కారేపల్లి: ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం సీతారాంపురం శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఖమ్మం ఇల్లందు జాతీయ రహదారిలోని కొత్తూరు క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం మహిళ మౄతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కామేపల్లిమండలం గోపాలపురం గ్రామానికి చెందిన వాంకుడోతు సక్రీ(42)గా గుర్తించారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.