కుక్కేశారు.. | 104 Passengers in Private Bus Hyderabad | Sakshi
Sakshi News home page

కుక్కేశారు..

Published Tue, Aug 6 2019 12:06 PM | Last Updated on Tue, Aug 6 2019 12:06 PM

104 Passengers in Private Bus Hyderabad - Sakshi

104 మందితో వెళుతున్న బస్సు సీజ్‌

గచ్చిబౌలి: ఆ బస్సు కెపాసిటీ 45, అంతకు మించి మహా అయితే పదో, 15 మందిని తరలించవచ్చు. అయితే ఓ ప్రైవేట్‌ బస్సులో ఏకంగా 104 మంది కూలీలు వెళ్లడం ఐటీ కారిడార్‌లో సోమవారం వెలుగు చూసింది. షాపూర్జీ పల్లంజి కంపెనీలో పని చేసే కూలీలు నానక్‌రాంగూడలోని లేబర్‌ కాలనీలో  నివాసం ఉంటున్నారు. నానక్‌రాంగూడ నుంచి మాదాపూర్‌ వైపు సోమవారం ఉదయం కూలీలతో వెళుతున్న ప్రైవేట్‌ బస్సును గచ్చిబౌలి జంక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ రఘుకుమార్‌  ఆపారు. కూలీలను కిందికు దించి లెక్కించగా ఏకంగా 104 మంది కూలీలు ఉన్నారు. దీంతో అవాక్కైన ఎస్‌ఐ బస్సును సీజ్‌ చేసి ఆర్‌టీఏ అధికారులకు అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement