ఏసీబీకి చిక్కిన వీఆర్వో | acb caught vro in nalgonda distirict | Sakshi

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

Published Thu, Aug 13 2015 2:31 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

ఓ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా చందంపల్లి వీఆర్వో ఏసీబీ కి చిక్కాడు.

నకిరేకల్: ఓ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా చందంపల్లి వీఆర్వో ఏసీబీ కి చిక్కాడు. గురువారం పథకం ప్రకారం ఏసీబీ అధికారులు వీఆర్వోను పట్టుకున్నారు. గ్రామానికి చెందిన లింగయ్య అనే రైతు పట్టాదారు పాస్‌పుస్తకాల్లో పేరు మార్పు కోసం వీఆర్వో వెంకటేశ్వర్లు ను సంప్రదించగా రూ. 8వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వీఆర్వో రైతు వద్ద నుంచి రూ. 8వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement