
'హోదా కోసం త్యాగాలకైనా సిద్ధం'
ప్రత్యేక హోదా కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం' అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెప్పారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకే అసెంబ్లీలో పోరాటం చేశామని అన్నారు.
యువత భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని పోరాటం చేస్తే నోటీసులిస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు.