలను తారుమారు చేయవచ్చని నిపుణులు రుజువు చేసి చూపించారు కూడా. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో వినియోగించనున్న ఈవీఎంల పనితీరుపై అఖిలపక్ష పార్టీలకు అవగాహన కల్పించడానికి ఎన్నికల యంత్రాంగం మాక్ పోలింగ్ నిర్వహించి అంతా సరిగ్గానే ఉందని చూపించాల్సి ఉంటుంది. ఈ మాక్ పోలింగ్ తతంగం ఎప్పుడో పూర్తైదని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో), ఈవీఎంల నోడల్ అధికారి దయానంద్ ‘సాక్షి’కి తెలిపారు. అఖిలపక్ష పార్టీల నేతలను సైతం ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నప్పటికీ.. ఈ విషయాన్ని అఖిల పక్ష పార్టీలన్నీ ఖండిస్తున్నాయి. మాక్పోలింగ్ జరిపినట్లు తమకు సమాచారమే లేదని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల జిల్లా అధ్యక్షులు ఆర్. సత్యనారాయణ, కాసాల బుచ్చిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఈవీఎంలో అభ్యర్థుల వివరాల నమోదు ప్రారంభం
న్యూస్లైన్, మంచిర్యాల టౌన్, పురపాలక ఎన్నికలకు సంబంధించి ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లు మంచిర్యాలకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రం నుంచి సోమవారం రాత్రి మంచిర్యాలకు రాగా స్థానిక కాలేజ్రోడ్లోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భధ్రపరిచారు. మంగళవారం నుంచి పట్టణంలోని 32 వార్డులకు.. 66 పోలింగ్ కేంద్రాలు ఉండగా 66 ఈవీఎంలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఒక్కో వార్డుకు సంబంధించి వార్డు నంబర్, బూత్ నంబర్, వార్డులో ఒక కౌన్సిలర్ స్థానం, స్థానానికి పోటీ అభ్యర్థుల సంఖ్య తదితర వివరాలను ఈవీఎంలలో నమోదు చేస్తున్నారు. ఉప జిల్లా ఎన్నికల అధికారి, మంచిర్యాల ఆర్డీవో జి.చక్రధర్రావు, సహాయ ఎన్నికల అధికారి, తహశీల్దార్ అశోకచక్రవర్తి, ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ తేజావత్ వెంకన్న ఆధ్వర్యంలో ఈవీఎంలలో బ్యాలెట్ వివరాల నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. వివరాలను నమోదు చేసిన అనంతరం ఈవీఎం మాస్టర్ ట్రైనర్స్ చంద్రన్కుమార్, సీహెచ్ ప్రభాకర్ ఈవీఎంలలో నమోదు చేసిన వివరాలను పరిశీలించి లాక్ చేస్తున్నారు. మంగళవారం సాయంత్ర వరకు 15 వార్డులకు సంబంధించి పోటీ అభ్యర్థులు, గుర్తులు తదితర వివరాలను నమోదు చేశారు. -
ఈవీఎంలు వచ్చేశాయ్
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు ఆదివారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చాయి. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి 3 వేల కంట్రోల్ యూనిట్లు జిల్లాకు చేరాయి. వీటిని కలెక్టరేట్ వెనుకవైపు ఉన్న సివిల్ సప్లయ్ గోదాములో భద్రపరిచారు. జిల్లాల్లో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాకు 7,200 కంట్రోల్ యూనిట్లు, 9,100 బ్యాలెట్ యూనిట్ రావాల్సి ఉంది. ఇప్పటివరకు 3000 కంట్రోల్ యూనిట్లు మాత్రమే వచ్చాయి. మిగిలినవన్నీ రెండు రోజుల్లో జిల్లాకు చేరనున్నాయి. ఈవీఎంలు రావడంతో కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్కు వెళ్లి పరిశీలించారు. ఈవీఎంలకు రక్షణగా ప్రత్యేక పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు అయింది. ఈవీఎంలు భద్రపరచిన గోదాముకు సీసీ కెమెరాలు, సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో వస్తాయని, ఆ తర్వాత ఫస్ట్ లెవల్ చెకింగ్ మొదలుపెడతామని కలెక్టర్ పేర్కొన్నారు. ఫస్ట్ లెవల్ చెకింగ్ ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వారంరోజులపాటు జరుగుతుందని, దీనిని వీడియో కూడా తీస్తామని పేర్కొన్నారు. ఈవీఎంలు భద్రపరిచే గోదాములో ఎటువంటి విద్యుత్ సౌకర్యం ఉండరాదని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో వేణుగోపాల్రెడ్డి, డీపీఓ శోభాస్వరూపరాని, కలెక్టర్ కార్యాలయ ఇ-సెక్షన్ సూపరింటెండెంట్ రమణరావు, ఎన్నికల సెల్ ఓఎస్డీ సంపత్కుమార్, ఎన్నికల సెల్ డీటీలు శివరాముడు, లక్ష్మీరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎం ప్రొడక్షన్స్ .... సరికొత్త చిత్రం!
ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు మన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా మార్చేశాయి. రిగ్గింగ్, బూత్ కబ్జాలకు దాదాపు మంగళం పాడేశాయి. ఈ సారి మొత్తం దేశంలో 17 లక్షల ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు ఉపయోగించబోతున్నారు. గత లోకసభ ఎన్నికల కంటే 12 శాతం ఎక్కువన్న మాట. ఈ ఈవీఎంలే లేకపోతే బ్యాలెట్ పేపర్ల ముద్రణకు దాదాపు 7700 మెట్రిక్ టన్నుల కాగితం ఖర్చయ్యేది. ఈ ఓటింగ్ యంత్రాల గురించి కొన్ని విశేషాలుః ఈవీఎంలు ఎప్పుడు తయారయ్యాయి? ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను మన దేశంలో మొట్టమొదటగా 1989-90 లో తయారు చేశారు. అనేక ప్రయోగాలు, పరీక్షల తరువాత వాటిని ప్రస్తుతం మనంచూస్తున్న రూపంలోకి తీసుకువచ్చారు. మొట్టమొదటగా ఈవీఎంలను తయారు చేసింది హైదరాబాద్ లోని ఈసీఐఎల్ లో. ఒక యంత్రం ఖరీదు దాదాపు 5500 రూపాయలు ఉంటుంది. అంటే కాగితం బ్యాలెట్లు, బాలెట్ బాక్సులకయ్యే ఖర్చు కన్నా చాలా తక్కువ అన్న మాట! తొలిసారి ఎప్పుడు ఉపయోగించారు? ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను మన దేశంలో మొట్టమొదటిసారి 1998లో ఉపయోగించారు. ఆ సంవత్సరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదహారు నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా వాడారు. ఆ తరువాత క్రమేపీ దేశమంతటా వాటిని విస్తరించారు. ఈ వీ ఎం లో ఎన్ని ఓట్లు రికార్డు చేయొచ్చు? ఒక ఈవీఎం 3840 ఓట్లను రికార్డు చేయగలుగుతుంది. మామూలుగా ఒక పోలింగ్ బూత్ లో పదిహేనువందల ఓట్లు ఉంటాయి. కాబట్టి ఒక బూత్ కి ఒక ఈవీఎం సరిపోతుంది. ఈవీఎం లో అత్యధికంగా ఎంతమంది అభ్యర్థుల ఓట్లు నమోదు చేయొచ్చు? ఒక ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల ఓట్లను హాయిగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా నమోదు చేయవచ్చు. అయితే చిన్నపాటి మార్పుల చేస్తే దాదాపు 64 మంది అభ్యర్థుల వోట్లను రికార్డు చేయడానికి వీలుంటుంది. 64 మంది అభ్యర్థులను దాటితే మాత్రం పాత పద్ధతిలో కాగితం బ్యాలెట్ పత్రాలను ఉపయోగించాల్సిందే. కరెంట్ లేకపోతే ఈవీఎంలు పనిచేస్తాయా? కరెంటు లేకపోయినా ఈవీఎంలు పనిచేస్తాయి. ఈవీఎంలు 6 వోల్టుల బ్యాటరీపై పనిచేస్తుంది. కాబట్టి కరెంటు పోయినా, అసలే కరెంటు లేకపోయినా అది హాయిగా పనిచేస్తుంది. అలాగే ఒక యంత్రం ఏదైనా కారణం వల్ల పనిచేయకపోతే, ఉపయోగించేందుకు అధికారుల వద్ద ఇంకొన్ని ఈవీఎంలు ఉంటాయి. వాటిని వాడవచ్చు. -
ఈవీఎంలు మళ్లీ వివాదాస్పదమౌతాయా?
ఈవీఎంల పనితీరు విషయంలో తొలినుంచీ ఎన్నో ప్రశ్నచిహ్నాలున్నాయి. ఈవీఎంలో ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని పలువురు వాదిస్తున్నారు. ఏ పార్టీకి ఓటు వేసినా ఒక పార్టీకే పడేలా చేయవచ్చునని కూడా వాదనలున్నాయి. 2009 లోకసభ ఎన్నికల సమయంలో ఈవీఎంల సామర్థ్యం విషయంలో చాలా వివాదాలు చెలరేగాయి. అయితే ఈ సారి ఎన్నికల్లోనూ ఈవీఎంల విషయంలో ఇలాంటి వివాదాలే తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. 2009 లో చెలరేగిన వివాదాల కారణంగా ఓటు వేసిన తరువాత ఓటరుకు తానే పార్టీకి లేదా అభ్యర్థికి ఓటేశారో తెలియచేసే ఒక రసీదు పత్రాన్ని ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ పత్రాన్ని వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ లేదా వీవీపీఏటీ అని అంటారు. అయితే ఈ సారి చాలా నియోజకవర్గాల్లో ఈ పత్రాన్ని ఇవ్వడం లేదు. దీనితో ఓడిపోయిన అభ్యర్థులు, పార్టీలు ఎన్నికలపై సవాళ్లు లేవనెత్తే అవకాశాలున్నాయి. వీవీపీఏటీ పత్రాన్ని ఇవ్వాలంటే ఈవీఎంను ఒక ప్రింటర్ కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని ఈవీఎంలకూ ఈ ప్రింటర్లను కనెక్ట్ చేయాలి. ఈ ప్రతిపాదనలను గతేడాది ఫిబ్రవరిలో ఆమోదించారు. ఇందుకు దాదాపు పధ్నాలుగు లక్షల ప్రింటర్లు అవసరం అవుతాయి. దీని కోసం 1860 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈ నిధిని ప్రభుత్వం విడుదల చేయలేదు. అలాగే చాలా చోట్ల ఎన్నికలు లేనప్పుడు ఈ ఈవీఎంలను ఆరుబయటే ఉంచడం జరుగుతుంది. మళ్లీ వాడేటప్పుడు ఆ యంత్రాల్లోని చిప్ లను మార్చినట్టయితే ఇతరులెవరూ యంత్రంలో మార్పులు చేయడానికి వీలుండదు. అయితే ఒక చిప్ కి వంద రూపాయలు ఖర్చవుతుంది. దీనికి కూడా నిధులు లేకపోవడంతో చిప్ ను మార్చడం లేదు. ఫలితంగా ఈవీఎంలను తమకు అనుకూలంగా పనిచేసేలా చేసుకోవడానికి అధికార పార్టీలు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఈవీఎంలలో ఫలితాలను తారుమారు చేయడానికి, మోసాలకు పాల్పడటానికి వీలుందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమీషన్ డీఆర్ డీఓ కి చెందిన ప్రొఫెసర్ ఎస్ సంపత్, ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ డా. ఇందిరేశన్, ఎలక్ట్రానిక్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ డైరెక్టర్ డా. సి రావ్ కాసరబాదాలతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈవీఎంలను గట్టిగా వెనకేసుకొచ్చింది. అయినప్పటికీ ఆరోపణలు ఆగడం లేదు. ఈ సారి వీవీపీఏటీ పత్రాలు ఇవ్వకపోతే ఆరోపణలు మరింత ఉధృతం అయ్యే ప్రమాదం ఉంది. -
ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
సంగారెడ్డి క్రైం, న్యూస్లైన్: ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తూ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాలకు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో మంగళవారం ఆమె కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఎస్పీ శెముషీ బాజ్పాయ్, జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్వో దయానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో 2407 పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను ఈనెల 16లోగా పూర్తి చేసి నివేదికను ఎలక్షన్ వెబ్సైట్లో నిక్షిప్తం చేయాలన్నారు. ఈ సారి ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ‘పైన పేర్కొన్న వారు ఎవరూ కాదు’ అనే ఆప్షన్ను పొందుపర్చిందని, ఈ ఆప్షన్ను ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద బ్యానర్ల ద్వారా ప్రదర్శించి ప్రచారం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రానికి రెండు కిలోమీటర్లు దూరం ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈనెల 16లోగా ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఏ విధమైన కారణం లేకుండా ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యయ పరిశీలకులు 40 మంది ఎన్నికల సంఘం నుంచి జిల్లాకు వచ్చే అవకాశం ఉందని, జిల్లాలోని విశ్రాంతి గృహాలన్నింటినీ సంబంధిత రిటర్నింగ్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంపై ఎన్నికల సంఘం లిఖిత పూర్వక నిబంధనలు జారీ చేసిందని, ఏ అధికారి కూడా తమ సొంత విధానాలతో ఎన్నికల ప్రక్రియ చేపట్టవద్దని సూచించారు. శాసన సభా నియోజకవర్గాల వారీగా జోన్ రూట్మ్యాప్లను, పోలింగ్ కేంద్రాల టెలిఫోన్ నంబర్ఏర్పాటు, సంబంధిత అధికారి వివరాలను, రిటర్నింగ్ అధికారి కార్యాలయం, అధికారి చాంబర్ వివరాలు, రిసెప్షన్ సెంటర్, పంపిణీ కేంద్రం, టెంపరరీ స్ట్రాంగ్ రూమ్ల వివరాలను ఈనెల 20లోగా తయారు చేసి సమర్పించాలన్నారు. ప్రతిపోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్పై ట్రయల్ రన్, వెబ్కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్ వీడియో గ్రఫీని ఈనెల 20లోగా తయారు చేసి సమర్పించాలని సూచించారు. ప్రతి శాసన సభా నియోజకవర్గం వారీగా ఈనెల 13లోగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలోని సమస్యాత్మక, సున్నిత, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోలింగ్ కేంద్రాలను గుర్తించి నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీ శెముషీ బాజ్పాయ్ సూచించారు. పోలీసులు, అధికారులు సమన్వయంతో సమస్యాత్మక, సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. జిల్లాలో ఆయుధాల లెసైన్సులు, కొత్త ఆయుధాలకు లెసైన్సులు రెన్యువల్ చేయవద్దని సూచించారు. -
మున్సిపల్ నామినేషన్లు ప్రక్రియ షురూ
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అయ్యింది. తొలివిడత 146 మున్సిపాలిటీలకు ఎన్నికలు ఎన్నికలు జరగనున్నాయి. 10 నగర పాలక సంస్థల్లోని వార్డులు, డివిజన్లకు పోటీ ఏర్పడింది. ప్రస్తుతం 146 మున్సిపాలిటీ ల్లోని 3,990 వార్డులకు, పది కార్పొరేషన్లలోని 513 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయి. గ్రామాల విలీనం సమస్యలు, కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని 13 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికల కమిషన్ త్వరలోనే ఎన్నికలు నిర్వహించనుంది. మొత్తం 95,35,824 మంది 9,015 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 11 వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) అందుబాటులో ఉండనున్నాయి. కాగా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ మార్చి 10: నామినేషన్ల స్వీకరణ మార్చి 13: నగర పాలక సంస్థల్లో నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 14: మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలుకు గడవు మార్చి 15: నామినేషన్ల పరిశీలన మార్చి 18: నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 30: పోలింగ్ ఏప్రిల్ 2: ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. -
సార్వత్రిక సమరం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక సమరం షురువైంది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రెండు రోజుల క్రితమే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు, నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. షెడ్యూల్ వెలువడటంతో టిక్కెట్లు ఆశి స్తున్న వారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 2న ఎన్నికల నోటిషికేషన్ విడుదల అవుతుండగా, ఫలితాలు మే 16న వెలువడనున్నాయి. ‘కోడ్’ అమలు జిల్లాలో పది అసెంబ్లీ, రెండు లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఆసిఫాబాద్(ఎస్టీ), బోథ్(ఎస్టీ), ఖానాపూర్(ఎస్టీ), సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ స్థానాలున్నాయి. పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గ పరిధిలో చెన్నూరు(ఎస్సీ), బెల్లంపల్లి (ఎస్సీ), మంచిర్యాల అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 19.18 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 9.60 లక్షల మంది పురుషులు కాగా, 9.57 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. నూతన ఓటర్ల నమోదుకు మార్చి 9 వరకు గడువు ఉంది. ఈసారి నూతనంగా ఓటర్లు నోటాను వినియోగించుకునే అవకాశం లభించింది. బరిలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో ఈ నోట మీట నొక్కేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. షెడ్యూల్ వెలువడిన వెంటనే జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కొన్ని నెల లుగా కసరత్తు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 15 పర్యవేక్షక కమిటీలను నియమించాలని నిర్ణయించింది. పోలింగ్కు అవసరమైన ఈవీఎం(ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ మిషన్లు)లను సిద్ధం చేశారు. ఇటీవలే ఈవీఎంలు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 2,256 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు వాటిని గుర్తించారు. తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. కాగా, నామినేషన్ల నుంచే అభ్యర్థుల ఖర్చు లెక్కలోకి వస్తుంది. భారీ బందోబస్తు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా పోలీసుశాఖ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు జిల్లా భద్రత ప్రణాళికను సిద్ధం చేసిన పోలీసు యంత్రాం గం జిల్లాలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, మత ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జైనథ్ మండలంలోని భోరజ్ వద్ద, సోన్, ఇందారం, లక్సెట్టిపేట గూడెం, వాంకిడి, తలమడుగు మండలంలోని తమల్కోట్, ఖానాపూర్ బాదన్కుర్తి, బాసరలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
30న మున్సిపల్ ఎన్నికలు
* 10వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ * ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ * ఏప్రిల్ 2వ తేదీన కౌంటింగ్.. ఫలితాలు * ఏప్రిల్ 7న పరోక్ష పద్ధతిలో మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక * ప్రస్తుతం 146 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలోనే ఎన్నికలు * 95,35,824 మంది ఓటర్లకు 9,015 పోలింగ్ కేంద్రాలు * ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ప్రకటించిన రమాకాంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల భేరి మోగింది. పోలింగ్, ఫలితాలు, పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక షెడ్యూల్తో పాటు రాష్ట్రస్థాయి నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో ఈనెల 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రిటర్నింగ్ అధికారులు మార్చి 10న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారని కమిషనర్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ రెండో తేదీన జరుగుతుందని, అదేరోజు ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఏప్రిల్ 7న చైర్పర్సన్లు, మేయర్లను ఎన్నుకుంటారని తెలిపారు. పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికకు ఈనెల 20వ తేదీన వేరుగా నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. ఏప్రిల్ ఏడో తేదీతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. కౌన్సిలర్లకు గరిష్టంగా లక్ష రూపాయలు, కార్పొరేటర్లకు గరిష్టంగా లక్షన్నర రూపాయల ఎన్నికల వ్యయ పరిమితిని నిర్ణయించినట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో డిపాజిట్ ఎస్సీ/ఎస్టీ/బీసీలకు రూ.1,250, ఇతరులకు రూ.2,500గా, కార్పొరేషన్లలో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5,000గా నిర్ణయించామన్నారు. 11 వేల ఈవీఎంల వినియోగం ప్రస్తుతం 146 మున్సిపాలిటీ ల్లోని 3,990 వార్డులకు, పది కార్పొరేషన్లలోని 513 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయని అన్నారు. గ్రామాల విలీనం సమస్యలు, కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని 13 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. మొత్తం 95,35,824 మంది 9,015 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. ఇందుకోసం 11 వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) వినియోగిస్తున్నామన్నారు. ఈవీఎంలలో ‘నోటా’ (నన్ ఆఫ్ ది అబౌవ్) ఆప్షన్ను పొందుపరిచేందు కోసం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. 49,583 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారని తెలిపారు. మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తాను పలుమార్లు సీఎంలకు వివరించానని రమాకాంత్రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని ఫిబ్రవరి 26వ తేదీన సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేని విధంగా సెలవు రోజున పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 7న వస్తుందని భావిస్తున్నామని, అప్పటికి ఈ ఎన్నికలు పూర్తవుతాయని, అవసరమైతే మేయర్, చైర్పర్సన్ల ఎన్నికలు ఒకటీ రెండురోజులు ముందుకు జరుపుతామని చెప్పారు. ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ కూడా విలేకరుల భేటీలో పాల్గొన్నారు. తక్షణం అమల్లోకి నియమావళి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ జారీతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని రమాకాంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రత్యేకంగా ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియమావళి అమలులో ఉంటుం దన్నారు. ఎన్నికలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారి బదిలీలు పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందు బదిలీలు చేసినా, అమలుకాని పక్షంలో వాటిని ఇప్పుడు అమలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తప్పనిసరిగా బదిలీలు చేయాలనుకుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి ప్రారంభోత్సవాలూ చేయడానికి వీల్లేదన్నారు. -
ఓటు డౌటు ‘క్లియర్’!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంలు) ద్వారా ఓటేసే విధానం వచ్చిన తర్వాత.. ఆ ఓటు ఎవరికి పడిందోననే అనుమానం మీలో ఏదో మూలన దాగుంది కదూ..! నిజంగా మీరు వేయాలనుకున్న వారికే ఓటు పడిందా..? ఎవరైనా ఆ మెషిన్ను టాంపరింగ్ చేశారా..? మీరు ఒకరికి వేస్తే మరొకరికి ఓటు పడి ఉంటుందా?... ఇలాంటి సందేహాలు గతంలో ఓటేసినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయా?.. ఇకపై అలాంటి సందేహాలు అక్కర్లేదు. వీటికి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల సంఘం చెక్ పెట్టనుంది. ఈవీఎంలపై నెలకొన్న సందేహాలను తీర్చడంతో పాటు ఎన్నికల సంస్కరణలలో భాగంగా ఈ సార్వత్రిక ఎన్నికలలో తొలిసారిగా ‘ఓట్ కన్ఫర్మేషన్’ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. అంటే మీరు వేసిన ఓటు ఎవరికి పడిందో వెంటనే తెలిసిపోతుందన్నమాట. అయితే, ఈ విధానాన్ని ఈసారి ఎన్నికలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, విజయవంతం అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఈసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టు కింద మన జిల్లా ఎంపికవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఓట్ను నిర్ధారించే విధంగా ఉండే ఈవీఎంల అందుబాటు, సిబ్బంది సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం పైలట్ ప్రాజెక్టును ఎక్కడెక్కడ అమలు చేయాలన్నది నిర్ణయిస్తుంది. ఒకవేళ మన జిల్లా ఎంపికయితే, కనీసం ఒకటి, రెండు నియోజకవర్గాలలోనయినా ఈ ఓట్ కన్ఫర్మేషన్ విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఓటు ‘కన్ఫర్మ్’ అవుతుంది ఇలా.. ఎన్నికల సంఘం వర్గాల ప్రకారం... పోలింగ్ బూత్లోకి వెళ్లిన తర్వాత ముందుగా గతంలో ఓటేసిన విధంగానే ఈవీఎంలో ఓటేయాలి. ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలని ఎన్నికల సిబ్బందికి చెపితే వారు మీ ఓటు కన్ఫర్మ్ చేస్తారు. మీరు ఓటేసిన ఈవీఎం దగ్గరే మీరు మరో రెండు సెకన్లు నిలుచుంటే మీకు అదే ఈవీఎంలో మీరు ఏ గుర్తుకు ఓటేశారనేది డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మీ ఓటును నిర్ధారిస్తూ ఓ స్లిప్ బయటకు వస్తుంది. కానీ ఆ స్లిప్ను మీ చేతికి ఇవ్వరు. మీకు చూపించరు. ఆ స్లిప్ వేరే బాక్సులోనికి వెళ్లిపోతుంది. ఆ స్లిప్లో మీరు వేసిన ఓటు ఎవరికి పడిందో స్పష్టంగా ఉంటుంది. కానీ మీ ఓటరు నెంబరు, మీ వివరాలు ఏమీ ఉండవు. మీరు ఎవరికి ఓటేసింది బయటి వారికి కానీ, ఎన్నికల సిబ్బందికి కానీ తెలిసే అవకాశం ఉండదు. అయితే, మీ ఓటు ఎవరికి పడిందో చాలెంజ్ చేసి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఎన్నికల సిబ్బంది ఆ స్లిప్ను తీసి మీకు చూపిస్తారు. -
కలెక్టరేట్లో ఈవీఎం వేర్హౌస్
విశాఖ రూరల్, న్యూస్లైన్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)ను భద్రపర్చడానికి కలెక్టరేట్లో గొడౌన్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.1.15 కోట్లను మంజూరు చేసింది. వాస్తవానికి కలెక్టరేట్లో ఈవీఎం వేర్హౌస్ నిర్మాణానికి 2012, జూలై 19న ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికి రూ.99 లక్షలు ఖర్చవుతుందని ప్రతిపాదనలు రూపొందించగా ఇందులో రూ.49.5 లక్షలను అదే ఏడాది ఆగస్టు 31న విడుదల చేసింది. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను ఆర్అండ్బీకి అప్పగించింది. ఆ ప్రాజెక్టును రూపకల్పన చేసిన ఆర్అండ్బీ అధికారులు నిర్మాణ ఖర్చు రూ.1.15 కోట్లు అవుతుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ ఏడాది ఆగస్టు 13న ప్రభుత్వానికి సమర్పించారు. తొలి దశలో విడుదల చేసిన రూ.49.5 లక్షలను ఖర్చు చేయలేదని విన్నవించారు. కలెక్టర్ పంపించిన సవరణ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఆ మేరకు రూ.1.15 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీఎంలను పెట్టడానికి జిల్లాలో ఇప్పటి వర కు సరైన స్థలం లే దు. ప్రతిసారి కళాశాలలు, ఆడిటోరియాల్లో భద్రపరుస్తూ వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈవీఎంలు మరమ్మత్తులకు గరవుతున్నాయి. కలెక్టరేట్లో శాశ్వత గిడ్డంగుల నిర్మాణంతో సమస్య తీరనుంది. -
రేపే ఢిల్లీ ఫలితాలు
ఓట్ల లెక్కింపునకు 14 కేంద్రాలు సిద్ధం సాక్షి, న్యూఢిల్లీ: హోరాహోరి ప్రచారం, రికార్డుస్థాయి పోలిం గ్ తదితర ప్రక్రియల తర్వాత అత్యంత కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఈ లెక్కింపు తర్వాతే గెలిచిందెవరో? ఓడిందెవరో? తేలిపోనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 8వ తేదీ, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న 70 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం నగరంలోని 9 జిల్లాల్లో 14 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. పదకొండు వేలకుపైగా పోలింగ్ కేంద్రాల నుంచి తీసుకొచ్చిన ఈవీఎంలను ఈ 14 కేంద్రాలకు తరలించి, ఓట్ల లెక్కింపును చేపడతారు. తూర్పు ఢిల్లీ, మధ్య ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ జిల్లాలో రెండేసి చొప్పున... దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, న్యూఢిల్లీ, నైరుతి ఢిల్లీ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో లెక్కించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఇప్పటికే అక్కడి నియోజకవర్గాల వారీగా భద్రపరిచి గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా ఉండడం కోసం వాటిని రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలోనే స్ట్రాంగ్రూములలో ఉంచి సీల్వేశారు. ఓట్ల లెక్కింపు కోసం ఆదివారం ఉదయం వాటిని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే తెరుస్తారు. స్థల లభ్యత, భద్రతా అవసరాల ఆధారంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎంపిక చేసి ఆయా ఓట్ల లెక్కింపు కేంద్రాలను, వాటిలోఎన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును జరపాలన్నది ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. యమునా విహార్లోని రాజకీయ ప్రతిభా విద్యాలయ్లో రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగనుండగా, ద్వారకాలోని ఎన్ఎస్ఐటీ వంటి వాటిలో ఎనిమిది నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలను అమర్చడంతో పాటు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత కోసం రెండు వలయాల భద్రతను ఏర్పాటు చేశారు. లోపలి వలయంలో పారా మిలటరీ బలగాలను, బయటి వలయంలో హోం గార్డులను మోహరించారు. శనివారం మరిం త మందిని మోహరించి వెలుపలి వల యాన్ని పటిష్ట పరుస్తారు. ఓటింగ్ యంత్రాలను భద్రపరిచిన కేంద్రాల బయట రాజకీయ పార్టీలు కూడా తమ ప్రతినిధులను నియమించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతించింది. -
ఇంకా సేథీ గీతలే ఎన్నికల చిహ్నాలు
సాక్షి, న్యూఢిల్లీ: చీపురు, కారు, ఫ్యాను, సైకిల్, టెలివిజన్ ... దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కనిపించేవి ఈ 100 చిహ్నాలే. టై, నెయిల్ కట్టర్ వంటి కొన్ని వస్తువులు మినహా మిగతా చిహ్నాలన్నీ సామాన్యుడు సులువుగా గుర్తుపట్టగలిగినవే. ఓటింగ్ రోజున అభ్యర్థుల పేర్ల కంటే వారి పేర్ల పక్కనున్న ఎన్నికల చిహ్నాలే బటన్ నొక్కడంలో ఓటరుకు ఎక్కువగా తోడ్పడుతాయి. నిరక్షరాస్య ఓటర్లు ఎక్కువగా ఉన్న మనదేశంలో అభ్యర్థుల పేర్లకంటే వారి చిహ్నాలే ప్రచారంతో పాటు, ఓటింగ్లోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణలో అనేక మార్పులు తెచ్చిన ఎన్నికల కమిషన్ చిహ్నాల విషయంలో మాత్రం మార్పుల జోలికి వెళ్లడం లేదు. తమ డ్రాఫ్ట్స్మేన్ ఎంఎస్ సేథీ గీసిన చిహ్నాలనే ఎన్నికల కమిషన్ ఇంకా వాడుతోంది. 1992 సెప్టెంబర్లో ఉద్యోగ విరమణ చేసిన సేథీ మరణించి చాలా కాలమవుతున్నా ఎన్నికల చిహ్నాల్లో మాత్రం మార్పు రాలేదు. సామాన్యుడు సులువుగా గుర్తించడం కోసం అతను నిత్య జీవితంలో వాడే వస్తువులనే ఎన్నికల చిహ్నాల జాబితాలో చేర్చారు. అప్పట్లో ఎన్నికల అధికారులు సూచించిన చిహ్నాలను సేథీ హెచ్బీ పెన్సిళ్ల సహాయంతో గీశారు. సేథీ పదవీ విరమణ చేసిన పదేళ్ల తరువాత ఎన్నికల కమిషన్ ఆయన గీసిన 100 చిహ్నాలతో జాబితా రూపొందించింది. వీటినే ఇప్పుడు ఫ్రీ సింబల్స్గా పేర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ వద్దనున్న చిహ్నాల జాబితాలో ఆరు చిహ్నాలను మాత్రం జాతీయ పార్టీల కోసం కేటాయించారు. రాష్ట్ర స్థాయి పార్టీల కోసం కేటాయించిన చిహ్నాలు రాష్ట్రం వరకు మాత్రమే ఆ పార్టీకి వర్తిస్తాయి. ఒక రాజకీయ పార్టీకి ఒక చిహ్నం కేటాయించాలంటే ఆ పార్టీ పది నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉంటుంది. -
ఓటింగ్లో పారదర్శకతకు చర్యలు
కడప కలెక్టరేట్, న్యూస్లైన్ : భారత ఎన్నికల సంఘం ఓటింగ్ విధానంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఇందువల్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో కొన్ని మార్పులు సంభవించనున్నాయి. ఓటర్ వెరిఫైర్ పేపర్ ఆడిట్ ట్రైయిల్ (వీవీపీఏటీ) సిస్టమ్ ఇందులో ఒకటి. బ్యాలెట్ పేపర్ల పద్దతి అమలులో ఉన్నప్పుడు తాను అనుకున్న అభ్యర్థికే ఓటు వేశామనే విషయం ఓటరుకు ఇట్టే తెలిసేది. కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చాక తాను వేసిన ఓటు అనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అన్నది ఓటరుకు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అంటే ఈవీఎం విధానంలో పారదర్శకత లోపించింది. ఈవీఎంల ద్వారా గోల్మాల్కు అవకాశాలున్నాయని వివిధ రాజకీయ పార్టీలు చాలాకాలంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరిప్రసాద్ అనే సామాజిక కార్యకర్త డెమో ద్వారా ఈ విషయాన్ని రుజువు చేశారు. ఇది అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈసీఐ రాజకీయ పక్షాలతో చర్చలు నిర్వహించింది. ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్ అమర్చాలని పలు పార్టీలు సూచించాయి. ఆ తర్వాత ఆ విషయం కొంతకాలం మరుగున పడింది. వివాదాలకు ఆస్కారం లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఓటర్ వెరిఫైర్ పేపర్ ఆడిట్ ట్రైయిల్ పద్దతిని అమలు చేయాలంటూ అక్టోబర్ 8వ తేదీన సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఫేజ్డ్ మ్యానర్లో ఈవీఎంలకు వివిపిఏటి పద్దతిని అనుసంధానించాలని పేర్కొంది. 2014లో జరుగనున్న సాధారణ ఎన్నికల నాటికి ఈ పద్దతి అమలులోకి రావాలని స్పష్టంచేసింది. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది. దీంతో ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఓటింగ్ విధానంలో మార్పులకు చర్యలు చేపట్టింది. వివిపిఏటి పద్దతి వల్ల తాను వేసిన ఓటు అనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అన్న విషయం ఓటరు తెలుసుకోవడానికి వీలుగా ఒక ప్రింట్ అవుట్ బయటకు వస్తుంది. ఈ పద్దతిని అమలు చేయడంలో భాగంగా జిల్లాలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్కు పంపాలంటూ కలెక్టర్ కార్యాలయానికి ఈసీఐ నుంచి ఆదేశాలు వచ్చాయి. పిఆర్సి లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు జిల్లాలో పర్యటించి వెళ్లారు. జిల్లాలోని 7,487 బ్యాలెట్ యూనిట్లు, 6,831 కంట్రోల్ యూనిట్లను వీరు త్వరలోనే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నుంచి జిల్లాకు త్వరలో 6వేల కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు రానున్నాయి. జిల్లాలో 2,491 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ కొత్త పద్ధతి గురించి అధికారులు, ఓటర్లకు డెమో నిర్వహించేందుకు 120 ఈవీఎంలు అదనంగా రానున్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి, ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి పది చొప్పున వీటిని కేటాయించనున్నారు. డెమో కోసం తీసుకురానున్న వీటిని పోలింగ్ సమయాల్లో ఉపయోగించరు. ‘నోటా’మీటల ఏర్పాటు : ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులంతా నేరచరితులైనప్పటికీ లేదా తనకు నచ్చకపోయినప్పటికీ ఎవరో ఒకరికీ ఓటు వేయాల్సివస్తోంది. అభ్యర్థులపై తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసేందుకు ఓటరుకు అవకాశం ఉండాలని వివిధ పౌర సంఘాలు, మేధావులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘నన్ ఆఫ్ ది అబౌ’ (నోటా) మీటను ఈవీఎంలలో కొత్తగా ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అంటే ఇకపై ఓటరుకు అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఈవీఎంలో చిట్ట చివర ఉన్న మీటను నొక్కితే సరిపోతుంది. అయితే ఈ అభిప్రాయాలను ఓట్ల లెక్కింపులో పరిగణలోకి తీసుకోరు. ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే గెలుపొందినట్లు ప్రకటిస్తారు. యువత నమోదుపై ప్రత్యేక శ్రద్ధ యువతను అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. 2014 జనవరి 1వ తేదికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు చర్యలు చేపడుతున్నారు. జనాభా గణాంకాల ప్రకారం 18 సంవత్సరాలు పైబడిన యువత 1,12,915 మంది ఉన్నారు. ఇందులో కేవలం 49,155 మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. మిగిలిన వారిని కూడా నమోదు చేసేందుకు అధికారులు కళాశాలల ప్రిన్సిపల్స్తో సంప్రదింపులు జరుపుతున్నారు. కళాశాలల్లో ఎంపిక చేసిన కొందరు విద్యార్థులను క్యాంపస్ అంబాసిడర్లుగా నియమించనున్నారు. ఓటర్ల నమోదుకు సహకరించినందుకుగానూ వీరికి రూ.2వేలు రెమ్యునరేషన్గా ఇవ్వనున్నారు. విద్యార్థులను ఆకర్షించేందుకు ఈసీఐ జిల్లాకు 17వేల ప్యాకెట్ క్యాలెండర్లను పంపింది. ఓటరు నమోదు ఫారాలను పూరించడం లేదా ఆన్లైన్లో దరఖాస్తులు ఎలా చేసుకోవాలో ఈ క్యాలెండర్లలో వివరించారు. అలాగే 11వేల వాల్పోస్టర్లు జిల్లాకు అందాయి. కొత్త ఓటర్లకు జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలర్ ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నారు. -
గోప్యత మాటేమిటి?!
మన ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) వినియోగించడం ప్రారంభించిన నాటి నుంచీ ఏదో రకమైన వివాదం తలెత్తుతూనే ఉంది. అలాంటి వివాదాలకు స్వస్తి పలుకుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పోటీచేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఈవీఎంలకు ప్రింటర్లను అనుసంధానించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ విధానాన్ని వివిధ సందర్భాల్లో ఎంపికచేసిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగిస్తూ వచ్చిన సంఘం గత సెప్టెంబర్లో నాగాలాండ్లోని నోక్సెన్ నియోజకవర్గం ఉప ఎన్నికలో తొలిసారి పూర్తిగా వినియోగించింది. బ్యాలెట్ బాక్సుల విధానానికి స్వస్తిపలికి ఈవీఎంలను ఉపయోగించడం మొదలెట్టాక పరాజితులు తమ ఓటమికి ఈవీఎంలలోనే కారణాన్ని వెదుకుతున్నారు. అధికార పక్షం ఈవీఎంలను ‘టాంపర్’ చేసిందనీ, లేకపోతే తాము భారీ మెజారిటీతో గెలిచేవారమని ఆరోపించడం పరిపాటైంది. ఎన్నికల ఫలితాలను హుందాగా స్వీకరించే మనస్తత్వాన్ని పరాజితులు ఏనాడూ ప్రదర్శించలేదు. మన రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు 2004 ఎన్నికల్లో ఓడినప్పటినుంచీ ఈవీఎంలంటే విరక్తి పుట్టింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉప ఎన్నికలు జరిగిన ప్రతిసారీ బాబు ఈవీఎంల గురించి రాద్ధాంతం చేసేవారు. 2009 ఎన్నికల్లోనూ ఇది కొనసాగింది. ఓడిన రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీసహా దాదాపు అన్ని పార్టీలూ ఈ తరహా వాదనలు చేయడం పరిపాటైంది. నిరుడు జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల సోర్స్ కోడ్ను అధికార అకాలీదళ్ హ్యాకర్లద్వారా మార్చి ఎన్నికల్లో విజేతగా నిలిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈవీఎంలపై తరచుగా వస్తున్న ఆరోపణల పర్యవసానంగా ఈ అక్టోబర్లో సుప్రీంకోర్టు ఈవీఎంలకు ప్రింటర్లను అనుసంధానించమని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తన ఓటు ఎంపికచేసుకున్న పార్టీకే వెళ్లిందో, లేదో ఓటరు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని, అలాగే ఓట్ల లెక్కింపులో వివాదం తలెత్తినప్పుడు సరిచూసుకోవడానికి కూడా తోడ్పడుతుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఈవీఎంలపై ఓటర్లకు విశ్వాసం కలగాలంటే ఇదొక్కటే మార్గమని వారు తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికలనాటికి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే, ఆరునెలల వ్యవధిలో లక్షలాది ఈవీఎంలకు అవసరమైన ప్రింటర్లు ఉత్పత్తిచేయడం సాధ్యంకాదు గనుక అప్పటికల్లా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే అమలుచేయగలమని ఎన్నికల సంఘం పేర్కొంది. వాస్తవానికి ఈవీఎంలపై పరాజితుల ఆరోపణలే తప్ప, సాధారణ ఓటర్లనుంచి ఏనాడూ ఫిర్యాదులు లేవు. పరాజితుల ఆరోపణలు కూడా ఏనాడూ రుజువైంది లేదు. ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం లోపభూయిష్టంగా ఉన్నదని, మొరాయిస్తున్న దని ఫిర్యాదులు వచ్చినప్పుడు వెనువెంటనే దాని స్థానంలో మరో ఈవీఎంను సమకూరుస్తున్నారు. మూడేళ్లక్రితం ఒక ఈవీఎంను దొంగిలించి, దాన్ని మార్చగలిగి నట్టు ఒక వ్యక్తి చూపించడానికి ప్రయత్నించినా అది పెద్దగా ఫలించలేదు. ఓటింగ్ సమయంలోగానీ, కౌంటింగ్ సమయంలోగానీ ఈవీఎంను దేనితోనూ అనుసంధా నించే అవకాశం లేకుండా రూపొందించారు. దాన్ని రిమోట్ కంట్రోల్తోగానీ, మరే ఇతర పద్ధతిలోగానీ మార్చడానికి అవకాశంలేని రీతిలో తయారుచేశారు. అందువల్లే తాము ఇచ్చే ఈవీఎంను తమ ఎదురుగా మార్చి దాని పనితీరులోని లోపాన్ని బయటపెట్టాలని అనేక సందర్భాల్లో ఎన్నికల సంఘం సవాల్చేసింది. ఈ సవాల్ను ఎవరూ స్వీకరించలేదు. పోలింగ్కు ముందు ఈవీఎంలను ప్రతి దశలోనూ తనిఖీ చేసుకునేందుకు, వాటి పనితీరును పరీక్షించేందుకు పార్టీల ప్రతినిధులకు అవకాశమిస్తారు. ఏ జిల్లాకు ఎక్కడి ఈవీఎంలు వెళ్తాయో, జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు వెళ్లే ఈవీఎంలేవో తెలుసుకునే అవకాశమే ఉండదు. మళ్లీ నియోజకవర్గంలోని వివిధ పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అవకాశం ఉన్న ఈవీఎంలు ఏవేవో తెలుసుకోవడం కూడా కష్టం. ఎన్నికలను నిర్దుష్టంగా జరిపించడం కోసం మన ఎన్నికల సంఘం ఇలా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. ఈవీఎంలను తారుమారు చేయాలనుకునేవారికి అసాధ్యమయ్యేలా ఈ ఏర్పాట్లన్నీ చేశారు. కొన్ని దేశాల్లో ఈవీఎంలకు స్వస్తిపలికి, మళ్లీ బ్యాలెట్ బాక్సుల విధానానికి వెళ్లడం నిజమే. కానీ, అక్కడ వినియోగించిన ఈవీఎంలు ప్రైవేటు సంస్థలు తయారుచేసినవి. మన దేశంలో ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న ఈవీఎంలన్నిటినీ ప్రతిష్టాత్మకమైన బెంగళూరులోని బెల్, హైదరాబాద్లోని ఈసీఐఎల్ సంస్థలు ఉత్పత్తిచేశాయి. సరే, కారణమేదైనా ఈవీఎంలకు ప్రింటర్ను అనుసంధానించే విధానం మొదలుకాబోతున్నది. ఈవీఎంలో ఓటరు తనకు నచ్చిన పార్టీకి ఎదురుగాగల బటన్ను నొక్కిన వెంటనే ప్రింటర్నుంచి ఆ ఓటు ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి వేశారో తెలియజేస్తూ ఒక స్లిప్ బయటికొచ్చే ఏర్పాటుంది. ఏడు సెకన్లపాటు ప్రింటర్కు అమర్చిన గాజుపలక వెనుక కనిపించే ఆ స్లిప్ అటు తర్వాత ఒక బాక్సులో పడే విధంగా ఏర్పాటు చేశారు. అయితే, ఈ విధానంపై రేపు వివాదాలు తలెత్తవన్న నమ్మ కం లేదు. తాను ఫలానా పార్టీకి ఓటువేస్తే స్లిప్పై వేరే పార్టీ పేరు వచ్చిందని పేచీకి దిగేవారు ఉండొచ్చు. పర్యవసానంగా పోలింగ్ నిలిచిపోతుంది.అంతా సవ్యంగా ఉన్నదని సంతృప్తిపడ్డాకగానీ తిరిగి మొదలయ్యే స్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు ఓటు హక్కుకు ఉండాల్సిన గోప్యత గల్లంతవుతుంది. ఆ ఓటరు ఎవ రికి ఓటేశాడో అక్కడున్నవారికి తెలిసిపోతుంది. దానివల్ల ఆ ఓటరుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. పారదర్శకత ఉండాల్సిన చోట ఉండాలి. కానీ, ఇలాంటి సందర్భాల్లో కాదు. దాదాపు రూ.1,700 కోట్లు వ్యయమయ్యే విధానం చివరకు ఇలాంటి స్థితికి దారితీయడం ఇబ్బందికరమే. కనీసం ఇప్పుడు న్యూఢిల్లీ నియోజకవర్గంలో వచ్చే అనుభవం తర్వాతైనా ఈవీఎంల పనితీరు నిర్ధారించుకుని, అందుకు అనుగుణంగా నిర్ణయాలను సవరించుకోవడం ఉత్తమం. -
నిశ్చింతగా ఓటు హక్కు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాసామ్యంలో ఓటుహక్కు ఎంతో విశిష్టమైనది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) వచ్చిన తర్వాత ఓటు సరిగా వేశామోలేదో, తాను అనుకున్న పార్టీకే పడిందో లేదో అన్న అనుమానాలు ఓటర్లమదిని తొలి చేవి. వాటిని నివృత్తి చేయడంతోపాటు ఓటరు కు మరింత సమాచారం అందించేలా ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దీని ప్రకారం ఓటు తన ఓటును ఏ పార్టీకి వేశాడో తెలుసుకోవడం సులవుగామారుతుంది. డిసెంబరులో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేనున్నారు. ఇందుకోసం మొట్టమొదటిసారి గా ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ట్రేల్ను (వీ వీపీఏటీ) వాడనున్నారు. ఇప్పటికే ఈ విధానా న్ని ఒక రాష్ట్ర విధానసభ ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్టు కింద విజయవంతంగా పూర్తిచేసినట్టు ఢిల్లీ ఎన్నికల అధికారి విజయ్దేవ్ పేర్కొన్నారు. వీవీపీఏటీ అంటే ఏమిటి? గతంలో మన దేశంలో బ్యాలెట్ పేపర్తో ఓట్లు వేసేవారు. తాము ఎంపిక చేసిన పార్టీ గుర్తుపై ఓటు ముద్రవేసి ఓటు వేసేవాడు. ఈవీఎంలు వచ్చిన తర్వాత తమ ఓటు ఎవరికి వేశామో తెలియని అయోమంలో కొందరు ఓటర్లు ఉంటున్నారు. వారికి ఊరట కలిగిస్తూ ఎలక్షన్ కమిషన్.. వీవీపీఏటీని ఇటీవలే ప్రవేశపెట్టింది. ఈవీఎం మెషీన్కి వీవీపీఏటీని అనుసంధానం చేస్తారు. ఓటు ఓటుహక్కు వినియోగించుకున్న వెంటనే అతడు/ఆమె ఏ పార్టీకి ఓటు వేశాడో తెలిపే చీటీ ఈ మెషీన్ ఇస్తుంది. దీంతో తాను ఏ పార్టీకి ఓటు వేశాడో ఓటు స్పష్టంగా తెసుకోవచ్చు. అనంతరం చీటిని అక్కడే ఉన్న డబ్బాలో జమచేయాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని ఈ ఎన్నికల్లో అమలులోకి తేవడంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారి ఒకరు అన్నారు. -
వద్దనడమూ ఓటే!
సంపాదకీయం: ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలంటూ ప్రజాస్వామ్యవాదులు, మేధావులు దశాబ్దాలనుంచి పోరుపెడుతున్నా పట్టించుకోని పాలకవర్గాలకు సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు శరాఘాతంవంటిది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని చెప్పి తిరస్కరించే హక్కు ఓటరుకు ఉంటుందని, ఆ హక్కుకు విఘాతం కలిగించడం పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని తన ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తీర్పునిస్తూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని చెప్పడానికి ఓటర్లకు వీలుకల్పిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)లలో అదనంగా మీటను పొందుపరచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదని, అది చట్టపరమైన హక్కు మాత్రమేనని... కనుక 32వ అధికరణం కింద దాఖలుచేసిన ఈ పిటిషన్ను తోసిపుచ్చాలని కేంద్రం చేసిన వాదనను తిరస్కరించింది. ఎన్నికల్లో ఓటు వేయడం అనేది రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణం హామీ ఇస్తున్న భావ ప్రకటనా స్వేచ్ఛలోనూ, 21వ అధికరణం హామీ ఇస్తున్న వ్యక్తిస్వేచ్ఛలోనూ భాగమని తెలియజేసింది. నిజానికి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో తనకెవరూ సమ్మతం కాదని తెలిపేందుకు ఓటరుకు ఇప్పటికే వీలుంది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని 49(ఒ) దాన్ని ఓటరుకు కల్పి స్తోంది. అయితే, నిజానికది అభ్యర్థులందరినీ తిరస్కరించడంతో సమానం కాదు. ఈ ఓటింగ్ ప్రక్రియనుంచి తాను గైర్హాజరవుతున్నానని చెప్పడానికి మాత్రమే వీలుకల్పించే నిబంధన అది. పైగా, అందుకోసం పోలింగ్ అధికారుల దగ్గర ఒక పత్రాన్ని తీసుకుని దాన్ని నింపి సంతకం చేయాల్సి ఉంటుంది. ఆతర్వాత ఫలానా ఓటరు ఓటింగ్నుంచి గైర్హాజరైనట్టు వేర్వేరు రిజిస్టర్లలో నమోదవుతుంది. ఓటేసినవారు ఎవరికి వేశారో తెలియకుండా గోప్యత ఉండగా... అందుకు భిన్నంగా ఉండేవారు మాత్రం వీధినపడటానికి ఇందువల్ల అవకాశం ఏర్పడుతోంది. కనుకనే ఈ నిబంధన చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే, నెగెటివ్ ఓటుకు అవకాశం కల్పించడంలో చాలా చిక్కుముడులున్నాయి. మన దేశంలో నిరక్షరాస్యత ఇప్పటికీ గణనీయంగా ఉంది. చదవగలిగినవారు సైతం ఏ పార్టీ అభ్యర్థినైనా వారి పేరుతో కాక...ఆ అభ్యర్థి పోటీచేస్తున్న పార్టీ గుర్తుతో మాత్రమే గుర్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని చెప్పడానికి ఏమి వాడవలసివస్తుందన్న ప్రశ్న ఉదయిస్తుంది. అందుకోసం వాడే గుర్తు ఏ అభ్యర్థి గుర్తుకైనా దగ్గరగా ఉంటే ఆ ఓట్లన్నీ అయాచితంగా అటు వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే, ఒక నియోజకవర్గంలో అభ్యర్థులందరూ నచ్చలేదని చెప్పేవారి సంఖ్య ఎక్కువైతే పరిస్థితేమిటో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉండనే ఉండవని చెప్పడానికి వీల్లేదు. ఎన్నికల బహిష్కరణకు మిలిటెంట్ సంస్థలు పిలుపునిస్తుంటాయి. ఆ పిలుపు ప్రభావం పెద్దగా లేని మాట వాస్తవమే అయినా... అందరినీ కదలించగలిగే సమస్యను ఆసరాచేసుకుని నెగెటివ్ ఓటు వేయాలని ప్రచారంచేస్తే అది ఫలించే అవకాశాన్ని తోసిపుచ్చలేం. అలాంటి పరిస్థితి ఏర్పడితే ఏంచేయాలో కూడా ఆలోచించాల్సిందే. అక్కడ మళ్లీ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా?ఆ ఎన్నికల్లో పోటీపడిన అభ్యర్థులను మార్చుకోమని పార్టీలకు సూచిస్తారా? మన ఎన్నికల ప్రక్రియలో నిజానికి ఓటువేసే వారి శాతం నానాటికీ తగ్గుతోంది. సామాన్య ప్రజలు అందులో పాల్గొన్నంత చురుగ్గా ఎగువ మధ్యతరగతి, ఆపై వర్గాలు పాల్గొనడంలేదు.70 శాతం పోలింగ్ జరిగితే అది చాలా ఎక్కువనే అభిప్రాయం ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చినవారిలో గణనీయంగా నెగెటివ్ ఓటేస్తే... విజేతగా నిలిచినవారి మెజారిటీ చాలా స్వల్పంగానే ఉంటుంది. విజేతకు కనీసం పోలైన ఓట్లలో 51శాతం వస్తేనే నెగ్గినట్టవుతుందన్న నిబంధన పెట్టకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. అయితే, నెగెటివ్ ఓటు అవకాశాన్ని ఇవ్వడంవల్ల ఇంతవరకూ ఎవరొచ్చినా ఒరిగేదేమీ లేదని నిర్లిప్తత ప్రదర్శించేవారు సైతం పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ హక్కును వినియోగించుకునే వీలుంటుంది. ఇంతకాలం ఇలా దూరంగా ఉండేవారి ఓట్లను స్థానికంగా ఉండే పెత్తందార్లు తమ ఖాతాలో వేసుకునేవారు. ఇప్పుడు అలాంటి దొంగ ఓట్ల బెడద తప్పుతుంది. వివిధ వర్గాలనుంచి వచ్చే సూచనలను పరిశీలించడం, వాటి సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించడం... అందుకోసం రాజకీయ పార్టీలతో, ఇతరత్రా సంస్థలతో చర్చించడం ప్రభుత్వాల కర్తవ్యం. సమష్టి చర్చల్లో నెగెటివ్ ఓటువల్లనైనా, మరే ఇతర చర్యవల్లనైనా రాగల అవరోధాలేమిటో, వాటిని అధిగమించడమెలాగో సూచనలు వస్తాయి. ప్రభుత్వాలు తమ కర్తవ్యాన్ని విస్మరించడంవల్ల న్యాయ స్థానాల జోక్యం అవసరమవుతున్నది. 70వ దశకంనుంచి ప్రజాస్వామ్యవాదులు, మేధావులు చేసిన డిమాండ్ల సంగతి అలావుంచి, 2001లో ఎన్నికల సంఘమే ఓటర్లకు నెగెటివ్ ఓటుకు అవకాశం కల్పించేలా చట్టంలో మార్పులుచేయాలని లేఖరాస్తే దానిపై పుష్కరకాలందాటినా ఈనాటికీ అతీగతీ లేదు. రెండేళ్లక్రితం అన్నా హజారే బృందం సైతం ఇలాంటి సూచన చేసింది. చాన్నాళ్లక్రితం లా కమిషన్ 170వ నివేదిక కూడా నెగెటివ్ ఓటు గురించి సిఫార్సుచేసింది. దానికీ స్పందన లేదు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంచేసుకుని తీర్పునిచ్చేదాకా ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. అయితే, పిటిషన్ విచారణ సమయంలో పార్టీల అభిప్రాయాలను కూడా న్యాయస్థానం వినివుంటే తీర్పు మరింత సమగ్రంగా ఉండేది. చేయాల్సిన ఎన్నికల సంస్కరణల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఒక మెట్టు మాత్రమే. కనీసం మిగిలిన సంస్కరణల విషయాల్లోనైనా కేంద్రంలో కదలికరావాలి. తాను చొరవ తీసుకోవడంలో విఫలమైతే ఇలా న్యాయస్థానాల జోక్యం తప్పనిసరవుతుందని గ్రహించాలి. -
ఓటరు తిరస్కరించవచ్చు
ఎన్నికల అభ్యర్థులపై సుప్రీంకోర్టు విప్లవాత్మక తీర్పు న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరినీ వ్యతిరేక ఓటుతో తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. బ్యాలెట్ పత్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ‘పై వారెవరూ కాదు’ (నన్ ఆఫ్ ది అబోవ్ - నోటా) అనే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే ఏర్పాటు చేయాలని.. ప్రత్యేక మీటను పొందుపరచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిర్దేశిస్తూ విప్లవాత్మక ఆదేశాలు జారీచేసింది. చెతన్యవంతమైన ప్రజాస్వామ్యంలో.. ‘పై వారెవరూ కాదు’ అనే మీటను ఎంచుకునే అవకాశం ఓటరుకు తప్పనిసరిగా ఇవ్వాలని.. దానివల్ల రాజకీయ పార్టీలు మంచి అభ్యర్థిని పోటీకి నిలపక తప్పనిసరి పరిస్థితి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈవీఎంలలో ‘నోటా’ మీటను ఏర్పాటు చేయటం ద్వారా ఓటర్లకు సాధికారత లభిస్తుందని, ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో సమర్థవంతమైన రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొంది స్తుందని వ్యాఖ్యానించింది. వ్యతిరేక ఓటు (నెగెటివ్ ఓటు) వేసే హక్కు ఓటర్లకు కల్పించాలని కోరుతూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పార్లమెంటులోని ఓటింగ్ యంత్రాల్లో ఎస్, నోస్, అబ్స్టెయిన్ (తటస్థం) అనే మూడు మీటలు ఉంటాయనే విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎన్నికల్లోనూ ‘నోటా’ మీట నొక్కటం ద్వారా ఓటరు వాస్తవానికి తాను ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నట్లు చెప్పటమే అవుతుందని పేర్కొంది. వ్యతిరేక ఓటు ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఈసీకి సుప్రీంకోర్టు నిర్దేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని జస్టిస్ రంజన ప్రకాశ్దేశాయ్, జస్టిస్ రంజన్ గొగోయ్లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల్లో ముఖ్యాంశాలివీ... భావప్రకటన హక్కులో భాగం ‘‘వ్యక్తులందరూ ఏదైనా ఒక అంశంపై మాట్లాడే, విమర్శించే, విభేదించే హక్కును 19వ అధికరణ కల్పిస్తోంది. ఇది సహనమనే స్ఫూర్తి ఆధారంగా నిలబడుతుంది. ప్రజలు విభిన్నమైన అభిప్రాయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు కలిగివుండేందుకు అనుమతిస్తుంది. ఒక వ్యక్తిని వ్యతిరేక ఓటు వేసేందుకు అనుమతించకపోవటం.. భావప్రకటనా స్వాతంత్య్రాన్నే హరిస్తుంది. ఓటు వేయటం అనేది భావప్రకటనా హక్కులో ఒక అంశం. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ కింద ఈ హక్కును కల్పించటం జరిగింది. ఒక వ్యక్తిని వ్యతిరేక ఓటు వేసేందుకు అనుమతించకపోవటం భావప్రకటనా స్వేచ్ఛను, 21వ అధికరణ అయిన స్వేచ్ఛా హక్కును హరిస్తుంది. మచ్చలేని అభ్యర్థులకు అవకాశం వస్తుంది... ప్రపంచంలోని 13 దేశాల్లో ఈ వ్యతిరేక ఓటు అమలులో ఉంది. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే.. దేశాన్ని సరిగా పరి పాలించేందుకు అందుబాటులో ఉన్నవారిలో ఉత్తములైన వారిని ప్రజా ప్రతినిధులుగా ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. వ్యతిరేక ఓటు ఎన్నికల ప్రక్రియలో వ్యవస్థాగత మార్పుతెస్తుంది. పార్టీలు నిలిపిన అభ్యర్థులను ప్రజలు పెద్ద సంఖ్యలో తిరస్కరించినప్పుడు.. ప్రజాభీష్టాన్ని అంగీకరించి పార్టీలు మచ్చలేని అభ్యర్థులను పోటీకి నిలబెట్టక తప్పని పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్య పురోభివృద్ధికి దోహదం... ప్రజాస్వామ్య పురోభివృద్ధికి వ్యతిరేక ఓటు దోహదపడుతుంది. ప్రజలు రాజకీయ ప్రక్రియలో సమర్థవంతంగా పాల్గొనటాన్ని వేగవంతం చేస్తుంది. ఎన్నికల ప్రక్రియలో స్వచ్ఛతను పెంపొందిస్తుంది. ఇది పార్టీలు, వారి అభ్యర్థులు ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారనేదానిపై స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. ప్రస్తుత వ్యవస్థలో అసంతృప్తికి గురైన ఓటర్లు సాధారణంగా ఓటు వేయటానికి రారు. ఫలితంగా వారి ఓట్లను అవినీతి శక్తులు దుర్వినియోగం చేసే అవకాశమిస్తుందనే వాస్తవం కూడా.. వ్యతిరేక ఓటు ఆవశ్యకతను బలపరుస్తుంది. పార్లమెంటులో ‘తటస్థం’ తరహాలోనే... పార్లమెంటులోని ఓటింగ్ యంత్రాల్లో ఎస్, నోస్, అబ్స్టెయిన్ (తటస్థం) అనే మూడు మీటలు ఉంటాయి. అంటే.. సభ్యులు తటస్థం అనే మీటను ఎంచుకునే అవకాశం కల్పించారు. అలాగే.. పిటిషనర్లు కోరుతున్న ‘నోటా’ మీట.. సరిగ్గా ఈ ‘తటస్థం’ మీట వంటిదే. నోటా మీట నొక్కటం ద్వారా ఓటరు వాస్తవానికి.. అభ్యర్థులలో ఎవరూ తన ఓటు వేయటానికి తగిన అభ్యర్థిగా గుర్తించకపోతే.. తాను ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నట్లు చెప్పటమే అవుతుంది. ఈవీఎంలలో ‘నోటా’ మీట ఏర్పాటు చేయాలి... బ్యాలెట్ పత్రాలు / ఈవీఎంలలో పైవారెవరూ కాదు (నోటా) అనే మరో మీటను ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్కు మేం నిర్దేశిస్తున్నాం. దీనివల్ల పోలింగ్ బూత్కు వచ్చే ఓటర్లు.. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నట్లయితే.. వారు ఎవరికీ ఓటు వేయకూడదనే తమ హక్కును వినియోగించుకునేందుకు, అదే సమయంలో తమ ఓటు గోప్యత హక్కును వినియోగించుకోవటానికి అవకాశం కలుగుతుంది. అభ్యర్థుల పేర్ల జాబితా చివర్లో ‘నోటా’ మీటను ఏర్పాటు చేయాలి. ఈ వ్యతిరేక ఓటు పద్ధతిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సంఘం దశలవారీగా కానీ, ఒకేసారి కానీ అమలు చేయాలి. దీనిని అమలు చేసేందుకు ఈసీకి అవసరమైన సహాయం కేంద్ర ప్రభుత్వం అందించాలి.’’ వ్యతిరేక ఓటుకూ గోప్యత తప్పనిసరే... ఓటర్ల ‘నోటా’ ఓట్ల విషయంలో గోప్యత పాటించాలని కూడా ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు నిర్దేశించింది. ‘‘ఓటు వేసే హక్కుతో పాటు, ఓటు వేయకుండా ఉండే హక్కు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 79(డి), 41(2), (3), 49-ఒ నిబంధనల కింద చట్టబద్ధంగా గుర్తించారు. ఓటరు తన ఓటు వేయాలని నిర్ణయించుకున్నా కానీ, తన ఓటు వేయరాదని నిర్ణయించుకున్నా కానీ గోప్యత పాటించాల్సి ఉంటుంది’’ అని స్పష్టంచేసింది. ‘‘ఓటరు తన ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లయితే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 128 సెక్షన్, సంబంధిత నిబంధనల కింద గోప్యత పాటించటం జరుగుతుందని.. ఒకవేళ ఓటరు తన ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటే గోప్యత పాటించబోమని చెప్పటం కుదరదు. ఓటు వేయకూడదని నిర్ణయించుకున్న ఓటరుతో భిన్నంగా వ్యవహరించే 49-ఒ నిబంధనలోని ఒక భాగం, ఫామ్ 17-ఎ అనేవి.. ఈ గోప్యతను ఉల్లంఘించేందుకు తోడ్పడుతున్నాయి. ఇది ఏకపక్షం, నిర్హేతుకం, 19వ అధికరణను ఉల్లంఘించటమే. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 79(డి), 128 సెక్షన్లకు విరుద్ధం’’ అని సుప్రీం తేల్చిచెప్పింది. అదనపు వ్యయం, శ్రమ అవసరం లేదు... వ్యతిరేక ఓటు వేసే సదుపాయాన్ని ప్రస్తుత ఈవీఎంలలోనే ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే, లేదా సాంకేతిక పరిజ్ఞానంలో ఎలాంటి మార్పూ చేయకుండానే ఏర్పాటు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి ఈసీ నివేదనను ఉటంకిస్తూ.. ఈవీఎంలో చివరి మీటను వ్యతిరేక ఓటుకు కేటాయించటానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు చెప్పింది. రాబోయే ఎన్నికల్లో అమలుకు అవకాశం ఇదిలావుంటే.. రాబోయే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ‘తిరస్కరించే హక్కు’ను అమలులోకి తెచ్చే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. సుప్రీం తీర్పును సాధ్యమైనంత వేగంగా అమలుచేసేందుకు సవివర మార్గదర్శకాలు జారీచేయటం జరుగుతుందని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీల మిశ్రమ స్పందన సుప్రీం తీర్పుపై పార్టీల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఈ తీర్పును పూర్తిగా అధ్యయనం చేయకుండా స్పందించటం తొందరపాటవుతుందని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు జాగ్రత్తగా స్పందించాయి. అయితే.. ఈ తీర్పు అసాధారణ పరిస్థితిని సృష్టించిందని, దీనిని సరిచేయాల్సి ఉందని సీపీఎం వ్యాఖ్యానించింది. సీపీఐతోపాటు పౌర సమాజంలోని ప్రముఖులు ఈ తీర్పును ఆహ్వానించారు. ‘వ్యతిరేక ఓట్లు అత్యధికంగా ఉంటే ఏమిటనేటువంటి అన్ని అంశాలనూ కోర్టు పరిగిణనలోకి తీసుకుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికిప్పుడు స్పందించటం తొందరపాటు అవుతుంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ అన్నారు. ‘మేం ఎన్నికల సంస్కరణలకు అనుకూలం. ఈ తీర్పు సరైనదా, పొరపాటా అని ఇప్పుడే చెప్పటం తొందరపాటు అవుతుంది’ అని బీజేపీ ఉపాధ్యక్షుడు నక్వీ పేర్కొన్నారు. ఈ తీర్పు రాజకీయాల్ని బాగుచేసే దిశగా చిన్న, బలమైన ముందుడగు అవుతుందని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందన్న సుప్రీం తీర్పును టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వాగతించారు. వ్యతిరేక ఓటు అంటే చెల్లని ఓటే?! అభ్యర్థులందరినీ తిరస్కరించే అవకాశం ఓటరుకు కల్పించాలన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు వ్యతిరేక ఓటు వేస్తే ఏం జరుగుతుందనేది ఇందులో ప్రధానంగా ఉంది. అయితే.. దీనిపై ఎన్నికల చట్టంలో ఎలాంటి ప్రస్తావనా లేనప్పటికీ.. ‘పై వారెవరూ కాదు’ అనే వ్యతిరేక ఓటును చెల్లని ఓటుగా పరిగణించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితిలో ఓట్లు పొందిన అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించటం జరగవచ్చని అంచనా వేస్తున్నాయి. ‘తప్పనిసరి ఓటు’ కూడా కావాలి... నేను ఈ తీర్పును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. ఇది మన రాజ కీయాలపై చిరకాల ప్రభావం చూపుతుందని ఖచ్చితంగా చెప్తున్నా. తప్పనిసరి ఓటు వల్ల కూడా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగల పలు ప్రయోజనాలు ఉన్నాయి. తప్పనిసరి ఓటును తీసుకురావటం ద్వారా.. ఓటర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది కాబట్టి.. ఎన్నికలపై విపరీతమైన వ్యయాన్ని నివారించవచ్చు. తప్పనిసరి ఓటుపై మేం బిల్లును ప్రవేశపెట్టాం. అందులో తిరస్కరించే హక్కు కూడా ఉంది. కానీ కాంగ్రెస్ దానిని పూర్తిగా వ్యతిరేకించింది. ఈ బిల్లును 2008, 2009ల్లో రెండు సార్లు (రాష్ట్ర శాసనసభలో) ఆమోదించాం. కానీ గవర్నర్ దానిని ఆపివేశారు. - నరేంద్రమోడీ, గుజరాత్ సీఎం 14వ దేశంగా భారత్ ఎన్నికల్లో తనకు నచ్చని అభ్యర్థిని తిరస్కరించే విధానం అమలు చేస్తున్న ఫ్రాన్స్, బ్రెజిల్, ఫిన్లాండ్, అమెరికా లాంటి దేశాల సరసన భారత్ చేరింది. దీంతో నెగెటివ్ ఓటింగ్ విధానం అమలుచేసే దేశాల్లో 14వ దేశంగా భారత్ అవతరించనుంది. ప్రస్తుతం ఈవీఎంల ద్వారా ఫ్రాన్స్, బెల్జియం దేశాలు మాత్రమే ‘నన్ ఆఫ్ ది అబౌవ్ (నోటా)’ను అమలు చేస్తుండగా.. బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, అమెరికాలోని నెవడా రాష్ట్రం బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటర్లకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. కాగా, ఫిన్లాండ్, స్వీడన్, అమెరికా, స్పెయిన్ దేశాల్లో ఓటర్లు బ్యాలెట్ను ఖాళీగా వదిలివేయవచ్చు. లేదంటే అభ్యర్థిపై కామెంట్లు కూడా రాయవచ్చు.