ఏసీబీ వలలో కోర్టు సూపరింటెండెంట్
Published Thu, Feb 11 2016 1:56 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
మెదక్: భూ సంబంధ వివాదంలో లంచం తీసుకుంటూ కోర్టు ఉద్యోగి ఒకరు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. మెదక్ పట్టణం మూడో అదనపు కోర్టులో లాల్సింగ్ అనే వ్యక్తికి చెందిన సివిల్ కేసు 2009 నుంచి నడుస్తోంది. అయితే, ఈ కేసు విషయంలో సమన్లు జారీ చేయటానికి సూపరింటెండెంట్ రమణారెడ్డి లంచం డిమాండ్ చేశారు. దీంతో లాల్ సింగ్ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు కోర్టు ఆవరణలో గురువారం మధ్యాహ్నం లాల్సింగ్ నుంచి రూ.5 వేలు తీసుకుంటున్న రమణారెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement