Published
Wed, Nov 30 2016 11:29 AM
| Last Updated on Tue, Oct 9 2018 4:20 PM
‘మంజునాథ’ పర్యటనలో గందరగోళం
ఏలూరు: కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బుధవారం పర్యటించింది. వెనుకబడిన కులాల వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకునే క్రమంలో ప్రారంభంలోనే గందరగోళం నెలకొంది. బీసీ కులాలను విడదీయడానికే కమిషన్ వేశారంటూ బీసీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అందరి వాదనలు వినడానికే వచ్చామన్న బీసీ కమిషన్ తెలిపింది. కుల సంఘ పెద్దల జోక్యంతో ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది.