
సాక్షి, చెన్నై : తమిళనాడు వేలూరు వాలజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రోడ్డుపై దూసుకొచ్చిన ఓ ద్విచక్ర వాహనం వృద్దున్ని ఢీ కొట్టి.. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న లారీని కూడా ఢీ కొట్టింది. ఈ క్రమంలో బైక్పై ఉన్న దంపతులు, వారి కుమారుడు మృతిచెందారు. బైక్ ఢీ కొట్టడంతో వృద్దుడు కూడా ప్రాణాలు విడిచాడు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment