కొమరవెల్లి జ్యువెలరీ షాపులో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది.
సిద్ధిపేట : కొమరవెల్లి జ్యువెలరీ షాపులో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. పనివారు బంగారు ఆభరణాలు తయారు చేస్తుండగా సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.